-
దార్శనికుడి దూరదృష్టి
సాక్షి, అమరావతి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన వారంతా హైదరాబాద్, పరిసర మూడు జిల్లాల అభివృద్ధిపైనే దృష్టిసారించగా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ సాంప్రదాయానికి స్వస్తి పలికి అది ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా విస్తరింప చేశారు. సహజ వనరులు సమృద్ధిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ పురోగతికి కృషి చేసిన ముఖ్యమంత్రిగా వైఎస్సార్ చరిత్రలో నిలిచారనడంలో అతిశయోక్తి లేదు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెట్టుబడుల్లో సగటున 54 శాతం వృద్ధి నమోదు కావడమే కాకుండా వీటిని ఆకర్షించడంలో 7వ స్థానం నుంచి మొదటి స్థానానికి చేరుకుంది. ఈ స్థాయి వృద్థి రేటును అంతకుముందు కానీ ఆయన తర్వాత కానీ ఏ ముఖ్యమంత్రీ అందుకోలేకపోయారు. పారిశ్రామిక పరుగులు.. గంగవరం పోర్ట్ కేవలం ఏ ఒక్క రంగానికో ప్రాధాన్యం కాకుండా ఐటీ, ఇన్ఫ్రా, ఫార్మా, తయారీ, బయోటెక్నా లజీ, ఎలక్ట్రానిక్స్తోపాటు అత్యంత ముఖ్యమైన వ్యవసాయానికి వైఎస్సార్ పెద్దపీట వేశారు. హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టు, పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ వే, బయోటెక్నాలజీ పార్క్, గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టు, ప్రత్యేక ఆర్థికమండళ్లు, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, కైజెన్ టెక్నాలజీస్ లాంటివి అనేకం ఆయన హయాంలోనే శంకుస్థాపన చేయడమే కాకుండా వైఎస్ చేతుల మీదుగా ప్రారంభం కూడా అయ్యాయంటే పారిశ్రామిక ప్రగతిని ఎలా పరుగులు పెట్టించారో అర్థం చేసుకోవచ్చు. ఇవి కాకుండా ఓడరేవు, నిజాంపట్నం, బందరు పోర్టు, విశాఖ–కాకినాడ పెట్రో కారిడార్, ఎన్టీపీసీ–బీహెచ్ఈఎల్, బ్రహ్మణి స్టీల్స్, లేపాక్షి నాలెడ్జ్ సెంటర్ లాంటి పలు కలల ప్రాజెక్టులకు రూపకల్పన చేసినా ఆయన అకాల మరణంతో వీటిలో చాలా వరకు ఆగిపోయాయి. కొన్ని ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోగా మరికొన్ని పూర్తిగా అటకెక్కాయి. నాడు వైఎస్సార్ శంకుస్థాపన చేసిన బందరు పోర్టు పనులు ఇంతవరకు ప్రారంభం కాకపోగా రాయలసీమను రతనాల సీమగా మార్చే ఎన్టీపీపీసీ–బీహెచ్ఈఎల్ ప్రాజెక్టు మూసివేత దిశగా అడుగులు వేస్తోంది. సిసలైన మహిళా సాధికారత సెజ్లు రాకముందు కూలి పనులకు వెళ్లే మహిళలు ఇప్పుడు పురుషులు కంటే ఎక్కువ సంపాదిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఎలాంటి విద్యార్హతలు లేకపోయినా నెలకు రూ. 8,000 నుంచి రూ. 12,000 వరకు సంపాదిస్తున్నారు. శ్రీసిటీ సెజ్లోనే సుమారు 20,000 మంది మహిళలు పని చేస్తున్నారు. తైవాన్కు చెందిన అపాచీ బూట్ల తయారీ కంపెనీలో సుమారుగా 18,000 మంది పని చేస్తుండగా వీరిలో 52 శాతం మంది మహిళలే ఉన్నారు. వైజాగ్లో ఏర్పాటైన శ్రీలంకకు చెందిన బ్రాండిక్స్ కంపెనీ 20,000 మందికి ఉపాధి కల్పిస్తుంటే అందులో 90 శాతం మంది మహిళలే ఉన్నారు. సెజ్ల రాకతో వెనుకబడిన ప్రాంతాల్లో మహిళలు ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడుతున్నారని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. సెజ్ల వల్ల ఇతర ప్రాంతాల నుంచే ఉపాధి కోసం తడ, సూళ్లూరుపేట, నాయుడుపేటలకు వలస వస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ ప్రాంతాల రూపు రేఖలే మారిపోయాయి. అన్ని వర్గాలను సంతృప్తస్థాయికి తీసుకెళ్లాలన్న దివంగత వైఎస్సార్ దార్శనికతకు ఈ సెజ్లే ప్రత్యక్ష నిదర్శనాలు. ఐటీ జోరు.. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయితే ఐటీ అభివృద్ధి ఆగిపోతుందంటూ దుష్ప్రచారం చేశారు. అయితే వైఎస్ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ రంగం పరుగులు పెట్టింది. ఏటా ఐటీ ఎగుమతులు రెట్టింపు కావడమే కాకుండా అప్పటిదాకా హైదరాబాద్కే పరిమితమైన సాంకేతిక రంగాన్ని చిన్న పట్టణాలకు కూడా విస్తరించారు. విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, కడప, వరంగల్ తదితర ప్రాంతాల్లోనూ ఐటీ జోరు మొదలైంది. విజయవాడలోని మేధా టవర్స్, వైజాగ్లోని ఐటీ టవర్స్ రాజశేఖరరెడ్డి హయాంలో వచ్చినవే. ఇప్పుడు ఈ రెండు ప్రాజెక్టులే విభజిత ఆంధ్రప్రదేశ్కు పెద్ద దిక్కుగా మారడం గమనార్హం. వైఎస్ సీఎంగా ఉండగా ఐటీ ఎగుమతుల్లో 566 శాతం వృద్ధి నమోదైంది. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి ఐటీ ఎగుమతులు విలువ కేవలం రూ.5,025 కోట్లు మాత్రమే. వైఎస్సార్ హయాంలో ఏటా దాదాపు రెట్టింపు వృద్ధి నమోదు చేస్తూ 2009–10 నాటికి రూ.33,482 కోట్లకు చేరాయి. బాబు తొమ్మిదేళ్ల పాలనలో 900 ఐటీ కంపెనీలు వస్తే రాజశేఖరరెడ్డి ఐదేళ్ల కాలంలో ఏకంగా 1,400కిపైగా కంపెనీలు తరలివచ్చాయి. బాబు పాలనలో ఐటీ రంగం ద్వారా 85,000 మందికి ఉపాధి లభిస్తే ఈ సంఖ్య వైఎస్సార్ శకం ముగిసేనాటికి 2,85,000 దాటింది. వైఎస్ మరణించడానికి రెండేళ్ల ముందు నుంచి ఐటీ ఉద్యోగాల కల్పనలో ఏకంగా 50 శాతానికి పైగా వృద్ధి నమోదయ్యేది. ఈ స్థాయి అభివృద్ధిని ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందిపుచ్చుకోలేదు. సెజ్లతో పారిశ్రామిక విప్లవం వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక 13 జిల్లాల్లో 28 సెజ్లను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం, విశాఖల్లో ఫార్మా, ఐటీ సెజ్లను ప్రోత్సహిస్తే కాకినాడలో ఇన్ఫోటెక్, జీఎంఆర్ సెజ్లు, విజయవాడలో ఎల్అండ్టీ హైటెక్ సిటీ (మేథా టవర్స్), నెల్లూరులో కృష్ణపట్నం సెజ్, మాంబట్టు, మేనకూరు, చిత్తూరు జిల్లాలో శ్రీసిటీని ఏర్పాటు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సెజ్ల ద్వారా సుమారు రూ. 70,000 కోట్ల విలువైన ఎగుమతులు జరుగుతున్నాయని అంచనా. శంషాబాద్ ఎయిర్పోర్ట్ 2008లో వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన ఒక్క శ్రీసిటీలోనే ఇప్పుడు 90కిపైగా చిన్న, పెద్ద కంపెనీలు ఏర్పాటై 35,000 మందికి ఉపాధి లభిస్తోంది. 2007లో వైఎస్ ప్రారంభించిన మాంబట్టు సెజ్లో 14,000 మంది పని చేస్తున్నారు. 2008లో ప్రారంభమైన మేనకూరు సెజ్లో పది కంపెనీలు ఏర్పాటు కాగా 7,000 మందికి ఉపాధి లభించింది. వైఎస్ హయాంలోనే ఏర్పాటైన డాక్టర్ రెడ్డీస్, దివీస్, రాంకీ, హెటెరో, అరబిందో లాంటి ఫార్మా సెజ్లతోపాటు విశాఖ, కాకినాడ, విజయవాడల్లో నెలకొల్పిన ఐటీ సెజ్ల్లో వేలాదిమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇవి కాకుండా హైదరాబాద్లో ఏర్పాటైన ఐటీ సెజ్ల ద్వారా కనీసం మరో రెండు లక్షల మందికి ఉపాధి లభించింది. భారీగా పెరిగిన ఎగుమతులు ఐటీ నుంచి బీటీ దాకా.. వ్యవసాయం నుంచి తయారీ వరకు అన్ని రంగాల్లో ఎగుమతులు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో భారీగా పెరిగాయి. గతంలో రూ.5,025 కోట్లుగా ఉన్న ఎగుమతులు వైఎస్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఏకంగా 375 శాతం పెరిగి రూ.73,143 కోట్లకు చేరుకున్నాయి. ముఖ్యంగా ఐటీ, ఫార్మా, ఇంజనీరింగ్, వ్యవసాయం, ఖనిజ రంగాల్లో ఎగుమతులు భారీగా వృద్ధి చెందాయి. 2003–04లో రూ.1,805 కోట్లుగా ఉన్న వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 2009–10 నాటికి రూ.5,833 కోట్లకు పెరిగాయి. ఖనిజాల ఎగుమతులు రూ.862 కోట్ల నుంచి రూ.3,499 కోట్లకు, ఫార్మా రూ.3,753 కోట్ల నుంచి రూ.13,650 కోట్లకు, ఇంజనీరింగ్ రూ.1,368 కోట్ల నుంచి రూ.9,141 కోట్లకు, ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు రూ. 84 కోట్ల నుంచి రూ.3,151 కోట్లకు పెరిగాయి. వైఎస్సార్ అన్ని రంగాలను ప్రోత్సహించారనేందుకు పెరిగిన ఎగుమతులే నిదర్శనం. 2003-04 2009-10 వ్యవసాయం 1,805 5,833 లెదర్ 1,785 1,889 ఖనిజాలు 862 3,499 చేనేత 447 1,613 హస్తకళలు 252 885 ఇంజనీరింగ్ 1,368 9,141 ఎలక్ట్రానిక్స్ 84 3,151 ఐటీ 5,025 33,482 ఫార్మా 3,753 13,650 మొత్తం 15,381 73,143 -
చెదిరిన ‘సిగ్నేచర్’
గ్లోబల్ టెండర్లకు స్పందన కరువు ఫలితం కొత్తగా మరో మిలీనియం టవర్ 2 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణం విశాఖపట్నం : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం అభివృద్ధిలో తనకు మించిన వారే లేరని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలను ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సంస్థలు విశ్వసించడం లేదు. ఆయన చెప్పేవన్నీ కల్లబొల్లి కబుర్లేనన్న నమ్మకంతో ఐటీ పెట్టుబడులకు ముందుకు రావడం లేదు. తెల్లారిలేస్తే భాగస్వామ్య సదస్సుల్లో రూ.లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టడానికి ముందుకు వస్తున్నారని ఊదరగొడ్తున్న సీఎం.. విశాఖలో ఏర్పాటు చేయబోయే సిగ్నేచర్ టవర్ నిర్మాణానికి పిలిచిన గ్లోబల్ టెండర్లకు స్పందనే లేదు. ఏళ్ల తరబడి ఎదురు చూసి, చూసి ఇక ఫలితం లేదని గ్రహించి తమ కలల సిగ్నేచర్ టవర్కు మంగళం పాడుతున్నారు. తాజాగా ఇప్పుడు మరో టవర్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు...! చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ హైటెక్ సిటీ తరహాలో విశాఖలో ఐటీ జంట టవర్లను నిర్మించాలని నిర్ణయించారు. వీటికి మధురవాడ ఐటీ సెజ్ హిల్ నంబరు 3లో సుమారు 17 ఎకరాల స్థలాన్ని ప్రతిపాదించారు. వీటి నిర్మాణానికి రూ.500 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. తొలిదశలో నిర్మించే టవర్కు సిగ్నేచర్ టవర్గా పేరు పెట్టారు. ఇందులో ఆతిథ్య, షాపింగ్, వినోద, ఆహ్లాద కేంద్రాలు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. దీనికి రూ.291 కోట్లు వ్యయం అవుతుందని తేల్చింది. ఏపీఐఐసీతో బిల్ట్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (బీఎఫ్ఓటీ) విధానంలో దీనిని చేపట్టాలని నిర్ణయించి, అమెరికాకు చెందిన జేమ్స్ లాంగ్ లాసల్లే (జెఎల్ఎల్) అనే సంస్థను కన్సల్టెంట్గా నియమించింది. వీటి నిర్మాణానికి ప్రభుత్వం పలుమార్లు గ్లోబల్ టెండర్లను పిలిచినా స్పందన రాకపోవడంతో కంగుతిన్న యంత్రాంగం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సిగ్నేచర్ టవర్ ఏర్పాటయితే అందులో ఎన్నో ఐటీ కంపెనీలు ఏర్పాటవుతాయని ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. కానీ ఆశాభంగమే ఎదురయింది. ఇక సిగ్నేచర్ టవర్ సాధ్యం కాదన్న నిర్ణయానికొచ్చిన ప్రభుత్వం సరికొత్తగా మరో టవర్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. మరో మిలీనియం టవర్ కోసం సిగ్నేచర్ టవర్కు మంగళం పాడేసిన ప్రభుత్వం తాజాగా మిలీనియం టవర్ను ఏర్పాటు చేయాలని తలపోస్తోంది. ఇప్పటికే రుషికొండ ఐటీ హిల్స్ మీద మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక మిలీనియం టవర్ 2016 నుంచి నిర్మాణంలో ఉంది. ఐదంతస్తులో నిర్మిస్తున్న దీని పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయి. ఈ ఏడాది జూన్ నాటికి ఇది పూర్తి కావలసి ఉన్నా కనీసం మరో ఏడెనిమిది నెలలయినా పట్టవచ్చని తెలుస్తోంది. ఈలోగా సిగ్నేచర్ టవర్ షాకివ్వడంతో మరో మిలీనియం టవర్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. రుషికొండ ఐటీ సెజ్లోని హిల్ నంబరు 3లో రెండు లక్షల చదరపు అడుగుల్లో దీనిని నిర్మించాలన్నది తాజా ప్రతిపాదన. దీనికి రూ.80 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కొత్త మిలీనియం టవర్ ఎప్పటికి కార్యరూపం దాలుస్తుందో ఇప్పుడే చెప్పడం కష్టమని అధికార వర్గాలు చెబుతున్నాయి. -
దేశంలో పదేళ్లలో 17 శాతం ఐటీ పెట్టుబడుల వృద్ధి
♦ రూ.53,396 కోట్లతో కర్ణాటక టాప్ ♦ ఏపీ వాటా 12 శాతం; తెలంగాణ వాటా 4 శాతం ♦ రూ.46,200 కోట్ల నుంచి రూ.2.2 లక్షల కోట్లకు! హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : దేశంలో 2005-06లో ఐటీ పెట్టుబడులు రూ.46,200 కోట్లుగా ఉంటే.. 2015-16 నాటికది రూ.2.2. లక్షల కోట్లకు పెరిగింది. పదేళ్లలో 17% వృద్ధిని నమోదు చేసింది. అయితే నాలుగో వంతు పెట్టుబడులు కర్ణాటక రాష్ట్రమే ఆకర్షించిందని అసోచాం నివేదికలో వెల్లడైంది. 2005-06లో రూ.14,337 పెట్టుబడులను ఆకర్షించిన కర్ణాటక.. 14% వృద్ధి రేటుతో 2015-16 నాటికి రూ.53,396 కోట్లకు చేరింది. 48% వృద్ధి రేటుతో రూ.35,300 కోట్ల పెట్టుబడులతో గుజరాత్ 2వ స్థానంలో నిలిచింది. 2005-06లో ఈ పెట్టుబడులు రూ.700 కోట్లు. 2015-16లో రాష్ట్రాల వాటాలను పరిశీలిస్తే.. కేరళ 13%, ఆంధ్రప్రదేశ్ 12%, తమిళనాడు 7%, హరియాణా 5%, మహా రాష్ట్ర 5%, వెస్ట్ బెంగాల్ 4.5%, తెలంగాణ 4%, ఒడిశా 3%, ఉత్తర్ ప్రదేశ్ 2%, మధ్యప్రదేశ్ 1.5% పెట్టుబడులను ఆకర్షించాయని అసోచాం నివేదిక వెల్లడించింది. ‘‘రొబోటిక్స్, సెమీ కండక్టర్ చిప్ డిజైన్, నానో టెక్నాలజీ వంటి విభాగాల్లో కర్నాటక హబ్గా మారింది. మెరుగైన పరిపాలన, లా అండ్ ఆర్డర్, పన్ను రాయితీల వంటివి ఐటీ కంపెనీలు కర్నాటక వైపు మొగ్గు చూపడానికి కారణమని’’ అసోచాం సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ చెప్పారు. మానవ వనరుల సమృద్ధి, ఐటీ నిపుణులు, ప్రతిభావంతులు, నైపుణ్యమైన ఉద్యోగులు, స్నేహపూరిత విధానాలూ కలిసొస్తున్నాయన్నారు. -
'ఐటీ పెట్టుబడులకు హైదరాబాద్ అనుకూలం'
హైదరాబాద్: భౌగోళికంగా, వాతావరణపరంగా ఐటీ పెట్టుబడులకు హైదరాబాద్ నగరం అనుకూలంగా ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. సింగిల్ విండో ద్వారా పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని ఆయన అన్నారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్లో తెలంగాణ ఐటీ పాలసీని ఆవిష్కరించిన సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. ఐటీ పరిశ్రమలకు కావాల్సిన అనుమతులు నిర్ణీత సమయంలో మంజూరు చేశామని ఆయన అన్నారు. ఈ ఏడాదిలో కొత్తగా రాష్ట్రానికి 1691 కంపెనీలు వచ్చాయని చెప్పారు. అన్ని పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతులు ఇచ్చామన్నారు. 20 నెలల క్రితం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు. ప్రతిరంగంలో అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీపై కేసీఆర్ సమీక్ష జీహెచ్ఎంసీపై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 11, 12 తేదీల్లో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. 13న వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, రామగుండం కార్పొరేటర్లకు శిక్షణ ఇప్పించనున్నట్టు తెలిపారు. అదేవిధంగా స్లమ్లెస్ సిటీగా హైదారాబాద్ను మార్చాలని ఆయన అన్నారు. ప్రతి 5 వేల మందికి ప్రజా కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో 4,700 డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించాలని కేసీఆర్ సూచించారు. కాగా, ఈ సమీక్ష సమావేశానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రగులుతున్న క్యాంపస్లు!
మహిళలు వ్యాపారాల్లో రాణించాలి
అభివృద్ధే ప్రధాని మోదీ లక్ష్యం
కాంగ్రెస్ పార్టీలో చేరికలు
సీత్యతండాలో అగ్ని ప్రమాదం
ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి
కాంగ్రెస్, బీఆర్ఎస్ను భూస్థాపితం చేయాలి
Lok sabha elections 2024: ఢిల్లీ గల్లీలు...ఎవరివో!
దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
సరెండర్ చేసినా కుర్చీ వదలరు
తప్పక చదవండి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
Advertisement