-
బంజారాహిల్స్: పైకి మసాజ్ సెంటర్.. లోపల అమ్మాయిలతో..
సాక్షి, హైదరాబాద్(బంజారాహిల్స్): మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న బ్యూటీ స్పాపై బంజారాహిల్స్ పోలీసులు దాడులు చేసి నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. వివరాలివీ.. బంజారాహిల్స్ రోడ్ నంబరు 10లో మహి ఆయుర్వేదిక్ బ్యూటీ స్పా సెలూన్ పేరుతో సునీల్కుమార్ వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో ఇక్కడ సోదాలు నిర్వహించగా వివిధ ప్రాంతాల నుంచి యువతులను రప్పించి క్రాస్ మసాజ్ పేరుతో వ్యభిచారం చేయిస్తున్నట్లు విచారణలో తేలింది. సునీల్కుమార్తోపాటు సబ్ ఆర్గనైజర్ ఫర్జానా బేగంపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అలాగే ముగ్గురు విటులను అదుపులోకి తీసుకొన్నారు. యువతులను పునరావాస కేంద్రానికి తరలించి బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: హయత్నగర్ బాలిక కిడ్నాప్ కేసులో ‘నాటకీయ’ ట్విస్ట్ జన్నత్ సెలూన్ అండ్ స్పాపై దాడులు బంజారాహిల్స్ రోడ్ నంబరు 11లోని ఆర్కే రెసిడెన్సీ పెంట్హౌజ్లో జెన్నత్ సెలూన్ అండ్ స్పా ముసుగులో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు దాడులు నిర్వహించి నిర్వాహకులపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. రత్లావత్ విజయ్బాబు(28) ఈ స్పాను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. వివిధ ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి తెలిసిన విటులను పిలిపించి స్పా సెంటర్లో వ్యభిచారం చేయిస్తున్నట్లు తేలింది. నిర్వాహకులు విజయ్బాబుపై కేసు నమోదు చేశారు. -
లోటస్ బ్లిస్ స్పా పేరుతో వ్యభిచారం.. సుజాతపై ఇప్పటికే..
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్లో ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. మసాజ్సెంటర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రిసెప్షనిస్ట్ సచిన్, విటులు సతీష్, రాజ్కుమార్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడుల్లో నలుగురు యువతులను రక్షించారు. లోటస్ బ్లిస్ స్పా పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వివిధ వర్గాల వారిని తన బుట్టలో వేసుకుని చాలా రోజులుగా వ్యభిచారం సాగిస్తున్నట్లు నిర్వహకురాలు సుజాతపై ఆరోపణలు ఉన్నాయి. సుజాతపై గతంలో కూడా పలు సెక్షన్ల కింద మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. చదవండి: (థర్డ్వేవ్ ప్రారంభమైంది.. జనవరి చివరి నాటికి..) -
సివిల్స్ ర్యాంకర్ @ మసాజ్ సెంటర్
సాక్షి, సిటీబ్యూరో: అతడి పేరు గరిక సంతోష్ కుమార్. రెండేళ్ల క్రితం యూపీఎస్సీ పరీక్షల్లో ర్యాంకు సాధించాడు. కేసు పెండింగ్లో ఉండటంతో ఎంపిక ప్రక్రియకు బ్రేక్ పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఎవరైనా ఆ కేసు ముగించుకునే మార్గాలు అన్వేషిస్తారు. సంతోష్ మాత్రం దీనికి పూర్తి ‘భిన్నం’. మసాజ్ సెంటర్ నిర్వాహకుడిగా మారి మరో కేసును తనపై వేసుకున్నాడు. ‘క్రాస్ మసాజ్’లు నిర్వహిస్తున్న ఆరోపణలపై సంతోష్ సహా ఏడుగురు నిందితుల్ని మధ్య మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసినట్లు డీసీపీ పి.రాధాకిషన్రావు సోమవారం వెల్లడించారు. విశాఖపట్నానికి చెందిన సంతోష్ కుమార్ ఫిజిక్స్ విభాగంలో ఎమ్మెస్సీ పూర్తి చేశాడు. సివిల్స్ కోచింగ్ కోసం సిటీకి వచ్చి అశోక్నగర్ చౌరస్తాలో ఉన్న ఓ ఇన్స్టిట్యూట్లో దాదాపు ఏడాది కోచింగ్ తీసుకున్నాడు. ఆ సమయంలోనే వైఎంసీఏ చౌరస్తాలోని స్లా్పష్ సెలూన్లో భాగస్వామిగా చేరాడు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మరో భాగస్వామితో వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో అతడి భార్యపై దాడి చేశాడనే ఆరోపణలతో సంతోష్పై నారాయణగూడ ఠాణాలో కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్టు అయి, బెయిల్పై బయటకు వచ్చాడు. ప్రస్తుతం ఇది కోర్టు విచారణ దశలో ఉంది. ఇదిలా ఉండగా 2016లో సివిల్స్ రాసిన సంతోష్ తొలి ప్రయత్నంలోనే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలు విజయవంతంగా పూర్తి చేసి ర్యాంకు సాధించాడు. అయితే నారాయణగూడలో క్రిమినల్ కేసు నమోదై ఉండడంతో ఎంపిక ప్రక్రియకు బ్రేక్ వేసిన యూపీఎస్సీ సంతోష్ పేరును విత్హెల్డ్లో పెట్టింది. మరోపక్క ఆ సెలూన్ను సంతోష్ బంధువైన రాధారెడ్డి స్పాగా మార్చారు. మగవారికి ఆడవారితో మసాజ్లు చేయించడం (క్రాస్ మసాజ్) చట్ట విరుద్ధమైనప్పటికీ అలా చేస్తూ మూడుసార్లు పోలీసులకు చిక్కారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆరు నెలల క్రితం ‘స్పా’ బాధ్యతలు చేపట్టిన సంతోష్ క్రాస్ మసాజ్ల పరంపరను కొనసాగించాడు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ముగ్గురు యువతుల్ని ఉద్యోగినులుగా నియమించుకున్నాడు. వీరితో కస్టమర్లకు మసాజ్లు చేయిస్తూ భారీగా వసూలు చేస్తున్నాడు. ఈ ఉద్యోగినులకు కనీసం జీతాలు కూడా ఇవ్వకుండా వేధిస్తున్నాడు. కస్టమర్లకు మసాజ్ చేసిన సందర్భంలో వారిచ్చిన టిప్పులతోనే ఈ యువతులు బతుకీడుస్తున్నారు. స్లా్పష్ స్పా వ్యవహారాలపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్సైలు జి.తిమ్మప్ప తమ బృందంతో సోమవారం స్పాపై దాడి చేశారు. సంతోష్తో పాటు రిసెప్షనిస్ట్ వై.శ్రీకాంత్, కస్టమర్లు ఎల్.గోపినాథ్, కె.కుమార్, మసాజ్ చేసే యువతులను అరెస్టు చేశారు. వీరి నుంచి నగదు, సెల్ఫోన్లు తదిరాలు స్వాధీనం చేసుకున్నారు. విచారణ నేపథ్యంలో తాను సివిల్స్ ర్యాంకర్ అని, కేసుతో ఎంపికకు బ్రేక్ పడిందని సంతోష్ చెప్పడంతో టాస్క్ఫోర్స్ అధికారులు అవాక్కయ్యారు. రికార్డులు పరిశీలించిన అధికారులు అతడు చెప్పింది నిజమేనని ధ్రువీకరించారు. తదుపరి చర్యల నిమిత్తం సంతోష్ సహా నిందితుల్ని నారాయణగూడ పోలీసులకు అప్పగించారు. దీంతో కలిపి అదే ఠాణాలో సంతోష్పై రెండు కేసులు ఉన్నట్లైంది. -
బ్యూటీ పార్లర్ ముసుగులో మసాజ్ సెంటర్
హైదరాబాద్(చైతన్యపురి): బ్యూటీ పార్లర్ ముసుగులో క్రాస్ మసాజ్ నిర్వహిస్తున్న సెంటర్పై ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి నిర్వాహకురాలు, ఇద్దరు యువతులను, ముగ్గురు కస్టమర్లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 8 వేల నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని చైతన్యపురి పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్మన్ఘట్కు చెందిన ప్రతిజ (28) మోహన్నగర్ చౌరస్తాలో స్పార్కిల్ బ్యూటీ సెలూన్ను నిర్వహిస్తుంది. కొంత కాలంగా అమ్మాయిలతో క్రాస్ మసాజ్ చేయిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా గోల్కొండకు చెందిన యువతి, సంతోష్నగర్కు చెందిన మహిళ, ఉప్పుగూడకు చెందిన మల్లేష్, కర్మన్ఘట్కు చెందిన దుర్గారావులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 8,720 నగదు, తొమ్మిది సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని చైతన్యపురి పోలీసు స్టేషన్లో అప్పజెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారం
చెన్నై: పుదుచ్చేరిలోని ఓ మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు మహిళలు సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పుదుచ్చేరి కొత్త బస్టాండ్ సమీపంలోని మరైమలైయడిగల్ రోడ్డులో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న మసాజ్ సెంటర్లపై పోలీసులు నిఘా ఉంచారు. ఈ క్రమంలో ఓ మసాజ్ సెంటర్లో వ్యభిచారం జరుగుతున్నట్లు కనుగొన్నారు. ఆ ముఠాను పట్టుకునేందుకు ఇద్దరు కానిస్టేబుళ్లను మఫ్టీలో మసాజ్ చేయించుకునేందకు సెంటర్కు పంపారు. వీరు మసాజ్ సెంటర్కు వెళ్లగానే తలా మూడు వేల రూపాయిలు తీసుకుని ఆరుగురు మహిళలను అక్కడ నిలబెట్టారు. పోలీసులు ఎంపిక చేసుకున్న ఇద్దరు మహిళలు అసభ్యంగా ప్రవర్తించసాగారు. వెంటనే బయట ఉన్న అధికారులకు ఎస్ఎంఎస్ పంపగా వారు మసాజ్ సెంటర్లోని ఆరుగురు మహిళలను రక్షించారు. వారిలో పుదుచ్చేరి సామిపిల్లై తోటకు చెందిన శశి(32), తమిళ్సెల్వి(31), దిండివనంకు చెందిన కార్తిక్(23), లాస్పేట్కు చెందిన గురుసామి(33)గా తెలిసింది. మసాజ్ సెంటర్ నిర్వాహకురాలు ముత్యాలపేటకు చెందిన రాధిక అలియాస్ ఆరోగ్యమేరి కోసం గాలిస్తున్నారు. అరెస్టైన నలుగురిని శుక్రవారం మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచి కాలాపట్టు జైలులో ఉంచారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement