breaking news
Lorry Owners Association Telangana
-
జనతా కర్ఫ్యూకు మద్దతుగా లారీలు ఆపేస్తాం..
సాక్షి, హైదరాబాద్: కోవిడ్-19 (కరోనా వైరస్) భాతరదేశంలో ప్రబలుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ నియంత్రణకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ‘జనతా కర్ఫ్యూ’ పాటించాలని పిలుపునిచ్చిన విషషయం తెలిసిందే. అయితే ప్రధాని మోదీ పిలుపుకు సర్వత్రా మద్దుతు తెలుపుతోంది. తాజాగా తెలంగాణ లారీ ఓనర్స్ అసోషియేషన్ రేపు జరగబోయే ‘జనతా కర్ఫ్యూ’కి తమ మద్దతు తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా లారీలను ఆపేస్తామని లారీ ఓనర్స్ అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నందారెడ్డి ప్రకటించారు. సుమారు పదిహేను లక్షల లారీలు ఈ ‘జనతా కర్ఫ్యూ’కి మద్దతు తెలిపాయని నందారెడ్డి అన్నారు. (జనతా కర్ఫ్యూ: తెలంగాణలో 24 గంటల బంద్!) ఎల్బీనగర్: హైదరాబాద్ నగర వాసుల్లో కోవిడ్-19(కరోనా వైరస్) భయం పట్టుకుంది. దీంతో నగరవాసులు స్వస్థలాలకు భారీగా వెళ్తున్నారు. ఎల్బీనగర్ స్వంత ఊర్లకు వెళ్లే ప్రయాణికుల భారీ రద్దీతో కిటకిటలాడుతోంది. ఇదే అదునుగా ప్రైవేటు ట్రావెల్స్ ప్రయాణికులను అధిక చార్జీలతో దోచుకుంటున్నాయి. ప్రైవేటు ట్రావెల్స్ రోడ్లపైనే వాహనాలు అడ్డంపెట్టి మరీ ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ రెచ్చిపోతున్నా ఆర్టీసీ సిబ్బంది మాత్రం పట్టించుకోకపోవటం గమనార్హం. ఇంత జరుగుతున్నా ట్రాఫిక్ పోలీసులు కనిపించడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. (నిలిచిపోనున్న రైళ్లు, మెట్రో, బస్సు సర్వీసులు) -
చర్చలు విఫలం.. లారీల సమ్మె ఉధృతం
-
చర్చలు విఫలం లారీల సమ్మె ఉధృతం
-
చర్చలు విఫలం.. లారీల సమ్మె ఉధృతం
⇒ 8 నుంచి దేశవ్యాప్త సమ్మె ⇒ అత్యవసర వస్తువుల రవాణాను నిలిపివేస్తాం ⇒ లారీ సంఘాల హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: లారీ యాజమాన్య సంఘాలతో బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ సోమవారం జరిపిన చర్చలు విఫల మయ్యాయి. దీంతో గత ఐదు రోజులుగా కొనసాగుతున్న సమ్మెను ఉధృతం చేయను న్నట్లు దక్షిణాది రాష్ట్రాల లారీ యజమానుల సంఘం, తెలంగాణ లారీ ఓనర్స్ అసోసి యేషన్ ప్రకటించాయి. ఈ నెల 8 నుంచి దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టనున్నట్లు తెలి పాయి. ప్రైవేట్ బీమా సంస్థల ప్రయోజనాల కోసమే అన్ని రకాల వాహనాలపై బీమా మొత్తాన్ని పెంచారంటూ లారీ సంఘాలు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. గత నెల 30 నుంచి ప్రారంభమైన సమ్మెతో హైదరాబాద్ కు నిత్యావసర వస్తువుల రవాణా పూర్తిగా స్తంభించింది, రాజధానిలో భవన నిర్మాణ రంగానికి అవసరమైన ఇసుక రవాణా కూడా ఆగిపోయింది. వనస్థలిపురం, ఆటోనగర్, మూసాపేట్, ఔటర్రింగు రోడ్డు, తదితర ప్రాంతాల్లో లారీ సంఘాలు పెద్దఎత్తున ఆందోళన కొనసాగిస్తున్నాయి. బీమా మొత్తమే ప్రధానం... వాహనాలపై బీమా మొత్తాన్ని ఏకంగా 41% పెంచడానికి వ్యతిరేకంగా చేపట్టిన ఈ సమ్మె నేపథ్యంలో సోమవారమిక్కడ బషీర్బాగ్ లోని పరిశ్రమల భవన్ ఐఆర్డీఏ కార్యా లయంలో చైర్మన్ విజయన్, ప్రతినిధుల బృందం లారీ సంఘాల ప్రతినిధులతో చర్చ లు జరిపింది. పెంచిన బీమాను ఉపసంహ రించుకోవాలని లారీ సంఘాలు కోరాయి. లారీ సంఘాల డిమాండ్లపై ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని ఐఆర్డీఏ చైర్మన్ విజయన్ స్పష్టం చేశారు. ఈ కమిటీలో లారీ సంఘాల ప్రతినిధులు కూడా ఉంటారని తెలిపారు. కమిటీ ఏర్పాటుపై సుముఖత వ్యక్తం చేసిన లారీ సంఘాలు అప్పటి వరకు బీమా పెంపును నిలిపివేయాలని కోరాయి. అయితే ఇప్పటికే అది అమల్లోకి వచ్చినందున నిలిపివేయడం సాధ్యం కాదని విజయన్ తెలిపారు. ఇందుకు నిరసన తెలుపుతూ లారీ సంఘాల ప్రతినిధులు చర్చలను బహిష్క రించి బయటకు వచ్చారు. సమ్మెను మరింత ఉధృతం చేయనున్నట్లు తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు భాస్కర్రెడ్డి తెలిపారు. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలకే పరి మితమైన సమ్మెను ఈ నెల 8 నుంచి ‘చక్రా బంద్’ పేరుతో దేశవ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించామన్నారు. ప్రస్తుతం తమ సమ్మె పారిశ్రామిక రంగానికి చెందిన ముడి సరుకులు, నిత్యావసర వస్తువుల రవాణాకు పరిమితమైందని, 6వ తేదీ నుంచి అత్యవసర వస్తువులైన పాలు, నీళ్లు, కూరగాయలు, మందులు, పెట్రోల్, డీజిల్ వంటి వస్తువుల రవాణాను కూడా నిలిపివేయనున్నట్లు తెలి పారు. 4వ తేదీ నుంచే అత్యవసర వస్తువుల సరఫరాను బంద్ చేయాలని అనుకున్నప్పటికీ 5న శ్రీరామనవమి ఉన్న దృష్ట్యా 6 నుంచి నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొ న్నారు. మంగళవారం నుంచి రాస్తారోకోలు, వంటావార్పు, ధర్నాలు, ర్యాలీలు వంటి నిరసన కార్యక్రమాలతో సమ్మెను ఉధృతం చేయనున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్రలకు కౌంటర్ పర్మిట్లు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం తెలంగాణకు మాత్రం ఇవ్వకపోవడం దారుణమని తెలం గాణ స్టేట్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బూడిద నందారెడ్డి అన్నారు. ఇందుకు నిరసనగా ఆటోనగర్ వద్ద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. కాగా లారీల సమ్మె ప్రభావం నిత్యావసర సరుకు లపై పడింది. హోల్సేల్ ధరల్లో 10–15% పెరుగుదల కనిపించింది. సమ్మె వల్ల మహా రాష్ట్ర నుంచి వచ్చే సరుకు రవాణా వాహనా లను జహీరాబాద్ వద్ద నిలిపివేస్తున్నారు.