breaking news
K. Laxman Fire
-
‘మజ్లిస్ మత రాజకీయాలకు కేసీఆర్ వత్తాసు’
సాక్షి, హైదరాబాద్: మజ్లిస్ మత రాజకీయాలకు సీఎం కేసీఆర్ వత్తాసు పలుకుతున్నారని, దేశహితం కోసం తీసుకున్న నిర్ణయాలకు మతం రంగు పులుముతారా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. దేశహితాన్ని కాంక్షిస్తారా లేక దోహద్రోహం తలపెడతారో సీఎం కేసీఆర్ తేల్చుకోవాలని స్పష్టంచేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పౌరసత్వ సవరణ చట్టాని (సీఏఏ)కి వ్యతిరేకంగా నిజామాబాద్లో నిర్వహించనున్న ఒవైసీ సభకు కేసీఆర్ మద్దతు తెలుపడాన్ని, టీఆర్ఎస్ ప్రతినిధిని పంపించడంతోపాటు కాంగ్రెస్, కమ్యూనిస్టులను కూడా ఆహ్వానించాలని కోరడాన్ని తప్పుబట్టారు. వాటిపై చర్చకు సిద్ధం ప్రజలు, ప్రతిపక్షాలకే కాదు.. ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా సమయమివ్వని కేసీఆర్ మతోన్మాద రాజకీయాలు నెరిపే ఎంఐఎం అధినేత అసదుద్దీన్తో 3 గంటల పాటు సమావేశం కావడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. సీఏఏపై కొన్ని పారీ్టలు ప్రజల్లో గందరగోళం çసృష్టించే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ఇప్పుడు తాజాగా నేషనల్ పాపులేషన్ రిజిస్టర్పై పెడ»ొబ్బలు పెడుతున్నాయన్నారు. ఎన్పీఆర్ మొబైల్ యాప్లో వివరాలు నమోదు చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని, ఎవరికి వారే తమ సాధారణ విషయాలు నమోదు చేయొచ్చని కూడా చెప్పిందన్నారు. అయినా టీఆర్ఎస్, మజ్లిస్, కాంగ్రెస్ కలసి అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఎన్పీఆర్ అమలు చేస్తే ముస్లింలంతా భారత పౌరసత్వాన్ని కోల్పోతారన్నట్లు పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సీఏఏ భారత ముస్లింలకు వ్యతిరేకమని నిరూపిస్తే తాము ముక్కును నేలకు రాస్తామని, లేకపోతే కేసీఆర్, అసదుద్దీన్ ఒవైసీ కలసి చారి్మనార్ సాక్షిగా ముక్కు నేలకు రాస్తారా? దీనిపై చర్చకు సిద్ధమేనా? అని ప్రశ్నించారు. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీ చట్టాలపై చర్చించడానికి బీజేపీ సిద్ధంగా ఉందని, ఎవరిని పంపుతారో చర్చకు పంపాలన్నారు. -
అంతా ఓట్లు, సీట్లు, నోట్లు, వెన్నుపోట్లే
-
అంతా ఓట్లు, సీట్లు, నోట్లు, వెన్నుపోట్లే
టీఆర్ఎస్ రెండేళ్ల పాలనపై కె.లక్ష్మణ్ ఫైర్ సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల టీఆర్ఎస్ పాలనలో ఓట్లు, సీట్లు, నోట్లు, వెన్నుపోట్లే ఎజెండాగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఆదివారం జరిగిన మహాసమ్మేళన్లో ఆయన ప్రసంగించారు. సీఎం కేసీఆర్ పాలనపై ప్రజలకు భ్రమలు తొలగిపోతున్నాయన్నారు. కేసీఆర్ వారసులకు అధికారాన్ని అప్పగించడం కోసం రాజకీయాలు చేస్తున్నారన్నారు. ప్రజా ప్రయోజనాల విషయంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని.. న్యాయస్థానాలు తప్పని చెప్పినా వినకుండా నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 119 సీట్లున్న రాష్ట్ర అసెంబ్లీలో 30 శాతం మంది సభ్యులు వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి ఫిరాయించినవారేనని లక్ష్మణ్ పేర్కొన్నారు. ఎంసెట్ 1, 2, 3 అంటూ లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటిదాకా బాధ్యులైన మంత్రి కూడా రాజీనామా చేయకపోవడమంటే అవినీతిని సమర్థించడమేనని విమర్శించారు. సెప్టెంబర్ 17న స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని అధికారంలోకి వచ్చేదాకా చెప్పిన టీఆర్ఎస్... ఇప్పుడా అంశాన్ని తుంగలో తొక్కిందని పేర్కొన్నారు. ఇక దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రధాని మోదీ పాలనపై విశ్వాసం పెరుగుతోందని చెప్పారు. అదే స్ఫూర్తితో తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.