-
బకెట్లో పడి బాలుడు మృతి
సాక్షి, కుభీర్(ఆదిలాబాద్) : మండలంలోని సాంగ్వి గ్రామానికి చెందిన పొట్టేవార్ ఆదిత్య (2) ఆదివారం మధాహ్నం 3 గంటలకు రెండు రూపాయల బిల్ల కోసం బాత్రూంలోని బకెట్లో పడి మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పొట్టేవార్ రజిత యోగేష్ దంపతులకు ఇద్దరు కుమారులు మధ్యాహ్నం కుటుంబసభ్యులు ఇంట్లో ఉండగా చిన్న కుమారుడు ఆదిత్య ఆడుకుంటూ.. బాత్రూంలోకి వెళ్లాడు. ఆడుకుంటుండగా రెండు రూపాయల బిల్ల బకెట్లో పడింది. దానిని తీయడానికి బకెట్లోకి వంగి తీసుకునే ప్రయత్నంలో అందులో పడిపోయాడు. నీటిలో తల మునగడంతో అపస్మారక స్థితికి చేరాడు. గమనించిన కుటుంబసభ్యులు భైంసా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యలో మృతి చెందాడు. గ్రామంలో విషాదం.. మండలంలోని సాంగ్వి గ్రామంలో ఆదివారం రెండు రూపాయల బిల్ల కోసం బకెట్లో పడి పొట్టేవార్ రజిత యోగేశ్ దంపతుల చిన్న కుమారుడు ఆదిత్య (2)మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నా యి. ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో వందలాది మంది తరలివచ్చారు. తల్లిదండ్రులు, కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. -
సైనికుడా.. వందనం
భైంసాటౌన్(ముథోల్) : మనం ఈరోజు ప్రశాంత జీవనం గడుపుతూ సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం భారత సైనికులు.. 24 గంటలు సరిహద్దుల్లో దేశానికి కాపలా కాస్తూ ఎడారి ఎండల్ని, కాశ్మీరు మంచును, మేఘాలయా వర్షాలను లెక్కచేయకుండా దేశరక్షణలో ప్రాణత్యాగానికైనా సిద్ధపడుతారు. కోట్లాది భారతీయుల కోసం తమ కుటుంబాలకు దూరంగా మంచుగడ్డల్లో, ఎముకలు కొరికే చలిలో విధులు నిర్వర్తిస్తూ దేశాన్ని కంటికి రెప్పలా కాపలా కాస్తున్నారు. కేవలం దేశరక్షణకే పరిమితం కాకుండా వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజల రక్షణలోనూ ముందుంటున్నారు. దేశానికి అన్నం పెట్టేది రైతన్నే అయినా.. దేశాన్ని కాపాడేది సైనికుడు.. అందుకే ముందుగా జై జవాన్, ఆ తరువాతే జై కిసాన్ అన్నారు. దేశసేవ కోసం జిల్లా నుంచి ఎంతోమంది సైనికులు సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈనెల 15న సైనిక దినోత్సవం. నిరంతరం దేశానికి కాపలా కాసే సైనికులను స్మరించుకునే రోజు ఇది. ఈ నేపథ్యంలో కథనం.. ఆర్మీ ‘డే’ నేపథ్యం.. అనేక పోరాటాల ఫలితంగా 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది. ఎందరో స్వాతంత్య్ర సమర యోధులు భారతదేశానికి బ్రిటిషర్ల నుంచి స్వాతంత్య్రాన్ని సంపాదించి పెట్టారు. స్వాతంత్య్ర భారతదేశాన్ని భారత సైనికులు కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్నారు. 1948లో చివరి బ్రిటిషన్ కమాండర్ జనరల్ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో భారతదేశ మొట్టమొదటి సైనిక కమాండర్గా కేఎం కరియప్ప జనవరి 15న బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఈ రోజున ‘జాతీయ సైనిక దినోత్సవం’గా జరుపుకుంటున్నాం. ఈ రోజున దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన జవానులకు ఢిల్లీలోని అమరజవాను జ్యోతి వద్ద నివాళులర్పిస్తారు. వారి త్యాగాలను స్మరించుకుంటారు. దేశసేవలో ఉత్తమ సాహసాలను ప్రదర్శించిన జవానులకు సేవా అవార్డులు సైతం అందజేస్తారు. ప్రభుత్వాలు ప్రోత్సహించాలి దేశరక్షణలో భాగంగా విధులు నిర్వర్తించే జవాన్లకు ప్రభుత్వం వారి పదవీ విరమణ అనంతరం ఐదెకరాల ప్రభుత్వ స్థలం కేటాయిస్తోంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భూమి కేటాయిస్తాయి. అయితే గతంలో పదవీ విరమణకు ముందే జవాన్లకు ప్రభుత్వం ఐదెకరాల భూమి కేటాయించేది. కానీ 2009 నుంచి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ఆర్మీ జవాన్లకు పదవీ విరమణ తరువాతే భూమి కేటాయించాలని నిర్ణయించింది. దీంతో గతంలో మాదిరే ముందుగానే ప్రభుత్వం భూమిని కేటాయించాలని జవాన్లు కోరుతున్నారు. తమపై ఆధారపడే కుటుంబసభ్యులకు చేదోడువాదోడుగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ముందుగానే ఐదెకరాల స్థలం కేటాయిస్తే ఎందరో యువకులు దేశరక్షణలో పాలు పంచుకునే అవకాశం ఉంటుందని వారు పేర్కొంటున్నారు. ప్రభుత్వాలు సైతం యువత దేశరక్షణలో రాణించేలా వారిని ప్రోత్సహించాలని జవాన్లు కోరుతున్నారు. లక్ష్యమే కనిపించింది మాది భైంసా మండలం లింగా 2 గ్రామం. ఇటీవల జమ్మూకాశ్మీర్లో జరిగిన పాక్ కాల్పుల్లో నాచేతి నుంచి బుల్లెట్ దూసుకెళ్లడంతో గాయమైంది. ఆ రోజు చుట్టూ పొగమంచు ఆవరించి ఉంది. కాసేపు ఏం జరిగిందో తెలియలేదు. శత్రువుల నుంచి బుల్లెట్ల వర్షం కురుస్తున్నా సుమారు గంటసేపు ఉగ్రమూకలతో పోరాడా. గాయాలు కావడంతో సైనిక అంబులెన్స్లో ఆస్పత్రికి చేర్చారు. చికిత్స పొందాలని సూచించడంతో స్వగ్రామానికి వచ్చా. – దుప్పి విశ్వనాథ్, జవాను, లింగ 2 యూనిఫాం అంటే ఇష్టంతో.. మాది నిర్మల్ జిల్లా ఖానా పూర్లోని శాంతినగర్. అమ్మ లక్ష్మి, నాన్న నర్సయ్య వ్యవసాయం చేస్తారు. నేను కూడా వ్యవసాయంలో నాన్నకు సాయం చేస్తూ చదువుకున్నా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి యూనిఫాం జాబ్ అంటే చాలా ఇష్టం. ఎలాగైనా ఉద్యోగం సాధించాలని కసి ఉండేది. మొదటగా కానిస్టేబుల్ ఎంపిక పరీక్షలకు వెళ్లినా సెలెక్ట్ కాలేదు. అయితే తరువాత కఠోర సాధనతో 2008లో ఆర్మీ రిక్రూట్మెంట్లో మొదటి ప్రయత్నంలోనే ఎంపికయ్యాను. ప్రస్తుతం పంజాబ్లో విధులు నిర్వర్తిస్తున్నా. – కడుకుంట్ల ప్రవీణ్కుమార్, జవాన్ దేశసేవ కోసమే మాది భైంసాలోని కిసాన్గల్లి. అమ్మ గంగాబాయి, నాన్న రాములు. పదోతరగతి వరకు భైంసాలోని సరస్వతి శిశుమందిర్లో విద్యాభ్యాసం జరిగింది. 2002లో ఆర్మీ రిక్రూట్మెంట్లో ఎంపికయ్యా. ప్రస్తుతం నాయక్గా విధులు నిర్వర్తిస్తున్నా. – కార్తీక్, నాయక్, భైంసా జైహింద్ మన నినాదం కావాలి మాది భైంసా పట్టణంలో ని గణేశ్నగర్. అమ్మ భూ మాబాయి, నాన్న సాయ న్న. అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది. నా విద్యాభ్యాసం భైంసాలోని సర స్వతి శిశుమందిర్లో సాగింది. చిన్నప్పటి నుంచే దేశభక్తి భావాలు ఎక్కువ. 2000 సంవత్సరంలో ఆర్మీ రిక్రూట్మెంట్లో ఎంపికయ్యా. ప్రస్తుతం హవల్దార్గా విధులు నిర్వర్తిస్తున్నా. పిల్లలకు గుడ్మార్నింగ్, గుడ్నైట్లకు బదులు జైహింద్, జైభారత్ అనే నినాదాలు నేర్పించాలి. దీంతో వారిలో దేశం పట్ల గౌరవభావం ఏర్పడుతుంది. – ఆకుల దత్తాత్రి, హవల్దార్, భైంసా -
పంట కాపలాకు వెళ్లి పాలేరు మృతి
లోకేశ్వరం(ముథోల్): లోకేశ్వరం మండలం కన్కపూర్ గ్రామ శివారు ప్రాంతంలో లక్ష్మినగర్తండాకు చెందిన పాలేరు మూడ రాము(35) గురువారం మృతి చెందాడు. లక్ష్మినగర్ తండాకు చెందిన మూడ రాము ఆష్టా గ్రామానికి చెందిన సాయారెడ్డి వద్ద పాలేరుగా ఉంటున్నాడు. శనగ పంటను అడవి పందుల నుంచి రక్షించడానికి రాము కాపలాకు వెళ్లి గురువారం చేనులో రాము శవమై కనించాడు. మృతదేహాన్ని ముథోల్ సీఐ రఘుపతి పరిశీలించారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారైలు, ఒక కుమారుడు ఉన్నారు. రాము తండ్రి లచ్చిరాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
స్వగ్రామం చేరిన మృతదేహం
లోకేశ్వరం(ముథోల్): కుటుంబాన్ని పోషించుకునేందుకు విదేశాలకు వెళ్లి నాలుగు డబ్బులు సంపాదించుకు వస్తానని చెప్పి బహ్రెయిన్కు వెళ్లిన మండల కేంద్రానికి చెందిన ఈదన్న (35) గత నెల 26న గుండెపోటుతో మృతి చెందాడు. గ్రామంలో పాలేరుగా పనిచేస్తున్న సాకలి ఈదన్న గతేడాది రూ.3 లక్షలు అప్పుచేసి బహ్రెయిన్కు వెళ్లాడు. గత నెల26న బహ్రెయిన్లో గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబసభ్యులకు ఫోన్ద్వారా సమాచారం వచ్చింది. అప్పటినుంచి మృతుని కుటుంబసభ్యులు 11రోజులుగా మృతదేహంకోసం రోదిస్తూ ఎదురుచూస్తూ ఉన్నారు. కాగా బుధవారం శవపేటిక ఇంటికి చేరింది. ఈదన్నకు భార్య గంగామణి, ఇద్దరు కుమార్తెలు దీపిక, దివ్య ఉన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement