-
భారత కంపెనీలతో యాపిల్ ఒప్పందం.. ఎందుకంటే..
ప్రపంచ నం.1 కంపెనీ అయిన యాపిల్ భారత్లో కార్యకలాపాలపై ఆసక్తిగా ఉందని తెలుస్తుంది. తాజాగా ఐఫోన్ కెమెరా మాడ్యుల్స్ సరఫరా చేసేందుకు భారత కంపెనీలతో యాపిల్ ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలిసింది. ఈమేరకు కొన్ని మీడియా సంస్థలు వార్తాకథనాలు ప్రచురించాయి. ఐఫోన్ కెమెరా మాడ్యుల్స్ తయారీకి టాటా గ్రూప్నకు చెందిన టైటాన్ కంపెనీతో, మురుగప్ప గ్రూప్తో యాపిల్ చర్చలు జరుపుతున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఒకవేళ ఈ ఒప్పందం కుదిరితే కుపెర్టినో కంపెనీ తన కార్యకలాపాలను చైనాతోపాటు భారత్లో విస్తరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ కుపెర్టినో కంపెనీ చైనాలో ఐఫోన్ కెమెరాలను తయారుచేస్తోంది. ఈ ఒప్పందానికి సంబంధించి మరో 5-6 నెలల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. టైటాన్ గడియారాలు, ఇతర ఆభరణాల తయారీలో ప్రత్యేకత చాటుకుంటోంది. చెన్నై ప్రధాన కార్యాలయంగా ఉన్న మురుగప్ప గ్రూప్నకు ఇంజినీరింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, కెమికల్స్ రంగంలో 100 ఏళ్ల అనుభవం ఉంది. ఈనేపథ్యంలో ఈ కంపెనీతో ఒప్పందం ఖరారు చేసుకోవచ్చని పరిశ్రమ వర్గాల ద్వారా తెలిసింది. ఎలక్ట్రానిక్స్, కాంపోనెంట్స్ రంగంలో తన వ్యాపారాన్ని విస్తరించాలని నోయిడాకు చెందిన కెమెరా మాడ్యూల్ తయారీ సంస్థ మోషిన్ ఎలక్ట్రానిక్స్లో మురుగప్ప గ్రూప్ 76% వాటాను కొనుగోలు చేసింది. బెంగళూరు ప్రధాన కార్యాలయంగా ఉన్న టైటాన్ కంపెనీ ఇంజినీరింగ్, ఆటోమేషన్లో సేవలందిస్తోంది. హై ప్రెసిషన్ కాంపోనెంట్ తయారీ, ఇంజినీరింగ్ డిజైన్ సర్వీస్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రక్షణ, ఏరోస్పేస్ వంటి పరిశ్రమల్లోను సేవలందిస్తోంది. యాపిల్ జనవరి నివేదిక ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి భారత్లో దాదాపు రూ.1 లక్ష కోట్ల విలువైన ఐఫోన్లను తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దాంతో స్థానికంగా ఆ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్న కంపెనీల ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది. ఇండియాలో తయారవుతున్న దాదాపు 70 శాతం ఐఫోన్లు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇది మరింత పెరిగి అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: ప్రపంచంలోని రద్దీ ఎయిర్పోర్ట్ల్లో భారత విమానాశ్రయం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకంలో భాగంగా యాపిల్ భారత్లో తయారీకి ముందుకు వచ్చింది. అందులో భాగంగా ఇప్పటికే ఫాక్స్కాన్, పెగాట్రాన్, విస్ట్రాన్ వంటి ఎలక్ట్రానిక్స్ కంపెనీలతో కలిసి పనిచేస్తోంది. -
