-
గూగుల్ కీలక ప్రకటన.. బిల్లింగ్ విధానానికి మారేందుకు గడువు పెంపు
న్యూఢిల్లీ: భారత్లోని డెవలపర్లు తమ ’ప్లే’ బిల్లింగ్ విధానానికి మారేందుకు గడువును పొడిగిస్తున్నట్లు టెక్ దిగ్గజం గూగుల్ వెల్లడించింది. డెడ్లైన్ను 2022 మార్చి నుంచి అక్టోబర్ 31 వరకూ పొడిగించినట్లు పేర్కొంది. భారత్లో తరచుగా చేసే డిజిటల్ చెల్లింపుల మార్గదర్శకాల్లో మార్పులు చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. భారత్లోని డెవలపర్లకు ప్రత్యేక అవసరాలను గుర్తించి, తదనుగుణంగా వారి వృద్ధికి తోడ్పాటు అందించడానికి తాము కట్టుబడి ఉన్నట్లు గూగుల్ ప్రతినిధి తెలిపారు. డెడ్లైన్ పొడిగింపు అంశం డెవలపర్లకు కాస్త ఊరట కలిగించగలదని అలయన్స్ ఆఫ్ డిజిటల్ ఇండియా ఫౌండేషన్ (ఏడీఐఎఫ్) తెలిపింది. అయితే, ఇందుకు చూపుతున్న కారణం సహేతుకంగా లేదని వ్యాఖ్యానించింది. నిర్దిష్ట యాప్లపై 15–30 శాతం ట్యాక్స్ విధించడం, చెల్లింపు ఆప్షన్లపై పరిమితులు విధించడం వంటి అంశాలపైనే డెవలపర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పేర్కొంది. -
విశాఖ మెట్రోపై విదేశీ సంస్థల ఆసక్తి
సాక్షి, విశాఖపట్నం: ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్న విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టులో ఒకింత కదలిక కనిపిస్తోంది. తక్కువ వడ్డీకి అప్పు పుట్టక, రుణం ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రాక ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు. ఇటీవల దక్షిణ కొరియా బ్యాంకు రాష్ట్ర ప్రభుత్వానికి రుణం ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ (ఏఎంఆర్సీ) నేతృత్వంలోని విశాఖ మెట్రో రైలు (వీఎంఆర్) ప్రాజెక్టుకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ గత జూన్ 16న నోటిఫికేషన్ జారీ చేసింది. జులై 7న గ్లోబల్ టెండర్ల దాఖలుకు ఆసక్తి ఉన్న సంస్థలను ఆహ్వానించింది. అక్టోబర్ 12న ప్రీబిడ్ నిర్వహించింది. అనంతరం ఆసక్తి ఉన్న సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. తొలుత డిసెంబర్ 15, ఆ తర్వాత జనవరి 25 వరకు గడువు విధించింది. అయితే గడువు పెంచాలని కొన్ని సంస్థల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఫిబ్రవరి ఆఖరు వరకు పొడిగించేందుకు సుముఖంగా ఉంది. దాదాపు 15 సంస్థలు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఆసక్తి చూపుతున్నాయి. ఇందులో విదేశీ సంస్థలే ఎక్కువగా ఉన్నాయి. వీటిలో సీమెన్స్ జర్మనీ, ఆల్స్టాంఫ్రాన్స్, హుండాయ్ అండ్ బాంకర్ ఇన్వెస్ట్మెంట్ దక్షిణ కొరియా, మిట్సుయి జపాన్, అన్సాల్టో ఇటలీ, ప్రసారణ మలేసియా, భారత్ నుంచి ఎల్అండ్టీ, అదానీ, ఐఎల్ఎస్ ముందుకొచ్చాయి. రూ.8,800 కోట్ల వ్యయమయ్యే ఈ ప్రాజెక్టును పబ్లిక్ ప్రైవేటు పార్టనర్షిప్ (పీపీపీ) విధానంలో చేపట్టనున్నారు. ఇందులో ప్రభుత్వ వాటా 53, ప్రైవేటు వాటా 47 శాతం కాగా ప్రభుత్వ వాటా రూ.4,600 కోట్లు సమకూర్చాల్సి ఉంది. మిగిలినది కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ పెట్టుబడి పెడుతుంది. దాదాపు రూ.9 వేల కోట్ల వ్యయం అవుతున్నందున ఈ ప్రాజెక్టును 34 సంస్థలు కన్సార్టియంగా ఏర్పాటై చేపట్టాల్సి ఉంటుంది. ఆయా సంస్థల అభ్యర్థన మేరకు బిడ్ల స్వీకరణకు మరికొన్నాళ్ల సమయం ఇవ్వనున్నామని ఏఎంఆర్సీ ఎండీ రామకృష్ణారెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. వీటిని పరిశీలించాక తుది జాబితాను తయారు చేస్తారు. తర్వాత రెండో దశలో టెండర్లు పిలిచి ఖరారు చేస్తారు. ఇందుకు నాలుగైదు నెలల సమయం పడుతుంది. -
పింఛన్ల గడువు పొడిగింపు
అనంతపురం టౌన్ : ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సర్వర్ సమస్య తలెత్తడంతో గడువును రెండ్రోజులు పెంచుతున్నట్లు డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రతి నెలా 5వ తేదీ వరకు పింఛన్ల పంపిణీ ఉంటుందని, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈసారి 7వ తేదీ వరకు పంపిణీ చేస్తామన్నారు. పింఛన్ల పంపిణీ అధికారులు లబ్ధిదారులందరికీ నగదు పంపిణీని వేగవంతం చేయాలని కోరారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అమెరికా వరల్డ్కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
అమిత్షాపై కోడ్ ఉల్లంఘన కేసు
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement