breaking news
Lekha Washington
-
వైరముత్తు అలాంటివాడే!
కొన్ని రోజులుగా వైరముత్తు తనతో పని చేసేవారి మీద లైంగిక వేధింపులు జరిపాడు అంటూ గాయని చిన్మయి పలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ ఆరోపణలకు మద్దతు పలికారు సంగీత దర్శకుడు రెహమాన్ సోదరి, సంగీత దర్శకురాలు, నిర్మాత రైహానా. ‘‘వైరముత్తు అలాంటివాడే అన్న విషయం ఇండస్ట్రీలో ఓపెన్ సీక్రెట్. వైరముత్తు ఇలాంటి వాడు అన్న సంగతి రెహమాన్కి తెలియదు. ‘నిజమా? ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే పరిస్థితి ఏంటి?’ అని రెహమాన్ నన్ను అడిగాడు. రెహమాన్ పుకార్లను పట్టించుకోడు. తన పనేంటో తను చేసుకుంటూ వెళ్తాడు. అలాగే కాంట్రవర్శీలు ఉన్నవాళ్లతో తను పనిచేయడు. మరి రెహమాన్ వీళ్లతో కలసి పనిచేయడా? అంటే.. అది తన ఇష్టం’’ అని పేర్కొన్నారు. చెడ్డవాడు హీరోయిన్ లేఖా వాషింగ్టన్ కూడా ‘మీటూ’ అంటూ పేరు చెప్పకుండా ఓ వ్యక్తిని ఆరోపించారు. శింబుతో కలసి లేఖ ‘కెట్టవన్’ అనే సినిమాలో యాక్ట్ చేయాల్సింది. అనుకోని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఇప్పుడు ట్వీటర్లో ‘ఒకే ఒక్క పదం.. కెట్టవన్.. మీటూ’ అని ట్వీట్ చేశారు. అంటే.. ఆమె ఎవర్ని అన్నారో ఊహించడం ఈజీ. అన్నట్లు ‘కెట్టవన్’ అంటే చెడ్డవాడు అని అర్థం. -
నమ్మకం లేదంటూనే..
తమిళసినిమా: కొందరు సినిమా నటీమణులతో ఇతరులు కూడా పెళ్లిపై నమ్మకం లేదనడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. అయినా ప్రేమలో పడుతుంటారు. సహజీవనం చేస్తుంటారు. పెళ్లి మాత్రం చేసుకోనంటారు. అలాంటి వారిలో నటి లేఖా వాషింగ్టన్ ఒకరు. ఉన్నాలే ఉన్నాలే, జయం కొండాన్, వా, కల్యాణ సమయల్ సాదం చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు కొన్ని హిందీ చిత్రాల్లోనూ నటించింది. ఇటీవల నటనకు దూరం అయిన లేఖా వాషింగ్టన్ తనకు పెళ్లిపై నమ్మకం లేదని బహిరంగంగానే చెప్పింది. అలాంటిది ముంబైకి చెందిన బబ్లో చటర్జీ అనే వ్యక్తి ప్రేమలో పడింది. ఎనిమిదేళ్లుగా ఆయనతో డేటిం గ్ చేస్తున్న లేఖా వాషింగ్టన్ ఐదేళ్లుగా తన బాయ్ఫ్రెండ్తో సహజీవనం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రేమజంట పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారట. పెళ్లిపైనే నమ్మకం లేదన్న లేఖా వాషింగ్టన్ ఇప్పుడు ప్రేమించినోడినే మనువాడబోతోంది. ఈ సుదీర్ఘ సహజీవన జంట ఈ నెల 18న ముంబైలో పెళ్లి చేసుకోనున్నారన్నది తాజా సమాచారం. చాలా నిరాడంబరంగా జరగనున్న ఈ పెళ్లిలో కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులతో పాటు నటుడు సిద్ధార్థ్, మాధవన్ చాలా కొద్దిమంది నటీనటులు మాత్రమే పాల్గొననున్నారట. -
కమీనా సినిమా రివ్యూ!
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో సీక్వెల్స్ లతోపాటు రీమేక్ ల పర్వం ఎక్కువగానే కొనసాగుతోంది. తెలుగులో ఇతర భాషల్లో విజయం సాధించిన చిత్రాలను తెలుగులో రీమేక్ చేసి హిట్ సాధించిన చిత్రాలు తక్కువగానే కనిపిస్తుంటాయి. తాజాగా హిందీలో విజయవంతమైన జానీ గద్దర్ చిత్రం ఆధారంగా కమీనా చిత్రాన్ని దర్శకుడు లక్ష్మికాంత్ చెన్నా రూపొందించారు. కమీనా చిత్రం సెప్టెంబర్ 13 తేది శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా టాలీవుడ్ లో విడుదలైన కమీనా చిత్రం ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందో తెలుసుకోవాలంటే ఓ కథేంటో తెలుసుకుందాం! అక్రమదందాలు, చట్టవ్యతిరేకమైన వ్యాపారాలు చేసే ధర్మ, తేజ, కైలాశ్, శివ, సిద్దార్థ్ లు ఐదుగురు పార్ట్ నర్స్. ఓ అక్రమ వ్యాపారంలో ఐదుకోట్లు పెట్టుబడి పెట్టి పదికోట్లు సులభంగా సంపాదించాలనుకునేందు ఐదుగురు ప్లాన్ చేస్తారు. ఆ క్రమంలోనే ఐదుకోట్లు సమకూర్చి...ఒడిశాలోని భువనేశ్వర్ కు శివ ద్వారా తరలించాలని సిద్ధమవుతారు. అయితే ఓ కారణంతో డీల్ పూర్తికాకుండానే ఐదుకోట్ల రూపాయలు కొట్టేసేందుకు సిద్ధార్థ్ పథకం రచిస్తాడు. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం శివను చంపేసి ఐదుకోట్ల రూపాయలను సిద్దు చేజిక్కించుకుంటాడు. అయితే ఎందుకు ఐదు కోట్ల రూపాయలను కొట్టేయాలనుకుంటాడు. ఏ కారణం కోసం సిద్ధార్థ్ డబ్బు కాజేయాలనుకుంటాడో ఆ లక్ష్యం నెరవేరిందా? సిద్ధార్థ్ మోసానికి గురైన మిగితా ముగ్గురు ఏం చేశారు అనే ప్రశ్నలకు సమాధానమే కమీనా చిత్రం. తెలుగు సినిమారంగంలో క్రైమ్, యాక్షన్, థ్రిల్లర్ నేపథ్యంలో ఇలాంటి కథలు చాలానే వచ్చాయి. అయితే బాలీవుడ్ లో జానీ గద్దర్ సాధించిన విజయం చిత్ర యూనిట్ ను రీమేక్ ఆలోచనకు ప్రాణం పోసి ఉండవచ్చు. అయితే శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో నీల్ నితిన్ ముఖేశ్ బాలీవుడ్ కు పరిచయం అవుతూ.. 2007 లో విడుదలైన జానీ గద్దర్ ప్రేక్షకుల్లో సంతృప్తిని మిగిల్చింది. అదే కథను తీసుకుని తెలుగులో కమీనాగా లక్ష్మికాంత్ తెరపై ఆవిష్కరింప చేయడంలో లక్ష్యాన్ని చేరుకున్నాడనిపిస్తుంది. తనదైన పక్కా స్క్రీన్ ప్లేతో చిత్రాన్ని ఆసక్తికరంగా మలిచారు. టేకింగ్, పాత్రల నుంచి నటనను రాబట్టుకున్న విధానం దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టాయి. సాయి కుమార్, ఆశీష్ విద్యార్థి, సుబ్బరాజు, బ్రహ్మాజీల పాత్రల ఎంపిక కమీనా చిత్రానికి కొంత బలాన్ని చేకూర్చింది. సాయి కుమార్ ఫుల్ లెంగ్త కాకపోయినప్పటికి.. అతిధి పాత్రకు పరిమితం కాకుండా.. ఆ పాత్ర ప్రభావం చివరి వరకు కనిపించింది. బ్రహ్మజీ, సుబ్బరాజు, ఆశీష్ విద్యార్థిలు తమకు అందివచ్చిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకున్నాడు. ఈ చిత్రంలోని కైలాశ్ పాత్ర పోషించిన బ్రహ్మజీ మంచి మార్కులే పడటం ఖాయం. బ్రహ్మజీ భార్యగా నటించిన రోజా పాత్ర కూడా ఈ చిత్రంలో ప్రధానమైందే. పోలీస్ అఫీసర్ గా రవిబాబు నటన పాత్ర పరిధి మేరకు కాకుండా కొంత శృతిమించిందనిపిస్తుంది. ఇక సిద్దార్థ్ పాత్రలో హీరోగా కనిపించిన క్రిష్ కు తొలి అవకాశంగా మంచి పాత్రనే లభించింది. తన శక్తి సామర్ధ్యాల మేరకు పూర్తిగా న్యాయం చేకూర్చేందుకే ప్రయత్నించాడు. అయితే హిందీలో ఇదే పాత్రలో కనిపించిన నీల్ నితిన్ ముకేశ్ నిర్ధేశించిన లక్ష్యాన్ని క్రిష్ చేరుకోలేకపోయాడన్నది స్పష్టంగా కనిపించింది. హీరోయిన్ లేఖా వాషింగ్టన్, మరో ప్రధాన పాత్రలో కనిపించిన ప్రస్థానం కథానాయిక రూబీ పరిహార్ లు పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు. ఈచిత్రానికి సంగీతం అందించిన అగస్త్య, సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ విభాగాల పనితీరు పర్వాలేదనిపించే స్థాయిలో ఉంది. ఇక ఎటువంటి ప్రచార ఆర్భాటం లేకుండా టాలీవుడ్ లో విడుదలైన కమీనా.. ప్రేక్షకులకు దగ్గరయ్యే అవకాశాలను బట్టే చిత్ర విజయం ఆధారపడి ఉంటుంది.