breaking news
issf shooting junior cup tournament
-
క్లీన్స్వీప్...
న్యూఢిల్లీ: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) జూనియర్ ప్రపంచకప్ టోర్నమెంట్ను భారత షూటర్లు ఘనంగా ప్రారంభించారు. తొలి రోజు భారత షూటర్లు మొత్తం ఐదు పతకాలను సొంతం చేసుకున్నారు. జూనియర్ మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో భారత్ క్లీన్స్వీప్ చేసింది. టాప్–3లో భారత షూటర్లే నిలిచి స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించారు. అనుష్క ఠాకూర్ పసిడి పతకం నెగ్గగా... అన్షిక రజత పతకాన్ని, ఆద్య అగర్వాల్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. అనుష్క 621.6 పాయింట్లతో అగ్రస్థానంలో, అన్షిక 619.2 పాయింట్లతో రెండో స్థానంలో, ఆద్య 615.9 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచారు. భారత్కే చెందిన సానియా 610.9 పాయింట్లతో ఎనిమిదో స్థానాన్ని దక్కించుకోగా... నిమ్రత్ కౌర్ 604.3 పాయింట్లతో తొమ్మిదో స్థానాన్ని సంపాదించింది. మరోవైపు జూనియర్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో భారత్కు రెండు పతకాలు లభించాయి. దీపేంద్ర సింగ్ షెకావత్ 617.9 పాయింట్లతో రజత పతకం నెగ్గగా... రోహిత్ కన్యాన్ 616.3 పాయింట్లతో కాంస్య పతకాన్ని సాధించాడు. స్వతంత్ర అథ్లెట్గా పోటీపడ్డ రష్యా షూటర్ కామిల్ నురిఖెమెతోవ్ 618.9 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. -
శివమ్ శుక్లాకు మూడో స్వర్ణం
ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ కప్ షూటింగ్ న్యూఢిల్లీ : ఇప్పటికే రెండు స్వర్ణాలు సాధించి ఊపు మీదున్న యువ షూటర్ శివమ్ శుక్లా మరోసారి మెరిశాడు. జర్మనీలోని సుల్లో జరుగుతున్న రెండో ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ కప్ షూటింగ్ టోర్నీ నాలుగో రోజు మంగళవారం తను 25 మీ. ర్యాపిడ్ ఫైర్ పిస్టల్లో స్వర్ణం సాధించాడు. అలాగే ఇదే విభాగంలో జరిగిన టీమ్ ఈవెంట్లో శుక్లా.. అర్జున్ దాస్, సిమర్జిత్ సింగ్తో కలిసి రజతం సాధించాడు. 50మీ. రైఫిల్ 3 పొజిషన్లో అఖిల్ షియోరన్ తృటిలో స్వర్ణం కోల్పోయి రజతంతో సంతృప్తి పడ్డాడు. 25మీ. పిస్టల్ మహిళల జూనియర్ టీమ్ ఈవెంట్లో భారత్ కాంస్యం సాధించింది. ఓవరాల్గా ఈ టోర్నీలో ఇప్పటిదాకా భారత్కు 13 పతకాలు లభించాయి.