LPG consumers
-
‘ఆ ఇళ్లలో సిలిండర్లు కనిపిస్తే చర్యలు’
న్యూఢిల్లీ: దేశంలోని వంటగ్యాస్ వినియోగదారులకు సంబంధించి కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ)కనెక్షన్ ఉన్న ఇళ్లలో డొమెస్టిక్ ఎల్పీజీ (ఎల్పీజీ)సిలిండర్లను ఉంచుకోవడంపై ప్రభుత్వం నిషేధం విధించింది. గ్లోబల్ మార్కెట్లో ఇంధన సరఫరాలో తలెత్తుతున్న ఒడిదుడుకుల దృష్ట్యా, జాతీయ ఇంధన నిల్వలను సమర్థంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఈ నిబంధనను అమల్లోకి తెచ్చింది.సవరించిన కొత్త నిబంధనలివేలిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఉత్తర్వులను సవరిస్తూ కేంద్రం తాజా ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం పీఎన్జీ సౌకర్యం ఉన్న ఇళ్లకు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కొత్త ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వకూడదు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న సిలిండర్లను రీఫిల్ చేయడంపై కూడా నిషేధం విధించారు. పీఎన్జీ వాడుతున్న వారు తమ వద్ద ఉన్న ఎల్పీజీ సిలిండర్లను తక్షణమే సంబంధిత కంపెనీలకు అప్పగించాల్సి ఉంటుంది.ఎందుకీ కఠిన నిర్ణయం?మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు, ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ వద్ద తలెత్తిన అడ్డంకులు అంతర్జాతీయ ఇంధన సరఫరాపై ప్రభావం చూపుతున్నాయి. భారత్ తన ఎల్పీజీ అవసరాల కోసం దాదాపు 90 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో, దేశీయ అవసరాలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పీఎన్జీ కనెక్షన్లు ఉన్న ప్రాంతాల్లో ఎల్పీజీ వాడకాన్ని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది.పెట్రోల్, డీజిల్ నిల్వలపై నిఘామరోవైపు పెట్రోల్ లేదా డీజిల్ను బాటిళ్లు, డబ్బాలు వంటి అనధికారిక కంటైనర్లలో నిల్వ చేయవద్దని మంత్రిత్వ శాఖ ప్రజలను హెచ్చరించింది. ఇలా చేయడం వల్ల తీవ్రమైన భద్రతా ముప్పులు పొంచి ఉంటాయని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించి విడి డబ్బాల్లో పెట్రోల్ పోసిన తమిళనాడులోని ఒక పెట్రోల్ బంకుపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు.ఆందోళన వద్దు.. నిల్వలు పుష్కలం!దేశంలో ఇంధన కొరత లేదని, ప్రజలు ఆందోళన చెంది ముందస్తుగా కొనుగోలు చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు. గృహ అవసరాలకు, రవాణా రంగానికి 100 శాతం గ్యాస్ సరఫరాను నిర్ధారిస్తూ ‘నేచురల్ గ్యాస్ కంట్రోల్ ఆర్డర్’ జారీ చేశారు. పరిశ్రమలకు మాత్రం సరఫరాను 80 శాతానికి పరిమితం చేశారు. ప్రస్తుతం దేశం పెట్రోల్, డీజిల్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధిగా ఉందని, దేశవ్యాప్తంగా ఉన్న లక్షకు పైగా రిటైల్ అవుట్లెట్లలో ఇంధన సరఫరా నిరంతరాయంగా కొనసాగుతున్నదని ప్రభుత్వం తెలిపింది.ఇది కూడా చదవండి: ప్రయాణికులకు విజ్ఞప్తి: ‘వందేభారత్’ ఎక్కుతున్నారా? -
గ్యాస్ లేక.. స్మశానంలో మృతదేహాల వెయిటింగ్..
కోజికోడ్: దేశవ్యాప్తంగా నెలకొన్న ఎల్పీజీ సిలిండర్ల కొరత ప్రభావం ఇప్పుడు స్మశానవాటికల వరకూ పాకింది. కేరళలోని కోజికోడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడిచే ‘స్మృతిపథం’ స్మశానవాటికలో గ్యాస్ సిలిండర్ల నిల్వలు పూర్తిగా అయిపోవడంతో, శుక్రవారం నుంచి గ్యాస్ ఆధారిత దహన సంస్కారాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.సంప్రదాయ పద్ధతులే శరణ్యంగత రెండు రోజులుగా సిలిండర్ల సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతోందని, ఎన్నిసార్లు ప్రయత్నించినా సరఫరాదారులు కొత్త స్టాక్ పంపలేదని స్మృతిపథం సిబ్బంది వాపోతున్నారు. దీంతో గ్యాస్ ఫర్నేస్లను మూసివేసి, ప్రత్యామ్నాయంగా కొబ్బరి పీచు, చిప్పలను ఉపయోగిస్తూ, సంప్రదాయ పద్ధతిలో దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఉన్న ఎలక్ట్రిక్ క్రీమెటోరియం కూడా సాంకేతిక కారణాలతో గత నాలుగు నెలలుగా మూలనపడింది. వారం రోజుల్లోగా దీనికి మరమ్మతులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.సామాన్యులపై అదనపు భారంసాధారణంగా మిగతా చోట్ల కంటే స్మృతిపథంలో అంతిమ సంస్కారాల ఖర్చు తక్కువ. ఇక్కడ గ్యాస్ ఆధారిత దహనానికి ₹2,000, ఎలక్ట్రిక్ పద్ధతికి ₹2,500 వసూలు చేస్తారు. గ్యాస్ కొరత కారణంగా దహన సంస్కారాల కోసం ఇప్పుడు కుటుంబ సభ్యులు పుతియాపాలం లేదా వెస్ట్ హిల్ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. దీనివల్ల ఒక్కో కుటుంబంపై అదనంగా ₹500 నుండి ₹1,500 వరకు ఆర్థిక భారం పడుతోంది.ఒక మృతదేహానికి 25 కిలోల గ్యాస్సాధారణంగా ఒక మృతదేహాన్ని గ్యాస్ ద్వారా దహనం చేయడానికి సుమారు 25 కిలోల గ్యాస్ అవసరమవుతుంది. అంటే దాదాపు ఒకటిన్నర కమర్షియల్ సిలిండర్లు ఖర్చవుతాయి. దహన ప్రక్రియలో తగినంత ఒత్తిడి కొనసాగించాలంటే ఒకేసారి 12 సిలిండర్లను ఫర్నేస్కు అనుసంధానించాల్సి ఉంటుంది. గ్యాస్ సరఫరా తిరిగి సాధారణ స్థితికి చేరుకున్న తర్వాతే ఇక్కడ సేవలు పునరుద్ధరిస్తామని అధికారులు చెబుతున్నారు.ఇది కూడా చదవండి: ఆకలి తీరుస్తున్న ‘గ్యాస్ అన్డూ’.. టెక్కీల క్రేజీ ఆవిష్కరణ -
గ్యాస్ బండపై రూ. 50 వడ్డింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఎల్పీజీ వినియోగదారులపై భారం మరింత పెరిగింది. గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ ధరను 50 రూపాయలు పెంచుతూ కేంద్రం సోమవారం నిర్ణయం తీసుకుంది. ఇది సాధారణ వినియోగదారులతో పాటు నిరుపేద ఉజ్వల పథక లబ్దిదారులకు కూడా వర్తిస్తుందని కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి వెల్లడించారు. సోమవారం అర్ధరాత్రి నుంచే పెంపు అమల్లోకి వచ్చింది. ఎల్పీజీ విక్రయాలపై పెట్రోలియం సంస్థలు నష్టాలు మూటగట్టుకుంటున్నందున ఈ నిర్ణయం తప్పలేదన్నారు. తాజా పెంపుతో దేశ రాజధానిలో ఎల్పీజీ సిలిండర్ ధర ఉజ్వల వినియోగదారులకు రూ.503 నుంచి రూ.553కు పెరిగింది. సాధారణ వినియోగదారులకు ధర రూ.853కి చేరింది. సీఎన్జీ ధరలను కూడా దాదాపు నాలుగు శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఢిల్లీలో సీఎన్జీ ధర కిలోకు ఒక రూపాయి పెరిగి రూ.75.09కి చేరింది. వీటితో పాటు పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని కూడా కేంద్రం 2 రూపాయల చొప్పున పెంచింది. అయితే ఈ పెంపు రిటైల్ ధరలకు వర్తించబోదు. ఫలితంగా ఈ భారం సామాన్య వినియోగదారులపై పడబోదని పురి స్పష్టం చేశారు. ‘‘అంతర్జాతీయంగా చమురు ధరలు బ్యారల్కు 70–75 డాలర్ల నుంచి 60 డాలర్లకు తగ్గిన నేపథ్యంలో పెట్రోల్, డీజిల్పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం విధించాలని నిర్ణయించాం. దీనివల్ల కేంద్రానికి రూ.32 వేల అదనపు ఆదాయం సమకూరనుంది. సమీప భవిష్యత్తులో చమురు ధరలు పెరగని పక్షంలో పెట్రో ధరలను తగ్గించే అవకాశం కూడా ఉంది’’ అని మంత్రి వెల్లడించారు. తాజా నిర్ణయంతో పెట్రోల్పై కేంద్రం పన్నులు లీటర్కు రూ.21.9కి, డీజిల్పై రూ.15.8కి చేరాయి. భారత్లో పెట్రోల్, డీజిల్ వార్షిక వినియోగం 16,000 కోట్ల లీటర్లు. మన చమురు అవసరాలకు 85 శాతం దాకా దిగుమతులపైనే ఆధారపడ్డాం. -
కేంద్రం సంచలన నిర్ణయం.. గ్యాస్ సిలిండర్లపై కొత్త రూల్స్!
ఇటీవలే నిత్యవసరాల వస్తువులకు జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి సామాన్యుడికి కేంద్రం ప్రభుత్వం షాకిచ్చింది. తాజాగా గ్యాస్ సిలిండర్లపై కొత్త నిబంధనలను తీసుకొచ్చి మరో ఊహించని షాక్ ఇవ్వనుంది. పలు మీడియా నివేదికల ప్రకారం.. గ్యాస్ వినియోగంపై పరిమితులు విధిస్తూ మోదీ సర్కార్ కొత్త రూల్స్ను ప్రవేశపెట్టనుంది. దీని ప్రకారం... వినియోగదారులు ఇకపై ఏడాదికి 15 సిలిండర్లు మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా.. నెలకు కేవలం 2 గ్యాస్ సిలిండర్లు కొనుగోలు చేసేలా.. మార్పులు చేసింది. అయితే ఇప్పటి వరకూ ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా..ప్రచారం మాత్రం సాగుతోంది. ఇదిలా ఉంటే.. దేశంలో నాన్-సబ్సిడీ కనెక్షన్ వినియోగదారులు ఇప్పటివరకు ఎన్ని సిలిండర్లు కావాలన్నా రీఫిల్స్ బుక్ చేసుకోవచ్చు. అయితే కొందరు వినియోగదారులు సిలిండర్లను దుర్వినియోగం చేస్తున్నారని నివేదికలు బయటపడ్డాయి. దీంతో ఈ కొత్త నిబంధనలను అమలులోకి తీసుకువచ్చేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కొత్తగా తీసుకురాబోయే చట్టం ప్రకారం.. ఒకవేళ అదనంగా సిలిండర్ల అవసరమైతే.. వినియోగదారులు సిలిండర్ తీసుకోవాల్సిన అవసరాన్ని తెలపడంతో పాటు నిర్ధేశించిన డ్యాకుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. వీటి డిమాండ్ని పరిశీలిస్తే.. జూలై 1, 2021, జూలై 6, 2022 మధ్య 12 నెలల కాలంలో వంట గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. జూలై 2021లో ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 834 ఉండగా, జూలై 2022 నాటికి , 26 శాతం పెరిగి రూ.1,053కి చేరుకుంది. ఎల్పీజీ( LPG)) సిలిండర్ ధరలు ప్రతి రాష్ట్రంలో వేరువేరుగా ఉంటాయి. ఎందుకంటే వాటి విలువ ఆ రాష్ట్రంలో విధించే పన్నులతో పాటు రవాణా ఛార్జీలపై ఆధారపడి ఉంటాయి. వాటిని కూడా ముడి చమురు ధరల ఆధారంగా లెక్కిస్తారు. చదవండి: బ్యాంకింగ్ బాదుడు.. రెడీగా ఉండండి, ఈ భారం కస్టమర్లదే! -
గ్యాస్ వినియోగదారులకు అదిరిపోయే గుడ్న్యూస్..!
ఆకాశమే హద్దుగా పెరిగిన ఇంధన ధరలపై కేంద్రం ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడంతో సామాన్యులకు కాస్త ఉపశమనం తగ్గింది. పెట్రోల్పై రూ. 5, డీజిల్పై రూ. 10 చొప్పున తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ సిలిండర్లపై మరో అనూహ్య నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఎల్పీజీ సిలిండర్లపై భారీ రాయితీ..! ఇంధన ధరలతో పాటుగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగానే పెరిగాయి. కొన్ని ప్రాంతాల్లో డొమెస్టిక్ గ్యాస్ ధర ఏకంగా రూ.1000కు చేరువైంది. దాంతో పాటుగా గ్యాస్ సిలిండర్లపై కేంద్రం సబ్సిడీను కూడా భారీగా తగ్గించింది. ప్రస్తుతం ఆయా ప్రాంతాలను బట్టి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల కొనుగోలుపై సుమారు రూ.20 నుంచి రూ. 40 వరకు మాత్రమే సబ్సిడీని పొందుతున్నారు. గ్యాస్ సిలిండర్లపై ధరల పెంపుతో సామాన్య ప్రజలపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఇచ్చే మినహాయింపును పెంచాలని భావిస్తోన్నట్లు తెలుస్తోంది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్పై రూ.312.48కి సబ్సీడి అందించాలని తెలుస్తోంది. ఉజ్వల పథకం కింద గ్యాస్ తీసుకున్న వారికి గరిష్టంగా ఈ సబ్సిడీ లభించనుంది. ఇతరులకు రూ.291.48 వరకు సబ్సిడీ రానుంది. కేంద్ర ప్రభుత్వం అందించే ఈ సబ్సిడీని పొందాలంటే గ్యాస్ వినియోగదారులు కచ్చితంగా బ్యాంక్ ఖాతాను మీ ఆధార్ కార్డ్తో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. సబ్సిడీ పొందాలంటే మీ బ్యాంకు ఖాతాను ఆధార్తో ఇలా లింక్ చేయండి ఇండనే గ్యాస్ సిలిండర్ కస్టమర్లు ‘cx.indianoil.in’ వెబ్సైట్ను సందర్శించి ఆదార్కార్డును లింక్ చేయాలి. భారత్ గ్యాస్ కంపెనీ వినియోగదారులు కంపెనీ అధికారిక వెబ్సైట్ - ‘ebharatgas.com’సందర్శించి ఆదార్కార్డును లింక్ చేయాలి. సంబంధిత బ్యాంకును సందర్శించడం ద్వారా కూడా ఆదార్ కార్డును లింక్ చేయవచ్చును. చదవండి: డిజిటల్ ఛార్జీల మోతపై క్లారిటీ ఇచ్చిన ఎస్బీఐ -
ఎల్పీజీ సిలిండర్ వినియోగదారులకు కేంద్రం శుభవార్త!?
ఎల్పీజీ సిలిండర్ వినియోగదారులకు కేంద్రం శుభవార్త తెలిపింది. ఇకపై వంట గ్యాస్ వినియోగదారులు తమకు నచ్చిన డిస్టిబ్యూటర్ ను ఎంపిక చేసుకోవచ్చని, అక్కడి నుంచే గ్యాస్ సిలిండర్ పొంద వచ్చని ప్రకటించింది. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా... ఎల్పీజీ గ్యాస్ సిలిండర్కి సంబంధించి వినియోగదారులు ఎదుర్కొంటున్న కష్టాల్ని ఎంపీలు పార్లమెంటులో ప్రస్తావించారు. దీనికి కేంద్ర పెట్రోలియం, సహజ ఇంధన వనరుల శాఖ మంత్రి రామేశ్వర్ స్పందిస్తూ... ‘ ఇకపై వంట గ్యాస్ వినియోగదారులు తమకు నచ్చిన డిస్టిబ్యూటర్ ను ఎంపిక చేసుకోవచ్చని, వారి వద్ద నుంచే సిలిండర్ ను ఫిల్ చేయించుకోవచ్చు’ అని ప్రకటించారు. పైలట్ ప్రాజెక్టుగా ఇప్పటి వరకు సిలిండర్ వినియోగదారులు ఒక్క డిస్టిబ్యూటర్ వద్ద మాత్రమే గ్యాస్ ఫిల్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏ డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచైనా గ్యాస్ సిలిండర్ తెచ్చుకునే వెసులుబాటును పైలట్ ప్రాజెక్టుగా చండీగడ్, కోయంబత్తూర్, గుర్గావ్, పూణే, రాంచీలలో ఇప్పటికే అమలు చేస్తున్నారు. పార్లమెంటులో కేంద్ర పెట్రోలియం, సహజ ఇంధన వనరుల శాఖ మంత్రి రామేశ్వర్ చేసిన ప్రకటనతో ఈ పథకం దేశమంతటా అమలు చేస్తారని తెలుస్తోంది. అయితే ఈ పథకం ఎప్పుడు అమలు చేస్తారనే దానిపై మరికొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది. మొత్తంగా కేంద్రం తాజా నిర్ణయం గ్యాస్ వినియోగదారులకు ఊరట కలిగించింది. -
పెరిగిన వంట గ్యాస్ వినియోగం
కొద్దీ కాలం నుంచి ఎల్పీజీ గ్యాస్ ధరల పెరుగుతన్న కూడా ప్రధానమంత్రి ఉజ్వల యోజన(పీఎంయువై) వినియోగదారుల ఎల్పీజీ గ్యాస్ వినియోగం పెరిగినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్) ఒక నివేదికలో తెలిపింది. ఐఓసిఎల్ ప్రకారం.. గత ఏడాదితో పోలిస్తే మొత్తం దేశీయ ఎల్పీజీ వినియోగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(ఫిబ్రవరి 21 వరకు) 10.3% వృద్ధిని నమోదు చేసినట్లు ‘ఐఓసీఎల్’ ప్రకటించింది. దీనికి ప్రధాన కారణం పీఎంయువై లబ్ధిదారులకు ఇచ్చిన మూడు ఉచిత ఎల్పీజీ రీఫిల్స్ కారణమని పేర్కొంది. కోవిడ్-19 పాండమిక్ సమయంలో అట్టడుగున ఉన్నవారు ఎదుర్కొంటున్న సమస్యలను తగ్గించడానికి పీఎంయువై లబ్ధిదారులకు మూడు ఉచిత ఎల్పీజీ రీఫిల్స్ అందించారు. కేంద్ర ప్రభుత్వం పేదలకు వంట గ్యాస్ అందించాలనే ఉద్దేశంతో "పీఎంయువై" పథకం కింద 8 కోట్ల 'ఎల్పీజీ' కనెక్షన్లను రూ.12,800 కోట్ల ప్రభుత్వ వ్యయంతో దేశమంతా లబ్ధిదారులకు అందజేసింది. మొత్తం రూ.9,670 కోట్లు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా బదిలీ అయ్యాయి. లాక్డౌన్ కాలంలో 8 కోట్ల మంది లబ్ధిదారులు ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన ద్వారా 14 కోట్ల ఎల్పీజీ సిలిండర్లను ఉచితంగా పొందారు. చదవండి: 4జీ ఇంటర్నెట్ స్పీడ్ పెంచుకోండిలా! 10 నిమిషాల్లో స్మార్ట్ఫోన్ ఫుల్ ఛార్జ్ -
గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే రూ.500 డిస్కౌంట్
న్యూఢిల్లీ: గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలంటే మనకు చాలా వరకు పద్ధతులున్నాయి. గ్యాస్ ఏజెన్సీకి కాల్ చేసి సిలిండర్ బుక్ చేయడం లేదా ఆయిల్ కంపెనీ వెబ్సైట్ లేదా యాప్లో బుకింగ్ చేసుకోవచ్చు. లేదా ఐవీఆర్ఎస్ నెంబర్కి కాల్ చేసినా గ్యాస్ సిలిండర్ బుక్ అవుతుంది. అలాగే మనకు ఆన్లైన్ లో థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ యాప్స్ తో బుక్ చేయడం ద్వారా ఒక్కో సారి క్యాష్బ్యాక్ కూడా లభిస్తుంది. ఇప్పుడు పేటీమ్ లో కూడా ఆఫర్ ఒకటి నడుస్తుంది. మీరు మీ గ్యాస్ సిలిండర్ను పేటీమ్ యాప్ లో బుక్ చేసుకుంటే రూ.500 వరకు క్యాష్బ్యాక్ ఆఫర్ పొందవచ్చు.(చదవండి: మోటోరోలా నుంచి ఫ్లాగ్షిప్ ఫోన్) ఈ ఆఫర్ను పేటీమ్ యాప్లో భారత్ గ్యాస్, హెచ్పి గ్యాస్, ఇండేన్ గ్యాస్ యూజర్లు ఉపయోగించుకోవచ్చు. కానీ, ఈ ఆఫర్ కేవలం డిసెంబర్ 31 వరకు పేటీమ్ లో మొదటి సారి బుక్ చేసుకున్న వినియోగదారులకు లభిస్తుంది. ఇందుకోసం వినియోగదారులు FIRSTLPG ప్రోమో కోడ్ ఉపయోగించాల్సి ఉంటుంది. మీకు అదృష్టం ఉంటే రూ.500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. మీరు పేటీమ్ యాప్ లో "బుక్ ఏ సిలిండర్" క్లిక్ చేసి తర్వాత గ్యాస్ ప్రొవైడర్ పేరు, ఎల్పీజీ ఐడీ, కస్టమర్ నెంబర్ ఎంటర్ చేసి ప్రొసీడ్ పై క్లిక్ చేయాలి. ఒకసారి వివరాలు సరిచూసుకున్న తర్వాత అప్లై ప్రోమో కోడ్ కింద FIRSTLPG ప్రోమో కోడ్ ఉపయోగించి మొదటిసారి సిలిండర్ బుక్ చేస్తే మీకు రూ.500 వరకు క్యాష్బ్యాక్ పొందవచ్చు. ఒక కస్టమర్ ఒక్కసారి మాత్రమే ఈ ప్రోమో కోడ్ వర్తిస్తుంది. -
సబ్సిడీ సిలిండర్పై రూ.2.89 పెంపు
న్యూఢిల్లీ: ఎల్పీజీ వినియోగదారులకు ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు మరోసారి షాక్ ఇచ్చాయి. 14.2 కిలోల బరువున్న సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్పై రూ.2.89, సబ్సిడీ లేని ఎల్పీజీ సిలిండర్పై రూ.59 పెంచుతున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం, డాలర్తో రూపాయి మారకం విలువ క్షీణించిన నేపథ్యంలో సబ్సిడీలేని సిలిండర్పై రూ.59 పెంచామని వెల్లడించింది. ఇక జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంతో సబ్సిడీ సిలిండర్పై రూ.2.89 అదనపు భారం పడిందని పేర్కొంది. అలాగే వినియోగదారులకు చెల్లిస్తున్న నగదు బదిలీ మొత్తాన్ని రూ.320.49 నుంచి రూ.376.6కు పెంచినట్లు ఐవోసీ తెలిపింది. -
రేపటి నుంచి దేశవ్యాప్తంగా నగదు బదిలీ పథకం
న్యూఢిల్లీ: గ్యాస్ వినియోగదారులకు నూతన సంవత్సరం ఆరంభం, అంటే రేపటి నుంచి దేశమంతటా నగదు బదిలీ పథకం అమలవుతుంది. గత నవంబరు 15 నుంచి దేశంలోని 54 జిల్లాలలో ఈ పథకం అమలవుతోంది. జనవరి 1 నుంచి మిగిలిన 676 జిల్లాలలో కూడా అమలవుతుంది. వంట గ్యాస్కు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ సొమ్ము రేపటి నుంచి బ్యాంకు ఖాతాలలో జమ చేస్తారు. నగదు బదిలీ పథకంలో చేరగానే ఒక్కో గ్యాస్ కనెక్షన్కు మొదట 568 రూపాయలు బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. వినియోగదారులు ఇక నుంచి మార్కెట్ ధరకు గ్యాస్ను కొనుగోలు చేయాలి. సిలెంబర్ బుకింగ్ చేయగానే అడ్వాన్స్ రూపంలో సబ్జిడీ సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ప్రస్తుతం 14.2 కిలోల గ్యాస్ సిలెండర్ సబ్సిడీ ధర 417 రూపాయలు. మార్కెట్ ధర 752 రూపాయలు. ఒక్కో వినియోదారుడికి 12 వరకు 14.2 కిలోల గ్యాస్ సిలెండర్లకు సబ్సిడీ వస్తుంది. మార్కెట్ ధరకు, సబ్సిడీ ధరకు మధ్య వ్యత్యాసం ఎంత ఉందో అంత మొత్తం బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. -
గ్యాస్ సబ్సిడీ చెల్లింపు నేటి నుంచే
న్యూఢిల్లీ: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు కొనే ముంబై, ఢిల్లీ వినియోగదారులకు బుధవారం నుంచి వారి ఖాతాల్లోకి సబ్సిడీ మొత్తాన్ని జమచేస్తారు. ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ప్రకారం వినియోగదారుడు మొదట మార్కెట్ ధర రూ.1,021 సిలిండర్ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కొన్ని రోజుల తరువాత సబ్సిడీ మొత్తం అతడు/ఆమె ఖాతాలోకి జమవుతుంది. అయితే బుక్ చేసిన వెంటనే రూ.435 ఖాతాలోకి జమవుతుంది. పూర్తి డబ్బు చెల్లించిన రోజు మిగతా మొత్తం బదిలీ అవుతుంది. ఆధార్ ద్వారా అనుసంధానించిన ఖాతాలకు ఈ మొత్తాలను బదిలీ చేస్తారు. మొదటిదశలో దేశంలోని 184 జిల్లాల్లో ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తున్నారు.


