breaking news
lok bhavan
-
కోటి సంతకాల సేకరణ ప్రతులను గవర్నర్కు అందజేశాం: వైఎస్ జగన్
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ.. -
వైఎస్సార్సీపీ కీలక భేటీ.. సాయంత్రం లోక్ భవన్కు వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ మోహన్రెడ్డి అధ్యక్షతన గురువారం వైఎస్సార్సీపీ కీలక భేటీ జరగనుంది. కోటి సంతకాల ప్రతులను రాష్ట్ర గవర్నర్కు అందజేయనున్న నేపథ్యంలో ఆయన ముందుగా పార్టీ నేతలతో భేటీ నిర్వహించనున్నారు.వైఎస్సార్సీపీ హయాంలో వైఎస్ జగన్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ చొప్పున.. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మించాలని ప్రయత్నించారు. పేదలకు, మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వం ద్వారా కార్పొరేట్ వైద్యం అందించడంతో పాటు రాష్ట్రంలో వైద్య విద్యా అవకాశాలను విస్తరించడం ఉద్దేశంతో ఆయన ఈ అడుగు వేశారు.ఇందులో ఏడు పూర్తి కాగా.. వైఎస్సార్సీపీ దిగిపోయేనాటికి మరో పది నిర్మాణంలో ఉన్నాయి. అయితే.. కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వాటిని నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. చివరకు పీపీవీ విధానం పేరిట కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనిని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ పేరిట ప్రజా ఉద్యమానికి పిలుపు ఇచ్చారు వైఎస్ జగన్.అక్టోబర్ నెలలో గ్రామాల స్థాయిలో ‘రచ్చబండ’ పేరిట మొదలైన సంతకాల సేకరణ.. ఇప్పుడు చివరి అంకానికి చేరుకుంది. రెండు నెలల్లో చంద్రబాబు సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మొత్తం కోటి 4 లక్షల 11 వేల 136 మంది సంతకాలు చేశారు. విద్యార్థులు, మేధావులు.. అన్ని వర్గాల ప్రజలూ వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణలో పాల్గొనడంతో.. దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.కొసమెరుపు ఏంటంటే.. అలాగే చంద్రబాబు సొంత గ్రామమైన నారావారిపల్లెలోనూ ఆయన నిర్ణయాన్ని తప్పుబడుతూ అక్కడి ప్రజలు సంతకాలు చేయడం..ఇప్పటికే అన్ని జిల్లాల నుండి సంతకాల ప్రతుల బాక్స్లు తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నాయి. గురువారం ఉదయం పత్రాలతో వచ్చిన వాహనాలకు వైఎస్ జగన్ జెండా ఊపి ప్రారంభిస్తారు. అవి అక్కడి నుంచి నేరుగా లోక్భవన్(పూర్వ రాజ్భవన్)కు చేరుకుంటాయి.అనంతరం పార్టీ ముఖ్య నేతలతో వైఎస్ జగన్ సమావేశమై.. ఇప్పటిదాకా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం గురించి చర్చిస్తారు. సాయంత్రం పార్టీ కీలక నేతలతో కలిసి లోక్ భవన్కు వైఎస్ జగన్కు వెళ్తారు. గవర్నర్ అబ్దుల్ నజీర్తో భేటీ అయ్యి.. మెడికల్ కాలేజీల ప్రవేటీకరణపై ప్రజల అభిప్రాయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తారు. -
ఇకపై రాజ్భవన్ కాదు.. లోక్భవన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ అధికారిక నివాసం రాజ్భవన్ పేరు లోక్భవన్గా మారింది. ఇకపై రాజ్భవన్ను లోక్భవన్గా పిలవాలని కోరుతూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా గవర్నర్ల అధికారిక నివాసాల పేర్లను లోక్భవన్గా మారుస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. రాజ్భవన్ ప్రవేశద్వారం వద్ద గోడపై ఉన్న రాజ్భవన్ అనే అక్షరాలను కూడా అప్పటికప్పుడు లోక్భవన్గా మార్చారు. -
యోగి కార్యాలయం గేటుపడి బాలిక మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కోసం సిద్దం చేస్తున్న కార్యాలయాల సముదాయం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఓ తొమ్మిదేళ్ల పాపపై ఇనుప గేటు పడి మృత్యువాత పడింది. మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఉన్నప్పటి నుంచి ‘లోక్ భవన్’ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దానికి అమర్చిన ఓ ఇనుప గేటు వద్ద కిరణ్ అనే బాలిక ఆడుకుంటుండగా అనూహ్యంగా ఆ పాపపై గేటు పడింది. దీంతో హుటాహుటిన ఆ పాపను ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే ప్రాణాలుకోల్పోయినట్లు వైద్యులు చెప్పారు. లోక్ భవన్లో సహజంగా ముఖ్యమంత్రి కార్యాలయం ఉంటుంది. అందులోనే కేబినెట్, ఇతర ముఖ్యమైన సమావేశాలు నిర్వహిస్తుంటారు. -
సీఎం ఆఫీసు వద్ద విషాదం
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం(లోక్ భవన్) వద్ద విషాదం చోటుచేసుకుంది. విస్తరణ పనుల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ ఇనుపగేటు మీద పడటంతో తొమ్మిదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మృతురాలి తల్లి నిర్మాణ పనుల్లో కూలిగా పనిచేస్తోంది. అక్కడే ఏర్పాటు చేసిన తాత్కాలిక గుడారంలో వీరు నివసిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి లక్నోలో భారీ వర్షం కురుస్తుండటంతో పనులు జరగలేదు. సాయంత్రానికి వర్షం తగ్గడంతో ఆట నిమిత్తం పాప బయటికొచ్చి అనూహ్యంగా ప్రమాదానికిగురైంది. తీవ్రంగా గాయపడిన పాపను ఆస్పత్రికి తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ కొద్దిసేపటికే కన్నుమూసింది. అంతకు ముందురోజే నిలిపిన భారీ ఇనుపగేటు.. వర్షం కారణంగా పడిపోయి ఉండొచ్చని అధికారులు అన్నారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ స్పందించాల్సిఉంది. లోక్భవన్కు భారీ హంగులు యూపీ సీఎం కార్యాలయమైన లోక్భవన్ను భారీ ఎత్తున విస్తరించే పనులు 2016లో(అఖిలేశ్ హయాంలో) ప్రారంభమయ్యాయి. సుమారు ఆరున్నర ఎకరాల ప్రాంతంలో రూ.602కోట్ల వ్యయంతో భారీ నిర్మాణాలు చేపట్టారు. ఇప్పుడున్న కార్యాలయం చిన్నదిగా ఉండటంతో మరింత సౌకర్యవంతమైన, విశాలమైన భవంతులను కడుతున్నారు.


