breaking news
muddamandaram
-
తనూజకు భారీగా ఓట్లు.. సీక్రెట్ ఇదే
బిగ్బాస్ తెలుగు 9 సీజన్లో తనూజ విన్నర్ అవుతుందని చాలామంది చెబుతున్న మాట.. అయితే, అదంతా పీఆర్ టీమ్ మాయా అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. బిగ్బాస్ కోసం దాదాపుగా ప్రతి కంటెస్టెంట్ పీఆర్ను పెట్టుకుంటారు. అలా అని కేవలం వారి మీదనే ఆదారపడితే కుదరదు. హౌస్లో కంటెస్టెంట్ సరైన కంటెంట్ ఇవ్వకుంటే ఎంతమంది పీఆర్ టీమ్లో ఉన్న సరే ఎలిమినేట్ అయి బయటకు రావాల్సిందే.తనూజ కోసం రూ. 100 కోట్లుబిగ్బాస్లో పది వారాలుగా తనూజ టాప్లో ఉంది. సోషల్మీడియా సర్వేలలో చాలామటుకు ఆమె విన్నర్ అంటూ ఓట్లు పడుతున్నాయి. కల్యాణ్ రెండో స్థానంలో ఉన్నాడు. అయితే, కొందరు తనూజను టార్గెట్ చేస్తూ పీఆర్ టీమ్ సాయంతో నెట్టుకొస్తుందని అంటుంటే... మరికొందరు మాత్రం తనకు బిగ్బాస్ టీమ్ సపోర్ట్ ఉందని అంటున్నారు. దాదాపు ఇందులో నిజం ఉండదనే వాదన షో గురించి తెలిసిన వారు చెబుతున్నమాట. ఆమెకు కప్ ఇచ్చేందుకు బిగ్బాస్ టీమ్ ఏకంగా రూ. 100 కోట్లకు పైగా ఖర్చు చేస్తుందా..? ఒకరి కోసం తమ ప్రతిష్టను దెబ్బతీసుకుంటుందా ..? ఒకవేళ తనూజకు సాయం చేయాలనుకుంటే మరో పది సీరియల్స్లలో అవకాశాలు కల్పిస్తారు. అంతే గానీ ఇలా కోట్లలో ఖర్చు పెట్టి ఆమెకు కప్ ఎందుకు ఇస్తారని వాదించేవారు కూడా ఉన్నారు.తనూజ ఓట్ల సీక్రెట్ ఇదేఅన్నపూర్ణ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సీరియల్ 'ముద్దమందారం..' 2014 నుంచి 2019 వరకు జీతెలుగులో ఈ సీరియల్ ప్రసారమైంది. ఒకటి రెండు కాదు ఏకంగా 1580 ఎపిసోడ్లతో బుల్లితెర హిస్టరీలోనే సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇందులో పల్లెటూరి పేదింటి అమ్మాయి పాత్రలో తనూజ అదరగొట్టింది. ఈ సీరియల్ చూసిన ప్రతిఒక్కరు ఆమెకు ఫ్యాన్స్ అయిపోయారు. తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా చాలా హిట్ అయింది. సీరియల్స్ ఎక్కువగా గృహిణిలే ఫాలో అవుతుంటారు. దీంతో బిగ్బాస్లో ఆమెకు వారి నుంచే మద్ధతు లభించింది. ఆపై చాలా గ్యాప్ తర్వాత బిగ్బాస్ వల్ల తనూజ మళ్లీ కనిపించడంతో మొదటి ఎపిసోడ్ నుంచే ఆమెకు భారీగా ఓట్లు పడటం జరుగుతుంది. ఈ కారణం వల్లనే ఆమెకు ఎక్కువగా ఓట్లు పోల్ అవుతున్నాయి. కేవలం పీఆర్ వల్ల మాత్రమే ఇంత బజ్ క్రియేట్ అవుతుంది అనుకుంటే పొరపాటే.. ముఖ్యంగా ఈ సీజన్లో బలమైన కంటెస్ట్ట్స్ లేకపోవడం ఆపై చాలా పవర్ఫుల్ అనుకున్న భరణి ఆట పేలవంగా ఉండటంతో తనూజకు బాగా కలిసొచ్చింది. ఇమ్మాన్యుయేల్ సత్తా చాటుతున్నప్పటికీ అతను ఒక్కసారి కూడా నామినేషన్లోకి రాలేదు. దీంతో తనకూ ఫ్యాన్ బేస్ లేకుండా పోయింది. ఆపై ప్రేక్షకులను మెప్పిస్తుంది కల్యాణ్ మాత్రమే.. కానీ, అతను కూడా తనూజతో బాగా క్లోజ్గా ఉండటం వల్ల విన్నర్ అయ్యేంత రేంజ్లో ఓట్లు పెద్దగా అతనివైపు మొగ్గుచూపడం లేదు. ఇలా పలు కారణాల వల్ల ప్రస్తుతానికి తనూజ టాప్లో దూసుకుపోతుంది. పీఆర్ టీమ్ కారణంగానే బిగ్బాస్ విన్నర్గా ఎవరూ కాలేరనేది చాలామంది చెబుతున్నమాట.. అందుకోసం ధైర్యం చేసి అంత ఖర్చు ఎవరూ చేయరని కూడా తెలుపుతున్నారు. కానీ, వారి ఆటకు కాస్త బలాన్ని పీఆర్ టీమ్ ఇస్తుందనేది మాత్రం వాస్తవం అంటారు. -
బిగ్బాస్ 'తనూజ' క్రేజ్.. పదేళ్ల నాటి హిట్ సాంగ్ ఇప్పుడు వైరల్
బిగ్బాస్ 9 తెలుగు సీజన్లో ప్రస్తుతానికి తనూజ టాప్లో దూసుకుపోతుంది. ఓటింగ్ పరంగా చాలా పేజీలలో ఆమె ప్రథమ స్థానంలో ఉంది. అయితే, తెలుగులో ఆమెకు ముద్దమందారం సీరియల్ మంచి గుర్తింపు తెచ్చింది. బిగ్బాస్లో ఆమె టాప్లో ఉండటంతో ఈ సీరియల్కు సంబంధించిన టైటిల్ సాంగ్ నెట్టింట వైరల్ అవుతుంది. మిలియన్ల కొద్ది వ్యూస్తో దూసుకుపోతుంది.తనూజ అసలు పేరు తనూజ పుట్టస్వామి. అయితే, సినీ పరిశ్రమలో తనూజ గౌడగా స్థిరపడిపోయింది. కర్ణాటకకు చెందిన ఈ బ్యూటీ బెంగళూరు యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆమెను ఒక టీచర్గా చూడాలని ఆమె తండ్రి కోరుకున్నాడు. కానీ, ఆమెకు సినిమా రంగం అంటే ఆసక్తి ఉండటంతో తన కలను సాధించుకోవడం కోసం ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అయితే, తన కాలేజీ రోజుల్లోనే హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ.తన కాలేజీ రోజుల్లోనే తనూజకు మొదట కన్నడ హారర్ సినిమా '6-5=2'లో దక్కింది. ఆ తర్వాత దండే బాయ్స్ చిత్రంలో నటించింది. వాటితో ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ క్రమంలోనే తెలుగులో తొలి సీరియల్ 'అందాల రాక్షసి'లో ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత వెంటనే ముద్దమందారంలో పార్వతి పాత్రతో మెరిసింది. మంచి నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇప్పుడు ఈ సిరీయల్ టైటిల్ సాంగ్ నెట్టింట వైరల్ అవుతుంది. తనూజ దెబ్బతో 27 మిలియన్లు దాటేసిందిబిగ్బాస్ సీజన్ ప్రారంభమైన సమయంలో కేవలం 6 మిలియన్ల వ్యూస్తో ఉన్న ఈ పాట.. ఇప్పుడు ఏకంగా 27 మిలియన్లతో దూసుకుపోతుంది. బిగ్బాస్లో తనూజ గేమ్ నచ్చిన వారు ఈ సాంగ్ను ఇప్పుడు చూస్తున్నారని తెలుస్తోంది. తనూజ వల్ల ఈ సాంగ్ ఏకంగా 20 మిలియన్ల వ్యూస్ అదనంగా రీచ్ తెచ్చుకుంది. తనూజ పుట్టస్వామి ఒక రియల్ గేమర్గా ఆడుతుంది. తనలో ఎమోషన్స్తో పాటు సెన్సిటివ్ కూడా ఉంది. మొదటి నుంచి టాస్క్ కూడా వదిలేయలేదు. కన్నడిగ అయినా సరే.., తెలుగులోనే చాలా ఫ్లూయెంట్గా మాట్లాడుతుంది. ప్రస్తుతానికి తనూజ మాత్రమే టాప్లో ఉంది. -
ఉద్యోగం చేయాలనుకున్నా కానీ, సినిమాల్లోకి రావాలనుకోలేదు!
‘ముద్దమందారం’లో పూర్ణిమ ‘ముద్దుకే ముద్దొచ్చే మందారం... మువ్వల్లే నవ్వింది సింగారం’. బహుశా...పూర్ణిమను చూసే వేటూరి ఈ పాట రాశారేమో! వెండితెరపై తెలుగుదనానికి ప్రతీకలా ఉండేవారామె. పరికిణీలో పూర్ణిమ నిజంగా ముద్దమందారమే. ఆహార్యంలోనే కాదు, అభినయంలో కూడా పూర్ణిమ అభినందనీయురాలే. జంధ్యాల వంటి దిగ్గజం ప్రశంసలు ఆమెకు లభించాయంటే కారణం అదే. ఇటీవలే మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్న పూర్ణిమ ఇంటర్వ్యూ కోసం ఆమె మొబైల్కి కాల్ చేసింది ‘సాక్షి’. ‘నువ్వు నేనూ కలిసుంటేనే నాకెంతో ఇష్టం..’ అంటూ ‘గంగోత్రి’ సినిమా లోని పాట కాలర్ట్యూన్గా వినిపించింది. చరణం పూర్తయ్యేలోపే ‘హలో’ అన్నారు పూర్ణిమ. ఆ తర్వాత జరిగిన సంభాషణ. మీ కాలర్ట్యూన్ వింటే... మీకు సినిమాలంటే బాగా ఇష్టమని అర్థమవుతోంది... అవును... ఇప్పటికీ సినిమాలు బాగా చూస్తుంటాను. ఇప్పటి హీరోల్లో ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ అబ్బాయిని చూడాలనుంది. అలాగే చిరంజీవిగారబ్బాయి చరణ్ యాక్షన్ అన్నా నాకు ఇష్టమే. రవితేజ, సిద్దార్థ్ల సినిమాలు కూడా బాగానే చూస్తా. ఇక హీరోయిన్లలో సమంత, కాజల్, అనుష్క, తమన్నా అంటే ఇష్టం. అప్పట్లో సౌందర్య కూడా నాలాగే తెరపై పద్ధతిగా కనిపించింది. తనంటే ఇంకా ఇష్టం. మీరు తెలుగుదనానికి ప్రతీకలా ఉండేవారు కదా. ఇప్పుడొస్తున్న హీరోయిన్ల పోకడలు చూస్తే ఏమనిపిస్తుంది? మనం ఎవర్నీ తప్పు పట్టలేం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎదగాలనుకున్నప్పుడు ఇలాంటివి చేయక తప్పదు. పాపం... హీరోయిన్లే ఐటమ్సాంగులు కూడా చేయాల్సొస్తోంది. మీరు ఈ జనరేషన్వారు కాకపోవడం వల్ల హ్యాపీగా ఫీలయ్యారా? నేను సంప్రదాయ కుటుంబంలో పుట్టిన అమ్మాయిని. అసలు సినిమాల్లో చేయడమే మా ఇంట్లో ఇష్టం లేదు. ‘ఒక్క సినిమానే’ అనేసరికి చేశాను. కమిట్మెంట్తో నడుచుకున్నాను కాబట్టే, అమ్మానాన్న కూడా నన్ను విభేదించలేదు. 1989లో నేను సినిమాలకు దూరమయ్యాను. అప్పుడు కొంతమంది దర్శక, నిర్మాతలు ట్రెండీగా కనిపిస్తే... పారితోషికం కూడా ఎక్కువిస్తామని అన్నారు. కానీ... నేను మాత్రం నా అభిమతాన్ని మార్చుకోలేదు. మీరు గాయని కూడా కదా? అవును.. అప్పట్లో చాలా పాటలు పాడాను. కొన్ని ఫంక్షన్లలో కూడా పాడాను. తొలుత గాయని అవుదామనే జంధ్యాల గారిని కలిశారట కదా? కాదండీ... ‘ముద్దమందారం’ హీరోయిన్ కోసం జంధ్యాల దాదాపు వందమంది అమ్మాయిలను చూశారు. ఆయనకు ఎవరూ సరిగ్గా నచ్చలేదు. అనుకోకుండా ఓ సందర్భంలో నా ఫొటో చూసి, ‘నా సినిమాలో నాయిక ఈ అమ్మాయే’ అని ఫిక్సయిపోయారట. మా నాన్నగారి వద్దకు తన కో-డెరైక్టర్ని పంపించి మాట్లాడించారు. నేను మాత్రం చేయనని కరాఖండీగా చెప్పేశాను. బాగా చదువుకుని, మంచి ఉద్యోగం చేయాలని నాకుండేది. కానీ నచ్చజెప్పడంతో ఒక సినిమా చేసి వచ్చేద్దాం అనుకున్నాను. కానీ... తర్వాత అదే జీవితం అయిపోయింది. దాదాపు వంద సినిమాల్లో నటించాను. ముద్దమందారం, మల్లెపందిరి, నాలుగు స్తంభాలాట, శ్రీవారికి ప్రేమలేఖ, ఆడపడుచు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య... ఇలా నాకు పేరు తెచ్చిన సినిమాలెన్నో. మీరు మరచిపోలేని పాత్ర? ‘ఇంట్లో రామయ్య-వీధిలో కృష్ణయ్య’లో ‘పిచ్చితల్లి’ పాత్రను ఎప్పటికీ మరువలేను. ‘ఆ సినిమా ఒప్పుకోడానికి పూర్ణిమ పాత్రే కారణం’ అని ఓ సందర్భంలో చిరంజీవి చెప్పారు... అవునా... అంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పండి. చిరంజీవిగారు కూడా అప్పుడప్పుడే ఎదుగుతున్న రోజులవి. కళ్లజోడు పెట్టుకొని చాలా క్యూట్గా ఉండేవారాయన. నన్ను ‘పూరీ.. పూరీ’ అని పిలిచేవారు. ఇద్దరం సెట్ అంతా అల్లరి చేసేవాళ్లం. మాధవి రిజర్డ్వ్ పర్సన్. ఎవరితోనూ కలిసేవారు కాదు. అందుకే... చిరంజీవిగారూ నేనూ కూడబలుక్కొని మరీ ఆమెను ఏడిపించేవాళ్లం. ఆ పాత్రను నేను చాలా బాగా చేశానని అందరూ అంటుంటారు. నిజానికి ఆ క్రెడిట్ మొత్తం కోడి రామకృష్ణగారిదే. ప్రతి సన్నివేశంలోనూ ఆయన నటించి చూపించేవారు. చిరంజీవిగారిని తర్వాత ఎప్పుడైనా కలిశారా? మొన్న టి.సుబ్బరామిరెడ్డిగారి పుట్టినరోజు వేడుక మా వైజాగ్లో జరిగింది. అప్పుడు కేవలం చిరంజీవిగారిని కలవడానికే వెళ్లాను. చూడగానే... ‘ఏమ్మా... బావున్నారా’ అన్నారు. నిజంగా నాకు ఎంత ఆనందమనిపించిందో. నిజంగా ఆయన చాలా గ్రేట్. నేను అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ చిరంజీవిగారి అభిమానినే. ‘మా వైజాగ్’ అంటున్నారు! మీరు ప్రస్తుతం అక్కడే ఉంటున్నారా? అవును.. ‘ముద్దమందారం’, ‘నాలుగు స్తంభాలాట’, ‘శ్రీవారికి ప్రేమలేఖ’.. ఇలా చాలా సినిమాల షూటింగులు ఇక్కడే జరిగేవి. జంధ్యాల గారికి కూడా వైజాగ్ ఇష్టం. ఇక్కడే షూటింగ్స్ జరిపేవారు. జంధ్యాలగారు కుడివైపుకి తిరిగి నిలబడమంటే, నేను ఎడమవైపు తిరిగి నిలబడేదాన్ని. దాంతో నన్ను ‘తింగరి..’ అని పిలిచేవారు. చనిపోయేవరకూ నన్ను అలాగే పిలిచారాయన. నిజంగా ఆ రోజులు మళ్లీ తిరిగిరావు. నా కెరీర్ ఎక్కువ భాగం వైజాగ్లోనే సాగింది. అయితే.. పెళ్లయ్యాక సినిమాలకు దూరమయ్యాను. మీ శ్రీవారు ఏం చేస్తారు? ఒరిస్సాలో ఉద్యోగం ఆయనకు. అందుకే అక్కడే స్థిరపడిపోయాం. ఇప్పుడు పిల్లలు కూడా పెరిగి పెద్దవారయ్యారు. నాతోటి హీరోయిన్లందరూ మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడితే.. నాక్కూడా నటించాలనిపించింది. అందుకే... వైజాగ్ వచ్చేశాం. తొమ్మిది నెలల నుంచీ ఇక్కడే ఉంటున్నాం. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు? ఉందిలే మంచికాలం ముందుముందునా, తొండి, 33 ప్రేమకథలు, సాహసం చేయరా డింభక, సాహెబా సుబ్రమణ్యం ఇలా పలు సినిమాల్లో తల్లి పాత్రలు చేశాను, చేస్తున్నాను. అయినా ఈ వయసులో అమ్మ పాత్రలు చేయడమే కరెక్ట్ కదా. సంభాషణ: బుర్రా నరసింహ


