-
ఘోర ప్రమాదం: ఐదుగురి దుర్మరణం
క్రిష్ణగిరి: కృష్ణగిరి– హోసూరు జాతీయ రహదారి సున్నంబట్టి వద్ద రోడ్డు పక్కన నిలిపి ఉన్న గ్యాస్ ట్యాంకర్ లారీని కారు ఢీనడంతో ఏడాది చిన్నారితో పాటు ఐదుగురు మృతి చెందారు. వివరాల మేరకు... బెంగళూరుకు చెందిన రమేష్ కుటుంబ సభ్యులు 8 మంది కలిసి తమిళనాడులోని వేలూరు జిల్లా గుడియాత్తంలో బంధువుల శుభకార్యానికి కారులో వెళ్లారు. కార్యక్రమాన్ని ముగించుకొని సోమవారం ఉదయం బెంగళూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. క్రిష్ణగిరి-హోసూరు జాతీయ రహదారి సున్నంబట్టి వద్ద కారు అదుపుతప్పి పక్కనే నిలిపి ఉన్న ఖాళీ గ్యాస్ ట్యాంకర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏడాది బాలిక అంజలితో పాటు ఐదుగురు ఘటన స్థలంలోనే మృతి చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లా డీఎస్పీ రాజు, రవాణాశాఖాధికారి బాలమురుగన్, కందికుప్పం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను బయటకు తీసి చికిత్స కోసం క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్నవారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. -
స్టూడెంట్ను ఎత్తుకెళ్లి పెళ్లికి యత్నించిన పీటీ సర్
సాక్షి, తిరువొత్తియూరు: కృష్ణగిరి జిల్లా మత్తూరు సమీపంలో ప్లస్ వన్ చదువుతున్న విద్యార్థినిని కిడ్నాప్ చేసి వివాహం చేసుకోవడానికి ప్రయత్నించిన ప్రభుత్వ వ్యాయామోపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణగిరి జిల్లా మత్తూర్ సమీపం జింజెమ్పట్టికి చెందిన మూర్తి కుమార్తె (16) ప్లస్ వన్ చదువుతోంది. తిరువణ్ణామలై జిల్లా మేల్ సంగంలో ఉంటోంది. అక్కడ కూలి పనులు చేస్తూ అదే ప్రాంతంలో ఉన్న డేనియల్ మిషన్ మెట్రికులేషన్ పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తోంది. ఈ నేపథ్యంలో 9వ తేదీన ఆ విద్యార్థిని అదృశ్యమైంది. దీనిపై విద్యార్థిని తల్లి కావ్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. తిరువన్నామలై నాగనూర్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పీటీ మాస్టర్గా పనిచేస్తున్న చరణ్ రాజ్ వివాహం చేసుకోడానికి ఆ విద్యార్థినిని కిడ్నాప్ చేసినట్లు తేలింది. దీంతో మత్తూరు పోలీస్ ఇన్స్పెక్టర్ మురుగన్ ఆదివారం చరణ్ రాజ్ను అరెస్టు చేశారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. చదవండి: అద్దె కోసం వచ్చామంటూ 12 సవర్ల బంగారం దోచేశారు -
ఊరు ఇంటర్ పాసైంది
ఇరులపట్టి గ్రామం. ఎక్కడుంది? డెంకణికొట్టయ్ తాలూకా. ఎక్కడుంది? బొమ్మతతనూర్ పంచాయితీ. ఎక్కడుంది? కృష్ణగిరి జిల్లా. ఓ.. తమిళనాడు! తమిళనాడులోని ఆ ఇరులపట్టి గ్రామం ఇప్పుడు వార్తలలోకి రావడానికి మంచి కారణమే ఉంది. ఆ ఊరి ఇంటర్ విద్యార్థిని కృష్ణవేణి గురువారం వచ్చిన ఫలితాలలో 600 మార్కులకు 295 మార్కులతో పాసై ఊరికి గుర్తింపును తెచ్చింది. ఇరులపట్టి గ్రామంలో ఇంటర్ పాస్ అయిన తొలి విద్యార్థి కృష్ణవేణి. పక్క జిల్లా అయిన ధర్మపురిలో.. పాలాకోడ్ సమీపంలోని కొత్తూరు ప్రభుత్వ కళాశాలలో ఆమె చదివింది. టెన్త్ కూడా అక్కడే. తొంభై తొమ్మిది, తొంభై ఎనిమిది శాతాలతో పిల్లలు పాస్ అవుతున్న కాలం ఇది. అయితే కృష్ణవేణిని వారితో సమానంగా అభినందించడానికి ఆమె సాధించిన మార్కులను కాకుండా, ఆమె ప్రయత్నాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. ఇంటర్లో కామర్సు, అకౌంట్స్ సబ్జెక్టులతో పాసైంది కృష్ణవేణి. ఇరులపట్టి చుట్టుపక్కల చాలావరకు తెలుగు, కన్నడ మీడియం పాఠాశాలలే. అందుకని తమిళ మీడియం కోసం పొరుగు జిల్లాల్లోని హాస్టల్లో ఉండి.. అక్కడే ఆరవ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుకుంది. బ్యాంక్ పరీక్షలు రాస్తూ, సివిల్ సర్వీసుకు ప్రిపేర్ అవుతూ ఒక మంచి ఉద్యోగం సంపాదించాలని ఆమె లక్ష్యం. తండ్రి రైతు. తల్లి గృహిణి. ఇద్దరు తోబుట్టువులు. వాళ్ల చదువు టెన్త్ తర్వాత ఆగిపోయింది. కృష్ణవేణి ఆ ఊరి చరిత్రలోనే ఇంటర్ పాస్ అయిన తొలి విద్యార్థి అనే వార్త రాగానే చుట్టుపక్కల డిగ్రీ కళాశాలల నుంచి ఆమెకు సీటు ఇస్తామన్న ఆఫర్లు మొదలయ్యాయి! ధర్మపురిలోని ‘ఆర్ట్స్ అండ్ సైన్స్’ ప్రైవేటు కాలేజీ ఇప్పటికే ఆమె కోసం అడ్మిషన్ను రిజర్వు చేసి ఉంచింది! ఇంటర్ ఫలితాలు వచ్చిన రోజు డెంకణికొట్టయ్ డిఎస్పీ సంగీత, కేళమంగళం పోలీస్ స్టేషన్ సిబ్బంది ఇరులపట్టి గ్రామంలోనే ఉన్నారు. స్థానికులకు రేషన్ బియ్యం, పప్పు, నూనెల పంపిణీ సక్రమంగా జరుగుతున్నదో లేదో పర్యవేక్షిస్తున్నారు. ఆ పనిలో ఉన్నప్పుడే కృష్ణవేణి గురించి డిఎస్పీ సంగీతకు తెలిసింది. వెంటనే ఆమెను పిలిపించి అభినందించారు. ‘‘నేనూ నీ లాగే పల్లె ప్రాంతం నుంచి వచ్చాను. మా ఇంట్లో నేనే తొలి గ్రాడ్యుయేట్ని’’ అని తన సంతోషాన్ని పంచుకున్నారు సంగీత. ఆర్థికంగా కృష్ణవేణికి సహాయం చేకూరేలా చేస్తానని కూడా చెప్పారు. ఇరులపట్టి గిరిజన గ్రామం. ఇకముందు కృష్ణవేణి ఏం సాధించినా అది ఊరు పంచుకునే విషయమే అవుతుంది. కృష్ణవేణి ర్యాంకు సాధించలేదు. నైంన్టీ నైన్ పర్సెంటేమీ రాలేదు. ఇంటర్ పూర్తి చేసింది.. అంతే! ఊరి పేరు మార్మోగిపోతోంది. ఊరి చరిత్రలోనే.. తొలి.. ఇంటర్ ఉత్తీర్ణురాలు కృష్ణవేణి!! -
ప్రేమ పెళ్లి ఎంత పనిచేసింది?
క్రిష్ణగిరి(సూళగిరి): పెద్దల మాట పెడచెవిన పెట్టి కర్ణాటకలో ఓ జంట ప్రేమ వివాహం చేసుకుంది. బంధువులు వారిని గ్రామానికి తీసుకొచ్చి పంచాయితీ పెట్టి విడిపోవాలని సూచించారు. దీంతో ఆ ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలో ప్రియున్ని కిడ్నాప్ చేశారు. విషయం తెలుసుకొన్న ప్రియుని తండ్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ సంఘటన సూళగిరి పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం వెలుగు చూసింది. సూళగిరి తాలూకా కొడితిమ్మనపల్లి గ్రామానికి చెందిన బసప్ప కొడుకు సురేష్(21) ప్లస్టూ వరకు చదువుకొని బెంగళూరులో పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన మహేశ్వరి(21) డిగ్రీ వరకు చదువుకుంది. ఏడాది కాలంగా వీరి మధ్య ప్రేమాయణం సాగుతోంది. గత నెల 17వ తేదీ బెంగళూరులోని కణ్ణమ్మ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. విషయం తెలుసుకొన్న ఇరువర్గాల బంధువులు వారికి నచ్చజెప్పి శనివారం స్వగ్రామానికి తీసుకొచ్చి పంచాయితీ ఏర్పాటు చేసి విడిపోవాలని సూచించారు. దీంతో ప్రేమ జంట సూళగిరి పోలీస్స్టేషన్కు వెళ్లారు. పోలీసులు రాత్రి సమయంలో స్టేషన్లో ఉంచమని, ఉదయం రావాలని సూచించడంతో సూళగిరిలోని ఓ మిత్రుని ఇంట్లో బసచేసి ఉదయం పోలీస్స్టేషన్కు వెళుతుండగా బంధువులు సురేష్ను కిడ్నాప్ చేశారు. తన భర్తను కిడ్నాప్ చేశారని మహేశ్వరి సూళగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకొన్న సురేష్ తండ్రి, గతంలో కూతురు కూడా ప్రేమ వివాహం చేసుకోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆదివారం ఉదయం ఉరేవేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. సూళగిరి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. -
మావి మూడు ఏలుబడులే కానీ బతుకొక్కటే
‘రాగెన్నుల రాజ్జెం’కు రాసిన ముందుమాటలోంచి; ప్రచురణ: కృష్ణగిరి జిల్లా రచయితల సంగం; పేజీలు: 120; వెల: 100; ప్రతులకు: అన్ని ముఖ్యమైన పుస్తక కేంద్రాలు. రమేశ్ ఫోన్: +91 8500548142 కృష్ణగిరి జిల్లా రచయితల సంగం (కృష్ణ. ర. సం.) వారు వెలువరిస్తుండే పన్నెండో పొత్తం ఇది. ‘మొరసునాడు కతలు’ పేరుతో వస్తుండే రెండో కూర్పు ఇది. మొరసునాడు ఇప్పటి ఆంధ్ర, కర్నాటక, తమిళనాడులలో మూడు ముక్కలయి నిలిచి ఉంది. చిత్తూరు, అనంతపురం, కృష్ణగిరి పెనువంటెం(జిల్లా)లలో కొంత కొంత; కోలారు, చిన్నబళ్లాపురం, బెంగళూరు నగర, గ్రామ పెనువంటెంలను కలిపితే మొరసునాడు అవుతుంది. మొరసునాడులో నూటికి ఏబయిమంది తెలుగు వాళ్లు ఉంటారు. ఇందులో తమిళనాడుముక్క వాళ్లవి ఆరు కతలుండాయి. ఆంధ్రముక్క వాళ్లవి అయిదు కతలుండాయి. కర్నాటకముక్క నుండి తీసుకొనింది నాలుగు కతల్ని. మూడు ముక్కలయి మూడునాడుల్లో ఉండినా, ఈ తావు బతుకూ బాళూ అంతా ఒకటే. ఈ తావు వాళ్లకి ముక్కెమయిన తిండిపంట రాగులు. వరసగా నాలుగు నాళ్లు రాగిసంగటి దొరకకపోతే వేసట పడిపోతారు. ఈ పదైదు కతలలో రాగిముద్దను తలుచుకోని కతే లేదు. మావి మూడు ఏలుబడులే కానీ బతుకొక్కటే అని చెప్పదలుచుకొంటిమి. దానికే మూడు ముక్కల కతలన్నీ కలగలిపి కూరిస్తిమి. ఈ కూర్పులోని పదైదుమంది రచయితలలో తొమ్మిదిమంది తెలుగువాళ్లు, నలుగురు కన్నడిగులు, ఇద్దురు తమిళులు. పదైదుమందిలో ఆరుగురు దళితులు, ఏడుగురు వెనకబడిన తరగతుల వాళ్లు, ఇద్దురు రైతుబిడ్డలు. దానికే కావచ్చు ఈ కతలన్నీ మన్ను మణము(సువాసన)తో నిండి ఉండాయి. ఏలుబడులు మూడుముక్కలు చేసిన మమ్మల్ని నానుడు(సాహిత్యా)లు అతుకుతుండాయి. రండి, మా రాగెన్నుల రాజ్జెం మీకు ఎదురుకోలు పలుకుతా ఉంది. - స.వెం.రమేశ్ రచయిత కమ్యూనిటీతో జరిపే భావప్రసారం సాహిత్యం (‘కథ-2015’కు రాసిన సంపాదకీయంలోంచి; ప్రచురణ: కథాసాహితి; పేజీలు: 206; వెల: 65; ప్రతులకు: 164, రవి కాలనీ, తిరుమలగిరి, సికింద్రాబాద్-15; ఫోన్: 9849310560) సాహిత్య సృజన మామూలుగా ఏ వ్యక్తి అయినా చేసే పనికాదు. సమాజంలో ముఖ్యమైన భాగంగా ముందున ఉంటూ, సమాజ చలన సూత్రాలను గురించి తనకున్న అవగాహనతో తను జీవిస్తూన్న సమాజం తీరుతెన్నులను లోతుగా పరిశీలిస్తూ విస్పష్టంగా వ్యాఖ్యానించగల వ్యక్తి- అనగా రచయిత కమ్యూనిటీతో జరిపే భావప్రసారం సాహిత్యం. అలా కమ్యూనికేషన్ నెరపడం- అంటే సాహిత్యం సృజియించడం- ఒక రకంగా తన బాధ్యత అనుకుంటాడు రచయిత. నడుస్తూన్న కాలం మౌలిక స్వభావాన్ని దాని రూపం, సారంతో సహా అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ, మారని మనిషితనం (్టజ్ఛి ్ఛ్ట్ఛట్చ జీ ్టజ్ఛి ఝ్చ), చరిత్ర వారసత్వం నేటి ప్రపంచంలో ఎలా నెగ్గుకుని వస్తున్నాయో తన రచనల ద్వారా చూపిస్తూ ఆ బాధ్యత నెరవేరుస్తాడు. సాహిత్య సృజన వివిధ ప్రక్రియ(జ్ఛట్ఛ)లలో సాగుతుంది. కథ వాటిల్లో ప్రధానమైనది. నిరంతర పరిణామశీలమైన విశిష్ట సాహితీప్రక్రియ కథ. కథంటే కేవలం కల్పన కాదు, అలాగని పూర్తి వాస్తవమూ కాదు. సాధారణత్వం చెరిగిపోయేలా ఊహను మేళవించి, ఒక యథార్థ జీవిత శకలాన్ని ఉన్నతీకరించి ఆసక్తికరంగా మలచడం- అనగా నిజజీవితంలో అంతవరకూ మన అనుభవంలోకి రాని రీతిలో, మన ఆలోచనకు తట్టని కోణంలో ఒక పరిచితమైన విషయాన్ని లేదా సాధారణ ఘటనను లేదా మామూలు సన్నివేశాన్ని కొత్తగా చూపడం కథ అవుతుంది. ఈ ఆసక్తికరంగా మలిచే కొత్తకోణంలో చూపే పనినే ‘కళ’ అంటాము. కళ అంటే సాధారణ అర్థంలో ప్రకృతి అనుకరణ అని మనకు తెలుసు. ఈస్థటిక్స్ ప్రకారం ఆలోచనలు రేకెత్తించేలా వినూత్న పద్ధతిలో ఆవిష్కృతమయ్యే వాస్తవికత పార్శ్వం అని కూడా మనకు తెలుసు. అలా చూసినప్పుడు కథారచయితని కళాకారుడనే అనాలి. ఎందుకంటే కథ (fiction) ఒక రకంగా వాస్తవమూ, మరోరకంగా వాస్తవాన్ని ధిక్కరించే ఊహాకల్పన కూడా. - ఆడెపు లక్ష్మీపతి
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
SRH VS LSG: లక్నోపై 10 వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం
బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Abinaya: 'అ అంటే అమలాపురం' పాటతో అదరగొట్టిన బ్యూటీ.. ఇప్పటికీ అలానే! (ఫోటోలు)
100 మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
IPL 2024: భువీ విజృంభణ.. నామమాత్రపు స్కోర్కే పరిమితమైన లక్నో
హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్..ఉప్పల్ ఊగేలా తారల సందడి (ఫొటోలు)
SRH VS LSG: సిక్సర్ల సునామీ.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా..!
భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. హీరో ఎమోషనల్ పోస్ట్
ఎన్నికల ప్రచారంలో షర్మిలకు షాక్
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement