పేమెంట్ బ్యాంక్ రేసు నుంచి వైదొలుగుతున్నాం | Cholamandalam drops payments bank plans | Sakshi
Sakshi News home page

పేమెంట్ బ్యాంక్ రేసు నుంచి వైదొలుగుతున్నాం

Mar 25 2016 12:52 AM | Updated on Sep 3 2017 8:29 PM

పేమెంట్ బ్యాంక్ రేసు నుంచి వైదొలుగుతున్నాం

పేమెంట్ బ్యాంక్ రేసు నుంచి వైదొలుగుతున్నాం

పేమెంట్ బ్యాంకుల రేసు నుంచి వైదొలుగుతున్నామని మురుగప్ప గ్రూప్‌కు చెందిన చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఫైనాన్స్

చోళమండలం ఫైనాన్స్ వెల్లడి
ముంబై: పేమెంట్ బ్యాంకుల రేసు నుంచి వైదొలుగుతున్నామని మురుగప్ప గ్రూప్‌కు చెందిన చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ బీఎస్‌ఈకి తెలిపింది. పేమెంట్ బ్యాంక్ ఏర్పాటు కోసం తమ అనుబంధ సంస్థ చోళమండలం డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్(సీడీఎస్‌ఎల్) ఆర్‌బీఐ నుంచి  సూత్రప్రాయ ఆమోదాన్ని పొందిందని, ఈ ఆమోదాన్ని తిరిగి ఆర్‌బీఐకే సమర్పిస్తున్నామని పేర్కొంది. పేమెంట్ బ్యాంకులకు సంబంధించిన వ్యాపారంలో తీవ్రమైన పోటీ ఉంటుందని, వ్యాపారం ప్రారంభించడానికే చాలా కాలం పడుతుందని, అందుకే ఈ రంగం నుంచి తప్పుకుంటున్నామని వివరించింది.

చెల్లింపు బ్యాంక్ వ్యాపార కార్యకలాపాల కోసం సీడీఎస్‌ఎల్‌లో రూ.75 కోట్లు పెట్టుబడులు పెట్టాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని పేర్కొంది. ఆర్‌బీఐ గత ఏడాది ఆగస్టులో 11 సంస్థలకు పేమెంట్ బ్యాంకులకు సంబంధించి సూత్రప్రాయ ఆమోదాన్ని తెలిపింది. ఈ పేమెంట్ బ్యాంకులు గ్రామీణ ప్రాంతాల్లో రెమిటెన్స్‌ల సేవలు నిర్వహించాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ.  1 లక్ష వరకూ డిపాజిట్లు అంగీకరించవచ్చు. ఖాతాదారులకు ఎలాంటి రుణాలు ఇవ్వడానికి లేదు. మురుగప్ప గ్రూప్‌కు చెందిన ఆర్థిక విభాగం, సీడీఎస్‌ఎల్.. ఇప్పటికే వాహన, ఎస్‌ఎంఈ, గృహ రుణాలందిస్తోంది. ఇన్వెస్టర్ అడ్వైజరీ సేవలను కూడా అందజేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement