breaking news
Ishrat Jahan encounter case
-
‘ఇష్రాత్’ కేసులో మాజీ పోలీసులకు విముక్తి
అహ్మదాబాద్: ఇష్రాత్ జహన్ను బూటకపు ఎన్కౌంటర్ చేశారన్న ఆరోపణలపై దాఖలైన కేసులో మాజీ పోలీసు అధికారులు డీజీ వంజరా, ఎన్కే అమిన్లకు సీబీఐ ప్రత్యేక కోర్టులో ఊరట లభించింది. కేసు విచారణను నుంచి తమను తప్పించాలంటూ వంజరా, అమిన్లు దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు అనుమతించింది. ఈ కేసులో విచారణ జరిపేందుకు గానూ సీబీఐకి గుజరాత్ ప్రభుత్వం అనుమతివ్వని నేపథ్యంలో కోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సీబీఐ విచారణకు ప్రభుత్వం అనుమతినివ్వలేదని.. దీంతో మాజీ పోలీసు అధికారులు దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు అనుమతిస్తున్నామని.. ఈ కేసులో వారికి వ్యతిరేకంగా ఏ చర్యలు తీసుకోరాదని ప్రత్యేక సీబీఐ కోర్టు న్యాయమూర్తి జేకే పాండ్యా చెప్పారు. -
‘ఇష్రత్’ అఫిడవిట్ మార్చటంలో చిదంబరం, మన్మోహన్, సోనియాల పాత్ర..
న్యూఢిల్లీ: ఇష్రత్ జహాన్ ఎన్కౌంటర్ కేసులో అఫిడవిట్ను మార్చాలన్న నిర్ణయాన్ని రాజకీయ స్థాయిలో తీసుకున్నారని అందులో అప్పటి హోంమంత్రి చిదంబరం, నాటి ప్రధాని మన్మోహన్, సోనియాల పాత్ర ఉందని బీజేపీ ఆరోపించింది. ఈ విషయంలో తమ నిష్కళంకత్వాన్ని నిరూపించుకోవాలని కాంగ్రెస్ పార్టీకి సూచించింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అప్పటి యూపీఏ ప్రభుత్వం తన రాజకీయ ప్రత్యర్థిని వేధించేందుకు, అప్పటి గుజరాత్ సీఎం మోదీని అప్రతిష్టపాలు చేసేందుకు సీబీఐని దుర్వినియోగం చేసిందని ధ్వజమెత్తారు. రెండో అఫిడవిట్ మోసపూరితం: జైట్లీ ఇష్రాత్ ఎన్కౌంటర్ కేసులో యూపీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రెండో అఫిడవిట్ మోసపూరితమైనదని మాజీ కేంద్రమంత్రి చిదంబరంపై జెట్లీ ధ్వజమెత్తారు. ఇష్రాత్, ఇతర ఆరోపిత లష్కరే ఉగ్రవాదుల ఎన్కౌంటర్ నిజమైనదేనని బుధవారం టైమ్స్ నౌ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. -
‘ఇష్రత్’రెండో అఫిడవిట్ సరైనదే
♦ తనే బాధ్యత తీసుకుంటానన్న చిదంబరం ♦ పిళ్లైకీ అందులో భాగముందని వ్యాఖ్య ♦ 2009 నాటి నివేదికను పరీక్షించనున్న హోంశాఖ న్యూఢిల్లీ: దేశాన్ని కుదిపేసిన 2004నాటి ఇష్రత్ జహాన్ ఎన్కౌంటర్ కేసులో రెండో అఫిడవిట్లో పేర్కొన్న విషయాలు వందశాతం వాస్తవమని కేంద్ర మాజీ హోం మంత్రి పి. చిదంబరం అన్నారు. ఈ విషయంలో బీజేపీ విమర్శలు చేస్తున్నా.. తన మాటకు కట్టుబడి ఉన్నట్లు చిదంబరం వెల్లడించారు. ‘ఆ ఘటన నివేదిక వచ్చినపుడు (2009లో) కేంద్ర హోం మంత్రిగా నేను బాధ్యత తీసుకుంటా. నాకెంత బాధ్యత ఉందో హోం శాఖ కార్యదర్శిగా ఆయన (జీకే పిళ్లై) బాధ్యత కూడా అంతే. కానీ ఆయన తన వివాదం నుంచి తప్పించుకుంటున్నారు. ఆయన వ్యవహరించిన తీరు నిరాశకు గురిచేసింది’ అని చిదంబరం అన్నారు. ఈ కేసుకు సంబంధించి మొదటి అఫిడవిట్ అస్పష్టంగా, సందిగ్ధంగా ఉన్నందునే రెండో అఫిడవిట్ను కోరాల్సి వచ్చింది. నిఘా వర్గాలు సేకరించిన సమాచారంపైనే కేంద్ర ప్రభుత్వం సందేహాలు వ్యక్తం చేసిందని.. ఇలాంటి నివేదికలను సాక్ష్యంగా పరిగణించలేమని చిదంబరం అన్నారు. నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని.. దీనికి కేంద్రం బాధ్యత వహించదన్నారు. ‘నా ప్రమేయం లేకుండానే తొలి అఫిడవిట్ సిద్ధమైంది. అందులో వాస్తవాలు లేవనిపించింది. హోం సెక్రటరీ, ఐబీ డెరైక్టర్, ఇతర అధికారులతో కలసి చర్చలు జరిపిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగానే రెండో అఫిడవిట్ సిద్ధమైంది’ అని చిదంబరం తెలిపారు. అయినా రెండో అఫిడవిట్లోని ఏ విషయం తప్పుగా ఉందో తనకర్థం కాలేదన్నారు. ఇది వందశాతం సరైనదే. ఈ కేసుకు సంబంధించిన అన్ని ఫైళ్లను తెప్పించుకుని పూర్తిగా సమీక్షించాకే నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 2009లో తొలి అఫిడవిట్ దాఖలు చేసినపుడు ఇషత్త్రో సహా చనిపోయిన వారంతా లష్కరే ఉగ్రవాదులని పేర్కొనగా.. రెండు నెలల తర్వాత దాఖలు చేసిన రెండో అఫిడవిట్లో వారు ఉగ్రవాదులనే విషయంపై స్పష్టత లేదని పేర్కొన్నారు. మరోవైపు, అఫ్జల్ గురు ఉరితీత తమ ప్రభుత్వ హయాంలోనే జరిగినా.. అది సరైన నిర్ణయం కాదని తనకు అనిపించిందన్నారు. అఫ్జల్ది దేశవ్యతిరేకం.. రాజద్రోహం కాదని చిదంబరం పునరుద్ఘాటించారు. మరోవైపు, ఇషత్ ్రజహాన్ ఎన్కౌంటర్లో యూపీఏ సర్కారు దాఖలు చేసిన అఫిడవిట్, ఇతర పత్రాలను కేంద్ర హోం శాఖ పరిశీలించనుంది. అయితే ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించిన అన్ని పత్రాలు లభించలేదని.. అవి ఎక్కడున్నాయో తెలియటం లేదని హోంశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.