breaking news
Military Helicopter
-
ట్రంప్కు తప్పిన పెను ప్రమాదం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు పెను ప్రమాదం తప్పింది. వాషింగ్టన్ నేషనల్ విమానాశ్రయం నుంచి ఆయనను తీసుకెళ్తున్న సైనిక హెలికాప్టర్ ‘మెరైన్ వన్’, ఫ్లోరిడాలోని పెన్సకోలాకు బయలుదేరుతున్న ‘ఎన్వాయ్ ఎయిర్’ప్రయాణికుల విమానానికి అతి దగ్గరగా వచ్చింది. కొన్ని క్షణాల తరువాత రెండు విమానాలు వెంటనే ఒకదానికొకటి దూరంగా వెళ్ళిపోయాయి. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మిని్రస్టేషన్ (ఎఫ్ఏఏ), నేషనల్ ట్రాన్స్ పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (ఎన్టీఎస్బీ) దర్యాప్తు ప్రారంభించాయి. మంగళవారం మధ్యా హ్నం రెండు విమానాల మధ్య కొన్నిక్షణాల పాటు దగ్గరగా వచ్చాయని, వెంటనే ఒకదానికొకటి దూరంగా వెళ్ళిపోయాయని, అధ్యక్షుడికి ఎటువంటి ప్రమాదం జరగలేదని ఎఫ్ఏఏ పేర్కొంది. ఆ విమానం సురక్షితంగా ల్యాండ్ అయినప్పటికీ, ముందుజాగ్రత్త చర్యగా మరో విమానాన్ని కూడా దారి మళ్లించామని తెలిపింది. రెండు విమానాల మధ్య దూరం తగ్గిన సమయంలో ఏటీసీ ఇద్దరు పైలట్లతో సంప్రదింపులు జరిపిందని పేర్కొంది. ఈ సంఘటన కట్టుదిట్టమైన నియంత్రణలో ఉండే వాషింగ్టన్ గగనతలంలో విమాన భద్రతపై ఆందోళనలను మళ్లీ రేకెత్తించింది. అధ్యక్షుడు ట్రంప్ స్థానిక సమయం మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో మెరైన్ వన్ హెలికాప్టర్లో వైట్ హౌస్ నుంచి జాయింట్ బేస్ ఆండ్రూస్కు వెళ్తున్నారు. సమాచార లోపంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు సమీపంలోని ట్రాఫిక్ను క్లియర్ చేయడంలో ఆలస్యం అయ్యింది. దీంతో అధ్యక్ష హెలికాప్టర్, ఎన్వాయ్ ఎయిర్ జెట్కు ఒక మైలు కంటే తక్కువ దూరం వచ్చింది. హెలికాప్టర్ మూడు నిమిషాల్లో గాల్లోకి లేస్తుందని కంట్రోలర్లకు తెలియజేయడానికి మెరైన్ వన్ సిబ్బంది మూడుసార్లు ప్రయతి్నంచింది. కానీ ఆ సమాచారం వారికి చేరడంలో ఆలస్యం అయింది. హెలికాప్టర్ సిబ్బంది కంట్రోల్ టవర్ను ముందే హెచ్చరించినట్లు ఏటీసీ ఆడియో సమీక్షలో రికార్డయ్యింది. ఆ తర్వాత, హెలికాప్టర్ బయలుదేరుతున్నట్లు సిబ్బంది ప్రకటించింది. అయితే, అప్పటికే ప్యాసింజర్ జెట్ టేకాఫ్ ప్రారంభించింది. విమానాశ్రయానికి కొన్ని మైళ్ల దూరంలోనే ఉన్న వైట్ హౌస్ నుంచి అధ్యక్షుడి హెలికాప్టర్ టేకాఫ్ అయినప్పుడు, సాధారణ విమానాలు బయలుదేరడాన్ని నిలిపివేస్తారు. అయితే, మెరైన్ వన్ ప్రయాణం సాధారణమైనదేనని భావించిన వాషింగ్టన్ నేషనల్ టవర్, హెలికాప్టర్ సిబ్బందిని ఆలస్యం చేయలేదు. ఆగమని అడగలేదు. ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపలేదు. మెరైన్ వన్ విమానాలను ప్రపంచంలోని అత్యుత్తమ విమానయాన నిపుణులలో కొందరు నడుపుతారు. ఇంతవరకూ అధ్యక్షుడు ప్రయాణిస్తున్న విమానాలకు ప్రమాదం జరగలేదు. దీంతో, ఈ ఘటనపై సమీక్షను కొనసాగిస్తామని, అవసరమైతే దిద్దుబాటు చర్యలు చేపడతామని ఎఫ్ఏఏ తెలిపింది. ఎన్టీఎస్బీ ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తును ప్రారంభించింది. -
నవ వధువుని మిలటరీ హెలికాప్టర్లో తీసుకెళ్లిన కమాండర్! ఆగ్రహించిన ప్రజలు
Commander landing near the bride's house: తాలిబన్ కమాండర్ నవ వధువుని ఇంటికి తీసుకెళ్లేందుకు మిలటరీ హెలికాప్టర్ని ఉపయోగించారంటూ ఆరోపణలు వచ్చాయి. అందుకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. మీడియా కథనం ప్రకారం... ఒక తాలిబన్ వ్యక్తి నవ వధువుని తీసుకుని మిలటరీ చాపర్లో పయనించాడని అఫ్గాన్ స్థానిక మీడియా పేర్కొంది. అతను తన భార్యను తీసుకుని ఆ చాపర్లో అప్గనిస్తాన్లోని లోగర్ నుంచి ఖోస్ట్ ప్రావిన్స్ వెళ్లినట్లు తెలిపింది. పైగా ఆ వ్యక్తిని హక్కాని శాఖ కమాండర్గా పేర్కొంది. అంతేకాదు ఆ కమాండర్ నవవధువు ఇంటి దగ్గర హెలికాప్టర్ నుంచి దిగుతున్న వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వ్యక్తి ఆమెని వివాహం చేసుకునేందుకు తన మామగారికి దాదాపు రూ. 10 లక్షలు పైనే చెల్లించాడని వెల్లడించింది. అంతేగాక ఆ వ్యక్తి ఖోస్ట్లో నివశిస్తున్నాడని, అతని భార్య పుట్టిల్లు లోగర్లోని బార్కి బరాక్ జిల్లాలో ఉందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయంటూ కథనాలు వచ్చాయి. ఈ విషయమై తాలిబన్ డిప్యూటి అధికార ప్రతినిధి ఖారీ యూసుఫ్ అహ్మదీ స్పందిస్తూ... ఆ వ్యాఖ్యలను ఖండించారు. సేనాధిపతి చేసిన వ్యాఖ్యలను శత్రువులు చేస్తున్న తప్పుడూ ప్రచారంగా పేర్కొన్నారు. అంతేకాదు ఈ ఆరోపణలను ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గనిస్తాన్ తోసిపుచ్చింది కూడా. ఐతే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రజలు ఈ చర్యను ఖండిస్తూ నిరసనలు వ్యక్తం చేశారు. ఇది ప్రజా ఆస్తులను దుర్వినియోగపరచడం కిందకే వస్తుందంటూ ప్రజలు పెద్ద ఎత్తున మండిపడ్డారు. -
సముద్రంలో కుప్పకూలిన మిలిటరీ విమానం
టొరంటో : కెనడాకు చెందిన మిలిటరీ హెలికాప్టర్ సముద్రంలో కుప్పకూలింది. నాటో టాస్క్ఫోర్స్లో భాగంగా ప్రయాణించిన హెలికాప్టరు గ్రీస్ లోని లోనియన్ సముద్రతీరంలో కుప్పకూలిందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడీ వెల్లడించారు. ఈ దుర్ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో ఐదుగురు గల్లంతు ఆయ్యారని తెలిపారు. గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, వారంతా క్షేమంగా భయటపడాలని కోరుకుంటున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తిని మెరైన్ సిస్టమ్స్ ఇంజినీరింగ్ ఆఫీసర్ సబ్ లెఫ్టినెంట్ అబ్బిగైల్ కోబ్రౌగా గుర్తించినట్లు పేర్కొన్నారు. (కెనడాలో కాల్పులు.. 16 మంది మృతి) ఘటనపై కోబ్రౌ తల్లి మాట్లాడుతూ..నా అందమైన గారాలపట్టి నన్ను విడిచిపెట్టి వెళ్లిపోయింది. ఆమె స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు అంటూ వాపోయింది. హెలికాప్టరులో రాయల్ కెనడియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన నలుగురు సభ్యులతో పాటు మరో ఇద్దరు సెన్సార్ ఆపరేటర్లు ఉన్నారని అధికారులు వెల్లడించారు. వీరి కుటుంబాలకు ప్రాథమికంగా సమాచారం అందించామని, అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని పేర్కొన్నారు. (కెనడా ప్రధాని.. వర్క్ ఫ్రమ్ హోమ్ ) -
చొచ్చుకువచ్చిన చైనా సైనిక హెలికాఫ్టర్
సాక్షి, న్యూఢిల్లీ : చైనా సైనిక విమానం సోమవారం నియంత్రణ రేఖను దాటి భారత గగనతలంలోకి చొచ్చుకురావడం కలకలం రేపింది. ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలోని బరహోటి ప్రాంతంలో చైనా మిలటరీ హెలికాఫ్టర్ చక్కర్లు కొట్టింది. గగనతల నిబంధనలను ఉల్లంఘించి చైనా సైనిక హెలికాఫ్టర్ భారత గగనతలంలోకి ఎలా వచ్చిందనే వివరాలు వెల్లడికావాల్సి ఉంది. మరోవైపు డోక్లాం వివాదం నేపథ్యంలో ఇరు దేశాలు ఎలాంటి పరిణామాలకైనా సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. డోక్లాం వ్యవహారంలో చైనా దూకుడు పెంచడంతో భారత్ ఎలాంటి పరిణామాలు ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉందని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. గత నెలరోజుల్లో చైనా హెలికాఫ్టర్లు మన గగనతలంలోకి చొచ్చుకురావడం ఇది నాలుగోసారి. ఈనెల 10న మూడు చైనా సైనిక హెలికాఫ్టర్లు బరహోతిలో ప్రవేశించాయి. నాలుగు కిలోమీటర్ల మేర భారత గగనతలంలోకి చొచ్చుకువచ్చిన చాపర్లు దాదాపు ఐదు నిమిషాల పాటు చక్కర్లు కొట్టాయి. మార్చి 8న లడఖ్లో రెండు చైనా హెలికాఫ్టర్లను గుర్తించారు. భారత గగనతలంలోకి 18 కిమీ లోపలికి అవి చొచ్చుకువచ్చాయి. ఫిబ్రవరి 27న చైనా హెలికాఫ్టర్ లడఖ్లనో డెసాంగ్, ట్రిగ్ హైవే చేరువలో 19 కిలోమీటర్లలోపలికి భారత గగనతలంలోకి వచ్చి కొద్దిసేపు చక్కర్లు కొట్టింది. -
స్కూలు భవనంపై కూలిన హెలికాప్టర్
కౌలాలంపూర్: మలేసియా మిలటరీకి చెందిన హెలికాప్టర్ ఓ పాఠశాలపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో విద్యార్థులు సహా 22 మంది గాయపడ్డారు. మంగళవారం బోర్నియో ద్వీపంలోని సబా రాష్ట్రం తవాలో ఈ దుర్ఘటన జరిగింది. సాధారణ మిలటరీ కార్యకలాపాల్లో భాగంగా ఈ హెలికాప్టర్ వెళ్లినట్టు మలేసియా ఎయిర్ ఫోర్స్ అధికారులు చెప్పారు. పాఠశాల భవనం పైకప్పుపై హెలికాప్టర్ అత్యవసరంగా క్రాష్ ల్యాండ్ అయినట్టు చెప్పారు. ఇందులో ప్రయాణిస్తున్న 14 మంది ప్రమాదం నుంచి తప్పించుకున్నారని తెలిపారు. కాగా పైలట్ పరిస్థితి విషమంగా ఉండగా, ఏడుగురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. -
పాఠశాలలో కూలిన ఆర్మీ హెలిక్యాప్టర్
కౌలాలంపూర్: మిలటరీకి చెందిన యుద్ధ విమానం ప్రమాదవశాత్తు పాఠశాలలో పడిపోయింది. ఇందులో ఏడు మంది విద్యార్థులతో సహా 22 మందికి గాయాలయ్యాయి. పైలట్ పరిస్థితి విషయంగా ఉంది. ఈ ఘటన మలేషియాలోని సభా రాష్ట్రం తవు గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. కౌలాలంపూర్ ఆర్మీకి చెందిన శిక్షణ విమానం ప్రమాదవశాత్తు బోర్నియా ద్వీపం సభా రాష్ట్రంలోని తవు గ్రామంలోని పాఠశాల క్యాంటీన్ పై కప్పుకు ఢీ కొట్టింది. వెంటనే పాఠశాలలో పడిపోయింది. కారణాలు తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.


