License issued
-
చలనమే విజయం
ఆదివాసీ మహిళలకు ఆధార్ కార్డ్ ఉంటుందో లేదో. మరి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందా? వారు ఒక టూ వీలర్ కలిగి డ్రైవింగ్ నేర్చుకుని ఉంటే కొండ మిట్టల దారుల్లో మైళ్ల కొద్దీ నడక నుంచి విముక్తి అవుతారు. ఉపాధికి మార్గాలు వెతుకుతారు. సమయం సద్వినియోగం చేసుకుంటారు. కాని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో వారికి డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాలు సమకూర్చే ప్రయత్నాలు ఏం జరుగుతున్నాయోగానీ కేరళలో జరుగుతున్నాయి. ఇలా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మన్యంప్రాంతాలలో కూడా చేయగలరేమో ఆలోచించాలి. ఎందుకంటే ఇది మంచి ఫలితాలను ఇస్తోంది. సరిగా చెప్పాలంటే మంచి పని ఎప్పుడూ మంచి ఫలితాలనే ఇస్తుంది. గిరిజన గూడేలు అడవుల్లో, కొండల్లో ఉంటాయి. వారు బాహ్య ప్రపంచంతో తెగిపోయి ఉన్నట్టుగా భావిస్తారు. దానికి కారణం ఆ గూడేలకు దారులు ఉండవు. ఉన్నా సరిగా ఉండవు. నాలుగు చక్రాల వాహనాలు తిరిగేలా కొన్ని దారులు మాత్రమే ఉంటాయి. అందుకే వీరు ఎక్కువగా కాలి నడక మీద ఆధార పడతారు. రోజులో ఎక్కువ సమయాన్ని వీరు నడకకోసమే వెచ్చించాల్సి ఉంటుంది. హైవే మీద కూడా వీరు అలవాటు కొద్దీ నడిచే వెళుతుంటారు.. లేదా డబ్బు లేక కూడా. అలా నడుస్తున్నవారిలో మహిళలను చూసి వీరి ట్రాఫిక్ నియమాలను తెలుపుదాం అనుకున్నారు ‘దేవికులం’ అనే టౌన్కు చెందిన సబ్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసు అధికారులు. ఈ ఊరు కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఉంది. దేవికులం చుట్టుపక్కల దాదాపు 25 గిరిజన గూడేలు ఉన్నాయి. ఈ గూడేలలోని మహిళలకు టూ వీలర్స్ లేవు. ఒకవేళ కొనగలిగినా వీరికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు. అందుకే అధికారులు కేవలం రోడ్ సేఫ్టీ గురించి చెప్పాలనుకున్నారు.టెస్ట్ పాసైన మహిళగత సంవత్సరం అధికారులు గిరిజన మహిళలను పిలిచి రోడ్డు జాగ్రత్తలు వివరిస్తున్నప్పుడు సుగంతి అనే గిరిజన మహిళ ‘సార్ నేను డ్రైవింగ్ నేర్చుకోగలనా’ అని అడిగింది. అధికారులు వెంటనే సమాధానం చెప్పలేక పోయారు. ఎందుకంటే కేరళలో డ్రైవింగ్ లైసెన్సు మన రాష్ట్రాల్లో కొన్నిచోట్ల జరిగినట్టుగా పరీక్షలు పాస్ కాకుండా పొందలేరు. పరీక్ష రాయాల్సిందే. గిరిజన మహిళ రాయగలదా అనుకున్నారు. ‘మా ఆశ్చర్యం కొద్ది ఆమె డ్రైవింగ్ నేర్చుకోవడమే కాదు పరీక్ష పాసై లైసెన్సు పొందింది’ అన్నారు ఆర్టిఏ అధికారులు. అప్పుడే వారికి ఆలోచన వచ్చింది... గిరిజన స్త్రీలకు డ్రైవింగ్ నేర్పాలని.మా జీవితాలు మారాయిడ్రైవింగ్ లైసెన్స్ పొంది కొత్తదో సెకండ్ హ్యాండ్తో ఒక టూ వీలర్ను ఏర్పాటు చేసుకున్నాక ఇక్కడ చాలామంది గిరిజన స్త్రీల జీవనం మారింది. ‘మేం పని కోసం వెళ్లగలుగుతున్నాం. ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందగలుగుతున్నాం’ అని వారు అంటున్నారు. టూ వీలర్ నడపడానికి సౌకర్యవంతమైన డ్రస్సులు కూడా వేసుకోవాల్సి ఉంటుంది. ‘గిరిజన నియమాలు అందుకు ఒప్పుకోవు. కాని గూడెం పెద్దలు పరిస్థితి అర్థం చేసుకుని అనుమతి ఇస్తున్నారు’ అంటున్నారు మహిళలు. చీర కాకుండా పంజాబీ డ్రస్సుల వంటివి జీవితంలో మొదటిసారి టూవీలర్లు నడపడానికే వీరు ధరిస్తున్నారు. ‘మాలో కొందరికి టూవీలర్ నడపడం వచ్చినా డ్రైవింగ్ లైసెన్స్ ఎలా పొందాలో తెలియక భయం భయంగా బండ్లు నడుపుతూ బతికేవాళ్లం. ఇప్పుడు లైసెన్సులు ఇవ్వడం వల్ల మా భయం పోయింది. మేము ధైర్యంగా టౌన్లకు వెళ్లి సరుకులు అమ్ముతాం’ అంటున్నారు. ‘స్వప్నం’ ఉన్న గిరిజన మహిళలు ఎందరో. వారికీ చలనంప్రాప్తమవ్వాలి. ‘కనావు’...అంటే ‘స్వప్నం’దేవకులం ఆర్.టి.ఓ. అధికారులు గిరిజన మహిళల కోసం ‘కనావు’ అనే కార్యక్రమం రూపొందించారు. కనావు అంటే స్వప్నం. డ్రైవింగ్ నేర్చుకొని, స్వీయ చలనం కలిగి తమ కలలు సాధించుకోవాలనే స్ఫూర్తిని ఇస్తూ ఈ కార్యక్రమం రూపొందించారు. ఇందులో డ్రైవింగ్ అవసరాన్ని చెప్పే కౌన్సెలింగ్, గూడెం పెద్దలు ఇందుకు అభ్యంతరం పెట్టకుండా వారి అనుమతి తీసుకొవడం, ఉచిత మెడికల్ ఎగ్జామినేషన్, టూ వీలర్ కొనుక్కునేందుకు ఫండ్ పొందే మార్గాలు... ఇవన్నీ ఉంటాయి. మహిళలు నడపడానికి అనువైన తేలికపాటి టూవీలర్ డ్రైవింగ్ను దేవకులం చుట్టుపక్కల ఉన్న గూడేల్లోని మహిళలకు నేర్పించసాగారు. ఇప్పటికి చాలామంది స్త్రీలు ఈ లైసెన్సులు పొందారు. కొందరు వాహనాలు సమకూర్చుకున్నారు. సొంత వాహనం మీద సొంతగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం అంటే ఏమిటో వారి అనుభవంలోకి వచ్చాక పెదాల మీద వచ్చిన చిరునవ్వు చూడదగ్గది. -
మూడు రష్యా సంస్థలకు ఎఫ్పీఐ లైసెన్సులు
న్యూఢిల్లీ: రష్యాకు చెందిన మూడు సంస్థలకు భారతీయ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ (ఎఫ్పీఐ) లైసెన్సును జారీ చేసింది. మాస్కో కేంద్రంగా పనిచేసే ఆల్ఫా క్యాపిటల్ మేనేజ్మెంట్ కంపెనీతో పాటు విసెవిలోద్ రోజానోవ్ అనే ఇన్వెస్టరు ఈ లైసెన్సులను పొందిన జాబితాలో ఉన్నారు. మూడేళ్ల పాటు 2026 వరకు ఇది వర్తిస్తుంది. ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యాపై ఆంక్షలు అమలవుతున్న వేళ ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్లో పెట్టుబడులు పెట్టడానికి రష్యా ఇన్వెస్టర్లు ఎఫ్పీఐ మార్గాన్ని ఎంచుకోవడం ఇదే ప్రథమం కావచ్చని పరిశమ్ర వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకూ వారు ఎక్కువగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) మార్గంలోనే ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వివరించాయి. డాలరును ఆయుధంగా చేసుకుని రష్యాపై ఆంక్షలను ప్రయోగిస్తుండటమనేది కొత్త ఆర్థిక పరిస్థితులకు దారి తీస్తున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలో రష్యా తాజా ధోరణి ప్రాధాన్యం సంతరించుకున్నట్లు పేర్కొన్నారు. -
‘చమురు’ కేటాయింపు అధికారం మంత్రులకే
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ముడిచమురు, గ్యాస్ క్షేత్రాల లైసెన్సుల్ని కంపెనీలకు కేటాయించే అధికారాన్ని ఆర్థిక, పెట్రోలియం మంత్రిత్వశాఖలకు అప్పగిస్తూ ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇంతకాలం ఈ లైసెన్సులను జారీచేసే అధికారం కేబినెట్ కమిటీకే ఉండేది. ఎంపవర్డ్ కమిటీ ఆఫ్ సెక్రటరీస్(ఈసీఎస్) సిఫార్సుల మేరకు బిడ్డింగ్లో విజేతలుగా నిలిచిన సంస్థలకు బ్లాకుల్లో పెట్రోలియం, సహజవాయువు వెలికితీతకు ఆర్థిక, పెట్రోలియం శాఖ మంత్రులు లైసెన్సులు జారీచేస్తారని కేంద్రం తెలిపింది. కాంట్రాక్టును దక్కించుకున్న కంపెనీలు తమ వాటాల్లో కొంతమొత్తాన్ని ఇతర సంస్థలకు అమ్ముకునేందుకు ఇకపై అనుమతిస్తారు. -
లైసెన్స్ జారీకి లంచం డిమాండ్
ఇద్దరు ఎయిర్పోర్టు అధికారులు అరెస్ట్ సాక్షి, హైదరాబాద్: లైసెన్సు జారీకి లంచం డిమాండ్ చేసిన ఇద్దరు ఎయిర్పోర్టు అధికారులు శుక్రవారం సీబీఐకి చిక్కారు. హైదరాబాద్లోని బడంగ్పేట్కు చెందిన సమీర్.. ‘మై టీ’ పేరుతో టీ కప్పుల బిజినెస్ ప్రారంభించాడు. అమెరికా, కెనడాలకు ఎగుమతి చేసేందుకు పైటో శానిటరీ లైసెన్స్ కోసం ప్లాంట్ క్వారంటైన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అథారిటీకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాడు. శంషాబాద్ ఎయిర్పోర్టులో ఉన్న స ంబంధిత అధికారులు అతుల్ ఠాక్రే, మనోజ్.. సమీర్కు రూ.15 వేలు చొప్పున లంచం డిమాండ్ చేశారు. దీంతో సమీర్ ఈ విషయాన్ని సీబీఐకి ఈనెల 10న ఫిర్యాదు చేశాడు. -
లెసైన్స్ల సత్యం బెట్టిదనిన..!
►జిల్లాలో నడుస్తున్న మద్యం దుకాణాలు 388 ►వాటిలో లెసైన్స్లు ఇచ్చిన దుకాణాలు 30.. లేనివి 358 ►అయినా సిండికేట్ ద్వారా మద్యాన్ని ఏరులై పారుస్తున్న వైనం ►కంప్యూటర్ బిల్లింగ్ ఇవ్వాల్సి వస్తుందనే లెసైన్స్ల జారీలో జాప్యం ‘‘ఆగస్టు ఒకటో తేదీ నుంచి హోలోగ్రామ్తో పాటు కంప్యూటరింగ్ బిల్లును ప్రతి మద్యం దుకాణంలో ఇవ్వాల్సిందే! లేదంటే ఒక్కబాటిల్ కూడా స్టాకు ఇచ్చే ప్రసక్తే లేదు.’’ ..జూలైలో ఎక్సైజ్ డీసీ సత్యప్రసాద్ అన్న మాటలు సాక్షి, చిత్తూరు: ఆగస్టు పోయింది...సెప్టెంబరు నడుస్తోంది. మద్యం దుకాణాలకు సరుకు సరఫరా అవుతోంది. ఇంకో విషయమేమంటే జిల్లాలో నడుస్తున్న 388 మద్యం దుకాణాల్లో లెసైన్స్లతో నడుస్తున్న దుకాణాలు కేవలం 30 మాత్రమే! తక్కినవన్నీ లెసైన్స్లు లేకుండా మద్యాన్ని ఏరులై పారి స్తున్నాయి. జిల్లాలో చిత్తూరు డివిజన్లో 192 దుకాణాలు ఉంటే అందులో 12 వాటికి మాత్రమే లెసైన్స్లు జారీ చేశారు. తిరుపతి డివిజన్లోని 196 షాపుల్లో 18 దుకాణాలకు లెసైన్స్లు ఇచ్చారు. తక్కినవన్నీ లెసైన్స్లు లేకుండా ఇష్టారాజ్యంగా నడుస్తున్నవే! నిబంధనలు ఇవీ.. ►ప్రతీ మద్యం సీసాపై హోలోగ్రామ్ ఏర్పాటు చేయాలి. దానిపై ఒక సీరియల్ నెంబర్ను ముద్రిస్తారు. ఆ నెంబర్తో సీసాకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నమోదు చేస్తారు. ►కొనుగోలుదారులకు సమాచారం ఇ చ్చేందుకు ఒక టోల్ఫ్రీ నెంబరు బాటిల్పై ఉంటుంది. తాను కొన్న మద్యం సీసా గురించి తెలుసుకోవాలనుకునే కొనుగోలుదారుడు సీసాపై ఉన్న టోల్ఫ్రీ నెంబరుకు ఎస్ఎంఎస్ పంపితే చాలు.. క్షణాల్లో ఆ సీసా ఎప్పుడు? ఎక్కడ తయారు చేశారు? ఏ మద్యం గోదాము నుంచి వచ్చింది? ఏ దుకాణానికి అమ్మకం జరిగింది? అనే వివరాలు అతని ఫోన్కు ఎస్ఎంఎస్ రూపంలో వస్తాయి. ►అలాగే ప్రతి మద్యం దుకాణంలో ఆన్లైన్ కంప్యూటర్ బిల్లులు ఇచ్చేందుకు పరికరాలను ఏర్పా టు చేయాలి. ►సూపర్మార్కెట్ తరహాలో కం ప్యూటర్ స్క్రాచ్ ద్వారా బిల్లువేసి, బిల్లు ప్రతిని కొనుగోలు దారుడికి అందజేయాలి. ఈ బిల్లు వివరాలు ఎప్పటికప్పు డు ఆన్లైన్లో ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయానికి చేరుతుంటాయి. నడుస్తున్నది ఇలా.. ప్రస్తుతం జిల్లాలోని ఏ మద్యం దుకాణంలో కూడా కంప్యూటర్ బిల్లు అ మలు కావడం లేదు. ఇది అమలైతే ప్రస్తుతం సిండికేట్ ద్వారా బాటిల్పై 5-15 రూపాయలు అధికంగా విక్రయించేందుకు అవకాశం ఉండదు. నకిలీ మద్యాన్ని కూడా విక్రయిం చేందుకు వీలు కాదు. ఇదే జరిగితే సిండికేట్ ద్వారా జిల్లావ్యాప్తంగా నెల కు వస్తున్న రూ.6.75 కోట్ల అక్రమార్జనకు గండిపడుతుంది. దీంతో వీ రంతా కంప్యూటర్ బిల్లులకు సంబంధించిన మిషనరీలు కొనుగోలు చే సేందుకు నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారు. కానీ అధికారులు మాత్రం కంప్యూటర్ బిల్లు మిషన్ 80-90వేల రూపాయలవుతుందని, అంత డబ్బు వె చ్చించి వాటిని కొనుగోలు చేసేం దుకు వ్యాపారులు విముఖత చూపుతున్నారని చెబుతున్నారు. సిండికేట్ ద్వారా ప్రతి నెలా 1.75లక్షల రూపాయలకు తక్కువ లేకుండా అక్రమార్జనతో జేబులు నింపుకుంటున్న మ ద్యం వ్యాపారులు 80 వెచ్చించడం పెద్ద లెక్కేం కాదు! కంప్యూటర్ బిల్లు లు ఇవ్వాల్సిందే లేదంటనే మద్యాన్ని సరఫరా చేయమని బీరాలు పలికిన ఆబ్కారీ అధికారులు ‘సిండికేట్’ చె ప్పినట్లు జీ..హుజూర్ అంటున్నారు. ఎందుకంటే వీరికి కూడా ప్రతినెలా ఠంఛనుగా మామూళ్లు ముట్టజెప్పుతున్నారు కాబట్టి వీరూ పట్టించుకోవడం లేదని ఓ ఎక్సైజ్ సీఐ ‘సాక్షి’తో తెలిపారు. దీంతో జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం ఏరులై పా రుతోంది. మందుబాబుల జేబులు ఖాళీ అవుతున్నాయి. అయితే టోల్ ఫ్రీ నెంబరు మాత్రం పనిచేస్తోంది. ఎక్సైజ్ డీసీ సత్యప్రసాద్ ఏమన్నారంటే.. లెసైన్స్ల విషయమై ఎక్సైజ్ డీసీ సత్యప్రసాద్ను ‘సాక్షి’ వివరణ కో రగా ఇటీవలే జిల్లాలో 114 దుకాణాలకు ఇచ్చామన్నారు. ఇవి కూడా నా లుగు వారాల్లో కంప్యూటర్ బిల్లింగ్ మిషనరీని అమర్చుకుంటున్నామని లిఖితపూర్వక హామీ ఇస్తే ఇచ్చామన్నారు. కంప్యూటర్ బిల్లింగ్ మిషన్ల సరఫరాలో జాప్యం జరుగుతోం దన్నారు. దీంతో జిల్లాకు రాలేదన్నా రు. దుకాణదారులతో హామీ ప త్రాలు తీసుకుని త్వరలోనే అందరికీ లెసైన్స్లు ఇస్తామని తెలిపారు.