-
Hyderabad: వంశీతో వెళ్లిపోతున్నానని రాసి పెట్టి..యువతి అదృశ్యం
సాక్షి, హైదరాబాద్: ప్రేమించిన వ్యక్తితో ఓ యువతి వెళ్లిపోయిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రోడామేస్త్రీనగర్కు చెందిన గోకల బాల్రాజ్గౌడ్, స్వప్నల కుమార్తె మనీషా(24) ప్రైవేట్ ఉద్యోగిని. కాగా శనివారం ఉదయం 11 గంటల సమయంలో స్వప్న ఇంటికి వచ్చి చూడగా కుమార్తె కనిపించలేదు. ఆమె సెల్ఫోన్ను సైతం ఇంట్లోనే వదిలిపెట్టింది. కాగా మనీషా పుస్తకంలో తాను వంశీ అనే వ్యక్తితో వెళ్లిపోతున్నానని రాసి ఉండగా.. అతడి సెల్ఫోన్కు ప్రయత్నించడంతో స్విచ్ఛాఫ్ వచ్చింది. బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతికినా ప్రయోజనం లేకపోవడంతో శనివారం యువతి తల్లిదండ్రులు జగద్గిరిగుట్ట పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: రాజకీయాల్లో రైతు నేతలు భాగస్వామ్యం కావాలి: సీఎం కేసీఆర్ -
అసత్య ప్రచారం, బెదిరింపులు: తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు
సాక్షి, జగద్గిరిగుట్ట: భూవివాదం నేపథ్యంలో జగద్గిరిగుట్ట కార్పొరేటర్ జగన్పై అసత్య ప్రచారం చేయడంతో పాటు బెదిరింపులకు దిగారన్న ఆరోపణలపై తీన్మార్ మల్లన్నపై కోర్టు ఆదేశాలతో జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్టకు చెందిన కొందరు వ్యక్తులు కార్పొరేటర్ జగన్ తమ భూమి కబ్జా చేశారని తీన్మార్ మల్లన్నను సంప్రదించారు. దీంతో అతడి టీమ్ సభ్యులు కార్పొరేటర్ పీఏగా పనిచేస్తున్న సంపత్రెడ్డికి కాల్చేసి భూవివాదం విషయమై అడిగారు. అయితే తనపై బెదిరింపులకు దిగడంతో పాటు భూమిని ఆక్రమించామని అసత్య ప్రచారం చేశారని ఆరోపిస్తూ సంపత్రెడ్డి జూలై 21న కోర్టును ఆశ్రయించాడు. తీన్మార్ మల్లన్న గ్రూపు సభ్యులు మాట్లాడిన కాల్ రికార్డును పరిశీలించిన కోర్డు అతడిపై కేసు నమోదు చేయాలని జగద్గిరిగుట్ట పోలీసులకు ఉత్తర్వు కాపీని అందజేయడంతో బుధవారం కేసు నమోదు చేశారు. చదవండి: పబ్లో చిన్నారి డాన్స్ వైరల్.. పోలీసుల సీరియస్ -
మత్తు అలవాటు పడితే.. భవిష్యత్తు చిత్తు
సాక్షి, ఆల్విన్కాలనీ( హైదరాబాద్): మాదక ద్రవ్యాలకు, గంజాయికి బానిసలుగా మారి యువత మత్తులో తూగుతూ కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నది. దీంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. మాదకద్రవ్యాలను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నా ముఠాలుగా ఏర్పడి జన సంచారం లేని ప్రాంతాలను ఎంచుకొని గంజాయి, మాదక ద్రవ్యాలను పీలుస్తున్నారు. యువతే ప్రధాన లక్ష్యంగా తీసుకొని ఈ చీకటి వ్యవహారాన్ని నిర్వహిస్తుండటంతో యువత రోగాల బారిన పడుతుండటంతో పాటు చెడుదారి పడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ► కూకట్పల్లి సర్కిల్ పరిధిలోని పలు కాలనీలు, బస్తీలు, ఫ్లై ఓవర్లు, చెరువు కట్టలు, నిర్మానుష ప్రదేశాలు ఎంచుకొని యువత మాదకద్రవ్యాలు సేవిస్తూ అటుగా వెళ్లే వారిపై దురుసుగా ప్రవర్తిస్తూ దాడులకు పాల్పడుండటం గమనార్హం. అదేమిటని ప్రశ్నిస్తే ఏమి చేసుకుంటావో చేసుకో మేము స్థానికులమంటూ దుర్భాషలాడుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. కొన్ని రోజుల క్రితం కూకట్పల్లి నుంచి జగద్గిరిగుట్టకు వెళ్లే చిత్తారమ్మ ఆలయ రోడ్డులో ఓ దుకాణం సమీపంలో యువత మాదకద్రవ్యాలను సిగరెట్లో నింపుకొని సేవిస్తూ చిందులేస్తూ రహదారిపై వెళ్లేవారిపై అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటంతో వారిని మందలించగా ఎదురుదాడికి దిగారని స్థానికులు, ప్రయాణికులు వాపోయారు. ► కూకట్పల్లి సర్కిల్ ధరణినగర్ సమీపంలో పరికి చెరువు కట్టపై నిత్యం పగలు, రాత్రి అనే తేడా లేకుండా మత్తుపదార్థాలు సేవించటమే కాకుండా మందుబాబులకు కూడా అడ్డాగా మారింది. స్థానికులు వారిని ప్రశ్నిస్తే మత్తులో ఉండి బెదిరింపులకు పాల్పడుతున్నారని రాత్రి వేళల్లో అరుపులు, కేకలతో అలజడి సృష్టిస్తున్నారని స్థానికులు తెలుపుతున్నారు. ► ఎల్లమ్మబండ చౌరస్తాలో, ఎన్టీఆర్నగర్, రైతు బజార్, మహదేవ్పురం చౌరస్తాలోని సిక్కుల కాలనీల్లో గంజాయి వ్యాపారం విరివిగా జరుగుతుందని యువతను టార్గెట్ చేసి గంజాయిని విక్రయిస్తూ యువతను చెడు అలవాట్లకు బానిసలుగా మారుస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. ► భరత్నగర్ బ్రిడ్జి నుంచి రైల్వే స్టేషన్కు వెళ్లే దారిలో సైతం యువత గంజాయి మాదకద్రవ్యాలను సేవిస్తున్నారు. ఈ విషయమై స్థానికులు గమనించి అటుగా వెళ్లాలంటేనే జంకుతున్నారు. మత్తులో ఉన్నవారు ఎప్పుడు ఏ అఘాయిత్యానికి పాల్పడతారో అని ఆందోళన చెందుతున్నారు. ► జగద్గిరిగుట్ట, ఆస్బెస్టాస్ కాలనీ, హుడా పార్కు ప్రాంతాలను ఆసరాగా తీసుకొని రాత్రి వేళల్లో యువత గంజాయి సేవిస్తూ ఆ ప్రాంతవాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ► కేపీహెచ్బీ కాలనీ కళామందిర్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం, పద్మావతి ప్లాజా ప్రాంతం, జనసంచారం లేని ప్రాంతాలను ఎంచుకొని యువత జోరుగా మత్తుమందులు సేవిస్తున్నారు. ► ప్రధానంగా ఆయా ప్రాంతాల్లో ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో ప్రత్యేకంగా పెట్రోలింగ్ పెంచి మాదక ద్రవ్యాలు సేవించే వారిపై దృష్టి సారించి వారికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తే తప్ప వారిలో మార్పు రాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలి కూకట్పల్లి సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో విచ్చలవిడిగా మాదకద్రవ్యాలు సేవిస్తూ యువత చెడు అలవాట్లకు బానిసలుగా మారుతున్నారు. పరికి చెరువు కట్టపై రోజూ యువత గుంపులుగా వచ్చి సిగరెట్లలో మాదక ద్రవ్యాలకు సంబంధించిన మందును నింపుకొని పీలుస్తూ దాడులకు దిగుతున్నారు. పోలీసు వారు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో వారికి ఏమీ తెలియనట్లు నటిస్తున్నారు. వారు వెళ్లిపోగానే తిరిగి గంజాయి పీలుస్తున్నారు. ప్రశ్నించే వారిపై దాడులు కూడా చేస్తున్నారు. వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలి. – గోపాల్, ధరణినగర్ జనరల్ సెక్రటరీ కఠిన చర్యలు తథ్యం నిర్జన ప్రాంతాల్లో యువత గంజాయి తాగుతూ పెడదారిన పడుతున్నారని తమకు ఫిర్యాదు రావటంతో వెంటనే స్పందించి వారిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశాము. ఇటీవల మూసాపేటలో గంజాయి విక్రయిస్తుండగా ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించాం. ఎక్కడి నుంచైతే ఫిర్యాదులు వస్తాయో ఆయా ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిఘా ఏర్పాటు చేస్తు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. – నర్సింగరావు, ఇన్స్పెక్టర్, కూకట్పల్లి ( చదవండి: టీలో పొడి ఎక్కువైందని తిట్టిన అత్త, దీంతో కోడలు.. ) -
హైదరాబాద్లో దారుణం.. తండ్రి ఉన్మాద చర్య
సాక్షి, హైదరాబాద్: నగరంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్మాదిలా మారిన ఓ తండ్రి తన మూడేళ్ల కుమారుడిని ఆటోకేసి కొట్టాడు. ఈ ఘటనలో చిన్నారి ప్రాణాపాయం నుంచి బయటపడగా, నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ జగద్గిరిగుట్టలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకోగా, ఆ వీడియో వెలుగులోకి వచ్చింది. ఉప్పల్కు చెందిన శివ గౌడ్(40)కు అనూషతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం. శివగౌడ్ తన కుటుంబంతో కలసి జగద్గిరిగుట్టలోని ఉమాదేవినగర్లో నివాసముంటున్నాడు. ఈ క్రమంలో ఓ మహిళతో పరిచయం పెంచుకుని.. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాడు. అయితే ఏం జరిగిందో తెలీదుగానీ ఆ మహిళ శివపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కోపంతో శివ రగిలిపోయాడు. ఆదివారం అర్ధరాత్రి ఆ మహిళకు ఫోన్ చేసి ఆమె కొడుకును చంపుతానంటూ బెదిరించాడు. కంగారుపడ్డ ఆ మహిళ అదే రాత్రి జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు శివగౌడ్కు ఫోన్ చేయగా.. వారితోనూ దురుసుగా మాట్లాడాడు. దీంతో పోలీసులు శివగౌడ్ ఇంటికి రాత్రి రెండు గంటల సమయంలో చేరుకున్నారు. పోలీసులతోపాటు సదరు మహిళ కూడా అక్కడకు వెళ్లింది. అయితే అప్పటికే మద్యం మత్తులో ఉన్న శివ.. వారిని చూసి ఊగిపోయాడు. ఇంటికి పోలీసులను తీసుకుని వస్తావా అంటూ ఆ మహిళపై శివగౌడ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్మాదిలాగా ప్రవర్తించాడు. తన కుమారుడు రిత్విక్(3)ను ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చి అక్కడున్న ఓ ఆటోకేసి కొట్టాడు. ఈ ఘటనతో పోలీసులు సైతం షాక్కు గురయ్యారు. భయంతో భార్య కేకలు వేసినా.. కొడుకుని లాక్కునేందుకు పక్కనున్నవారు యత్నించినా శివ పట్టు వీడలేదు. చివరకు స్థానికులు గుమిగూడటంతో భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన రిత్విక్ను నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం బాలుడిని శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. శివపై ఫిర్యాదు చేసేందుకు భార్య సిద్ధంగా లేకపోవటంతో.. కేసును సుమోటోగా స్వీకరించి నిందితుడు శివగౌడ్ను అరెస్టు చేశారు. -
మద్యం మత్తులో ఉన్మాదిలా మారిన తండ్రి
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement