breaking news
Lament
-
విషాద పరీక్ష అవధి లేని శోకం
♦ ఇద్దరు విద్యార్థులకు విషాద పరీక్ష ♦ కన్నవారు మృతి చెందడంతో తీరని వేదన ♦ అయినా పరీక్ష రాసిన విద్యార్థులు ♦ దేవరాపల్లి, పెదబయలులో కన్నీటి ఘటనలు పదో తరగతే పెద్ద పరీక్షనుకునే ఆ పిల్లలిద్దరికీ విధి చెప్పనలవి కానంత కఠినమైన పరీక్ష పెట్టింది. రేపేం ప్రశ్నలొస్తాయోనని ఆందోళనతో సతమతమయ్యేంత సున్నిత మనస్కులను భరించలేనంత కర్కశమైన సంఘటనతో అతలాకుతలం చేసింది. అనుకోని ప్రశ్న వస్తేనే బెంబేలెత్తే బేల హృదయాలున్న వారిని ఊహించనలవి కాని పరిణామాలతో విలవిలలాడేలా చేసింది. పరీక్షల వేళ కాస్త అలజడిని కూడా తట్టుకోలేని వయస్సులో ఉన్న ఆ ఇద్దరి కన్నవారిని ఎత్తుకుపోయి క్రూరంగా పరిహసింది. రేపు పరీక్షనగా ఈరోజు జరిగిన ఘోరాలతో ఆ విద్యార్థి, విద్యార్థిని గుండెల్లో కన్నీరు ఉప్పెనలా ఉప్పొంగింది. అయితే అంత దుఖాన్ని పంటి బిగువున అణచిపెట్టి పరీక్ష రాసిన వారిని చూసి చివరికి విధి హృదయం కూడా బరువెక్కే ఉంటుంది. దేవరాపల్లి/ పెదబయలు: మరి కొన్ని గంటల్లో పరీక్ష రాయనున్నారనగా ఆ విద్యార్థులిద్దరికీ ఎవరూ ఊహించడానికి కూడా సాహసించని పరీక్ష ఎదురైంది. ఓ విద్యార్థి, ఓ విద్యార్థిని టెన్త్ సాంఘిక శాస్త్రం-1 పరీక్ష రాయబోతున్న తరుణంగా కన్నవారికి కోల్పోయిన విషాదం చోటు చేసుకుంది. దేవరాపల్లి, పెదబయలుల్లో ఇద్దరు టెన్త్ విద్యార్థులు ఒకరు తండ్రిని, మరొకరు తల్లిని కోల్పోయి వేదనతో విలవిలలాడాల్సి వచ్చింది. అయితే తీరని ఆవేదనలోనూ శనివారం సోషల్-1 పరీక్ష రాయడంతో ప్రతి ఒక్కరి హృదయం చెమ్మగిల్లింది. దేవరాపల్లి గాంధీవీధికి చెందిన కదిరి ప్రసాద్ తెనుగుపూడి రెసిడెన్షియల్ స్కూల్లో టెన్త్ పరీక్షలు రాస్తున్నాడు. అతని తండ్రి అప్పారావు (40) కొంత కాలంగా క్యాన్సర్తో బాధ పడుతూ శుక్రవారం రాత్రి మరణించాడు. ప్రసాద్ ఏకైక కుమారుడు. అతడే తండ్రికి తలకొరివి పెట్టాలి. విద్యా సంవత్సరం కోల్పోకూడదన్న ఆలోచనతో ప్రసాద్ పరీక్షకు హాజరయ్యాడు. తెనుగుపూడి రెసిడెన్షియల్ స్కూల్లో సోషల్ పరీక్ష రాసివచ్చి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. తండ్రికి తలకొరివి పెట్టాడు. ఈ సంఘటన తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులను కన్నీటిలో ముంచెత్తింది. దేవరాపల్లిలో విషాదం చోటుచేసుకుంది. మండల కేంద్రం పెదబయలు గ్రామానికి చెందిన సల్లంగి శ్రావణి స్థానిక ఎస్టీ ఆన్స్ పాఠశాలలో టెన్త్ చదువుతూ అక్కడి జెడ్పీ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రం-2లో పరీక్ష రాస్తోంది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు తల్లి సల్లంగి వరహాలమ్మ(48) ఉన్నపళంగా కుప్పకూలిపోయింది. ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించింది. తండ్రి సల్లంగి జగన్నాథం ముంచంగిపుట్టు మండలం జోలాపుట్టు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా పని చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి తల్లి మృతదేహం వద్ద కూర్చొని రోదించిన శ్రావణి శనివారం విషాదకర పరిస్థితుల్లో పరీక్షకు హాజరయింది. దుఖాన్ని దిగమింగుకుని పరీక్ష రాసింది. మధ్యాహ్నం 2 గంటలకు తిరిగొచ్చి తల్లి అంత్యక్రియల్లో పాల్గొంది. -
విషాదాన్ని నింపిన హోలీ
పటాన్చెరు టౌన్, న్యూస్లైన్ : హోలీ పండుగ ముగ్గురి కుటుం బాల్లో విషాదం నింపింది. దీంతో ఆయా కుటుంబాన్ని విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే.. రంగులు కనుక్కోవడానికి వెళ్లిన ఓ వ్యక్తి పుల్కల్ మండలం శివ్వంపేట బ్రిడ్జి కింద నీటిలో శవమై తేలాడు. ఎస్ఐ లోకేష్ కథనం మేరకు.. సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ఖాన్పేట గ్రామానికి ఆంజనేయులు, స్వరూ ప దంపతులకు ముగ్గురు కుమారులు. వీరిలో రమేష్ (24) రెండో వాడు. తండ్రి నిర్వహిస్తున్న హోటల్లో పని చేస్తూ చేదోడు వాదోడుగా ఉండేవాడు. అయితే హోలీని పురస్కరించుకుని ఆదివారం గ్రామంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నాడు. అనంతరం స్నేహితులు లింగం, హరిశంకర్, విక్రమ్లతో కలిసి రమేష్ స్నానం చేసేందుకు పుల్కల్ మండలం శివ్వంపేట బ్రిడ్జి వద్దకు వచ్చాడు. ముగ్గు రు మిత్రులకు ఈత రాక పోవటంతో వారు ఒడ్డున కూర్చొని స్నానాలు చేశా రు. రమేష్ మాత్రం బ్రిడ్జి పై భాగంలో లోతుగా ఉన్న నీటిలోకి వెళ్లి నీట మునిగాడు. దీంతో విషయాన్ని రమేష్ కుటుంబ సభ్యులకు తెలిపారు. వారు వచ్చి చూడగా అప్పటికే చీకటి పడడంతో వెనుతిరిగి సోమవారం ఉదయం అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే రమేష్ మృతదేహం నీట తేలింది. దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ లోకేష్ తెలిపారు. మరో సంఘటనలో సిద్దిపేట మం డలం చిన్నగుండవెల్లి గ్రామానికి చెందిన మల్యాల ప్రవీణ్ (15) బావిలో మునిగి దుర్మరణం చెందారు. గ్రామస్తుల కథ నం మేరకు.. గ్రామానికి చెందిన సత్త య్య, దేవవ్వలకు ముగ్గురు కుమారులు. రెండవ కుమారుడు మల్యాల ప్రవీణ్ (15) తొమ్మిదవ తరగతి చదువుతున్నా డు. హోలీ పండుగలో భాగంగా ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి రంగులు చల్లుకున్నారు. దీంతో ఒంటికి అంటిన రంగులు కడుక్కోవడానికి గ్రా మ శివారులో ఉన్న ఓ బావిలోకి ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో బావిలో ఈత కొడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ప్రవీణ్ మునిగి పోయాడు. దీందో విషయాన్ని స్నేహితులు కుటుంబసభ్యులకు, గ్రామస్తులకు చేరవేశారు. వారు బావి వద్దకు చేరుకుని మృతదేహం కోసం రెండు గంటల పాటు వెతికి బయటకు తీశారు. ప్రవీణ్ మృతదేహాన్ని చూ సి కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా విలపించారు. బాలుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ కిషన్రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీహరిగౌడ్లు కోరారు. జేసీబీ గుంతలో పడి మరొకరు పటాన్చెరు టౌన్ : కాలకృత్యాలకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు జేసీబీ గుం టలో మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని నందిగామలో సోమవారం చోటు చేసుకుంది. బీడీఎల్ భానూర్ పోలీసుల కథనం మేర కు.. రాజస్థాన్ రాష్ట్రం బైరాన్ మండలం అసాక్ గ్రామానికి చెందిన జితేందర్సింగ్ (25) మండల పరిధిలోని నందిగామలో గల ఓ ప్రైవేటు పరిశ్రమలో ఉద్యోగం చేస్తున్నాడు. అదే పరిశ్రమలో ఉన్న ఓ గదిలో బంధువులతో కలిసి ఉం టున్నాడు. అయితే సోమవారం హోలీ పండుగ కావడంతో పరిశ్రమలో ఉండే తోటి బంధువులతో కలిసి హోలీ ఆడా డు. అనంతరం చిన్నాన్న మహేందర్సింగ్, మామయ్య జితేందర్తో కలసి స్నా నానికి వెళ్లాడు. అయితే ముందుగా జితేందర్ సింగ్ కాలకృత్యాలకు వెళ్లాడు. అనం తరం జేసీబీ గుంతలో దిగి ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందా డు. అయితే జితేందర్ ఎంత సేపటికీ రాకపోవడంతో బంధువులు అక్కడికి వె ళ్లి చూసి విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఏఎస్ఐ ప్రసాద్బాబు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు.