breaking news
Miss Universe India
-
'తిరంగా' దుస్తుల వివాదం..ఊర్వశి రౌతేలా స్పందన ఇదే..!
మిస్ యూనివర్స్ ఇండియా 2026 గ్రాండ్ ఫినాలే ఆగస్టు 23న జైపూర్లోని జీ స్టూడియోస్లో జరిగిన సంగతి విధితమే. ఈ అందాల పోటీకి మాజీ మిస్ యూనివర్స్ ఇండియా ఊర్వశి రౌతేలా, భారత్ తొలి మిస్ యూనివర్స్ సుష్మితా సేన్, మిస్ యూనివర్స్ ఇండియా 2024 రియా సింఘా, పర్యావరణవేత్త, చిత్ర నిర్మాత ప్రజ్ఞా కపూర్, మిస్ యూనివర్స్ రన్నరప్ సెలీనా జైట్లీ తదితదరులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం కోసం ఊర్వశి త్రివర్ణ పతాకాన్ని స్ఫూర్తిగా తీసుకున్న దుస్తులను ఎంచుకుందామె. దీనిపై నెటిజన్ల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. పలువురు భారత జెండాను దుస్తులుగా ధరించడం లేదా జెండాను నేరుగా దుస్తులపై ముద్రించడం వంటివి జాతీయ జెండా నియమావళిని ఉల్లఘించినట్లే అంటూ ఘాటుగా విమర్శలు చేశారు. అంతేగాదు చాలామంది ఇలా చేసి ఉండకూడదు, ఇది సరైనది కాదంటూ తిట్టిపోశారు కూడా. మరికొందరైతే...భారత జెండా నియమావళి గురించి ప్రస్తావిస్తూ.. దాన్ని ఉల్లంఘిస్తే పడే శిక్షలు, చట్టం గురించి కూడా మాట్లాడారు. మరి ఆ వ్యాఖ్యలపై మాజీ మిస్ యూనివర్స్ ఇండియా ఊర్వశి రౌతేలా ఏమన్నారంటే. అది యథావిధి ప్రతిరూపం కానే కాదు..తను తన దేశాన్ని కేవలం ఒక జాతీయతగా మాత్రమే కాకుండా, గుర్తింపులో భాగంగా భావిస్తాను. తాను ఎక్కడ నుంచి వచ్చానో ప్రజలకు తెలియజేయడానికే ఈ కౌచర్ని ఎంచుకున్నట్లు తెలిపారు. "దీని ఆకృతి, రంగుల కలయిక, అందులో వివరాలు కేవలం ఫ్యాషన్గా రూపొందించినవే. ఇది ఒక జాతీయ భావనను కళాత్మక వ్యక్తీకరణగా మార్చడం గురించి. అలాగే ఈ గౌనుకి భారత జాతీయ పతాకానికి చాలా స్పష్టమైన తేడాలు ఉన్నాయి. నిజానికి ఈ గౌను ఏమి జాతీయ పతాకానికి ఏమి యథాతథ ప్రతిరూపం మాత్రం కాదు. ఇది జస్ట్ త్రివర్ణ పతాకం నుంచి ప్రేరణ పొందిన అంశాలను ఉపయోగించి డిజైన్ చేసిన గౌను మాత్రమే". అని నొక్కి చెప్పారు ఊర్వశి. ఈ గౌనులోని మూడు రంగులు, మధ్యలోని చక్రం వంటివి జాతీయ జెండాలోని మూలాంశాలతో ఫ్యాషన్ని చూపించే ప్రయత్నం చేశామే తప్ప జెండా నియమావళిని అస్సలు ఉల్లంఘించలేదని కరాఖండీగా చెప్పారు. పైగా ఇవి నిలువు రంగులు, మధ్యలో ఉన్న చక్రం ఒక ఆభరణంలా మాత్రమే ధరంచానని అlhleరు. ఇది జాతీయ పతాకంలా కాకుండా స్టేజ్ లైట్ల కింద ఒక ఆకర్షణీయమైన ఫ్యాషన్ వేర్లా ప్రజెంట్ చేశానని అంటోంది. అలాగే ఈ గౌనులోఉన్నది అసలైన కాషాయరంగు కాదు, అలాగే ఆకుపచ్చరంగు కూడా వేరొక ఛాయలో తీసుకున్నార. అలాగే మధ్యలోని చిహ్నం అధికారిక నిర్దేశాలను అత్యంత భిన్నం అని వివరించారు. కాగా, ఈ డిజైనర్వేర్ని డాషా ఫ్యాషన్ కౌచర్కు చెందిన బెలారసియన్ డిజైనర్ డార్యా చెర్మాషెంట్సేవా రూపొందించారు.జాతీయ జెండా నియమావళి..2002, జాతీయ జెండా వినియోగానికి సంబంధించిన నియమ నిబంధనలను వివరిస్తుంది.జాతీయ గౌరవానికి అవమానాలను నివారించే చట్టం, 1971 ప్రకారం, జెండాను ఏ విధమైన దుస్తులు లేదా యూనిఫాంలో భాగంగా ఉపయోగించరాదు, అలాగే దానిని కుషన్లు, చేతి రుమాళ్లు, నాప్కిన్లు లేదా ఏ ఇతర వస్త్ర సామగ్రిపైన ఎంబ్రాయిడరీ లేదా ప్రింట్ చేయరాదు.ఈ చట్టం ఇంకా ఇలా పేర్కొంటుంది, జెండాని ఉద్దేశపూర్వకంగా నేలను తాకడానికి లేదా నీటిలో ఎగరడానికి అనుమతించరాదు.జాతీయ జెండాను కట్ చేసి కుట్టకూడదు.జాతీయ జెండాను నడుము కింది భాగంలో చుట్టుకోవద్దు. జెండాను అలంకరణ కోసం ఉపయోగించకూడదు. చేతులు తుడుచుకోవడం లాంటివి చెయ్యకూడదు. జాతీయ పతాకాన్ని ఏ వస్తువు మీదా కప్పవద్దు. దేశం కోసం ప్రాణాలు విడిచిన వారిపై కప్పడానికి జాతీయ జెండా అంత గౌరవాన్ని జవాన్ కు దక్కడానికే ఇలా చేస్తారు.చిరిగిన, నలిగిన, తిరగబడిన జెండాలను ఎగురవేయొద్దు.జాతీయ పతాకాన్ని ఎగరేసినప్పుడు.. అంతకంటే ఎక్కువ ఎత్తులో మరే ఇతర జెండాలు ఉండకూడదు.అలాగే వేదికపై జాతీయ పతాకాన్ని ఎగురవేసేటప్పుడూ..జెండా ఎగురవేసే వ్యక్తి ముఖం ప్రేక్షకుల వైపు, త్రివర్ణ పతాకం ఎల్లప్పుడూ అతడి కుడివైపు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. (చదవండి: సుస్మితా సేన్పై వెల్లువెత్తుతున్న విమర్శలు..! ఊర్వశి రౌతేలా అలా కనిపించడానికి రీజన్) -
వారందరికీ నా సెల్యూట్!
జైపూర్: నీట్–యూజీ సహా అన్ని రకాల పరీక్షల్లో జవాబుదారీతనం, పారదర్శకత కోసం ఇటీవల ఢిల్లీలో వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపిన యువత ధైర్యాన్ని ‘మిస్ యూనివర్స్ ఇండియా–2026’విజేత కెజియా లిజ్ మెజో ప్రశంసించారు. న్యాయం కోసం గళమెత్తడం దేశం పట్ల వారికి ఉన్న ప్రేమను, అభిమానాన్ని ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. ఆదివారం రాత్రి జైపూర్లో జరిగిన గ్రాండ్ ఫినాలేలో ‘మిస్ యూనివర్స్ ఇండియా 2026’కిరీటాన్ని ఆమె గెల్చుకున్న సంగతి తెలిసిందే. ఎంతో ధైర్యవంతులు, ఒకరికొకరు అండగా నిలిచే తరానికి చెందినందుకు చాలా గర్వపడుతున్నానని చెప్పారు. 19 ఏళ్ల కెజియా లిజ్ మెజో తాజాగా ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన నిరసనలో పాల్గొన్న యువత గురించి స్పందించారు. సరైన దాని కోసం నిరసన తెలిపేందుకు ముందుకు వచి్చన ప్రతి విద్యారి్థకీ, ప్రతి ఒక్కరికీ, మన దేశ శ్రేయస్సు కోసం ఏకమైన వారందరికీ సెల్యూట్ చేస్తున్నానని తెలిపారు. లక్ష్యం కోసం గళమెత్తడానికి ధైర్యం కావాలని చెప్పారు. యువతరంలో తాను కూడా ఒక భాగమైనందుకు గర్విస్తున్నానని వివరించారు. యువత ముందంజలో ఉన్న గొప్ప భారతదేశానికి తాను ప్రాతినిధ్యం వహిస్తున్నానని ఉద్ఘాటించారు. సామాన్యమైన యువతినే.. కేరళకు చెందిన కెజియా లిజ్ మెజో ఈ ఏడాది జరిగే మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్ తరఫున పాల్గొనబోతున్నారు. ఇలాంటి పోటీల్లో విజేతగా నెగ్గి కిరీటాన్ని ధరించడం అనేది కేవలం వ్యక్తిగత విజయం మాత్రమే కాదని.. దేశవ్యాప్తంగా ఉన్న యువతుల ఆకాంక్షలను మోయడమేనని అన్నారు. ‘‘అర్హత ఉన్నవారిలో నేనొక్కదాన్నే లేను. అంతిమ విజేతను కూడా నేనే అవుతానని చెప్పలేను. యువతకు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని పొందినదాన్ని మాత్రమే నేను. వారి గొంతుకలను అందరికీ వినిపించడం నా బాధ్యత’’అని చెప్పారు.తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. అందాల పోటీలు తన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమని వెల్లడించారు. అయితే, చిన్న వయసులో మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకోవాలని కలలు కనడం మొదలుపెట్టినప్పుడు అది అసాధ్యమైన పనిగానే అనిపించేదని చెప్పారు. ఈ ప్రయాణంలో కొన్నిసార్లు భయపడడం, ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం వంటివి చోటుచేసుకున్నాయని తెలిపారు.తనలో బలహీనతకు సంబంధించిన క్షణాలు చాలానే ఉన్నాయని, అంతిమంగా చూస్తే తాను కూడా సామాన్యమైన యువతినేనని స్పష్టంచేశారు. ఏదైనా ఒక విషయం కోసం ఎంతగానో శ్రమిస్తూ కలలు కంటూ కళ్లు మూసినప్పుడు భయాలు కలగడం సహజమేనని, సందేహాలు కూడా అనివార్యమని అన్నారు. న్యాయవాదిగా పనిచేస్తా.. ప్రపంచ స్థాయి పోటీలో భారత్కు ప్రాతినిధ్యం వహించడం ఆనందంగా ఉందని కెజియా లిజ్ మెజో తెలియజేశారు. కేవలం తన సొంత రాష్ట్రానికే కాకుండా, దేశం మొత్తానికి సంబంధించిన వైవిధ్యాన్ని తనతోపాటు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మన దేశంలోని ప్రతి ప్రాంతానికీ ప్రాతినిధ్యం వహిస్తానని తెలిపారు. మిస్ యూనివర్స్ ఇండియా పోటీలో వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చిన పోటీదారులను కలవడం వల్ల వారి సంస్కృతులు, సంప్రదాయాల గురించి తెలుసుకునే అవకాశం లభించిందని పేర్కొన్నారు.మిస్ యూనివర్స్ పోటీకి వెళ్లినప్పుడు దేశంలో ప్రతి ప్రాంతం వైవిధ్యాన్ని, ఆయా నేలల విశేషాలను తన వెంట తీసుకెళ్తానని వ్యాఖ్యానించారు. మిస్ యూనివర్స్ పోటీలో గెలిచిన తర్వాత కూడా న్యాయవాదిగా పనిచేస్తానని స్పష్టంచేశారు. తన ఆశయాలకు అందాల పోటీ అడ్డంకి కాదన్నారు. న్యాయశాస్త్రం అంటే ఎంతో ఇష్టమని, తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడే న్యాయవాది కావాలని లక్ష్యంగా పెట్టుకున్నానని పేర్కొన్నారు.ఆ లక్ష్యాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేనని చెప్పారు. సమాజంలో సానుకూల మార్పును తీసుకురావడానికి చట్టాన్ని వినియోగిస్తానని, ఈ కిరీటంతో పాటు ఆ పనిని కచ్చితంగా చేయగలనని నమ్ముతున్నానని వెల్లడించారు. అందం గురించిన మెజో తన అభిప్రాయం వ్యక్తంచేశారు.అది కేవలం శారీరక రూపానికి మాత్రమే పరిమితం కాదని అన్నారు. -
మాజీ మిస్ యూనివర్స్గా సుస్మితా అలానా ప్రవర్తించేది..?
మిస్ యూనివర్స్ అందాల పోటీల ఫైనల్స్ జైపూర్లో విజయవంతంగా పూర్తైన సంగతి తెలిసిందే. ఈవేడుకలో మిస్ యూనివర్స్గా కేరళ అమ్మాయి కజియా లిజ్ మెజో కిరిటాన్ని గెలుచుకుంది కూడా. అయితే ఈ వేడుకలో న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన వారిలో ఒకరైన బాలీవుడ్ బ్యూటీ, మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్పై ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి. ఆమె తీరుపై నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమె ఆ కార్యక్రమంలో ఫస్ట్ రన్నరప్ మిస్ ఇంటర్నేషనల్ ఇండియా 2026 వైష్ణవి గణేష్కు అనుకూలంగా వ్యవహరించారంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుస్మితా మిస్ ఇండియా టైటిల్ని గెలిచిన కజియాని ఎలా విస్తరిస్తున్నావ్ అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఆగస్టు 24న 'మెజెస్టిక్ మూమెంట్స్' అనే ఇన్స్టాగ్రామ్ పేజీ ఒక వీడియోను షేర్ చేసింది. ఆ నేపథ్యంలోనే నెటిజన్లు ఆగ్రహావేశాలు వెల్లగక్కుతున్నారు. ఆ వీడియోలో సుస్మిత కొత్తగా కిరీటం గెలుచుకున్న కజియాని అభినందిస్తున్నప్పటికీ..ఆమె నేరుగా వైష్ణవి వైపుకి నడుస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అంతేగాదు విన్నర్ కజియాకి ఏదో మొక్కబడిగా కంగ్రాట్స్ చెబుతున్నట్లుగా క్లియర్గా కనిపిస్తుంది. ఆ తర్వాత సుస్మిత వైష్ణవిని ఓదారుస్తూ..తలపై ఉన్న మిస్ ఇంటర్నేషనల్ ఇండియా 2026 కిరీటాన్ని సరిచేస్తూ కనిపిస్తుంది. అదే సమయంలో సెలీనా జైట్లీ, ఊర్వశి రౌతేలాతో సహా ఇతరులు కూడా అక్కడున్న అందగత్తెలందర్నీ అభినందిస్తున్నారు. కానీ సుస్మిత మరోసారి కజియాని దాటి వెళ్లిపోవడం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. దాంతో నెటిజన్లు ఒక్కసారిగా మండిపడ్డారు. View this post on Instagram A post shared by Majestic Moments (@elegancereignss)విజేత వద్దకు వెళ్లి రన్నరప్ వద్దకు వెళ్లి ఉంటే బాగుండేదని, అది వేదిక మర్యాద అంటూ విమర్శల వర్షం కురిపించారు. ఒక మాజీ మిస్ యూనివర్స్ ఇలా ప్రవర్తించాలా అంటూ ఆమె వైఖరిపై నిప్పులు చెరుగుతున్నారు. అంతేగాదు సుస్మిత మీలాంటి వాళ్లు న్యాయనిర్ణేతగా ఉండకూడదు అంటూ తింటిపోస్తూ పోస్టులు పెట్టారు. ఇదిలా ఉండగా, ఈ వేడుకలో ఊర్వశి రౌతేలా తన దుస్తులతో అందరి దృష్టిని ఆకర్షించింది.త్రివర్ణ పతాక స్ఫూర్తితో మెరిసింది..భారత జాతీయ జెండాలోని కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల స్ఫూర్తితో రూపొందించిన గౌన్ను ఆమె ధరించింది. ఈ కార్యక్రమానికి తాను ఈ గౌనులో రావడానికి గల రీజన్ కూడా వెల్లడించారు. ఈ ఏడాది జరిగిన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ వద్ద ఒక మీడియా సంస్థ తన గురించి ప్రశ్నించినప్పుడు..సగర్వంగా భారతీయురాలిని అని చెప్పానన్నారు. కానీ ఈ రోజు అంతకుమించి ప్రత్యేకమైన రోజు అని అందుకే ఇలా ఈ త్రివర్ణ పతాక రంగుల గౌనులో వచ్చానని చెప్పారు. #WATCH | Jaipur, Rajasthan | Grand Finale of Miss Universe India 2026 | Former Miss Universe India and Actress Urvashi Rautela says, “One should never consider failure as a failure. There is always scope to learn and to move further. I really want to wish all of them all the very… pic.twitter.com/MMK7g4WhgU— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) August 24, 2026దీన్ని అంతర్జాతీయ డిజైనర్ 'దాషా' రూపొందించారని, డిజైన్ చేయడానికే మూడునెలల సమయం పట్టిందని అన్నారు. ఇలా'మిస్ యూనివర్స్ ఇండియా' ఫినాలేలో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ ఈ గౌన్ ధరించడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. పైగా ఇలా న్యాయనిర్ణేతగా వ్యవహరించడం తనకు నాల్గోసారని చెప్పారు. కాగా, ఈ వేడుకలో న్యాయనిర్ణేతలుగా బాలీవుడ్నటి, మాజీ మిస్ యూనివర్స సుస్మితా సేన్, మాజీ మిస్ యూనివర్స్ ఇండియా ఊర్వశి రౌతేలా, మిస్ యూనివర్స్ ఇండియా 2024 రియా సింఘా, పర్యావరణవేత్త, చిత్ర నిర్మాత ప్రజ్ఞా కపూర్, మాజీ మిస్ యూనివర్స్ రన్నరప్ సెలీనా జైట్లీ తదితరులు వ్యవహరించారు. (చదవండి: ఆమెకు మిస్ యూనివర్స్ కిరీటాన్ని వరించేలా చేసిన ప్రశ్న ఇదే..!) -
డార్క్ లైట్ టు లైమ్లైట్
కాజియాకు నలుగురిలో కలవడం అంటే ఇష్టం. టీనేజీలోకి వచ్చిన తరువాత ఆ ఇష్టం వెనకడుగు వేసింది. ‘నల్లపిల్ల’ అని ఎవరైనా వెక్కిరిస్తారేమో అనే భయం ఆమెలో ఉండేది. ఆ భయం కాస్తా ఆత్మన్యూనతగా మారింది. ఆత్మన్యూనత నుంచి ఆత్మవిశ్వాసంలోకి వచ్చిన తరువాత తనను తాను అద్భుతంగా తీర్చిదిద్దుకుంది కేరళలోని మావెళిక్కరకు చెందిన కాజియా లిజ్ మెజో.తాజాగా...ఈ నెల 23న జైపూర్లో జరిగిన ఫైనల్లో కాజియా లిజ్ మెజో ‘మిస్ యూనివర్స్ ఇండియా’ కిరీటాన్ని గెలుచుకుంది. ‘మిస్ యూనివర్స్ ఇండియా’ టైటిల్ను గెలిచిన తొలి కేరళ మహిళగా చరిత్ర సృష్టించింది. నవంబర్లో ప్యూర్టోరికోలో జరగనున్న 75వ మిస్ యూనివర్స్ పోటీలో మన దేశానికి ప్రాతినిధ్యం వహించనుంది. 19 సంవత్సరాల కాజియా న్యాయశాస్త్ర విద్యార్థిని. దేశవ్యాప్తంగా 52 మంది మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొన్నారు. వీరందరిలో కాజియా పిన్న వయస్కురాలు. వైష్ణవి గణేష్ ఫస్ట్ రన్నరప్గా, అనుశీ సాత్వలేకర్ సెకండ్ రన్నరప్గా నిలిచారు.అబుదాబి (యూఏఈ)లో పెరిగిన కాజియా ‘బేబీ షో’లో పాల్గొనడం ద్వారా చిన్న వయసులోనే రంగస్థలంపై మెరిసింది. ఆ తరువాత కాలంలో శాస్త్రీయ నృత్యం వైపు అడుగులు వేసింది. అందరిలాగే బాల్యం అంటే కాజియాకు చాలా ఇష్టం. ‘చిన్నపిల్లగా ఉన్నప్పుడు భయమనేదే ఉండదు. సరదాగా గడపడం, అందమైన దుస్తులు ధరించడం, కార్టూన్ ప్రపంచంలోకి దూరడం..ఇలాంటి అద్భుతాలెన్నో బాల్యంలో ఉంటాయి’ అంటుంది కాజియా.అభద్రత... ఆత్మన్యూనత...టీనేజ్లోకి అడుగుపెట్టిన కాజియా బాల్యంలోని సంతోషానికి దూరం అయింది. డిజిటల్ ప్రపంచంలోని సోకాల్డ్ సౌందర్య ప్రమాణాల వైపు మొగ్గు చూపడం వల్ల ఆత్మవిశ్వాసం కోల్పోయింది.‘నేను నలుపుగా ఉండడం వల్ల విపరీతమైన అభద్రతాభావానికి గురయ్యేదాన్ని. రకరకాల ఫెయిర్ నెస్ క్రీమ్ల యాడ్స్ చూస్తుండేదాన్ని. వాటిని చూసిన తరువాత నా శరీరాకృతి సరిగ్గా లేదు అనిపించేది.నా ప్రతి ఫొటోకు ఫిల్టర్స్ ఉపయోగించేదాన్ని. కళ్లను పెద్దవిగా చేయడానికి, చర్మపు రంగులను మార్చేదాన్ని’ గతాన్ని గుర్తు తెచ్చుకుంది కాజియా.మార్పు మొదలైంది...మొదట్లో నలుగురిలో కలవడానికి ఇష్టపడే కాజియా, ‘నేను నలుపుగా ఉంటాను’ అని అతిగా ఆలోచించడం వల్ల ఆత్మన్యూనతకు గురయ్యేది. నలుగురిలో కలవడానికి ఇబ్బంది పడేది. అద్దంలో తన ముఖం తనకే నచ్చకపోయేది. అయితే, కొంతకాలం తరువాత తనను తాను సమీక్షించుకోవడం వల్ల ఆ తరువాత కాలంలో కాజియాలో చాలా మార్పు వచ్చింది. ‘బాహ్య సౌందర్యం కంటే ఆత్మ సౌందర్యం గొప్పది’ అనే విషయాన్ని తెలుసుకుంది. ఆత్మన్యూనత పోయింది. ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆ ఆత్మవిశ్వాసంతోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది.విజయ పరంపర...ఆత్మవిశ్వాసం దిశగా తనను తాను తీర్చిదిద్దుకున్న కాజియా 2024లో ‘మిస్ టీన్ దివా’ టైటిల్ గెలుచుకోవడం ద్వారా అంతర్జాతీయ స్థాయి పోటీలకు మార్గం సుగమం చేసుకుంది. 2025లో ‘మిస్ టీన్ ఇంటర్నేషనల్’లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి మొదటి రన్నరప్గా నిలిచింది. ఆ తరువాత ‘మిస్ యూనివర్స్ కేరళ’ విజేతగా నిలిచింది.అలా జరగకూడదు...‘సోషల్ మీడియా చాలా కృత్రిమమైనది. ఆ కృత్రిమత్వపు మాయలో పడిపోవద్దు. ఆత్మవిశ్వాసం లేని పిల్లలను విషపూరిత భావాలతో భయపెడితే సమాజానికి మనం ఏం సందేశం ఇస్తున్నట్లు?’ అని ప్రశిస్తోంది కాజియా. తాను ఒకప్పుడు ఎదుర్కొన్న డిజిటల్ ఒత్తిడి ఎవరూ ఎదుర్కోవద్దు అంటుంది. పరిపూర్ణత (పర్ఫెక్షన్) కోసం పాకులాడే ధోరణిని ఆమె వ్యతిరేకిస్తోంది. పేజెంట్ పోటీదారులు అనుసరించే జీవనశైలిని అనుసరించడానికి కాజియా నిరాకరిస్తోంది.మల్టీ టాలెంట్...మోడల్, శాస్త్రీయ నృత్యకారిణి మాత్రమే కాదు కాజియా గాయని కూడా. డ్రమ్స్, వయోలిన్ వాయిస్తుంది. టెడెక్స్ వేదికలపై పర్యావరణ పరిరక్షణ నుంచి ఆత్మవిశ్వాసం వరకు రకరకాల అంశాలపై స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాలు ఇస్తోంది. మాలీవుడ్ సినిమా ‘షైలాక్’తో నటిగా తొలి అడుగులు వేసింది.‘నీ లక్ష్యాలు ఏమిటో ఒక నోట్బుక్లో రాసుకో’ అని కజియాను తల్లి ప్రోత్సహించేది. ‘హాలివుడ్ వాక్ఆఫ్ ఫేమ్లో చోటు సంపాదించాలి’....ఇలాంటి ఎన్నో లక్ష్యాలతో ఆ నోట్బుక్ నిండిపోయింది. పెద్ద కలలు కనే సాహసం ఆ రోజు నుంచే మొదలైంది.‘ఆ సాహమే నన్ను ఇక్కడికి వరకు తీసుకువచ్చింది’ అంటుంది కాజియా.నిశ్శబ్దమంటే...ఫైనల్ రౌండ్లో అడిగిన ‘మీ జీవితంలో నిశ్శబ్దానికున్న శబ్దాన్ని ఎలా వర్ణిస్తారు?’ అనే ప్రశ్నకు–‘‘నేను ఈ వేదిక పైకి వచ్చే ముందు వరకు ఇక్కడ అంతా నిశబ్దమే. నటిగా, డ్యాన్సర్గా, అందాల పోటీలపై ఆసక్తి ఉన్న అమ్మాయిగా ఇలాంటి వేదికపైనే ఎదిగాను. ఈ వేదిక పైకి వచ్చే ముందు నిశబ్దంగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంట్లో ఉన్న అనుభూతి కలుగుతుంది. అలాంటి ప్రదేశంలోనే నేను ఉన్నాను, నా దేశంలో ఉన్నాను’’ అంటూ జవాబు ఇచ్చింది కాజియా.దేవుడు ఇచ్చే తోట!విజేత అంటే ఎవరో కాదు, ఒకసారి ఓడిపోయి గెలుపు కోసం మరోసారి ప్రయత్నించిన వ్యక్తి మాత్రమే. మీరు దేవుడిని ఒక పువ్వు అడిగారు. అది వెంటనే మీకు దొరక్క పోవచ్చు. గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే... ఒక పువ్వు కాదు, ఒక తోటే మీకు ఇవ్వడానికి దేవుడు ప్రయత్నాలు చేస్తున్నాడని! అయితే దేవుడు ఆ తోట ఇచ్చే వరకు మనం ఓపికగా ఉండాలి. ఆశాభావంతో ఉండాలి. సోషల్ మీడియాలో కనిపించేవాటిని చూసి గుడ్డిగా నమ్మకూడదు. అనుసరించకూడదు.– కాజియా -
ఆమెకు మిస్ యూనివర్స్ కిరీటాన్ని వరించేలా చేసిన ప్రశ్న ఇదే..!
కేరళకు చెందిన 19 ఏళ్ల కజియా లిజ్ మెజో మిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటాన్ని గెలుచుకున్నారు. ఆదివారం జైపూర్లో జరిగిన అందాల పోటీల ఫైనల్లో 52 మంది అందగత్తెలను ఓడించి జాతీయ టైటిల్ను గెలుచుకున్నారు. కజియా లిజ్ మెజో కొత్త మిస్ యూనివర్స్ ఇండియా 2026గా నిలిచారు. అయితే ఆమె గెలుపుకి కారణమైన సన్నివేశంకి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. అదేంటంటే అందులో కజియాకే కిరీటాన్ని కట్టబెట్టేలా చేసిన ఆసక్తికర ప్రశ్న అందర్నీ ఈమితంగా ఆకర్షించింది. నిజానికి మిస్ యూనివర్స్ ఇండియా ప్రకారం, ఈ ఏడాది ఫైనలిస్టులకు 20 ప్రశ్నలు ఇచ్చి..వారికి సమాధానాలు రాయడానికి 90 నిమిషాల సమయం ఇచ్చారు. అయితే కజియా రెండుప్రశ్నలకు ఇచ్చిన సమాధానం న్యాయనిర్థేతల మనసునే గెలుచుకుంది. అవేంటో చూసేద్దామా.యాక్ట్ నౌ వ్యవస్థాపకుడు, గ్లామనంద్ గ్రూప్లో సోషల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ అయిన రాజీవ్ కె. శ్రీవాస్తవ మీ జీవితంలో నిశ్శబ్దం ధ్వనిని వర్ణించగలరా అని అడగగా..అందుకు కజియా ఇలా సమాధానం ఇచ్చింది. "నాకు, నిశ్శబ్దం అంటే, నేను కొద్ది నిమిషాల క్రితం ఈ వేదికపైకి ప్రవేశించే ముందు అనుభవించిన ప్రశాంతతనే నిశబ్దంగా విశ్వసిస్తా. ఎందుకంటే నేను ఒక శాస్త్రీయ నృత్యకారిణిగా, ఒక నటిగా, అందాల పోటీల ప్రేమికురాలిగా వేదికపైనే పుట్టి పెరిగాను. అందువల్ల ఈ వేదికపైకి అడుగు పెట్టే ముందు నిశ్శబ్దాన్ని, ప్రశాంతతను, అత్యంత ప్రశాంతమైన స్థితిని అనుభవిస్తాను. ఎందుకంటే అది నాకు నా సొంత ఇంట్లో ఉన్నట్లు అనిపిస్తుంది. నా దృష్టిలో, అదే నిశ్శబ్దం. అని ఆమె చాలా అద్భుతంగా చెప్పారామె. అలాగే కజియా తన తన దృష్టిలో అందం అంటే ఏంటో కూడా పంచుకున్నారు. ఆమె ఇలా అన్నారు, "నా దృష్టిలో, నిజమైన అందం అంటే దృఢ సంకల్పం; ధైర్యం, పదే పదే పైకి లేవాలనే నిశ్శబ్ద నిర్ణయం, ఏదైనా సాధించడానికి ముందే నమ్మకం ఉంచడం. అలాగే నా దృష్టిలో, అందమైన ఆత్మవిశ్వాసంతో ఉండటం అంటే సాహసంతో ఉండటమని అర్థం." అని సగర్వంగా చెప్పారామె. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Pageantomania | Beauty Pageant (@pageantomania)(చదవండి: ట్రావెల్ వీడియోల్లో ఇంత కిక్ ఉందా? ఏడాదికి రూ.85 లక్షలు ఆర్జించే ఉద్యోగాన్నే..) -
19 ఏళ్ల కేరళ అమ్మాయికి మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం.. ఏకంగా 52 మంది బ్యూటీలను..(ఫొటోలు)
-
మిస్ యూనివర్స్ ఇండియా 2026 విజేత : ఎవరీ కేరళ బ్యూటీ
Miss Universe India 2026 ఒకప్పుడు తన ముఖాన్ని, తన ఫోటోలను చూసుకోవడానికి కూడా ఇబ్బంది పడిన ఒక యువతి ఆత్మవిశ్వాసంతో ఎదిగి అందాల రాణిగా తనను తాను చాటుకుంది. ఆగస్టు 23న జైపూర్లో జరిగిన ‘మిస్ యూనివర్స్ ఇండియా 2026’ గ్రాండ్ ఫినాలేలో 52 మంది పోటీదారులను వెనక్కి నెట్టి కాజియా లిజ్ మెజో (Kaziah Liz Mejo) విజేతగా నిలిచారు. సుమారు 9వేల మంది దరఖాస్తుదారుల నుండి ప్రాంతీయ పోటీలు, ఆడిషన్లు , వైల్డ్కార్డ్ ఎంట్రీల ద్వారా ఆమెను ఎంపిక చేశారు. ఈ విజయంతో, నవంబర్లో పోర్టో రికోలో జరగనున్న 75వ మిస్ యూనివర్స్ పోటీల్లో కాజియా భారతదేశం తరఫున పోటీ పడనున్నారు. మిస్ యూనివర్స్ ఇండియా ఫినాలే ఈవెంట్కు సుస్మితా సేన్ (1994 మిస్ యూనివర్స్), సెలీనా జైట్లీ, ఊర్వశి రౌతేలా, రియా సింహా (మిస్ యూనివర్స్ ఇండియా 2024), ఫిల్మ్ ప్రొడ్యూసర్ ప్రగ్యా కపూర్, డెర్మటాలజిస్ట్ డాక్టర్ స్తుతి ఖారే శుక్లా న్యాయనిర్ణేతలుగా వ్యవహరించడం విశేషం. కేవలం ఏడాది క్రితం టీన్-టైటిల్లో రన్నర్-అప్గా తన అందాల పోటీ ప్రయాణాన్ని ప్రారంభించిన ఒక యువతి ఇండియా మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకోవడం, ప్యూర్టో రికోలో ప్రపంచ వేదికపై పోటీపడే అవకాశం లభించడం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.ఇదీ చదవండి: బిడ్డకు మేనమామ ఉంగరం : బిడ్డింగ్ దక్కించుకున్న జ్యుయల్లర్స్ ఇవే!ఎవరీ కాజియా లిజ్ మెజో?అబుదాబిలో పెరిగిన కేరళ అమ్మాయి మెజో (Mejo) 2007లో జన్మించింది. మావెలిక్కరకు చెందిన మెజో అబ్రహం సుజా మెజోల కుమార్తె అయిన ఆమె, ప్రస్తుతం కొచ్చిలో ఉంటూ బెంగళూరులో న్యాయశాస్త్రం (లా) చదువుతోంది. అంతుకుముందు ఆమె అబుదాబిలోని ఎమిరేట్స్ నేషనల్ స్కూల్, సెయింట్ జోసెఫ్స్ స్కూల్, అబుదాబి ఇండియన్ స్కూల్లో తన పాఠశాల విద్యను పూర్తి చేసింది. చిన్న వయసులోనే ఆమెకు వేదికపై ప్రదర్శనలు ఇచ్చే అవకాశం లభించింది. 2012లో అబుదాబిలో శాస్త్రీయ నృత్య శిక్షణ ప్రారంభించిన ఆమె, ఆ తర్వాత అనేక సృజనాత్మక రంగాలలో నైపుణ్యాలను పెంపొందించుకుంది. 2024లో అందాల పోటీలలో పాల్గొనడం ప్రారంభించింది . 'మిస్ టీన్ ఇంటర్నేషనల్ 2025' పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి, 'ఫస్ట్ రన్నరప్'గా నిలిచింది. కొన్ని నెలల తర్వాత, ఆమె ఉన్నత స్థాయి పోటీకి (కేటగిరీకి) మారి, రాష్ట్ర స్థాయి టైటిల్ను గెలుచుకోవడం ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. కొచ్చిలో జరిగిన పోటీలో మాళవిక రాజేంద్రన్ దేవ్ , లిజ్ జైమోన్ జాకబ్లను ఓడించి, ఆమె 'బీనా కన్నన్ కౌచర్ మిస్ యూనివర్స్ కేరళ 2026' కిరీటాన్ని గెలుచుకుంది. View this post on Instagram A post shared by PAGEANTS UNIVERSE (@pageants_universe)ఈ సందర్భం గత కొన్నేళ్లు తాను అనుభవించిన ఆత్మన్యూనత గురించి గా మెజో వివరించింది. చాలా కాలందాకా తన రూపం వ్యక్తిత్వం పట్ల తనకు ఆత్మవిశ్వాసం ఉండేది కాదని ఆమె చెప్పింది. fake it till you make it అనే దృక్పథం తనలో మార్పు తెచ్చిందని ఆమె పేర్కొంది. వేదికపైకి వెళ్లే ముందు కూడా, అత్యంత ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తిని తానేనని తనకు తాను చెప్పకునే దాన్నని ఆమె చెప్పింది.ఇదీ చదవండి: రోజు రూ. 50లే, ఇపుడు ఫార్చ్యూనర్ కారు : స్వీపర్ సక్సెస్ స్టోరీ వైరల్అలాగే అందాల పోటీల పట్ల ఆమెకు ఆసక్తి కలగడానికి టీవీలో చూసిన ఒక సంఘటనే కారణమని చెప్పుకొచ్చింది. 2021లో హర్నాజ్ సంధు 'మిస్ యూనివర్స్' కిరీటాన్ని గెలుచుకోవడం చూసిన తర్వాత తనకు అందాల పోటీలపై ఆసక్తి కలిగిందని మెజో చెప్పింది. ఎన్నాళ్లో ఎదురు చూసి, చివరికి ఆమె టైటిల్ దక్కించుకోవడం తనకు స్ఫూర్తినిచ్చిందని ఆమె పేర్కొంది. -
మిస్ టీన్ యూనివర్స్ ఇండియా విజేతగా ప్రసుచి పాండా
మిస్ టీన్ యూనివర్స్ ఇండియాగా ఒడిశాకు చెందిన ప్రసుచి పాండా కిరీటాన్ని దక్కించుకుంది. ఈ ఘన విజయం అనంతరం తొలిసారిగా భువనేశ్వర్కు వచ్చిన ఆమె అక్కడ స్థానిక మీడియాతో ముచ్చటించారు. ఇది తనకు ఎంతో భావోద్వేగంతో కూడిన క్షణంగా అభివర్ణించింది. అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం ఒక గౌరవం, గొప్ప బాధ్యతగా పేర్కొంది. ఇది తన ప్రయాణానికి ఆరంభం మాత్రమేనని అన్నారు. కచ్చితంగా తాను తన తల్లిదండ్రులు, ఒడిశా రాష్ట్రం, గర్వపడేలా కృషి చేస్తానని చెప్పారామె. అసలు ఇలా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం అనేది తన చిరకాల కోరిక అని, అందువల్ల నాదేశం మిస్ టీన్ యూనివర్సిటీ కిరీటాన్ని దక్కించుకునేలా తనవంతుగా పూర్తి అంకితభావంతో పనిచేస్తానని అన్నారామె. కాగా, టీనేజర్ల కోసం ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అందాల పోటీలలో ఒకటైన 'మిస్ టీన్ యూనివర్స్' అంతర్జాతీయ పోటీలో వచ్చే ఏడాది భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనుంది ప్రసుచి. ఆమె ఎవరంటే..ధరణిధర్ పాండా, స్వప్న రాణి పాండాల కుమార్తె. ఆమె కుటుంబం ఒడిశాలోని గంజాం జిల్లా బెర్హంపూర్లోని హిల్పట్నాకు చెందినది. చదువుకునే రోజుల్లోనే ఆమెకు మోడలింగ్ పట్ల అమితాశక్తి ఉంది. అదే ఆమెను తన కలలను సాకారం చేసుకునేందుకు ఢిల్లీకి వెళ్లేలా ప్రేరేపించింది. అక్కడ ఆమె యువ మోడల్గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ప్రసూచి తన నాలుగేళ్ల వయసులోనే ఈ శిక్షణ ప్రారంభించి, 2026లో వృత్తిపరంగా ర్యాంప్వాక్లో అడుగుపెట్టింది. ఆమె నిరంత పట్టుదల, అంకితభావం, ఈ ప్రతిష్టాత్మకమైన మిస్టీన్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటాన్ని దక్కించుకునేలా చేశాయి.(చదవండి: కంగనా రనౌత్ వైరల్ కేన్సర్ స్టోరీ..నిజంగానే అధిక ప్రోటీన్ ప్రమాదకరమా?) -
మిస్ యూనివర్స్ వేదికపై అందాల ‘మణి’క
నవంబర్లో థాయ్లాండ్లో జరగనున్న మిస్ యూనివర్స్ 2025పోటీలో పాల్గొనబోతున్న భారతీయ సుందరిగా మనికా విశ్వకర్మ(Manika Vishwakarma) ఎంపికైంది.రాజస్తాన్కు చెందిన మనిక విశ్వకర్మ ప్రస్తుతం పోలిటికల్ సైన్స్ చదువుతోంది. క్లాసికల్ డాన్సర్గా ప్రతిభ చూపడమే కాదు ‘న్యూరోనోవా’ అనే సంస్థను స్థాపించి పుట్టుకతోనే న్యూరో సమస్యలతో బాధపడే చిన్నారులకు సాయం చేస్తోంది మనిక. ఆమె పరిచయం.దాదాపు 100కు పైగా దేశాల సుందరీమణులు పాల్గొనే ‘మిస్ యూనివర్స్’పోటీలలో 2025 సంవత్సరానికి భారతదేశం తరఫున పాల్గొనే ప్రతినిధిగా 22 సంవత్సరాల మనిక విశ్వకర్మ ఎంపికైంది. జైపూర్లో మంగళవారం తెల్లవారుజాము వరకూ సాగిన తుది ఎంపిక వేడుకలో మనిక విశ్వకర్మ ‘మిస్ యూనివర్స్ ఇండియా 2025’ కిరీటం దక్కించుకుంది. గత సంవత్సరం ఈ టైటిల్ గెలుచుకున్న రియా సిన్హా ఆమెకు కిరీటం తొడిగింది. ఉత్తర ప్రదేశ్కు చెందిన తాన్యా శర్మ ఫస్ట్ రన్నర్ అప్గా, హర్యాణకు చెందిన మెహక్ ధింగ్రా రెండవ రన్నర్ అప్గా ఈపోటీలో నిలిచారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల అందగత్తెలు ఈపోటీలో పాల్గొనగా రాజస్తాన్కు చెందిన మనిక విజేతగా నిలిచింది. నవంబర్లో థాయ్లాండ్లో జరగనున్న 74వ ‘మిస్ యూనివర్స్’పోటీలలో మనిక తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. గతంలో మిస్ యూనివర్స్ కిరీటాన్ని మన దేశం నుంచి సుస్మితాసేన్ (1994), లారా దత్తా (2000), హర్నాజ్ సంధు (2021) గెలుచుకున్నారు.స్త్రీ విద్య ముఖ్యమైనదిమిస్ యూనివర్స్ ఇండియా 2025 విజేత తుది ఎంపికలో జ్యూరీ అడిగిన ప్రశ్నకు మనిక ఇచ్చిన జవాబు అందరినీ ఆకట్టుకుంది. ‘స్త్రీలకు విద్య అందించే అవకాశం ఒకవైపు, పేద కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన అందించే అవకాశం మరోవైపు నీకు ఉంటే దేనిని ఎంచుకుంటావ్’ అనే ప్రశ్నకు మనిక ‘నేను స్త్రీ విద్యనే ఎంచుకుంటాను. ఎందుకంటే స్త్రీలకు విద్య నేర్పించడం వల్ల ఆమె మాత్రమే మారదు... కుటుంబాలు... తద్వారా భవిష్యత్ తరాలు మారుతాయి’ అని సమాధానం ఇచ్చింది.డాన్సర్, పెయింటర్రాజస్తాన్లోని గంగానగర్ అనే చిన్న పట్టణానికి చెందిన మనిక విశ్వకర్మ బాల్యం నుంచి క్లాసికల్ డాన్సర్. పెయింటర్ కూడా. ఆమెను లలిత కళా అకాడెమీ, జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్ సత్కరించాయి కూడా. పోలిటికల్ సైన్స్ స్టూడెంట్గా ఢిల్లీలో ఉంటూపోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూనే అందాలపోటీలో పాల్గొంది మనిక. ఒక సాధారణ నేపథ్యం నుంచి విజేతగా నిలిచింది. ‘అందరూ ఈ సమయంలో తాము పడ్డ కష్టాల గురించి చెబుతారు. కాని నేను నాకు దొరికిన సపోర్ట్ గురించి చెబుతాను. మా అమ్మా నాన్నలు నన్ను ఎంతో సపోర్ట్ చేశారు. నాకు చదువు నేర్పిన గురువులది తర్వాతి స్థానం. నా స్నేహితులు ఎంతో ్రపోత్సహించారు. వీరందరూ లేకుంటే నేను ఇక్కడి వరకూ రాను’ అని చెప్పిందామె.సామాజిక సేవలో...పుట్టుకతోనే న్యూరో సంబంధ సమస్యలతో పాల్గొనే చిన్నారుల కోసం ‘న్యూరోనోవా’ అనే సంస్థను స్థాపించింది మనిక. డౌన్ సిండ్రోమ్, ఏడీహెచ్డీ వంటి సమస్యలతో బాధ పడే చిన్నారులకు తగిన కౌన్సెలింగ్, సపోర్ట్ ఇచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉంది. ‘మిస్ యూనివర్స్ వంటిపోటీలు గుర్తింపును ఇవ్వడం మాత్రమే కాదు వ్యక్తిత్వాన్ని కూడా తీర్చిదిద్దుతాయి. ఈపోటీలలో సవాళ్లను ఎదుర్కొంటూ విజేత అయ్యాను. ఈ గుర్తింపుతో నా సామాజిక సేవను విస్తరిస్తాను. సమాజానికి ఏదో ఒకటి చేయడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత’ అంది మనిక. -
మిస్ యూనివర్స్ ఇండియాగా రాజస్థాన్ బ్యూటీ
మిస్ యూనివర్స్ ఇండియా 2025 కిరీటాన్ని మణిక విశ్వకర్మ గెలుచుకున్నారు. గత ఏడాది విజేత రియా సింఘా ఆమెకు కిరీటం అలంకరించారు. తాజాగా జైపుర్ వేదికగా జరిగిన ఈ పోటీలో ఆమె గెలుపొందారు. ఈ ఏడాదిలో థాయ్లాండ్లో జరగనున్న 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో మణిక విశ్వకర్మ బరిలొకి దిగనున్నారు. భారత్ తరఫున ఆమె ప్రాతినిధ్యం వహించనున్నారు. రాజస్థాన్లోని శ్రీ గంగానగర్కు చెందిన మణిక ప్రస్తుతం ఢిల్లీలో నివాసం ఉంటున్నారు. ఆమె పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఆమె NCC క్యాడెట్ కూడా.. న్యూరోనోవా అనే సంస్థను స్థాపించి ADHD వంటి న్యూరోలాజికల్ సమస్యలతో బాధపడే వారికి సహాయం అందిస్తున్నారు. మణిక విశ్వకర్మ అందం, ప్రతిభ, సేవా భావనతో మిస్ యూనివర్స్ వేదికపై భారత్కు గర్వకారణంగా నిలవనున్నారు. -
మిస్ యూనివర్స్కు మన తెలుగు తేజాలు
త్వరలో థాయిలాండ్లో జరగనున్న మిస్ యూనివర్స్ 2025 కోసం భారత్ నుంచి మిస్ యూనివర్స్ ఇండియాను ఎంపిక చేయడానికి పోటీలు జరిగాయి. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ ఫైనలిస్టుల ఎంపికలో మిస్ యూనివర్స్ తెలంగాణగా కశ్వి, మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్గా ప్రకృతి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వీరు పంచుకున్న విశేషాలు..సుస్మితాసేన్ స్ఫూర్తినేను మెడికల్ స్టూడెంట్ని. మోడల్ గా కూడా రాణిస్తున్నాను. శాస్త్రీయ నృత్యమూ నేర్చుకున్నాను. అందాల పోటీలు అంటే కేవలం బ్యూటీ గురించి మాత్రమే కాదు. మహిళా సాధికారత, ఆత్మవిశ్వాసం, సమాజానికి మంచి చేయాలనే ఆలోచన, జీవన నైపుణ్యాల వృద్ధి.. ఇలా అన్నింటిపై ఫోకస్ ఉంటుంది. అందుకే నేను దీనిమీద దృష్టి పెట్టాను. నేను పుట్టి పెరిగింది అమెరికాలో. మా అమ్మానాన్నలు తెలంగాణ వాసులు. మిస్ యూనివర్స్ సుస్మితాసేన్ అంటే నాకు చాలా ఇష్టం. ఆమెలా ఎదగాలన్నది నా డ్రీమ్. అందుకే నన్ను నేను నిరూపించుకోవడానికి హైదరాబాద్ వచ్చాను. ఈరోజుల్లో ప్రజల్లో మానసిక అనారోగ్యం బాగా పెరుగుతోంది. దీనిపై చైతన్యం కలిగించేందుకు కృషి చేస్తున్నాను. అలాగే గృహహింస పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాను. వీటితో పాటు మూగ, చెవిటి వారికి సహాయకారిగా ఉంటూ వారి వృద్ధికి కృషి చేస్తున్నాను. ఈ విషయాలు న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్నాయి. తెలంగాణకు రావడానికి ముందే మా పేరెంట్స్ నుంచి, బుక్స్ నుంచి తెలంగాణ గొప్పతనం గురించి తెలుసుకున్నాను. ఇక్కడికి రావడం విజేతగా నిలవడం... చాలా సంతోషంగా ఉంది.– కశ్వి, మిస్ యూనివర్స్ తెలంగాణకాన్ఫిడెన్స్ ముఖ్యంకళ్ళు మూసినా, తెరిచినా కిరీటమే కళ్ళ ముందుండేది. ఫైనలిస్ట్గా ఎంపికయినందుకు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. పోటీలో మన మాటల్లో, నడకలో, ప్రవర్తనలో కాన్ఫిడెన్స్ నే ప్రధానంగా చూస్తారు. ఫైనల్ రౌండ్లో... త్యాగం, పాజిటివిటీ, నెగెటివిటీల గురించి అడిగారు. త్యాగం అనేది ఎప్పుడూ గొప్పదే. మన జీవితంలో చిన్న చిన్న త్యాగాలు చేస్తుంటాం. కానీ, త్యాగం వల్ల మన సెల్ఫ్ హ్యాపీగా లేకపోతే చేయకూడదు అని నేను చెప్పడం న్యాయనిర్ణేతలను ఆకట్టుకుంది. గత ఏడాది ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ నుంచి పోటీ చేసి గెలు పొందాను. ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్గా ఎంపికయ్యాను. ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామో ఆ రాష్ట్ర సంస్కృతి, చరిత్ర, భాష.. ఇలా అన్నింటి గురించి తెలిసుండాలి. అమ్మానాన్న బెంగళూరులో ఉంటారు. అమ్మ వర్కింగ్ విమెన్, అక్క ప్రేరణ నాకు బ్యాక్ బోన్ అని చెప్పవచ్చు. అంతగా ఎంకరేజ్ చేస్తారు. బీకామ్లో డిగ్రీ చేశాను. డాన్స్ అంటే ఇష్టంతో డాన్స్ కోర్సు చేశాను. బెంగళూరులో డాన్స్ స్టూడియో ఉంది. రియాలిటీ షో చేశాను, నేను నటించిన సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది. నన్ను ఆల్ రౌండర్ అని నా ఫ్రెండ్స్ అంటుంటారు. బ్యూటీ అంటే ఫిజికల్గా కనిపించేదే కాదు.. మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ . దానినే అన్నింటికన్నా భిన్నంగా చూపగలగాలి.–ప్రకృతి కంబం, మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్– నిర్మలారెడ్డిఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్ -
స్వతంత్ర భారతి: 1994/2022 సౌందర్య కిరీటాలు
సౌందర్య కిరీటాలు ప్రపంచ వేదిక మీద భారతీయ సౌందర్యం విరాజిల్లింది. సుస్మితాసేన్ విశ్వ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకోవడం, ఆ వెంటనే ఐశ్వర్యా రాయ్ ప్రపంచ సుందరిగా వన్నెకెక్కడంతో అంతర్జాతీయ అందాల పోటీలలో భారతదేశం విజయ బావుటా రెపరెపలాడటం మొదలైంది. అప్పటికి 28 ఏళ్ల కిందట రీటా ఫారియా ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా అవతరించారు. ఆ సందర్భం దేశ ప్రజల స్మృతిపథంలో చెరిగిపోతున్న దశలో 1994 లో దేశం నుంచి సరికొత్త అందాల రాణులు ప్రపంచ వేదికల మీద రాణించడం మొదలైంది. ఆ ఏడాదితో భారతదేశంలో అందాల తయారీ పరిశ్రమ ఊపందుకుంది. భారతీయ యువతులను ఈత దుస్తుల్లో మెరిసిపోయే సుందరాంగులుగా తీర్చిదిద్దడం మొదలైంది. ఆ పరిశ్రమ ఫలితాలుగా డయానా హైడెన్, యుక్తాముఖి, ప్రియాంక చోప్రా, లాలా దత్తా, మానుషీ చిల్లర్ మన ప్రపంచ సుందరీమణులుగా విజేతలౌతూ వస్తున్నారు. ఆ ప్రకంపనలు దేశవ్యాప్తంగా రెండు రకాలైన ప్రతిధ్వనులుగా వినిపించాయి. ఒకటి అనుకూలం. ఇంకోటి ప్రతికూలం. సైన్యంలోకి పృథ్వి పృథ్వి క్షిపణిని భారత సైన్యంలోకి ప్రవేశపెట్టారు. ‘రిపబ్లిక్ డే’ని అందుకు తగిన సందర్భంగా ఎంచుకుని ఢిల్లీ పరేడ్ గ్రౌండ్స్లో పృథ్విని ప్రదర్శించారు. (చదవండి: ఎయిర్పోర్ట్కి శంకర్ పేరు) -
హర్నాజ్ను విశ్వ సుందరిగా నిలిపిన ప్రశ్న ఇదే...!
Miss Universe 2021 Harnaaz Sandhu Won Crown to This Final Question: ఇజ్రాయేల్ ఇలాట్ వేదికగా జరిగిన 70వ విశ్వ సుందరి వేడుకల్లో భారత యువతి హర్నాజ్ సంధు కిరీటం దక్కించుకుంది. విశ్వ సుందరి పోటీల్లో విజేతగా నిలిచిన మూడో భారత యువతిగా నిలిచింది హర్నాజ్. గతంలో సుస్మితా సేన్, లారా దత్తా ఈ కిరీటాన్ని గెలుచుకున్నారు. తాజాగా జరిగిన పోటీల్లో 80 మందిని వెనక్కి నెట్టి.. కిరీటం గెలుచుకున్నారు హర్నాజ్. హర్నాజ్కు కిరీటాన్ని అందించిన ప్రశ్న ఏంటనే ఆసక్తి ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో నెలకొంది. ఇక ఫైనల్ రౌండ్లో ముగ్గురు ఫైనలిస్ట్లు మిగిలారు. వీరిని జడ్జిలు ‘‘ఈ షో చూస్తున్న మహిళలుకు మీరిచ్చే సలహా ఏంటని’’ ప్రశ్నించారు. మిస్ సౌత్ ఆఫ్రికా, మిస్ పరాగ్వేతో పాటు మిస్ ఇండియా హర్నాజ్ చక్కగా సమాధానమిచ్చి పోటీ రౌండ్లను ముగించారు. ముగ్గురిలో అత్యుత్తమ సమాధానం చెప్పిన హర్నాజ్ను కిరీటం వరించింది. ఆమెను విజేతగా ప్రకటించి.. మిస్ మెక్సికో నుంచి కిరీటాన్ని మిస్ ఇండియా హర్నాజ్కు అందించారు. (చదవండి: మిస్ యూనివర్స్గా భారత యువతి) హర్నాజ్ యువతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు.. తమను తాము నమ్మకపోవడం. మీకు మీరే ప్రత్యేకం అని నమ్మండి.. అదే మిమ్మల్ని అందంగా చేస్తుంది. ఇతరులుతో పోల్చుకోవడం ఆపేసి.. ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి మాట్లాడండి. భయాల నుంచి బయటకు రండి.. మీ గురించి మీరే మాట్లాడండి.. ఎందుకంటే మీ జీవితానికి మీరే లీడర్. మీకు మీరే గొంతుక. నన్ను నేను నమ్మాను.. అందుకే ఈ రోజు ఈ వేదిక మీద నిల్చోగలిగాను’’ అని సమాధానమిచ్చారు హర్నాజ్. (చదవండి: మిలీనియం గర్ల్.. మిస్ యూనివర్స్ అవుతుందా..?) The new Miss Universe is...India!!!! #MISSUNIVERSE pic.twitter.com/DTiOKzTHl4 — Miss Universe (@MissUniverse) December 13, 2021 హర్నాజ్ సమాధానం జడ్జిలతో పాటు ప్రజలకు నచ్చింది. దాంతో మిస్ ఇండియా హర్నాజ్ కౌర్ సంధును విజేతగా స్టీవ్ హార్వే ప్రకటించగానే, స్టేడియం మొత్తం సందడి నెలకొంది. తన పేరును విజేతగా ప్రకటించిన వెంటనే హర్నాజ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. మిస్ మెక్సికో ఆండ్రియా మెజా మిస్ యూనివర్స్ 2021గా హర్నాజ్కి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఈ పోటీలో మొదటి రన్నరప్గా మిస్ పరాగ్వే, రెండో రన్నరప్గా మిస్ సౌత్ ఆఫ్రికా నిలిచారు. సోమవారం ఉదయం పోటీ ప్రారంభమైనప్పుడు, హర్నాజ్ మొదట్లో టాప్ 16కి చేరుకుంది. స్విమ్సూట్ రౌండ్ తర్వాత, ఆమె టాప్ 10లో నిలిచారు. చదవండి: ఏయ్ నిన్నే..మెషిన్ అరుస్తోంది నిజం చెప్పు -
మిస్ యూనివర్స్గా భారత యువతి హర్నాజ్ సంధు
-
మిస్ యూనివర్స్గా భారత యువతి
సాక్షి, న్యూఢిల్లీ: 130 కోట్ల మంది భారతీయుల ఆశలను నిజం చేసి.. విశ్వ సుందరి కిరీటాన్ని దక్కించుకుంది భారత యువతి హర్నాజ్ సంధు. ఇజ్రాయేల్లోని ఇలాట్ నగరంలో జరిగిన డెబ్బయ్యవ మిస్ యూనివర్స్ పోటీల్లో విజేతగా నిలిచింది హర్నాజ్ సంధు. 80 మందితో పోటి పడి విజేతగా నిలిచింది హర్నాజ్ సంధు. ఇటీవలే లివా మిస్ దివా యూనివర్స్గా నిలిచింది మిలీనియం గర్ల్ హర్నాజ్. (చదవండి: మిలీనియం గర్ల్.. మిస్ యూనివర్స్ అవుతుందా..?) 21 ఏళ్ల తర్వాత భారత్కు మిస్ యూనివర్స్ కిరీటం దక్కింది. సుస్మితాసేన్, లారాదత్త తర్వాత మిస్ యూనివర్స్గా నిలిచిన మూడో భారత యువతి హర్నాజ్. 17 ఏళ్లకే మోడలింగ్ ప్రారంభించని హర్నాజ్.. పలు పంజాబీ చిత్రాల్లో కూడా నటించింది. The new Miss Universe is...India!!!! #MISSUNIVERSE pic.twitter.com/DTiOKzTHl4 — Miss Universe (@MissUniverse) December 13, 2021 చదవండి: దుమ్ము రేపుతున్న ఇజ్రాయెల్ పాప్ సింగర్.. మిలీనియం గర్ల్ హర్నాజ్ కౌర్ సంధు చంఢీఘర్లోని పంజాబీ కుటుంబంలో 2000 సంవత్సరంలో జన్మించింది. శివాలిక్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తిచేసింది. తరువాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ చేసింది. ప్రస్తుతం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీ చేస్తోంది. హర్నాజ్ చిన్నప్పటి నుంచి యోగా ఔత్సాహికురాలేగాక, ఫిట్నెస్ లవర్. గుర్రపు స్వారీ, ఈత, డ్యాన్స్, యాక్టింగ్, ట్రావెలింగ్ లను అమితంగా ఇష్టపదేది. ఏమాత్రం ఖాళీ దొరికినా వీటిలో ఏదో ఒక దానిలో లీనమైపోయేది. చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనే కోరిక తనది.. దీంతో 17 ఏళ్లకే మోడలింగ్లో అడుగుపెట్టింది. కాలేజీలో తొలి స్టేజ్ ప్రదర్శనతో తన మోడలింగ్ జర్నీ ప్రారంభమైంది. ఒకపక్క మోడలింగ్ చేస్తూనే అనేక ఫ్యాషన్ షోలలో పాల్గొనేది. ఈ క్రమంలోనే అందాల పోటీల్లో పాల్గొని 2017లో ‘మిస్ చంఢీఘర్’ కిరీటాన్ని గెలుచుకుంది. నటిగానూ.. హిందీ, పంజాబీ, ఇంగ్లిష్ భాషలను అనర్గళంగా మాట్లాడగలిగిన హర్నాజ్ ఒకపక్క మోడలింగ్ చేస్తూనే సినిమాల్లో నటించే అవకాశాలను పొందింది. ‘బాయి జీ కుట్టాంగే, యారా దియా పూబరన్’ అనే పంజాబీ సినిమాలలో నటించింది, ఇవి వచ్చే ఏడాది విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. హార్నాజ్కు ప్రకృతి అంటే ఎంతో ఇష్టం. అందుకే పర్యావరణాన్ని కాపాడండి అని గొంతెత్తి చెబుతోంది. ఇప్పటిదాకా పాల్గొన్న అందాల పోటీల్లో పర్యావరణంపై అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెబుతూ న్యాయ నిర్ణేతల మనసులు గెలుచుకుంది. ‘ఇండియాకు మిస్ యూనివర్స్ కిరీటాన్ని తీసుకొచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాను’ అని చెప్పడమే కాక.. ఆ మాటలను నిజం చేసి చూపింది హర్నాజ్. -
తెలుగు తెరపై మరో అందాల సుందరి
అందాల సుందరి టైటిల్ గెల్చుకున్న ఐశ్వర్యా రాయ్, సుస్మితా సేన్ వంటివారు సినిమాల్లో రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో అందాల సుందరి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యారు. ఈ బ్యూటీ పేరు శిల్పా సింగ్. రెండేళ్ల క్రితం ‘ఐయామ్ షి-మిస్ యూనివర్శ్ ఇండియా టైటిల్ గెల్చుకున్న ఆమె ఓ తెలుగు చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపారు. ఎమ్.జి. మరియు ఎమ్.ఎస్. సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అనూప్ బండారీ దర్శకుడు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -‘‘శిల్పా సింగ్ ప్రధాన పాత్ర చేయనున్న ఈ చిత్రంలో ఓ స్టార్ హీరో కీలక పాత్ర చేయనున్నారు. నిరూప్, అవంతికా శెట్టి, రాధికా చేతన్ హీరో, హీరోయిన్లు. ‘వర్డ్స్’ అనే షార్ట్ ఫిలింతో పలు అంతర్జాతీయ అవార్డులు అందుకున్న అనూప్ని మా సంస్థ ద్వారా దర్శకునిగా పరిచయం చేయడం ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: మురళి గంధర్వ, సంగీతం: ఆగం రాక్ బ్యాండ్.


