-
గ్రూప్–1 కొత్త నోటిఫికేషన్.. 563 ఖాళీల భర్తీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 563 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) సోమవారం సాయంత్రం కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసింది. 503 గ్రూప్–1 ఉద్యోగ నియామకాల కోసం 2022 ఏప్రిల్ 26న జారీ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేసింది. తాజా నోటిఫికేషన్ మేరకు 18 శాఖల్లో 563 పోస్టులకు సంబంధించిన ప్రిలిమ్స్ రాత పరీక్ష కోసం ఈ నెల 23 నుంచి ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కమిషన్ వెల్లడించింది. మార్చి 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. వాటిల్లో పొరపాట్లు సవరించుకునేందుకు మార్చి 23వ తేదీనుంచి 27వ తేదీ సాయంత్రం 5 వరకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. ప్రిలిమినరీ పరీక్షను ఈ ఏడాది మే లేదా జూన్ నెలలో నిర్వహించనున్నట్లు కమిషన్ తెలిపింది. మెయిన్ పరీక్షలను ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో నిర్వహించనున్నట్లు వివరించింది. పరీక్షలకు వారం రోజుల ముందు నుంచి పరీక్ష సమయం కంటే 4 గంటల ముందు వరకు వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. వివిధ కారణాలతో 2022లో విడుదల చేసిన గ్రూప్–1 నోటిఫికేషన్ రద్దు చేయగా... అప్పుడు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కూడా మళ్లీ తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని, ఫీజు మాత్రం చెల్లించక్కర్లేదని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్ (ఆప్టికల్ మార్కింగ్) లేదా సీబీఆర్టీ (కంప్యూటర్ బేస్డ్) పద్ధతిలో నిర్వహించనున్నట్లు తెలిపింది. పోస్టుల వారీగా అర్హతలు, పరీక్షల నిర్వహణ, మార్కులు, సిలబస్ తదితర పూర్తిస్థాయి వివరాలతో కూడిన నోటిఫికేషన్ను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. పెరిగిన పోస్టుల సంఖ్య మహిళలకు హారిజాంటల్ (సమాంతర) పద్ధతి (ప్రత్యేకంగా ఎలాంటి రోస్టర్ పాయింట్ మార్కింగ్ లేకుండా)లో రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఈ నేపథ్యంలో మహిళలకు కేటగిరీల వారీగా పోస్టులను ప్రత్యేకంగా రిజర్వ్ చేయలేదు. కానీ మొత్తంగా 33 1/3 (33.3) శాతం ఉద్యోగాలను మాత్రం కేటాయించనుంది. ఈ క్రమంలో మల్టీజోన్ల వారీగా పోస్టులు, అదేవిధంగా జనరల్ కేటగిరీతో పాటు కమ్యూనిటీ రిజర్వేషన్ల వారీగా ఉన్న పోస్టులను కమిషన్ వెల్లడించింది. తాజా నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్య 60 పెరగడం గమనార్హం. పరిస్థితులపై చర్చించి రద్దు నిర్ణయం గ్రూప్–1 ఉద్యోగ నియామకాల విషయంలో నెలకొన్న పరిస్థితులపై టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎం.మహేందర్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కూలంకషంగా చర్చించామని, 2022 ఏప్రిల్ 26న జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నామని టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్ నికొలస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. అసలేం జరిగిందంటే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా భారీ సంఖ్యలో గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ 2022 ఏప్రిల్ 26న నోటిఫికేషన్ జారీ చేసింది. అవకతవకలకు తావు లేకుండా ఉద్యోగాల భర్తీ కోసం అప్పటి ప్రభుత్వం ఇంటర్వ్యూలను రద్దు చేసింది. 503 ఉద్యోగాల కోసం ఏకంగా 3,80,081 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2022 అక్టోబర్ 16న గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షలను నిర్వహించింది. అదే ఏడాది చివర్లో పెద్ద సంఖ్యలో అభ్యర్థులకు అవకాశం కల్పించే లక్ష్యంతో 1:50 నిష్పత్తిలో అర్హుల జాబితాను విడుదల చేసింది. 2023 ఏడాది ఆగస్టులో మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించడంతో అభ్యర్థులు కఠోర దీక్షతో సన్నద్ధతను ప్రారంభించారు. కానీ గతేడాది మార్చిలో పలు టీఎస్పీఎస్సీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగు చూసింది. గ్రూప్–1 ప్రశ్నపత్రాలు సైతం బయటకు వెళ్లాయని తేలడంతో ప్రిలిమినరీ పరీక్షను కమిషన్ రద్దు చేసింది. 2023 జూన్ 11న మరోమారు ప్రిలిమ్స్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అయితే రెండోసారి టీఎస్పీఎస్సీ ప్రిలిమ్స్ నిర్వహించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. పరీక్ష నిర్వహణలో లోపాలు జరిగాయని నిర్ధారిస్తూ హైకోర్టు పరీక్ష రద్దుకు ఆదేశించింది. దీనిపై టీఎస్పీఎస్సీ సుప్రీకోర్టును ఆశ్రయించింది. అ తర్వాత రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగడం, కా>ంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేపట్టడం, కొత్త కమిషన్ను ఏర్పాటు చేయడం, కొత్తగా మరో 60 గ్రూప్–1 ఖాళీలను గుర్తించడం లాంటి పరిణామాలు వరుసగా చోటు చేసుకున్నాయి. తాజాగా గ్రూప్–1 నోటిఫికేషన్ను రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించడంతో గత కొంతకాలంగా నెలకొన్న గందరగోళానికి తెరపడింది. పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతించినట్లు కమిషన్ తెలిపింది. అయితే గత నోటిఫికేషన్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన టీఎస్పీఎస్సీ..ఏ కారణాలతో రద్దు చేసిందీ పూర్తిస్థాయిలో వివరించలేదు. ప్రిలిమ్స్ మూడోసారి..! రికార్డు స్థాయిలో గ్రూప్–1 ఉద్యోగ ఖాళీలు ఉండడంతో గతంలో నిరుద్యోగులు ఎన్నో ఆశలతో దరఖాస్తు చేసుకున్నారు. కానీ కఠోర దీక్షతో అభ్యర్థులు పడిన శ్రమ వృథా ప్రయాసే అయ్యిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నోటిఫికేషన్ వెలువడి దాదాపు రెండు సంవత్సరాలు కాగా.. అభ్యర్థులు ఇప్పటికే రెండుసార్లు ప్రిలిమినరీ పరీక్షలు రాయడం గమనార్హం. కాగా కొత్త నోటిఫికేషన్ జారీతో మూడోసారి ప్రిలిమ్స్ రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
ఉద్యోగ నియామకాలు డౌన్
ముంబై: కార్యాలయ ఉద్యోగ నియామకాలు ఆగస్ట్ నెలలో క్షీణత చూశాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోలి్చనప్పుడు 6 శాతం తక్కువగా నమోదయ్యాయి. ముఖ్యంగా ఐటీ, బీమా, ఆటోమొబైల్, హెల్త్కేర్, బీపీవో రంగాల్లో నియామకాల పరంగా అప్రమత్త ధోరణి కనిపించింది. ఈ ఏడాది ఆగస్ట్ నెలలో 2,566 ఉద్యోగాలకు సంబంధించి పోస్టింగ్లు పడ్డాయి. క్రితం ఏడాది ఇదే నెలలో ఇవి 2,828గా ఉన్నట్టు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ నివేదిక వెల్లడించింది. నౌకరీ సంస్థ తన పోర్టల్పై జాబ్ పోస్టింగ్లు, ఉద్యోగ అన్వేషణల డేటా ఆధారంగా ప్రతి నెలా నివేదిక విడుదల చేస్తుంటుంది. ఇక ఈ ఏడాది జూలై నెలలో పోస్టింగ్లు 2,573తో పోలిస్తే కనుక ఆగస్ట్లో నియామకాలు 4 శాతం పెరిగాయి. ఆయిల్ అండ్ గ్యాస్, హాస్పిటాలిటీ, ఫార్మా రంగాల్లో నియామకాల పట్ల ఆశావహ ధోరణి కనిపించింది. ‘‘ఐటీలోనూ సానుకూల సంకేతలు కనిపించాయి. గడిచిన కొన్ని నెలలుగా ఐటీలో నియామకాలు తగ్గగా, సీక్వెన్షియల్గా (జూలైతో పోలిస్తే) ఐటీలో నియామకాలు పెరిగాయి. కార్యాలయ ఉద్యోగాల మార్కెట్లో సాధారణ పరిస్థితులు తిరిగి ఏర్పడుతున్నదానికి ఇది ఆరోగ్యకర సంకేతం’’అని నౌకరీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ వెల్లడించారు. ఐటీలో 33 శాతం డౌన్ ఐటీ రంగంలో నియామకాలు క్రితం ఏడాది ఆగస్ట్తో పోలి్చనప్పుడు, ఈ ఏడాది అదే నెలలో 33 శాతం తక్కువగా నమోదయ్యాయి. బీమా రంగంలో 19 శాతం, ఆటోమొబైల్ రంగంలో 14 శాతం, హెల్త్కేర్ రంగంలో 12 శాతం, బీపీవో రంగంలో 10 శాతం చొప్పున నియామకాలు తగ్గాయి. ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో నియామకాల పరంగా 17 శాతం వృద్ధి నమోదైంది. అహ్మదాబాద్, ముంబై, చెన్నై, హైదరాబాద్లో ఆయిల్ అండ్ గ్యాస్ రంగ నియామకాలు ఎక్కువగా చోటు చేసుకున్నాయి. 16 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన నిపుణులకు డిమాండ్ ఎక్కువగా కనిపించింది. ఆతిథ్య రంగం (హాస్పిటాలిటీ)లోనూ నియామకాలు బలంగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోలి్చనప్పుడు 14 శాతం వృద్ధి కనిపించింది. ఆర్అండ్డీపై దృష్టి పెరగడంతో ఫార్మా రంగంలో 12 శాతం అధికంగా నియామకాలు జరిగాయి. అహ్మదాబాద్, చెన్నైలో ఎక్కువగా ఫార్మా అవకాశాలు లభించాయి. ఏఐ ఉద్యోగాల్లోనూ 8 శాతం వృద్ధి కనిపించింది. మెషిన్ లెరి్నంగ్, ఏఐ సైంటిస్ట్, డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్ల ఉద్యోగ నియామకాలు కూడా పెరిగాయి. -
శ్రీకాకుళం: వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ
శ్రీకాకుళం అర్బన్: కలెక్టర్ ఉత్తర్వుల మేరకు జాతీయ ఆరోగ్య మిషన్ కింద జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె.చంద్రానాయక్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సైకియాట్రిస్ట్, ఫోరెన్సిక్ స్పె షలిస్ట్, జనరల్ ఫిజీషియన్, ఎన్పిసీడీఎస్ కింద కార్డియాలజిస్ట్, ఎన్పీసీడీఎస్ కింద మెడికల్ ఆఫీ సర్, ఎన్బీఎస్యూసీ కింద మెడికల్ ఆఫీసర్, స్టాఫ్నర్సులు, సైకియాట్రిస్ట్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫిజియోథెరఫిస్ట్లు, ఆడియో మెట్రిషియన్, సోషల్ వర్కర్లు, క్వాలిటీ మానిటర్ కన్సల్టెంట్, హాస్పిటల్ అటెండెంట్, శాని టరీ అటెండెంట్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకూ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. అర్హులైన అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పూర్తి వివరాల కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.శ్రీకాకుళం.ఏపీ.జీవోవి.ఇన్ నుంచి సమాచారం పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇవీ చదవండి: కూరగాయలు అమ్ముతున్న ఐఏఎస్ అధికారి.. అసలు నిజం ఇదే! ఇంటర్లో సీఈసీ చేశారా.. ఈ కెరీర్ అవకాశాలు మీకోసమే -
‘జానారెడ్డి కూడా అసత్యాలకు మొగ్గు చూపడం బాధాకరం’
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాల భర్తీ విషయంలో అసత్యాలతో ప్రజలను గందరగోళ పరిచేందుకు ప్రతిపక్షాలు కొత్త నాటకాన్ని మొదలుపెట్టాయని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు విమర్శించారు. ఇందులో భాగంగానే నిజాలను దాచి పెడుతున్నాయని మండిపడ్డారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 2020 వరకు రాష్ట్రంలో 1,32,899 ఉద్యోగాలు భర్తీ చేశామని, అనుమానాలుంటే ఆయా శాఖల్లో ధ్రువీ కరించుకోవాలని సూచించారు. ఉద్యోగాల కల్ప నపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నా యంటూ ప్రభుత్వ శాఖల వారీగా భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలతో కూడిన బహిరంగ లేఖను కేటీ రామారావు గురువారం విడుదల చేశారు. నిజాలను జీర్ణించుకోలేకే.. ‘నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగొస్తుందన్న సామెత రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు సరిగ్గా సరిపోతుంది. 2014 నుంచి వివిధ శాఖల్లో భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్యను మీడియా ద్వారా అంకెలతో సహా సాధికారికంగా వివరించా. ఈ నిజాలను జీర్ణించుకోలేని విపక్షాలు అసత్యాలతో తెలంగాణ యువతను గందరగోళానికి గురి చేసేం దుకు ప్రయత్నిస్తున్నాయి’అని కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. ‘జానారెడ్డి లాంటి సీనియర్ రాజ కీయ నేత కూడా ఈ అసత్యాలను వల్లెవేసేందుకే మొగ్గు చూపడం బాధాకరం. అధికారంలోకి వస్తే ఉద్యోగాలు ఇస్తామనే హామీ మేరకు మేం పాలన పగ్గాలు చేపట్టిన నాటి నుంచి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూనే ఉన్నాం. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఉద్యోగ నియామకాల వివరాలు ఇస్తా మనే జానారెడ్డి ప్రకటనను స్వాగతిస్తున్నా.. అం దులో తెలంగాణ యువతకు ఎన్ని ఉద్యోగాలి చ్చారో కూడా చెప్పాలని కోరుతున్నా.. ప్రభుత్వ శాఖల్లో అవసరమైన ఖాళీలను భర్తీ చేస్తూనే రాష్ట్ర పారిశ్రామిక విధానం టీఎస్ఐపాస్ ద్వారా ప్రైవేటు రంగంలో సుమారు 14 లక్షల ఉద్యోగాలను కల్పిం చాం..’అని వెల్లడించారు. ప్రైవేటు రంగంలో ఉద్యో గాల కల్పన చేపడుతూనే ప్రభుత్వ శాఖల్లో ఉద్యో గాల భర్తీ విషయంలో అత్యంత పారదర్శకత పాటించినట్లు కేటీఆర్ తెలిపారు. ఉమ్మడి ఏపీలో పబ్లిక్ సర్వీస్ కమిషన్పై అవినీతి ఆరోపణలు ఉండేవని, టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ అత్యంత పారదర్శకంగా జరిగిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని నిరంతర ప్రక్రియగా పేర్కొంటూ, తాజాగా మరో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఉద్యోగాల భర్తీ ప్రకియను వేగంగా పూర్తి చేస్తామని, ఇందులో ఎవరికీ సందేహాలు అవసరం లేదన్నారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన నాటి నుంచి యువతకు ఉద్యోగాలు కల్పించడంలో గత ప్రభుత్వాలతో పోలిస్తే ఎక్కువ నిబద్ధత, చిత్తుశుద్దితో పనిచేస్తున్న టీఆర్ఎస్కు అండగా నిలబడాలని, కొన్ని పార్టీలు, నాయకులు పనిగట్టుకొని చేసే అసత్య ప్రచారాల ప్రభావానికి లోనుకాకుండా యువత ఆలోచించాలని కేటీఆర్ తన లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు కల్పించిన 1,32,899 ప్రభుత్వ ఉద్యోగాల వివరాలను కేటీఆర్ శాఖల వారీగా వెల్లడించారు. -
ఫ్లిప్కార్ట్లో 70వేల ఉద్యోగాలు
న్యూఢిల్లీ : ప్రముఖ రీటైల్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ భారీగా సీజనల్ ఉద్యోగ నియామకాలకు తెరతీసింది. పండుగ సీజన్తో పాటు తన బిగ్ బిలియన్ డేస్ సేల్స్ ఆఫర్ రోజుల సందర్భంగా నెలకొనే డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా 70వేల ప్రత్యక్ష, లక్షలాది పరోక్ష ఉద్యోగ అవకాశాల్ని కల్పిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇందులో ప్రత్యక్ష నియామకాల్ని తన సప్లై చెయిన్లో ఎగ్జిక్యూటివ్స్, పిక్కర్స్, ప్యాకర్స్, సార్టర్స్ పోస్టుల్లో భర్తీ చేయనుండగా, పరోక్ష ఉద్యోగ అవకాశాల్ని తన అమ్మకపు భాగస్వామ్య లొకేషన్లు, కిరాణషాపుల్లో కల్పించనుంది. సప్లయి చైన్ విస్తరణ, బలోపేతంతో రానున్న పండుగల సీజన్లో లక్షల మంది ఈ–కామర్స్ కస్టమర్లు ఆన్లైన్లో సాఫీగా షాపింగ్ చేసుకునే సౌకర్యాన్ని కలి్పంచేందుకు ఈ భారీ నియామకాలను చేపట్టినట్లు కంపెనీ తెలిపింది. కొత్తగా ఎంపికైన వారికి కస్టమర్ సర్వీస్, డెలివరీ, ఇన్స్టాలేషన్, సేఫ్టీ, శానిటైజేషన్తో పాటు పీఓఎస్ మెషీన్లు, స్కానర్లు, మొబైల్ అప్లికేషన్లను ఆపరేట్ చేయడం తదితర అంశాల్లో శిక్షణ ఇస్తామని కంపెనీ పేర్కొంది. ‘‘ఈ–కామర్స్ వ్యవస్థ పురోగతికి అదనపు అవకాశాల సృష్టి అవసరం. ఇది కేవలం పరిశ్రమకు పరిమితం కాకుండా కస్టమర్ల ప్రయోజనాలకు ముఖ్యమే.’’ అని ఫ్లిప్కార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమితేష్ ఝా అన్నారు. ఆర్డర్లను చివరి మైలురాయి వరకు చేర్చేందుకు దేశంలో 50 వేల చిన్న కిరాణాషాపులు, పెద్ద హోల్సేల్ దుకాణాలతో ఫ్లిప్కార్ట్ గతవారం ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ కామర్స్ కంపెనీలు పండుగ సీజన్లో వచ్చే ఆర్డర్ల దృష్ట్యా భారీగా ఉద్యోగ సామర్థ్యాన్ని పెంచుకుంటాయి. గతేడాదిలో ఇదే పండుగ సీజన్లో ఫ్లిప్కార్ట్, అమెజాన్ కంపెనీలు దాదాపు 1.4లక్షల తాత్కాలిక ఉద్యోగాలను నియమించుకున్నాయి. ఇక ఇప్పటికే లాజిస్టిక్స్ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఈ–కామ్ ఎక్స్ప్రెస్ 30,000 ఉద్యోగాలను ప్రకటించింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement