breaking news
Manaswini
-
యూత్ను మెప్పించిన 'మనస్విని' సినిమాల్లోకి ఎంట్రీ
టాలీవుడ్లోకి యంగ్ నటి 'మనస్విని బాలబొమ్మల' అడుగుపెడుతుంది. గతంలో భక్తి పాటలతో సింగర్గా యువతరంలో మంచి గుర్తింపు దక్కించుకున్న ఆమె వెండితెరపైకి 'కొక్కొరొకో' మూవీతో ఎంట్రీ ఇస్తుంది. ఇందులో ఆమె అతిథి పాత్రలో కనిపిస్తున్నప్పటికీ కథలో కీలకంగా ఉండనుంది. ఈ మూవీ నుంచి తాజాగా ప్రత్యేకమైన పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీతోనే ఎంట్రీ ఇస్తున్న మనస్విని బాలబొమ్మల ఫస్ట్ లుక్ గురించి ప్రశంసలు వస్తున్నాయి.యువతరంలో మంచి గుర్తింపు ఉన్న మనస్విని బాలబొమ్మల చాలా టాలెంటెడ్.. తెలుగులో 'కొక్కొరొకో' చిత్రంతో వెండితెరపైకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతుంది. ఇది ఆమె సినీ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసిన ప్రత్యేక పోస్టర్ తన సున్నితమైన, సంప్రదాయాత్మక భావంతో వెంటనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆ పోస్టర్పై “Our Bangarraju Family wishes you and your family a Happy Sankranthi. ‘కొక్కోరోకో’ త్వరలో థియేటర్లలో” అనే సందేశం ఉంచి, చిత్రానికి పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారు.ఈ సంక్రాంతి పోస్టర్ ద్వారా మనస్విని బాలబొమ్మల తొలి అధికారిక లుక్ కూడా విడుదలైంది. ఆ పోస్టర్లో ఆమె సీనియర్ నటుడు సముద్రఖని సహా ఇతర నటులతో కలిసి కనిపించారు. ఈ చిత్రంలో ఆమెది అతిథి పాత్ర అయినప్పటికీ, ఇది తెలుగుసినిమాల్లో ఆమెకు అధికారిక ఆరంభంగా నిలవడంతో పాటు, ఇప్పటికే సినీ వర్గాల్లో మంచి స్పందనను రాబడుతోంది.సినిమాల్లోకి రాకముందే మనస్విని ఒక శిక్షణ పొందిన, బహుముఖ ప్రతిభ కలిగిన కళాకారిణిగా తనదైన బలమైన పునాది వేసుకున్నారు. థియేటర్ రంగంలో Little Women నాటకంలో జోగా, Much Ado About Nothing లో బియాట్రిస్గా ప్రధాన పాత్రలు పోషించిన అనుభవం ఆమెకు ఉంది. నటనతో పాటు ఆమెకు పెరిని నాట్యం అనే శాస్త్రీయ నృత్యంలో శిక్షణ తీసుకుంది.. కర్ణాటక సంగీతంలోనూ ప్రావీణ్యం ఉంది. భక్తి గీతాల ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు పలు పాఠశాల కార్యక్రమాలకు యాంకరింగ్ చేయడం కూడా ఆమె కళా ప్రయాణంలో భాగమే.. ఇవన్నీ ఆమె స్టేజ్ ప్రెజెన్స్ను ప్రతిబింబిస్తాయి.'కొక్కొరొకో' చిత్రాన్ని దర్శకుడు రమేష్ వర్మ తన కొత్త బ్యానర్ ఆర్వీ ఫిల్మ్ హౌస్ ద్వారా తొలిసారి నిర్మాతగా మారి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీనివాస్ వసంతల దర్శకత్వం వహిస్తున్నారు. ఐదు విభిన్న పాత్రలతో కూడిన ఈ సంకలిత చిత్రం, సంప్రదాయ కోడిపందేల నేపథ్యాన్ని ప్రధానంగా తీసుకుంది. రేఖా వర్మ, కురపాటి సిరీష నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని, నీలాద్రి ప్రొడక్షన్ పతాకంపై 2026లో విడుదలకు సిద్ధమవుతోంది. View this post on Instagram A post shared by Manaswini (@mcanutikki) -
పాపకు ప్రాణం పోద్దాం!
పాలకుర్తి టౌన్: ముచ్చటైన జంట కడుపున ఇద్దరు కవల పిల్లలు పురుడుపోసుకున్నారు. వారి ఎదుగుదలను చూస్తూ ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు. బుడిబుడినడకలు, ముద్దు మాటలతో ఆ లేత మొగ్గలు కన్నవారికి కనులపండుగ చేశారు. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. 15 నెలల ప్రాయంలో చిన్న కూతురు హృదయ సంబంధిత వ్యాధి బారిన పడి కన్నుమూసింది. ఆ కుటుంబంలో అంతులేని విషాదం నెలకొంది. కన్నీళ్లను దిగమింగి పెద్ద కూతురు ఆలనా పాలనా చూస్తూ జీవనం సాగిస్తున్న ఆ కుటుంబంలో పెను ఉప్పెనలా మరో విపత్తు వచ్చి పడింది. పెద్ద కూతురు మనస్విని కేన్సర్ బారిన పడింది. ప్రాణాలకు భరోసా లేదని, ఖరీదైన వైద్యం చేస్తే తప్ప పాపను బతికించడం కష్టమని వైద్యులు తేల్చిచెప్పారు. ఉన్న ఊరిలో ఉపాధి కరువై హైదరాబాద్లో చిరుద్యోగంలో కుదురుకున్న మధ్యతరగతి తండ్రి ఈ పిడుగులాంటి వార్తతో కుదేలయ్యాడు. ఉన్న ఒక్క బిడ్డను బతికించుకోవాలని ఆ తండ్రి పడుతున్న తపన వర్ణనాతీతం. కేన్సర్ బారిన పడి బతుకు పోరాటం చేస్తున్న ఆ బిడ్డకు దాతలు ఆపన్నహస్తం అందిస్తే ప్రాణం నిలబడుతుంది. సమాజంలో మానవత్వం పరిఢవిల్లుతుంది. ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు.. ప్రమాదకరమైన వ్యాధి బారినపడి బతుకు పోరాటం చేస్తున్న బిడ్డను బతికించుకోవడానికి తల్లిదండ్రులు నానా పాట్లు పడుతున్నారు. చేతిలో ఉన్న డబ్బులు మొత్తం వైద్యానికి ఖర్చు చేశారు. రోజుకు రూ.వేలల్లో వైద్య ఖర్చులకు చెల్లించాల్సి రావడం వారికి భారంగా మారింది. చాలీచాలని వేతనంతో బతుకుబండి లాగుతున్న మధ్య తరగతి వేతన జీవికి వైద్య ఖర్చులు భరించే స్థితి లేదు. పాపను కాపాడుకునే దారి లేక చేతిలో చిల్లిగవ్వ లేక ఆ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు. దాతలు సాయమందించి తమ బిడ్డకు ప్రాణబిక్ష పెట్టాలని దీనంగా వేడుకుంటున్నారు. ఖరీదైన వైద్యం.. భరించలేని దైన్యం.. జనగామ జిల్లా పాలకుర్తి మండలం ముత్తారం గ్రామానికి చెందిన భారత మల్లేష్ – భాగ్యలక్ష్మి దంపతులకు కవల పిల్లలు. మల్లేష్ హైదరాబాద్లోని జీవీకే కంపెనీలో చిరుద్యోగం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. కుటుంబం సాఫీగా సాగుతున్న క్రమంలో కనురెప్పలపై కాలం కన్నెర్రజేసింది. చిన్న కూతురు మనస్విత 15 నెలల వయస్సులో ‘రెస్ట్రిక్టవ్ కార్డియోపతి’ వ్యాధి బారిన పడి రెండేళ్ల క్రితం తనువు చాలించింది. బోసినవ్వుల బిడ్డ అర్ధాంతరంగా లోకాన్ని విడిచిపెట్టడంతో కుటుంబం షాక్కు గురైంది. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగి పెద్ద కూతురు మనస్విని అల్లారుమద్దుగా పెంచుకున్నారు. మూడేళ్ల వరకు ఆ బిడ్డకు ఎలాంటి నలత లేదు. ఆ తర్వాత తరుచూ అనారోగ్యం బారిన పడటం మొదలైంది. ఆస్పత్రిలో పరీక్షలు చేయిస్తే ‘అక్యూట్ లింఫోసైటిక్ లుకేమియా’ అనే కేన్సర్ సోకిందని వైద్యులు తేల్చారు. వైద్య ఖర్చులు రూ.20 లక్షల వరకు అవుతాయని, అంతకంటే ఎక్కువైనా భరిస్తే తప్ప పాప ప్రాణం నిలబడే అవకాశం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం అంత డబ్బు లేకున్నా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తాత్కాలికంగా వైద్యం అందిస్తున్నారు. సాయం చేయాలనుకునే వారు సంప్రదించాల్సిన నంబర్లు భారత మల్లేష్, ఎస్బీఐ ఖాతా నంబర్ 3159 04824 88, పాలకుర్తి ఐఎఫ్ఎస్సీ కోడ్ : SBIN0014240 ఫోన్ పే / గూగల్ పే నంబర్ : 97042 23003 -
మనస్విని ఆరోగ్య పరిస్ధితి విషయం
-
దేవుడు... దెయ్యం... మనిషి
మనిషి దేవుడికి భయపడతాడు. దెయ్యానికి భయపడతాడు. ఈ భయాలతో అసలు మనిషి పయనం ఎటువైపు వెళుతుంది? ఈ నేపథ్యంతో రూపొందుతోన్న చిత్రం ‘దేవుడు... దెయ్యం... మనిషి’. కొమురవెల్లి శ్రీనివాస్ గౌలికర్ దర్శకుడు. ఎస్.ఎస్.ఎన్.మూవీస్ పతాకంపై కేశనకుర్తి శ్రీనివాస్, కొమురవెల్లి శ్రీనివాస్ గౌలికర్ నిర్మిస్తున్న ఈ చిత్రం బుధవారం హైదరాబాద్లో ప్రాంభమైంది. ముహూర్తపు దృశ్యానికి దర్శకుడు ప్రేమ్రాజ్ కెమెరా స్విచాన్ చేయగా, దర్శక, నిర్మాత సానా యాదిరెడ్డి క్లాప్ ఇచ్చారు. భద్రాచలం, మణుగూరు, పాపికొండలు తదితర ప్రాంతాల్లో 40 రోజుల సింగిల్ షెడ్యూల్లో చిత్రాన్ని పూర్తి చేస్తామని దర్శకుడు తెలిపారు. ఈ సినిమాలో నటించే అవకాశం రావడం పట్ల శిరీష్, తులసి, నరేష్, మనస్విని సంతోషం వెలిబుచ్చారు. ఈ చిత్రానికి కెమెరా: కోట తిరుపతిరెడ్డి, బేబి హరితశ్రీ.


