breaking news
manjot kalra
-
గిల్, పృథ్వీ షాతో కలిసి ఆడాడు.. కట్ చేస్తే! ఇప్పుడు ఓ జట్టునే కొనేశాడు
మన్జోత్ కల్రా.. ఈ క్రికెటర్ గురుంచి చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ 2018 అండర్-19 ప్రపంచకప్ను భారత్ సొంతం చేసుకోవడంలో అతడిది కీలక పాత్ర. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో అద్భుతమైన సెంచరీ సాధించి టీమిండియాను మన్జోత్ ఛాంపియన్గా నిలిపాడు.ఆ టోర్నమెంట్ సమయంలో పృథ్వీ షా, శుభమన్ గిల్ వంటి స్టార్లతో సమానంగా మన్జోత్ కల్రా పేరు కూడా మారుమోగింది. భారత క్రికెట్కు మరో సూపర్ స్టార్ దొరికాడని అంతా భావించారు. ఆ టోర్నీ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ (అప్పట్లో ఢిల్లీ డేర్డెవిల్స్) అతన్ని ఐపీఎల్ కోసం కొనుగోలు చేసింది. అయితే 2019లో ఢిల్లీ తరఫున అరంగేట్రం చేసిన కొద్దికాలానికే అతడి కెరీర్ ఊహించని మలుపులు తిరిగింది. వయస్సులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో కల్రాపై ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ ఏడాది పాటు నిషేధం విధించింది. ఆ తర్వాత పునరాగనమం చేసినప్పటికి అతడు రాణించలేకపోయాడు. మన్జోత్ కల్రా చివరగా ఢిల్లీ తరపున 2021లో లిస్ట్-ఏ క్రికెట్లో ఆడాడు.ఫ్రాంచైజీ ఓనర్గా కల్రాఅయితే మన్జోత్ కల్రా మళ్లీ ఇప్పుడు ఐదేళ్ల తర్వాత క్రికెట్ ప్రపంచంలో సరికొత్త పాత్రలో కన్పించేందుకు సిద్దమయ్యాడు. లంక ప్రీమియర్ లీగ్లో జాఫ్నా కింగ్స్ ఫ్రాంచైజీకి సహ-యజమానిగా అతడు మారాడు. మన్జోత్ .. ప్రముఖ పారిశ్రామికవేత్త మయాంక్ గోయెల్తో కలిసి 'స్పోర్ట్స్ కమ్యూన్' అనే సంస్థ ద్వారా జాఫ్నా కింగ్స్ జట్టులో వాటాలను కొనుగోలు చేశాడు.ఫ్రాంచైజీకి సంబంధించిన వ్యూహాలు, ఆటగాళ్ల ఎంపిక, ఆపరేషన్స్ బాధ్యతలను కల్రా పర్యవేక్షించనున్నాడు. లంక ప్రీమియర్ లీగ్-2026 సీజన్ జూలై 17 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: అప్పటి నుంచి ధోని అస్సలు నచ్చలేదు: గంగూలీ -
భారత యువ క్రికెటర్పై ఏడాది నిషేధం
న్యూఢిల్లీ: రెండేళ్ల క్రితం న్యూజిలాండ్లో ఆస్ట్రేలియాతో జరిగిన అండర్–19 ప్రపంచకప్ ఫైనల్లో సెంచరీతో భారత్ను గెలిపించిన ఓపెనర్ మన్జ్యోత్ కాల్రాపై... రంజీ ట్రోఫీ మ్యాచ్ల్లో ఆడకుండా ఢిల్లీ జిల్లా క్రికెట్ సంఘం (డీడీసీఏ) ఏడాదిపాటు నిషేధం విధించింది. దేశవాళీ అండర్–16, అండర్–19 వయో విభాగాల్లో ఆడిన సమయంలో కాల్రా అసలు వయసుకంటే తక్కువ వయసు చూపి జట్లలోకి ఎంపికయ్యాడని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు తప్పని కాల్రా రుజువు చేయలేకపోయాడు. దాంతో కాల్రాపై ఏజ్ గ్రూప్ క్రికెట్ ఆడకుండా రెండేళ్లు... రంజీ ట్రోఫీ ఆడకుండా ఏడాదిపాటు నిషేధం విధిస్తున్నట్లు డీడీసీఏ అంబుడ్స్మన్ జస్టిస్ (రిటైర్డ్) బదర్ దురెజ్ ప్రకటించారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి రికార్డుల ప్రకారం మన్జ్యోత్ కాల్రా ప్రస్తుత వయస్సు 20 ఏళ్ల 351 రోజులుగా ఉంది. ఇటీవలే అండర్–23 క్రికెట్ టోర్నీలో బెంగాల్తో మ్యాచ్లో కాల్రా 80 పరుగులు చేశాడు. ఓపెనర్ ధావన్ లంకతో టి20 సిరీస్కు ఎంపిక కావడంతో అతని స్థానంలో కాల్రా ఢిల్లీ జట్టులోకి రావడం ఖాయమైంది. అయితే అంబుడ్స్మన్ తాజా నిర్ణయంతో కాల్రా ఎలాంటి క్రికెట్ ఆడే అవకాశం లేకుండా పోయింది. -
రెండో భారత క్రికెటర్గా..
మౌంట్ మాంగనీ: అండర్-19 వరల్డ్ కప్ను భారత్ సాధించడంలో ముఖ్య భూమిక పోషించిన ఓపెనర్ మన్జోత్ కల్రా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అండర్-19 వరల్డ్ కప్ చరిత్రలో భాగంగా తుది పోరులో శతకం సాధించిన రెండో భారత క్రికెటర్గా మన్జోత్ నిలిచాడు. అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో ఆసీస్తో జరిగిన మ్యాచ్లో మన్జోత్(101 నాటౌట్) అజేయ శతకం సాధించిన సంగతి తెలిసిందే. ఫలితంగా అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో ఉన్ముక్త్ చంద్ తర్వాత సెంచరీ చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. 2012లో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో భారత ఆటగాడు ఉన్ముక్త్ చంద్ శతకం సాధించాడు. ఆ తర్వాత మెగా పోరు ఫైనల్లో శతకం సాధించిన టీమిండియా ఆటగాడు మన్జోత్ కల్రానే. ఓవరాల్గా అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో సెంచరీ సాధించిన ఐదో ఆటగాడు మన్జోత్.1988 వరల్డ్ కప్ ఫైనల్లో ఆసీస్ ఆటగాడు బ్రెట్ విలియమ్స్ శతకం సాధించి తొలి ఆటగాడిగా నిలవగా, 1998 తుది పోరులో ఇంగ్లండ్ ఆటగాడు స్టీఫెన్ పీటర్స్ సెంచరీ సాధించాడు. 2002లో జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో ఆసీస్ ఆటగాడు జారడ్ బర్క్ శతకం సాధించాడు.


