న్యూఢిల్లీ: భారత స్టార్ షూటర్, పారిస్ ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన మనూ భాకర్... ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్లో భారత షూటర్ల బృందానికి నాయకత్వం వహించనుంది. మ్యూనిక్ వేదికగా మంగళవారం నుంచి ప్రారంభం కానున్న షూటింగ్ ప్రపంచకప్ టోర్నమెంట్ కోసం భారత జాతీయ రైఫిల్ సమాఖ్య (ఎన్ఆర్ఏఐ) ఆదివారం 22 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఇందులో మనూ రెండు వ్యక్తిగత విభాగాలతో పాటు... ఓ టీమ్ ఈవెంట్లో బరిలోకి దిగనుంది. మనూ భాకర్తో పాటు హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్ కూడా ఈ టోర్నీలో బరిలోకి దిగనుంది.


