breaking news
kidnap case filed
-
పెళ్లినాడే అమ్మాయిని దారుణంగా ఈడ్చుకుంటూ కిడ్నాప్
-
పెళ్లినాడే అమ్మాయిని దారుణంగా ఈడ్చుకుంటూ..
చండీగఢ్ : పెళ్లి జరగాల్సిన రోజే యువతి కిడ్నాప్ కావడం కలకలం రేపింది. ఈ ఘటన పంజాబ్లో చోటుచేసుకుంది. వివరాలు... ఫజికా జిల్లా ముక్త్సర్కు చెందిన ఓ యువతికి ఇటీవలే వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో శుక్రవారం ఆమె పెళ్లి జరగాల్సి ఉంది. అయితే బ్యూటీ పార్లర్కు వెళ్లిన సదరు యువతి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో బ్యూటీ పార్లర్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీ గమనించగా కొందరు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేసినట్లు తెలిసింది. సదరు యువతి పార్లర్ బయటకు రాగానే ఆమెను అడ్డగించిన దుండగులు బలవంతంగా కారులోకి ఎక్కించేందుకు ప్రయత్నించారు. ఆమె ప్రతిఘటించినప్పటికీ దారుణంగా కొడుతూ కార్లోకి లాక్కెల్లారు. ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యుల అనుమానం మేరకు కొంతమంది వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
పెంచుకునేందుకే బాలుడి కిడ్నాప్
జిన్నారం(పటాన్చెరు) : వివాహం జరిగి ఏళ్లు గడిచినా పిల్లలు లేకపోవటంతో ఓ బాలుడిని పెంచుకోవాలని ఆశ పడ్డ మహిళ ఏకంగా ఇంటి ముందు ఆడుకుంటున్న మూడున్నరేళ్ల బాలున్ని కిడ్నాప్ చేసింది. ఈ సంఘటన జిన్నారం మండలంలోని బొల్లారం గ్రామంలో గత నెల 24న జరిగింది. అప్పట్లో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఎట్టకేలకు బాలున్ని తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను బొల్లారం సీఐ సతీష్రెడ్డి సోమవారం వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి... బీహార్కు చెందిన సునీల్కుమార్, రేఖాకుమారిలు కొంతకాలం క్రితం వలస వచ్చి బొల్లారంలో నివాసం ఉంటున్నారు. సునీల్కుమార్ ఓ పరిశ్రమలో కార్మికుడిగా విధులు నిర్వహించుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు. వివాహం జరిగి ఏళ్లు గడుస్తున్నా సంతానం లేరన్న బాధ భార్యా భర్తలను వేధిస్తుండేది. పిల్లలు కావాలని రేఖాకుమారి ఎంతగానో ఆశపడింది. ఎంతకీ పిల్లలు కాకపోవటంతో బొల్లారంలో వెంకట్రెడ్డినగర్లో ఇంటి ముందు ఆడుకుంటున్న మూడున్నరేళ్ల కల్లుగిరి అనే బాలున్ని రేఖాకుమారి గమనించింది. బాలునికి ఏదో ఆశచూపి బయటకు పంపి, తాను కొద్ది సేపటికి బయటకు వెళ్లింది. బాలున్ని తీసుకుని ఆటోలో వెళ్లి సికింద్రాబాద్ స్టేషన్లో రైలెక్కి బిహార్లోని తన సొంత గ్రామానికి వెళ్లింది. దీంతో బాలుడు కనిపించకపోవటంతో అతని తల్లిదండ్రులు గత నెల 24న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. బాలుడి ఇంటి ముందున్న సీసీ కెమెరాలను పరిశీలించగా ముందు బాలుడిని అనుసరించి వెనుకే రేఖాకుమారి వెళ్లిన దృశ్యాలు కనిపించాయి. రేఖాకుమారి భర్త ద్వారా పోలీసులు వివరాలు సేకరించారు. బిహార్లో ఉన్న రేఖాకుమారిని తిరిగి రప్పించేందుకు భర్తతో కలిసి పోలీసులు వ్యూహ రచన చేశారు. సోమవారం సికింద్రబాద్ రైల్వే స్టేషన్కు వచ్చిన రేఖాకుమారితో పాటు బాలున్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలున్ని పోలీసులు వారి తల్లిదండ్రులకు అప్పగించారు. రేఖాకుమారినిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఆపరేషన్ను విజయవంతం చేసిన పోలీసులను సీఐ సతీష్రెడ్డి అభినందించారు. చిన్నారుల పట్ల తల్లిదండ్రులు అçప్రమత్తంగా ఉండాలని సీఐ సతీష్రెడ్డి ప్రజలకు సూచించారు. -
శశికళ నన్ను కిడ్నాప్ చేశారు: ఎమ్మెల్యే
శశికళ చెన్నై నగరాన్ని వీడి బెంగళూరుకు అలా బయల్దేరారో లేదో.. ఆమె మీద ఒక కిడ్నాప్ కేసు నమోదైంది. శశికళతో పాటు ప్రస్తుతం ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన మంత్రి పళనిసామి మీద కూడా కలిపి ఈ కేసు నమోదు చేశారు. తనను వీళ్లిద్దరూ కలిసి కిడ్నాప్ చేశారంటూ దక్షిణ మదురై ఎమ్మెల్యే శరవణన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూవత్తూరు పోలీసు స్టేషన్లో ఈ కేసు నమోదైంది. అయితే ఇంతకుముందు చెన్నై పోలీసులు కూవత్తూరులోని గోల్డెన్ బే రిసార్టుకు వెళ్లి అక్కడ తాము ప్రతి ఎమ్మెల్యేతోను మాట్లాడామని, మొత్తం 112 మంది ఎమ్మెల్యేలు తాము స్వచ్ఛందంగానే వచ్చినట్లు చెప్పారంటూ హైకోర్టుకు ఒక అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. మరి ఇప్పుడు ఈ ఫిర్యాదు ఎలా వచ్చిందో చూడాలి. కాగా గోల్డెన్ బే రిసార్టు నుంచి ఎమ్మెల్యే శరవణన్ పారిపోయి బయటకు వచ్చారు. ఆయన పన్నీర్ సెల్వానికి మద్దతు తెలిపారు.