వైజాగ్లో కోరమాండల్ కొత్త ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మురుగప్ప గ్రూప్ సంస్థ, ఎరువుల తయారీ దిగ్గజం కోరమాండల్ ఇంటర్నేషనల్ తాజాగా ఆంధ్రప్రదేశ్లో భారీగా పెట్టుబడులు ప్రకటించింది. విశాఖపట్నంలోని తమ ఎరువుల కర్మాగారంలో కొత్తగా సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లాంటు ఏర్పాటు చేయనున్నట్లు మంగళవారం వెల్లడించింది. ఇందుకోసం సుమారు రూ. 400 కోట్లు వెచ్చిస్తోన్నట్లు సంస్థ తెలిపింది. దీనికి సంబంధించి ఎంఈసీఎస్ (మోన్శాంటో ఎన్విరో–కెమ్ సిస్టమ్స్), టీకేఐఎస్ (థిసెన్క్రప్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్)తో సాంకేతిక భాగస్వామ్య ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. రోజుకు 1,650 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు కోరమాండల్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ అరుణ్ అలగప్పన్ తెలిపారు. భారత్ ప్రస్తుతం సల్ఫ్యూరిక్ యాసిడ్ అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో మూడో స్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా ఉత్పత్తిని పెంచుకుని, దిగుమతులు తగ్గించుకోవాలన్న స్వావలంబన భారత్ లక్ష్య సాకారం దిశగా కొత్త ప్లాంటు ఏర్పాటు నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ప్రస్తుతం వార్షికంగా 6 లక్షల టన్నులుగా ఉన్న సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉత్పత్తి సామర్థ్యం .. మరో 5 లక్షల టన్నుల మేర పెరిగి 11 లక్షల టన్నులకు చేరుతుంది. ఎరువుల ఉత్పత్తికి అవసరమైన ముడి వస్తువులను అందుబాటులో ఉంచుకోవాలన్న దీర్ఘకాలిక లక్ష్యానికి అనుగుణంగా ఈ పెట్టుబడులు చేస్తున్నట్లు అరుణ్ తెలిపారు. ప్రస్తుతం వైజాగ్లోని కోరమాండల్ ఫ్యాక్టరీ ఏటా 13 లక్షల టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, దాదాపు 4 లక్షల టన్నుల క్యాప్టివ్ ఫాస్ఫోరిక్ యాసిడ్ ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేస్తోంది. -
పేమెంట్ బ్యాంక్ రేసు నుంచి వైదొలుగుతున్నాం
చోళమండలం ఫైనాన్స్ వెల్లడి ముంబై: పేమెంట్ బ్యాంకుల రేసు నుంచి వైదొలుగుతున్నామని మురుగప్ప గ్రూప్కు చెందిన చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ బీఎస్ఈకి తెలిపింది. పేమెంట్ బ్యాంక్ ఏర్పాటు కోసం తమ అనుబంధ సంస్థ చోళమండలం డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్(సీడీఎస్ఎల్) ఆర్బీఐ నుంచి సూత్రప్రాయ ఆమోదాన్ని పొందిందని, ఈ ఆమోదాన్ని తిరిగి ఆర్బీఐకే సమర్పిస్తున్నామని పేర్కొంది. పేమెంట్ బ్యాంకులకు సంబంధించిన వ్యాపారంలో తీవ్రమైన పోటీ ఉంటుందని, వ్యాపారం ప్రారంభించడానికే చాలా కాలం పడుతుందని, అందుకే ఈ రంగం నుంచి తప్పుకుంటున్నామని వివరించింది. చెల్లింపు బ్యాంక్ వ్యాపార కార్యకలాపాల కోసం సీడీఎస్ఎల్లో రూ.75 కోట్లు పెట్టుబడులు పెట్టాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని పేర్కొంది. ఆర్బీఐ గత ఏడాది ఆగస్టులో 11 సంస్థలకు పేమెంట్ బ్యాంకులకు సంబంధించి సూత్రప్రాయ ఆమోదాన్ని తెలిపింది. ఈ పేమెంట్ బ్యాంకులు గ్రామీణ ప్రాంతాల్లో రెమిటెన్స్ల సేవలు నిర్వహించాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ. 1 లక్ష వరకూ డిపాజిట్లు అంగీకరించవచ్చు. ఖాతాదారులకు ఎలాంటి రుణాలు ఇవ్వడానికి లేదు. మురుగప్ప గ్రూప్కు చెందిన ఆర్థిక విభాగం, సీడీఎస్ఎల్.. ఇప్పటికే వాహన, ఎస్ఎంఈ, గృహ రుణాలందిస్తోంది. ఇన్వెస్టర్ అడ్వైజరీ సేవలను కూడా అందజేస్తోంది. -
మురుగప్ప స్థూల లాభం 26 శాతం అప్
హైదరాబాద్: మురుగప్ప గ్రూప్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,780 కోట్ల స్థూల లాభాన్ని ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరపు స్థూల లాభంతో పోల్చితే ఇది 26 శాతం అధికమని మురుగప్ప గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.24,350 కోట్లుగా ఉన్న టర్నోవర్ 2014-15 ఆర్థిక సంవత్సరంలో 11 శాతం వృద్ధితో రూ.26,926 కోట్లకు చేరిందని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో తమ పనితీరు మెరుగుపడిందని, మరిన్ని ప్రాంతాలకు విస్తరించామని తెలిపింది. కోరమాండల్ ఇంటర్నేషనల్, ఈఐడీ ప్యారీ, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఇండియా, కార్బొరండమ్ యూనివర్శల్, చోళమండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ... ఇవన్నీ మురుగప్ప గ్రూప్ కంపెనీలే. -
పంటలు గతేడాదికంటే బాగుంటాయి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వర్షాభావ పరిస్థితులపై నెలకొన్న ఆందోళన క్రమేపి తగ్గుతోందని, గత సంవత్సరం కంటే ఈ ఏడాది పంటల దిగుబడి బాగుంటుందని మురుగప్ప గ్రూపు అంచనా వేస్తోంది. ప్రస్తుతం సాధారణం కంటే 15 శాతం తక్కువ వర్షాలు పడ్డాయని, ఈ శాతం 10 శాతానికి పరిమితమవుతుందని, దీనిపై అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మురుగప్ప గ్రూపు చైర్మన్ ఎ.వెలయన్ పేర్కొన్నారు. వర్షాలు ఆలస్యమైనా ఇప్పుడిప్పుడే రిజర్వాయర్లలోకి నీరు చేరుతోందని, దీంతో రబీ పంటల దిగుబడి బాగుంటుందని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. కోరమాండల్ గ్రూపునకు ప్రధాన మార్కెట్లుగా ఉన్న కర్నాటక, ఆంధ్రా, ఒరిస్సాలపై వచ్చే మూడు వారాల్లో ఒక స్పష్టత వస్తుందన్నారు. మొత్తంమీద చూస్తే సెప్టెంబర్ నుంచి ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు మెరుగవుతుందని అంచనా వేస్తున్నామని, దీంతో మా గ్రూపు పనితీరు కూడా బాగుంటుందన్నారు. అత్యంత చౌకగా చక్కెర దేశంలో చక్కెర ధరలు ప్రపంచంలోనే అత్యంత చౌకగా ఉన్నాయని, దీంతో చక్కెర దిగుమతులపై సుంకాలు పెంచడంతో దేశీయ పరిశ్రమకు కొంత మేర ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఇప్పటికే 8 మిలియన్ టన్నుల చక్కెర నిల్వలు ఉండగా, ఈ ఏడాది 25 మిలియన్ టన్నుల చక్కెర ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నట్లు వెలయన్ తెలిపారు. ఒక్క ఉత్తర ప్రదేశ్ తప్ప ఆంధ్రప్రదేశ్తో సహా కర్నాటక, మహారాష్ట్రలో గత ఏడాది కంటే ఈ సారి చెరకు సాగు పెరిగిందన్నారు. సీఎస్ఆర్ కింద పాఠశాలకు రూ.4.55 కోట్ల విరాళం మురుగప్పా గ్రూపునకు చెందిన కోరమాండల్ ఇంటర్నేషనల్ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని ఉద్భవ్ పాఠశాలను దత్తత తీసుకుంది. ఇందుకోసం ఐఐఎం అహ్మదాబాద్ అలుమినీ హైదరాబాద్ చాప్టర్తో ఒప్పందం కుదుర్చుకుంది. దీని కింద పాఠశాల నిర్వహణకు ఏటా అయ్యే రూ. 70 లక్షల వ్యయాన్ని కోరమాండల్ భరించనుంది. ఇందుకోసం మొత్తం రూ.4.55 కోట్లు ఉద్భవ్ పాఠశాలకు విరాళంగా ఇచ్చింది. ఈ సందర్భంగా వెలయన్ మాట్లాడుతూ ఈ ఏడాది సీఎస్ఆర్ కింద సుమారు రూ. 15 కోట్లు వ్యయం చేయనున్నట్లు తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement