breaking news
mla Nallamilli Ramakrishna Reddy
-
ఎమ్మెల్యే నల్లమిల్లి కక్ష సాధిస్తున్నాడు
రాజమహేంద్రవరం రూరల్: అంధురాలైన తన భార్య పింఛన్ నిలిపివేశారని జనసేన పార్టీ నేత వీరబాబు ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు అధికారులు తన భార్యకు పింఛన్ ఇవ్వడం లేదని బిక్కవోలు మండలం ఆరికిరేవుల గ్రామ పంచాయతీకి చెందిన జనసేన వార్డు మెంబర్ వీరబాబు తెలిపాడు. శనివారం ఆయన అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ కార్యదర్శి, వైఎస్సార్ సీపీ దివ్యాంగుల సెల్ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు ముత్యాల పోసికుమార్, అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖండవల్లి భరత్ కుమార్ తదితరులతో కలిసి డీఆర్డీఏ పీడీ ఎంవీఎస్ఎన్ మూర్తికి ఫిర్యాదు చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తమ గ్రామ పంచాయతీలో జరుగుతున్న అవకతవకలపై తాను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కక్ష పెంచుకున్నారని తెలిపాడు. తన భార్య కొర్ల రాముకు వస్తున్న దివ్యాంగ పింఛన్ను గత నెలలో నిలిపివేశారని ఆరోపించారు. సదరం వెరిఫికేషన్ చేయించుకోవాలని అధికారులు మెమో ఇస్తే.. ఆ మేరకు ఆన్లైన్లో వైద్యులు పరీక్షించి, 40 శాతం వైకల్యం ఉన్నట్లు నివేదిక ఇచ్చారన్నారు. అయితే గత నెల 31న పింఛను వచ్చినట్లు తన భార్య సెల్కు మెసేజ్ వచ్చిందన్నారు. కానీ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు సచివాలయ ఉద్యోగి నగదు ఇవ్వకుండా ఎంపీడీఓ మౌఖిక ఆదేశాలు ఇచ్చారని ఆరోపించారు. ఆఫ్లైన్లో మరోసారి రీవెరిఫికేషన్ చేయించాలని, అప్పుడు కూడా 40 శాతం వస్తే పింఛను ఇస్తామని పీడీ చెప్పారని వీరబాబు తెలిపారు. -
‘అడుక్కోవడం’ అక్కడ పవిత్రమైన మొక్కు
అనపర్తి: సాధారణంగా అమ్మవారి జాతరలు రాత్రి జరుగుతాయి. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరంలో కొలువు తీరి, కర్రి వంశీకుల ఆడపడుచుగా పూజలందుకునే సత్తెమ్మ తల్లి జాతర మాత్రం తరతరాల నుంచి పగటి వేళల్లో జరుగుతోంది. అంతేకాదు.. విలక్షణమైన మరో ఆనవాయితీని కూడా ఈ జాతర సందర్భంగా చూడవచ్చు. చిన్న, పెద్ద తేడా లేకుండా బాలురు, ధనిక పేద అన్న తారతమ్యం లేకుండా పురుషులు చిత్ర విచిత్ర వేషాలు వేసి బిచ్చమెత్తుతారు. కోరిన కోరికలు తీరితే అలా బిచ్చమెత్తుతామని మొక్కుకోవడం వారికి రివాజు. అలా సేకరించిన సొమ్మును, కానుకలను అమ్మవారి హుండీలో వేసి, మొక్కుబడులు తీర్చుకుంటారు. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతర ముగింపు సందర్భంగా బుధవారం కనిపించిన ‘యాచకులు కాని యాచకులు’ వీరు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి దంపతులు కూడా జోలె పట్టడం విశేషం. -
‘అడుక్కోవడం’ అక్కడ పవిత్రమైన మొక్కు
-
వెన్నుపోటుదారుకు మళ్లీ చోటా?
అనపరిత: ‘ఏరు దాటాక తెప్ప తగలేసే’ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావును పార్టీలో చేర్చుకోవడంపై పెదపూడి మండలం తెలుగు తమ్ముళ్లు భగ్గుమన్నా రు. అనపర్తి టీడీపీ కార్యాలయంలో ఆదివారం జరిగిన పెదపూడి మండల టీడీపీ కార్యకర్తల సమావేశం బొడ్డు చేరికపై వేడెక్కింది. పెదపూడి మండల టీడీపీ అధ్యక్షుడు జేవీవీ కృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథి గా పాల్గొన్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని.. బొడ్డును ఎందుకు చేర్చుకున్నారంటూ పెదపూడికి చెందిన మార్నీ కాశీ నిలదీశారు. ఆయనకు పెదపూడికి చెందిన వాసు, శహపురానికి చెందిన కృష్ణ వత్తాసు పలికారు. ‘బొడ్డు డౌన్ డౌన్, బొడ్డును టీడీపీ నుంచి తరిమి కొట్టాలి’ అన్న నినాదాలతో సమావేశం రసాభాసగా మారింది. ఎమ్మెల్యే వారించబోయినా ఖాతరు చేయని కార్యకర్త లు తమను సంప్రదించకుండా బొడ్డును ఎందుకు చేర్చుకున్నారని ప్రశ్నిం చా రు. నియోజకవర్గంలో ఏకతాటిపై నడుస్తున్న పార్టీలో బొడ్డు చేరిక వల్ల గ్రూ పులు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు బురదజల్లి వైఎస్సార్సీపీలో చేరిన వాడిని ఎలా చేర్చుకున్నారని మండిపడ్డారు. బొడ్డు టీడీపీలో, ఆయన తనయుడు వైఎస్సార్ సీపీలో ఉండడాన్ని తప్పుపట్టారు. బొడ్డు టీడీపీలో కొనసాగితే పార్టీకి రాజీనామా చేస్తామని తెగేసి చెప్పారు. ఆగ్రహోదగ్రులైన కార్యకర్తలను శాంతింపజేసేందుకు ఎమ్మెల్యే ఎంత యత్నించినా, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కోరినా లక్ష్యపెట్టలేదు. చివరికి కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి వెనుకాడబోననడంతో కొంత శాంతించారు.


