breaking news
National Rifle Association of India
-
భారత షూటింగ్ లీగ్కు అనూహ్య స్పందన
న్యూఢిల్లీ: భారత షూటింగ్ లీగ్ (ఎస్ఎల్ఐ)లో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా షూటర్లు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న ఈ లీగ్ కోసం ఇప్పటి వరకు దేశవిదేశాలకు చెందిన 400 మందికి పైగా షూటర్లు పేర్లు నమోదు చేసుకున్నట్లు జాతీయ రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఏఐ) బుధవారం వెల్లడించింది. ఇందులో కజకిస్తాన్, రష్యా, ఇరాన్, హంగేరి, క్రొయేషియా, అజర్బైజాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, గ్రెనెడా, ఇటలీ, ఆ్రస్టేలియా, ఆ్రస్టియా, సెర్బియా, అమెరికా, స్పెయిన్, థాయ్లాండ్, జర్మనీ, చెక్ రిపబ్లిక్, నార్వే, సాన్ మారినో, రొమానియా దేశాలకు చెందిన షూటర్లు ఉన్నారు. తొలిసారి నిర్వహిస్తున్న ఈ లీగ్కు అనూహ్య స్పందన రావడం ఆనందంగా ఉందని ఎన్ఆర్ఏఐ అధ్యక్షుడు కాళికేశ్ నారాయణ్ సింగ్ పేర్కొన్నారు. ‘ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న భారత షూటింగ్ లీగ్ పై స్పష్టమైన అవగాహనతో ఉన్నాం. ప్రపంచ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నాం. భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలిచేవిధంగా సహృద్భావ వాతావరణంలో పోటీలు నిర్వహిస్తాం’ అని అన్నారు. జూలై వరకు పేర్లు నమోదు చేసుకునే ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 2 వరకు ఎస్ఎల్ఐ తొలి సీజన్ జరిగే అవకాశం ఉంది. లీగ్లో పిస్టల్ విభాగంలో 10 మీటర్లు, 25 మీటర్లు... రైఫిల్ విభాగంలో 10 మీటర్లు, 50 మీటర్లు, ‘త్రీ’ పొజిషన్... షాట్గన్ విభాగంలో ట్రాప్, స్కీట్లో పోటీలు నిర్వహించనున్నారు. లీగ్లో కనీసం ఆరు జట్లు పాల్గొననుండగా... రెండు గ్రూప్లుగా విభజించి పోటీలు చేపట్టనున్నారు. ఆటగాళ్లను ఎలైట్ చాంపియన్స్, వరల్డ్ ఎలైట్, నేషనల్ చాంపియన్స్, యూత్ చాంపియన్స్ అనే నాలుగు కేటగిరీల్లో విభజించనున్నారు -
టోక్యో ఒలింపిక్స్కు భారత షూటింగ్ జట్టు ప్రకటన
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనే భారత షూటింగ్ జట్టును నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్లో భారత షూటర్లు 10 కేటగిరీలకుగాను 15 బెర్త్లు సంపాదించారు. అయితే ఎన్ఆర్ఏఐ నిబంధనల ప్రకారం బెర్త్ అనేది దేశానికి చెందుతుందికానీ అర్హత సాధించిన షూటర్కు కాదు. ఫలితంగా టోక్యో ఒలింపిక్స్కు నేరుగా అర్హత పొందకపోయినా మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ప్రపంచ నంబర్వన్, తమిళనాడు షూటర్ ఇలవేనిల్ వలారివన్కు టోక్యోలో భారత్కు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కింది. గత మూడేళ్లుగా జాతీయ, అంతర్జాతీయ టోర్నీలలో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా ఎన్ఆర్ఏఐ 15 మందితో జట్టును ఎంపిక చేసింది. ఇక 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో టోక్యో బెర్త్ సాధిం చిన చింకీ యాదవ్ను కాదని మనూ భాకర్కు అవకాశం ఇచ్చారు. చింకీని రిజర్వ్గా ఎంపిక చేశారు. పురుషుల విభాగం: 10 మీటర్ల ఎయిర్ రైఫిల్: దివ్యాంశ్, దీపక్. 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్: సంజీవ్ రాజ్పుత్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్: సౌరభ్ చౌధరీ, అభిషేక్ వర్మ. స్కీట్ ఈవెంట్: అంగద్వీర్, మేరాజ్ అహ్మద్ఖాన్. మహిళల విభాగం: 10 మీటర్ల ఎయిర్ రైఫిల్: అపూర్వీ, ఇలవేనిల్. 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్: అంజుమ్, తేజస్విని. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్: మనూ భాకర్, యశస్విని. 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్: రాహీ, మనూ. 10 మీటర్ల రైఫిల్ మిక్స్డ్ టీమ్: దివ్యాంశ్, ఇలవేనిల్. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్: సౌరభ్, మనూ భాకర్. -
షూటింగ్ సెలక్షన్స్పై హీనా ఫిర్యాదు
న్యూఢిల్లీ: భారత మేటి షూటర్ హీనా సిద్ధూ తనకు సెలక్షన్స్లో జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసేందుకు శనివారం జాతీయ రైఫిల్ అసోసియేషన్ (ఎన్ఆర్ఏఐ) తలుపు తట్టింది. అయితే రోజంతా నిరీక్షించిన ఆమెకు ఎన్ఆర్ఏఐ చీఫ్ రణీందర్ సింగ్ ఆదివారం చర్చిద్దామని హామీ ఇచ్చారు. ఆసియా క్రీడల కోసం ఎంపిక చేసిన భారత షూటింగ్ జట్టులో తనను మిక్స్డ్ పెయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్ నుంచి తప్పించారని 28 ఏళ్ల హీనా వాపోయింది. కేవలం వ్యక్తిగత ఎయిర్ పిస్టల్ ఈవెంట్లోనే ఎంపిక చేయడం అసంతృప్తికి గురిచేస్తోందని చెప్పింది. 25 మీ. పిస్టల్ ఈవెంట్లో ఆమె కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్. 10 మీ. ఎయిర్ పిస్టల్ ఈవెంట్లోనూ హీనా రజతం నెగ్గింది. ‘ఎన్ఆర్ఏఐ అధ్యక్షుడు రణీందర్ సింగ్ను కలిసేందుకు రోజంతా నిరీక్షించాను. ఎట్టకేలకు ఆయన స్పందించి ఆదివారం మాట్లాడదామని చెప్పారు. ఆయన మంచి వ్యక్తి అని తెలిసే ఇక్కడికి వచ్చాను. మెరిట్కు విలువిస్తారని, పారదర్శకత పాటిస్తారనే నమ్మకముంది. కొందరికి ప్రయోజనం చేకూర్చేందుకు సెలక్షన్ కమిటీలో సాంకేతిక అవకతవకలకు పాల్పడ్డారు’ అని హీనా విమర్శించారు. మను బాకర్కు మేలు చేకూర్చేందుకే తనను టీమ్ ఈవెంట్ నుంచి తప్పించారని ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతర్జాతీయ పోటీల్లో పతకాలు తెస్తున్న తనలాంటి షూటర్లకే ఇలాంటి పరిస్థితి రావడం ఘోరమని ఆమె వాపోయింది. -
సమూల మార్పులు అవసరం
భారత షూటింగ్ భవిష్యత్ కోసం బింద్రా కమిటీ సూచనలు న్యూఢిల్లీ: కేవలం ప్రతిభ ఉంటే సరిపోదని... నైపుణ్యానికి క్రమం తప్పకుండా మెరుగులు దిద్దుకుంటూ, పక్కా ప్రణాళికతో, క్రమశిక్షణతో ముందుకు సాగితేనే భారత షూటింగ్ భవిష్యత్ బాగుంటుందని అభినవ్ బింద్రా సారథ్యంలో ఏర్పాటైన రివ్యూ కమిటీ అభిప్రాయపడింది. రియో ఒలింపిక్స్లో భారత్ నుంచి 12 మంది షూటర్లు పాల్గొన్నా... ఒక్కరు కూడా పతకం సాధించకపోవడంతో భారత జాతీయ రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఏఐ)... బింద్రా నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసి నివేదిక కోరింది. ‘2004 ఏథెన్స ఒలింపిక్స్ నుంచి వరుసగా మూడు ఒలింపిక్స్ క్రీడల్లో షూటర్లు పతకాలు గెలవడంంతో 2016 రియోలోనూ షూటింగ్ నుంచి పతకం వస్తుందని అందరూ భావించారు. కానీ రియో ప్రదర్శన ద్వారా భారత షూటింగ్ వ్యవస్థలో లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దాల్సిన సమయం వచ్చేసిందని అవగతమైంది. కొంతమంది నైపుణ్యమైన షూటర్ల కారణంగా కొన్నేళ్లుగా భారత్కు అంతర్జాతీయస్థారుులో పతకాలు వచ్చారుు. అంతేగాని పక్కా వ్యవస్థ ద్వారా ఈ ఫలితాలు రాలేదని రియో ప్రదర్శన ద్వారా తేలిపోరుుంది’ అని బింద్రా కమిటీ వివరించింది. ‘జాతీయ రైఫిల్ సంఘం ఇప్పటికై నా తమ ధోరణిని మార్చుకోవాలి. కొత్త విధానాలను తేవాలి. సత్తా ఉన్నా వారికి సరైన అవకాశాలు కల్పించాలి. ఎలా ఉన్నా ముందుకు సాగిపోతామన్న వైఖరిని విడనాడాలి’ అని ఈ కమిటీ సూచించింది. గగన్ నారంగ్, హీనా సిద్ధూలతోపాటు తొలిసారి ఒలింపిక్స్లో పాల్గొన్న అపూర్వీ చండీలా, అయోనికా పాల్ వ్యవహారశైలిని కూడా బింద్రా కమిటీ తప్పు పట్టింది. గగన్ నారంగ్ గాయంతోనే ఒలింపిక్స్లో పాల్గొన్నాడని, సరైన ప్రణాళిక లేకుండా ప్రాక్టీస్ చేశాడని విమర్శించింది. మరోవైపు బింద్రా కమిటీ సూచించిన ప్రతిపాదనలు అమలు చేసేలా తాము చర్యలు తీసుకుంటామని జాతీయ రైఫిల్ సంఘం అధ్యక్షుడు రణిందర్ సింగ్ తెలిపారు. -
బింద్రాకు అరుదైన గౌరవం
ఐఎస్ఎస్ఎఫ్ అథ్లెట్స్ కమిటీ చైర్మన్గా ఎంపిక న్యూఢిల్లీ: దిగ్గజ షూటర్ అభినవ్ బింద్రాకు అరుదైన గౌరవం లభించింది. అంతర్జాతీయ షూటింగ్ స్పోర్ట్స్ సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) చైర్మన్గా ఎంపికైన తొలి భారతీయుడిగా బింద్రా రికార్డు సృష్టించాడు. ఈ మేరకు భారత జాతీయ రైఫిల్ సంఘాని (ఎన్ఆర్ఏఐ)కి ఐఎస్ఎస్ఎఫ్ నుంచి లేఖ అందింది. విశ్వవ్యాప్తంగా షూటింగ్ కార్యకలాపాలన్నీ ఈ సమాఖ్య నుంచే జరుగుతాయి. 32 ఏళ్ల బింద్రా ఈ పదవి దక్కించుకోవడంతో ఐఎస్ఎస్ఎఫ్ పరిపాలనా మండలిలో కూడా సభ్యుడవుతాడు. ‘ఇది నిజంగా చాలా గొప్ప గౌర వం. వ్యక్తిగతంగానే కాకుండా దేశానికే దక్కిన పురస్కారంగా భావిస్తున్నాను. ఈ పదవి చాలా బాధ్యతాయుతమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న షూటర్ల సమస్యలకు సంబంధించి నేను బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. అందరినీ సమదృష్టితో చూస్తూ పదవికి న్యాయం చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాను’ అని బింద్రా అన్నాడు. ఇప్పటిదాకా అతను ఐఎస్ఎస్ఎఫ్ అథ్లెట్స్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. బింద్రాకు దక్కిన గుర్తింపుపై ఎన్ఆర్ఏఐ అధ్యక్షుడు రణీందర్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు.