-
యువతి దారుణ హత్య
– తలపై గట్టిగా కొట్టి చంపి.. దహనం చేసిన నిందితులు –కడప నగర శివార్లలోని అగ్రిగోల్డ్ వెంచర్లో ఘటన –డాగ్స్క్వాడ్, క్లూస్టీం పరిశీలన చెన్నూరు : కడప నగర శివార్లలో దారుణ హత్య జరిగింది. గుర్తు తెలియని యువతి(21)ని తలపై బలమైన రాడ్డుతో కొట్టి చంపారు. చెన్నూరు పోలీస్టేషన్ పరిధిలోని కమలాపురం రోడ్డులో మదీనా ఇంజనీరింగ్ కళాశాల ఎదురుగా ఉన్న అగ్రిగోల్డ్ వెంచర్లో గురువారం దహనం చేసిన యువతి మృతదేహం లభ్యమైంది. స్థానికులు ఉదయం వాకింగ్కు వెళ్లగా మృతదేహం ఉన్నట్లు గమననించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అర్బన్ సీఐ సదాశివయ్య, ఎస్ఐలు వినోద్కుమార్, రాజేశ్వర్రెడ్డి, సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. డాగ్స్క్వాడ్, క్లూస్ టీంలను పిలిపించి క్షుణ్ణంగా పరిశీలించారు. బుధవారం రాత్రే ఈ సంఘటన జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. హత్యచేసి..పెట్రోల్పోసి దహనం.. హంతకులు ముందుగా యువతిని ఓ చోట తలపై బలమైన రాడ్డుతో కొట్టి చంపారు. ఓ వాహనంలో నిర్మానుష్యంగా ఉన్న ఈ ప్రాంతానికి తీసుకొచ్చారు. మృతదేహంపై పెట్రోల్ పోసి ఎవ్వరూ గుర్తు పట్టని విధంగా ముఖంపైనే బాగా కాల్చారు. యువతికి సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లేకుండా చేశారు. సంఘటన స్థలంలోనే మద్యం సేవించి దహనం చేశారనడానికి, రెండు బీరు బాటిల్లు, వాటర్ ప్యాకెట్లు, పెట్రోల్ తెచ్చిన బాటిళ్లు లభ్యమయ్యాయి. ఘటనా స్థలం వద్దకు క్లూస్టీం, డాగ్స్క్వాడ్లను పిలిపించి పోలీసులు ఆరా తీశారు. దుండగులు ఉపయోగించిన అనుమానిత వస్తువులను సేకరించారు. రిమ్స్ నుంచి వైద్యులను పిలిపించి శవపరీక్ష అక్కడే చేయించారు. మృతదేహం 19 నుంచి 24 ఏళ్లలోపు యువతిదని, తలపై బలంగా కొట్టి చంపి, ఇక్కడ కాల్చారని పోలీసులు భావిస్తున్నారు. దహనమైన మృతదేహాన్ని రిమ్స్కు తరలించారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని హంతకులను త్వరలోనే పట్టుకుంటామని సీఐ సదాశివయ్య తెలిపారు. -
యువతి దారుణ హత్య
– తలపై గట్టిగా కొట్టి చంపి.. దహనం చేసిన నిందితులు –కడప నగర శివార్లలోని అగ్రిగోల్డ్ వెంచర్లో ఘటన –డాగ్స్క్వాడ్, క్లూస్టీం పరిశీలన చెన్నూరు : కడప నగర శివార్లలో దారుణ హత్య జరిగింది. గుర్తు తెలియని యువతి(21)ని తలపై బలమైన రాడ్డుతో కొట్టి చంపారు. చెన్నూరు పోలీస్టేషన్ పరిధిలోని కమలాపురం రోడ్డులో మదీనా ఇంజనీరింగ్ కళాశాల ఎదురుగా ఉన్న అగ్రిగోల్డ్ వెంచర్లో గురువారం దహనం చేసిన యువతి మృతదేహం లభ్యమైంది. స్థానికులు ఉదయం వాకింగ్కు వెళ్లగా మృతదేహం ఉన్నట్లు గమననించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అర్బన్ సీఐ సదాశివయ్య, ఎస్ఐలు వినోద్కుమార్, రాజేశ్వర్రెడ్డి, సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. డాగ్స్క్వాడ్, క్లూస్ టీంలను పిలిపించి క్షుణ్ణంగా పరిశీలించారు. బుధవారం రాత్రే ఈ సంఘటన జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. హత్యచేసి..పెట్రోల్పోసి దహనం.. హంతకులు ముందుగా యువతిని ఓ చోట తలపై బలమైన రాడ్డుతో కొట్టి చంపారు. ఓ వాహనంలో నిర్మానుష్యంగా ఉన్న ఈ ప్రాంతానికి తీసుకొచ్చారు. మృతదేహంపై పెట్రోల్ పోసి ఎవ్వరూ గుర్తు పట్టని విధంగా ముఖంపైనే బాగా కాల్చారు. యువతికి సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లేకుండా చేశారు. సంఘటన స్థలంలోనే మద్యం సేవించి దహనం చేశారనడానికి, రెండు బీరు బాటిల్లు, వాటర్ ప్యాకెట్లు, పెట్రోల్ తెచ్చిన బాటిళ్లు లభ్యమయ్యాయి. ఘటనా స్థలం వద్దకు క్లూస్టీం, డాగ్స్క్వాడ్లను పిలిపించి పోలీసులు ఆరా తీశారు. దుండగులు ఉపయోగించిన అనుమానిత వస్తువులను సేకరించారు. రిమ్స్ నుంచి వైద్యులను పిలిపించి శవపరీక్ష అక్కడే చేయించారు. మృతదేహం 19 నుంచి 24 ఏళ్లలోపు యువతిదని, తలపై బలంగా కొట్టి చంపి, ఇక్కడ కాల్చారని పోలీసులు భావిస్తున్నారు. దహనమైన మృతదేహాన్ని రిమ్స్కు తరలించారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని హంతకులను త్వరలోనే పట్టుకుంటామని సీఐ సదాశివయ్య తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ప్రజాస్వామ్య పరిరక్షణ సభ
వేద విజ్ఞానం కలిగిన భూమి భారత్
కాంగ్రెస్లో మున్సిపల్ కౌన్సిలర్ల చేరిక
పేదల సంక్షేమానికి పెద్దపీట
కాంగ్రెస్ పార్టీతోనే పేదలకు న్యాయం
ఓటేసిన ఆర్వో
ధాన్యం దిగదు.. లారీ కదలదు
● జనసంద్రంగా ఐబీ చౌరస్తా ● మంచిర్యాలలో రోడ్షో
నేడు నీట్
డీఏవోగా సురేఖ బాధ్యతల స్వీకరణ
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement