breaking news
Lokesh Machines
-
సరిహద్దులో పేలనున్నమరో సిటీ తుపాకీ
సాక్షి, హైదరాబాద్: భారత సరిహద్దుల్లో పహారా కాసే జవాన్ల చేతికి మరో ‘సిటీ తుపాకీ’అందనుంది. బాలానగర్ కేంద్రంగా పని చేసే లోకేశ్ మెషీన్స్ లిమిటెడ్ సంస్థ ఇప్పటికే ‘అస్మి’పేరుతో ఓ సబ్ మెషీన్ గన్ (ఎస్ఎంజీ) రూపొందించి ఆర్మికి అందించింది. తాజాగా మీడియం మెషీన్ గన్ (ఎంఎంజీ)ను తయారు చేస్తోంది. పుణెలోని రక్షణ అభివృద్ధి, పరిశోధక సంస్థ (డీఆర్డీఓ)లో అంతర్భాగమైన అర్మామెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిషిమెంట్ ఈ గన్ను డిజైన్ చేయగా... తయారీకి సంబంధించి ఆర్మీ నుంచి రూ.17.7 కోట్ల ఆర్డర్ లోకేశ్ మెషీన్స్కు దక్కింది.ఈ సంస్థ ఇజ్రాయెల్, జర్మనీ ఆయుధ కర్మాగారాలకు దీటుగా ‘అస్మి’ని ప్రతిష్టాత్మకంగా తయారు చేసింది. ఈ తుపాకీని భద్రతా బలగాలతో పాటు కేంద్ర పోలీసు బలగాలూ వినియోగిస్తున్నాయి. ప్రముఖుల భద్రత కోసం వినియోగించడానికీ అస్మి అనువుగా ఉంది. తాజాగా 7.62 = 51 మి.మీ. క్యాలిబర్తో ఉండే ఈ ఎంఎంజీ కూడా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) ప్రమాణాలకు లోబడి, దేశీయ పరిస్థితులకు అనుగుణంగా తయారవుతోంది. ఈ ఎంఎంజీలో క్విక్ ఛేంజ్ బ్యారల్ సిస్టం, త్రీ–పొజిషన్ గ్యాస్ రెగ్యులేటర్ వంటి ఆధునిక హంగులున్నాయి.తుపాకీ సమర్థమంతంగా పని చేయడానికి ఇవి ఉపకరిస్తాయి. ప్రస్తుతం ఆర్మీ వినియోగిస్తున్న ఎంఎంజీల కంటే ఈ తుపాకీ 25 శాతం తక్కువ బరువు ఉంటుంది. 1800 మీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ను ఛేదించగలదు. 250 తూటాల బెల్ట్ కెపాసిటీతో పని చేస్తుంది. రెండు బెల్ట్లను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. మైనస్ 40 డిగ్రీల నుంచి 55 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలోనూ నిరాఘంటంగా సేవలు అందిస్తుంది. -
లోకేష్ మెషీన్స్ కొత్త ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సీఎన్సీ మెషీన్స్, వాహన విడిభాగాల తయారీలో ఉన్న లోకేష్ మెషీన్స్ రక్షణ, అంతరిక్ష రంగ ఉత్పత్తుల విభాగంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం హైదరాబాద్ సమీపంలోకి కాలకల్ వద్ద 11 ఎకరాల్లో ప్లాంటును నెలకొల్పుతోంది. తొలి దశలో రూ.100 కోట్ల వ్యయం చేయనుంది. 4–6 నెలల్లో ఉత్పత్తి ప్రారంభం అవుతుందని కంపెనీ డైరెక్టర్ ఎం.శ్రీనివాస్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘భారత్తోపాటు అంతర్జాతీయ మార్కెట్ కోసం నూతన కేంద్రంలో చిన్న, మధ్యతరహా ఆయుధాలను తయారు చేస్తాం. ప్రత్యక్షంగా 200, పరోక్షంగా 800 మందికి ఉపాధి లభిస్తుంది. రెండవ దశలో మరో రూ.150 కోట్లు వెచ్చిస్తాం. ప్రతిపాదిత ఫెసిలిటీ పక్కన 3 ఎకరాల్లో వెండార్ పార్క్ ఏర్పాటు చేస్తాం. విడిభాగాల తయారీలో ఉన్న 8 యూనిట్లు ఈ పార్క్లో వచ్చే అవకాశం ఉంది. లోకేష్ మెషీన్స్ ఆర్డర్ బుక్ రూ.250 కోట్లుంది. 2021–22లో రూ.201 కోట్ల టర్నోవర్ సాధించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 25–30 శాతం వృద్ధి ఆశిస్తున్నాం’ అని వివరించారు. మేడ్చల్ కేంద్రంలో కంపెనీ కొత్త విభాగాన్ని లోకేష్ మెషీన్స్ ఎండీ ఎం.లోకేశ్వర రావు సమక్షంలో రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు జి.సతీష్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. -
నిధుల వేటలో లోకేష్ మెషీన్స్
ముంబై: లోకేష్ మెషీన్స్ ప్రిఫరెన్షియల్ షేర్లు, వారెంట్లు జారీ చేయడం ద్వారా సుమారు రూ. 20 కోట్లు సమీకరించాలని నిర్ణయించింది. రూ. 50 ధరకి 10 లక్షలు ప్రిఫరెన్షియల్ షేర్లు, 31 లక్షల వారెంట్లను ఒకేసారీ లేదా విడతల వారీగా జారీ చేయడం ద్వారా నిధులు సేకరించడానికి ఈజీఎం ఆమోదం తెలిపింది. ఈ నిధులతో రుణ భారం తగ్గించుకునే యోచనలో కంపెనీ ఉంది.