breaking news
irctc package
-
ఆద్యంతం.. ఆసక్తికరం ఈ ఆరు రోజుల టూర్..!
మధ్యప్రదేశ్ జ్యోతిర్లింగ దర్శనం. ప్రాచీన కోటల సందర్శనం. సాంచి బౌద్ధ స్థూపం వీక్షణం. ఇండోర్ లాల్బాగ్ ప్యాలెస్. ఉజ్జయిని మహాకాలేశ్వరుడు. భోపాల్ ఆదివాసీ ఆద్యకళల నిలయం. నర్మద తీరాన అహిల్యాబాయి కోట. ఇంకా... ఇంకా ఈ టూర్లో.1వ రోజుసంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ (12707) సాయంత్రం నాలుగన్నరకు కాచిగూడ స్టేషన్లో బయలుదేరుతుంది. రాత్రంతా ప్రయాణం.2వ రోజురైలు ఉదయం 08:15 గంటలకు భోపాల్ రైల్వే స్టేషన్కు చేరుతుంది. రైలు దిగి హోటల్ గదిలో చెక్ ఇన్, ఫ్రెష్ అప్ అయిన తర్వాత రోడ్డు మార్గాన సాంచి స్థూపానికి ప్రయాణం. ఆ తర్వాత భోజేశ్వర్ మహాదేవ్ ఆలయ దర్శనం చేసుకుని తిరిగి భోపాల్కు రావాలి. భోపాల్లోని ట్రైబల్ మ్యూజియం వీక్షణం. రాత్రికి హోటల్లో బస.అశోకుడి పెళ్లి మండపం!సాంచి స్థూపం బౌద్ధ క్షేత్రాల్లో ప్రధానమైనది. మన ప్రాచీన నిర్మాణ శాస్త్ర విజ్ఞానానికి ప్రతీక. యునెస్కో గుర్తించిన వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరానికి 45 కిలోమీటర్ల దూరాన ఉంది. ఇది క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దం నాటి నిర్మాణం. ఈ చారిత్రక నిర్మాణం మౌర్య, బౌద్ధ వాస్తుశైలిల సమ్మేళనం. బుద్ధుని అవశిష్టాన్ని ప్రతిష్ఠించి నిర్మించారు. స్థూపానికి దక్షిణ ముఖ ద్వారానికి దగ్గరగా సాంచి ఆర్కియలాజికల్ మ్యూజియం ఉంది. ఇందులో నాలుగు సింహాల అశోకుని రాజముద్ర, ధర్మచక్రం ఉన్నాయి. అశోక చక్రవర్తి బౌద్ధాన్ని స్వీకరించిన తర్వాత చేసిన గొప్ప నిర్మాణాల్లో ఇది ముఖ్యమైనది. ఇది అశోకుని భార్య దేవి పుట్టిన ప్రదేశం, వారి వివాహం జరిగిన ప్రదేశం కూడా ఇక్కడికి పది కిలోమీటర్ల దూరానున్న విదిశ.. రెండు వందల రూపాయల కరెన్సీ నోట్ను వెనక్కి తిప్పి చూడండి. సాంచిలోని బౌద్ధస్థూపం కనిపిస్తుంది.భోపాల్ మ్యూజియం – ఆదివాసీల ఆద్యకళ (ఆద్యకళా నిలయం)మధ్యప్రదేశ్లో నివసించే ఆదివాసీలు, వారి జీవనశైలికి ఒక మీనియేచర్ రూపమే ఈ ట్రైబల్ మ్యూజియం. ఇందులో స్థానికంగా నివసించే గోంద్, భిల్, భారియా, సహారియా, కోర్కు, కోల్, భైగా ఆదివాసీ జాతుల రోజువారీ వస్తువులు, కళాకృతులు ఉన్నాయి. ఆదిలాబాద్లోని ఆదివాసీలు తయారు చేసే ఢోక్రా శైలి ఇత్తడి బొమ్మలు కూడా ఉన్నాయి. ఆదివాసీలు ధాన్యం నిల్వచేసుకోవడానికి అడవిలోని చెట్ల తీగలతో అల్లిన పెద్ద పెద్ద బుట్టలు ఉంటాయి.భోజ్పూర్ ఈశ్వరుడుభోజేశ్వర మందిరం... ఉన్న ప్రదేశం పేరు భోజ్పుర్. ఇది చిన్న గ్రామం. పారమార రాజు భోజుడు నిర్మించిన ఆలయం ఇది. అయితే ఇక్కడ ఆలయ నిర్మాణం పూర్తయినట్లు కనిపించదు. అర్ధంతరంగా ఆగి΄ోయిందా లేక నిర్మాణం విధ్వంసానికి గురైందా అనే సందేహం వస్తుంది. ఆలయ ప్రాంగణంలో అక్కడక్కడా శిల్పాల విడిభాగాలు కనిపిస్తాయి. ఆ విడిభాగాలు క్షతగాత్రాలు కాదు. ఒక పెద్ద శిల్పం ఆకారం ఉంటుంది, కానీ మెరుగులు లేక అసంపూర్తిగా కనిపిస్తుంది. బహుశా ఈ ఆలయ నిర్మాణాన్ని తలపెట్టిన తర్వాత అనుకోని కారణాలతో నిర్మాణం ఆగి΄ోయి ఉండవచ్చని చరిత్రకారుల అంచనా. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దీనిని నిశితంగా పరిశోధించి మాన్యుమెంట్ ఆఫ్ నేషనల్ ఇం΄ార్టెన్స్గా గుర్తించింది. ఏటా ఇక్కడ శివరాత్రి వేడుక అంబరాన్ని తాకుతుంది.3వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత గది చెక్ అవుట్, ఉజ్జయినికి ప్రయాణం. ఉజ్జయినిలో హోటల్ చెక్ ఇన్. మహాకాలేశ్వర్ ఆలయం, హర్సిద్ధి ఆలయం, మంగళ్నాథ్ ఆలయం, నవ్గ్రహ శని మందిర్, శ్రీచింతామన్ గణేశ్ టెంపుల్, రామ్ఘాట్, శ్రీగద్కాలిక టెంపుల్ దర్శనం, రాత్రికి ఉజ్జయినిలోనే బస.క్షతగాత్ర ఉజ్జయినిప్రాచీనకాలం నుంచి ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం ఇది. పద్దెనిమిది శక్తిపీఠాల్లో ఉజ్జయిని ఒకటి. ద్వాదశ జ్యోతిర్లింగం కూడా. సతీదేవి దేహంలో పై పెదవి పడిన ప్రదేశం ఉజ్జయిని అని చెబుతారు. మహాకాలేశ్వరుడి ఆలయం కూడా ఇక్కడ ప్రసిద్ధి. గుజరాత్ లోని సోమనాథ్ ఆలయం లాగానే ఇది కూడా విధ్వంసాల బారిన పడిన ఆలయం. ఢిల్లీ పాలకుడు ఇల్టుట్మిష్ తన రాజ్యవిస్తరణలో భాగంగా ఉజ్జయిని మీద దండెత్తి విజయం సాధించిన సందర్భంగా ఇక్కడి ప్రాచీన ఆలయాన్ని ధ్వంసం చేశాడు. జ్యోతిర్లింగాన్ని ముక్కలు చేసి సమీపంలోని కోటితీర్థ కుండ్లో విసిరివేశాడని చెబుతారు. మరాఠా రాజోద్యోగి రామచంద్ర బాబా సుఖ్తాంకర్ పునర్నిర్మాణం చేశాడు. కానీ అది కూడా జలాలుద్దీన్, అలాఉద్దీన్ ఖిల్జీల దాడికి గురైంది.ఈ శని క్షేత్రం త్రివేణీ సంగమంనవగ్రహ శని మందిర్ ఉజ్జయినికి ఎనిమిది కిలోమీటర్ల దూరాన ఉంది. ఇక్కడ క్షిప్ర, గండకి, సరస్వతి నదులు కలుస్తాయి. ఈ ప్రదేశాన్ని త్రివేణీ ఉజ్జయిని అంటారు. సాధారణంగా శివాలయం లేదా ఇతర ఆలయాల్లో నవగ్రహాల వేదిక ఉంటుంది. ఇక్కడ నవగ్రహాల కోసమే ఓ ఆలయం ఉంది.సీతమ్మ కొలిచిన గణేశుడుఈ ఆలయం ఉజ్జయినికి ఏడు కిలోమీటర్ల దూరాన ఫతేహాబాద్లో ఉంది. స్వయంభువుగా వెలిసిన ఈ గణేశుడిని కొలిస్తే మనసులోని చింతలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. రామాయణ కాలంలో సీతాదేవి ఈ ప్రదేశంలో కొంతకాలం నివసించిందని, ఆ సమయంలో ఈ గణేశుడిని ప్రార్థించినదని చెబుతారు. ఇక్కడి క్షిప్రానది తీరాన రామ్ఘాట్ కూడా ఉంది. 4వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత గది చెక్ అవుట్, మహేశ్వర్కు ప్రయాణం. అహిల్యాదేవి కోట, నర్మద ఘాట్ దర్శనం తర్వాత ఓంకారేశ్వర్కు ప్రయాణం. ఓంకారేశ్వర్లో హోటల్ లో చెక్ ఇన్ అయిన తర్వాత నడకదూరంలో ఉన్న ఆలయాలను దర్శించుకోవచ్చు. నదిలో పడవ ప్రయాణం చేయవచ్చు. రాత్రి బస ఓంకారేశ్వర్లో.రాతికి పూచిన పూలురాణి అహిల్యాబాయి కోట మహేశ్వర్ పట్టణంలో ఉంది. దాంతో మహేశ్వర్ కోటగా వ్యవహారంలోకి వచ్చింది. ఇది మొత్తం గ్రానైట్ స్టోన్తో చేసిన మరాఠా శైలి నిర్మాణం. నర్మద నది తీరాన శత్రుదుర్భేద్యంగా నిర్మించడమే కాక అత్యంత సునిశితమైన నైపుణ్యంతో నగిషీలు చెక్కారు. కోటలోని ప్యాలెస్ల గోడలకు చెక్కిన పూలు అప్పుడే విచ్చుకున్నట్లున్న తాజా పూల తోరణాల్లా ఉంటాయి. రాతికి పూచిన ఈ పూలు నాటి శిల్పకారుల నైపుణ్యాన్ని నేటి తరానికి తెలియచేస్తున్న ప్రతిబింబాలు. ఈ కోట స్త్రీసాధికారతకు ప్రతీక. రాణి అహిల్యాబాయ్ హోల్కర్ క్రీ.శ 1765 నుంచి 1796 వరకు మాల్వా రాజ్యాన్ని పాలించారు. ఈ కోటలో ఉన్న రాణి ప్యాలెస్ను మ్యూజియంగా మార్చారు. అందులో ఆమె ఆహార్యం, జీవనశైలితోపాటు పాలన రీతి కూడా కళ్లకు కడుతుంది. ఆమె వారసుడు ప్రిన్స్ రిచర్డ్ హోల్కర్ ఈ కోటలోని అహిల్యాబాయి వాడాను హెరిటేజ్ హోటల్గా మార్చారు. మహేశ్వరలో నర్మదాతీరాన విహరిస్తూ అనేక ఆలయాలు, చారిత్రక నిర్మాణాలను దగ్గరగా వీక్షించవచ్చు. 5వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత గది చెక్ అవుట్, ప్రయాణం ఇందోర్ వైపు సాగుతుంది. ఇందోర్లో లాల్బాగ్ ప్యాలెస్, ఖజ్రన గణేశ్ మందిర్ దర్శనం తర్వాత రాత్రి ఎనిమిది గంటలకు ఇందోర్ రైల్వేస్టేషన్కు వచ్చి ట్రైన్ నంబర్ 19301 అంబేద్కర్ నగర్– యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ ఎక్కాలి. ఎనిమిది గంటలకు రైలు బయలుదేరుతుంది. రాత్రంతా ప్రయాణం.లాల్బాగ్ గులాబీల తోటఇందోర్లోని లాల్బాగ్ ప్యాలెస్ కూడా హోల్కర్ రాజవంశ నిర్మాణమే. యాభై ఏళ్ల కిందటి వరకు ఆ రాజవంశమే ఇందులో నివసించింది. ప్రభుత్వ నిర్వహణలో ఉంది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దీనిని మ్యూజియంగా మార్చింది. ఈ ప్యాలెస్లోకి వెళ్లే ముందు మెయిన్ గేట్ నిశితంగా పరిశీలించాలి. యూరోపియన్ శైలిలో బకింగ్హామ్ ప్యాలెస్ను తలపిస్తుంది. ఇక భవనంలోపలి గదులు కూడా ప్రాచ్య ప్రాచాత్య కలబోతగా ఉంటాయి. 76 ఎకరాల్లో విస్తరించిన ప్యాలెస్ ప్రాంగణమంతటినీ చూడడం కష్టమే. కానీ ఇరవై ఎకరాల రోజ్ గార్డెన్ను మిస్ కాకూడదు. అహిల్యాబాయి వాడాను ఆమె వారసుడు హోటల్గా మార్చాడని చెప్పుకున్నప్పుడు అతడి పేరు ప్రిన్స్ రిచర్డ్ హోల్కర్ అని చెప్పుకున్నాం. అప్పుడు కలిగిన సందేహానికి సమాధానం ఈ ప్యాలెస్లో లభిస్తుంది. హోల్కర్ రాజవంశానికి చెందిన తుకోజీరావ్ హోల్కర్ మూడవ భార్య అమెరికన్. పేరు నాన్సీ అన్నే మిల్లర్. తుకోజీ మరణం తర్వాత ఆమె అమెరికాకి వెళ్లిపోయారు. మధ్యప్రదేశ్ జ్యోతిర్లింగ్ దర్శన్ (ఎస్హెచ్ఆర్ 097). ఇది ఆరు రోజుల యాత్ర. భోపాల్, ఉజ్జయిని, ఓంకారేశ్వర్, ఇందోర్ ప్రదేశాలను సందర్శించవచ్చు. హైదరాబాద్, కాచిగూడ స్టేషన్ నుంచి ట్రైన్ నంబరు 12707, సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ బుధవారం సాయంత్రం నాలుగన్నరకు బయలుదేరుతుంది. ఇది వీక్లీ టూర్. కంఫర్ట్ (థర్డ్ ఏసీ)లో సింగిల్ షేరింగ్కి 36 వేలకు పైగా అవుతుంది. ట్విన్ షేరింగ్లో ఒక్కొక్కరికి 20వేలు దాటుతుంది. ట్రిపుల్ షేరింగ్లో ఒక్కొక్కరికి దాదాపుగా 16 వేలవుతుంది. నలుగురు నుంచి ఆరుగురు వరకు బృందంగా ప్రయాణం చేస్తే మరికొంత తగ్గుతుంది.స్టాండర్డ్ (స్లీపర్) కేటగిరీలో సింగిల్ షేరింగ్ సుమారు 34 వేలు, ట్విన్ షేరింగ్లో ఒక్కొక్కరికి సుమారు 18 వేలవుతుంది. ట్రిపుల్ షేరింగ్లో ఒక్కొక్కరికి సుమారు 14 వేలవుతుంది.టూర్ కోడ్:https://www.irctctourism.com/pacakage_descriptionpackageCode=SHR097(చదవండి: పర్యాటకుల తాకిడితో ఉక్కిరిబిక్కిరి అయ్యే టాప్ 10 ప్రదేశాలివే..!) -
బంగారు భారతం..! తప్పక సందర్శించాల్సిన యాత్ర..
ఇండిపెండెన్స్డే రోజు గాంధీజీ హృదయ్కుంజ్...ఆ తర్వాత... రోజుకొకటిగా అనేక ప్రదేశాలు. దేశఐక్యత ప్రతీక స్టాచ్యూ ఆఫ్ యూనిటీ... గాంధీజీ కారాగారం అగాఖాన్ ప్యాలెస్.మరాఠాల శౌర్యానికి ప్రతీక శనివార్వాడా... వావ్ అనిపించే గుజరాత్ మెట్ల బావులు...అదాలజ్ కా వావ్... పఠాన్లోని రాణీ కీ వావ్... దక్కన్ కోసం శంభాజీ నగర్ మినీ తాజ్మహల్. బౌద్ధ చిత్రాల అజంత గుహలు... శిల్పాల ఎల్లోరా... ఝాన్సీలో వీరాంగణ లక్ష్మీబాయ్ కోట.సంక్రాంతి వేడుకల రామ్రాజా టెంపుల్. మొధేరాలో సూర్యుడి మెత్తని కిరణాలు.ఈ టూర్లో మినిమమ్ గ్యారంటీలివి. మన భారతం బంగారు భారతం. అందుకే... ఇది స్వర్ణ భారత్ యాత్ర.1వ రోజురాత్రి ఏడు గంటలకు ఢిల్లీలోని సఫ్దర్జంగ్ రైల్వే స్టేషన్కు చేరాలి. ఎనిమిది గంటలకు రైలు అహ్మదాబాద్కు బయలుదేరుతుంది. రాత్రి భోజనం రైల్లోనే.2వ రోజుఉదయం రైల్లోనే టీ, రిఫ్రెష్మెంట్, బ్రేక్ఫాస్ట్ పూర్తయిన తర్వాత పదకొండు గంటలకు అహ్మదాబాద్ స్టేషన్కు చేరుతుంది. రైలు దిగి హోటల్ గదిలో చెక్ అవ్వాలి. మధ్యాహ్న భోజనం తర్వాత సబర్మతి ఆశ్రమం, అదాలజ్ కా వావ్, సాయంత్రం సబర్మతి రివర్ఫ్రంట్ విహారం తర్వాత హోటల్కు చేరాలి. భోజనం, బస అక్కడే.సబర్మతి తీరాన హృదయ్కుంజ్ అహ్మదాబాద్లో గాంధీజీ నివసించిన ఆశ్రమం సబర్మతి నది తీరాన ఉండడంతో సబర్మతి ఆశ్రమం అనే పేరు వ్యవహారంలోకి వచ్చింది. కానీ గాంధీజీ తన ఇంటికి పెట్టుకున్న పేరు ‘హృదయ్ కుంజ్’. ఐదెకరాల్లో విస్తరించిన ఆశ్రమంలో గాంధీజీ నివసించడానికి ఒక భవనం, వంట కోసం, భోజనాల కోసం, స్వాతంత్య్ర సమరయోధుల సమావేశాల కోసం అనేక భవనాలను నిర్మించారు. ఇప్పుడు కొన్ని భవనాలను మ్యూజియంగా మార్చారు. ఇక రివర్ ఫ్రంట్ అంటే సబర్మతి తీరాన సూర్యోదయం, సూర్యాస్తమయాల వీక్షణను, వాకింగ్కి అనువుగా డెవలప్ చేసిన కారిడార్. మన స్వాతంత్య్రదినోత్సవం నాడు దేశానికి స్వాతంత్య్రం కోసం పోరాడిన గాంధీజీ ఆశ్రమాన్ని, స్వాతంత్య్ర పథక రచనలు జరిగిన ప్రదేశాన్ని సందర్శించిన అనుభూతి అనిర్వచనీయమైనది.వావ్... ఇది బావిఅదాలజ్ కా వావ్. ఇది మెట్ల బావి. ఐదంతస్థుల నిర్మాణం. వర్షాకాలంలో మూడు అంతస్థులు దిగితే నీటిని అందుకోవచ్చు. వేసవిలో ఐదంతస్థుల కిందికి దిగితే కానీ నీరందదు. బయట ఎంత వేడి ఉన్నప్పటికీ ఈ బావి దగ్గర చల్లగా ఉంటుంది. మంచి గాలి వీస్తూ ఆహ్లాదంగా గడపవచ్చు. ఇది గుజరాత్ రాజధాని నగరం గాంధీనగర్కు సమీపంలో ఉంది. మధ్యయుగంలో విదేశాలతో వర్తక వాణిజ్యాలు నిర్వహించే వ్యాపారులు, పర్యాటకులు ఈ ప్రదేశం నుంచి రాకపోకలు సాగించేవారు. వారి సౌకర్యార్థం రాణి రుడాబాయి క్రీ.శ 1498లో దీనిని నిర్మించారు. ఇక్కడ పండుగలకు సంప్రదాయ వేడుకలు నిర్వహిస్తారు.ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత ఎనిమిదిన్నరకు రోడ్డు మార్గాన మొధేరాకు ప్రయాణం. మొధేరా సూర్యదేవాలయ వీక్షణం. లంచ్ తర్వాత పఠాన్కు ప్రయాణం. రాణీ కీ వావ్ విహారం తర్వాత అహ్మదాబాద్కు వచ్చి హోటల్లో భోజనం, బస.పుష్పవతి తీరాన సూర్యదేవాలయంమొధేరాలోని సూర్యదేవాలయం అద్భుతమైన నిర్మాణం. దీని ఆర్కిటెక్చర్ గొప్పతనాన్ని వివరించాలంటే ఒక గ్రంథమే అవుతుంది. గుర్జర శైలి నిర్మాణం ఇది. దీనిని క్రీ.శ 11వ శతాబ్దంలో సోలంకి రాజవంశానికి చెందిన మొదటి భీమదేవుడు నిర్మించాడు. ఆలయం ఎదురుగా పెద్ద నీటి కొలను, దాని చుట్టూ జామెట్రికల్ డిజైన్తో నిర్మించిన మెట్లు మనదేశ నిర్మాణ కౌశలానికి నిదర్శనాలు.సరస్వతి తీరాన రాణీ కీ వావ్రాణీ కీ వావ్ చూస్తే నోరెళ్ల బెట్టి వావ్ అనాల్సిందే. ఇది పఠాన్ నగరంలో సరస్వతి నది తీరాన ఉంది. పఠాన్ నగరం మొధేరాకి 35 కిమీల దూరాన ఉంది. స్టెప్ వెల్ నిర్మాణాల్లో పతాకస్థాయి నిర్మాణం ఇది. ఈ గోడలకున్న శిల్పాలు, రాతిలో చెక్కిన డిజైన్లు చూపుతిప్పుకోనివ్వవు. ఈ గోడల మీదున్న డిజైన్లను చేనేతకారులు చీరల మీద నేస్తారు. యునెస్కో ఈ నిర్మాణాన్ని పదేళ్ల కిందట హెరిటేజ్ సైట్గా గుర్తించింది.]4వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత అహ్మదాబాద్లోని హోటల్ గదిని చెక్ అవుట్ చేసి రైల్వేస్టేషన్కు చేరి రైలెక్కాలి. తొమ్మిదిన్నరకు రైలు ఏక్తానగర్కు బయలుదేరుతుంది. లంచ్ రైల్లోనే. ఒంటిగంటకు రైలు దిగి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వీక్షణానికి వెళ్లాలి. అక్కడ షో చూసి, వెనక్కి వచ్చి రైలెక్కాలి. రాత్రి భోజనం రైల్లోనే. రాత్రి పది గంటలకు రైలు ఖాద్కీ (పూనే) స్టేషన్కు బయలుదేరుతుంది.నర్మద తీరాన ఐక్యత నిర్మాణంసర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ మన దేశానికి భౌగోళిక రూపాన్నిచ్చిన ఆర్కిటెక్ట్. నర్మద నది తీరాన ఉన్న స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దాదాపు ఆరువందల అడుగుల విగ్రహం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం. ఇది పటేల్ నూటయాభైవ జయంతి ఏడాది. పటేల్ విగ్రహం తయారీకి శిల్పికి ఒక డిజైన్ ఇవ్వడానికి చరిత్రకారులు, కళాకారులు, విద్యావేత్తల బృందం పని చేసింది. ఈ విగ్రహం ఉన్న ప్రదేశం పేరు కెవాడియా. ఇక్కడి రైల్వేస్టేషన్కి అదే పేరు. ఇప్పుడు దీనిని ఏక్తానగర్గా మార్చారు.5వ రోజుఉదయం ట్రీ, బ్రేక్ఫాస్ట్ తర్వాత తొమ్మిది గంటలకు రైలు ఖాద్కీ స్టేషన్కు చేరుతుంది. రైలు దిగి ఆగాఖాన్ ప్యాలెస్ సందర్శనానికి వెళ్లాలి. హోటల్లో చెక్ ఇన్ అయ్యి, మధ్యాహ్న భోజనం తర్వాత కాస్బా గణపతి, లాల్ మహల్, శనివార్ వాడాల్లో పర్యటించి హోటల్కు చేరాలి. రాత్రి భోజనం, బస అక్కడే.మూలనది తీరం గాంధీజీ కారాగారంఅగాఖాన్ ప్యాలెస్ పూనేలో ఉంది. క్విట్ ఇండియా ఉద్యమకాలంలో మహాత్మా గాంధీ, కస్తూర్బా గాంధీ, సరోజినీ నాయుడుతో΄ాటు అనేక మంది స్వాతంత్య్ర సమరయోధులు ఇక్కడ కారాగార శిక్షను అనుభవించారు. కస్తూర్బా గాంధీ ఇక్కడే తుదిశ్వాస వదిలారు. ప్యాలెస్ ప్రాంగణంలో కస్తూర్బా సమాధి, గాంధీజీ చితాభస్మ సమాధి ఉన్నాయి. ప్యాలెస్లో క్విట్ ఇండియా ఉద్యమ చిహ్నంగా విగ్రహం ఉంది.ఛత్రపతుల కోట శనివార్ వాడాశనివార్ వాడా మరీ ప్రాచీనమైనదేమీ కాదు, 18వ శతాబ్దపు నిర్మాణం. సరైన నిర్వహణ లేక కొంతకాలం కళ తప్పింది. ఇప్పుడు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహణలోకి వచ్చిన తరవాత కళను సంతరించుకుంటోంది. ఇది ఏడంతస్థుల నిర్మాణం. మరాఠా వీరుల శౌర్యానికి ప్రతీకగా పీష్వా మొదటి బాజీరావ్ విగ్రహం ఉంది. ఢిల్లీలోని మొఘల్ పాలకులకు ఎదురు నిలబడి దీటుగా బదులిస్తున్నట్లు ఉండాలనే ఉద్దేశంతో ఈ కోటను ఉత్తరాభిముఖంగా నిర్మించాడు ఛత్రపతి షాహు.6వ రోజుఆరవ రోజు: ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసుకుని హోటల్ గది చెక్ అవుట్ చేసి ఎనిమిది గంటలకంతా భీమశంకర్ జ్యోతిర్లింగ దర్శనానికి బయలుదేరాలి. దారిలో లంచ్ చేసుకుని, ఆ తర్వాత ఆలయ దర్శనం చేసుకుని ఖాద్కీ రైల్వేస్టేషన్కు చేరి రైలెక్కాలి. భోజనం, బస రైల్లోనే. రైలు రాత్రి పది గంటలకు ఛత్రపతి శంభాజీ నగర్ (ఔరంగాబాద్)కు బయలుదేరుతుంది.ప్రకృతి ఒడిలో భీమశంకరుడుద్వాదశ జ్యోతిర్లింగాల్లో భీమశంకర్ ఒకటి. ఇది పూనేకి 50 కిలోమీటర్ల దూరాన సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో దట్టమైన అడవిలో ఉంది.7వ రోజుఉదయం టీ, రిఫ్రెష్మెంట్, బ్రేక్ఫాస్ట్ పూర్తయిన తర్వాత రైలు ఛత్రపతి శంభాజీ నగర్కు చేరుతుంది. రైలు దిగి బీబీ కా మఖ్బారా వీక్షణానికి వెళ్లాలి. ఆ తర్వాత హోటల్ గదిలో చెక్ ఇన్, లంచ్. ఆ తర్వాత ఎల్లోరా గుహలు చూసుకుని ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్లాలి. రాత్రి భోజనం, బస హోటల్లో.శంభాజీ నగర్ మినీ తాజ్మహల్మరాఠా సామ్రాజ్యాన్ని ఏలిన రెండవ ఛత్రపతి శంభాజీ భోసాలే పేరుతో ఔరంగాబాద్ నగరానికి శంభాజీ నగర్ అని పేరు పెట్టారు. ఇక్కడ ఔరంగజేబు మనుమడు అజమ్ షా తన తల్లి దిల్రాస్ బాను బేగం కోసం తాజ్ మహల్ నమూనాలో నిర్మించిన బీబీ కా మఖ్బారా (మినీ తాజ్మహల్) పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్. ఇక్కడ పాన్ ఫేమస్. స్టార్ పాన్ షాప్ నుంచి అరబిక్ దేశాలకు పాన్లు ఎగుమతి అవుతాయి. అత్యంత ఖరీదైన ఎక్స్΄ోర్ట్ క్వాలిటీపాన్ ధరలు వేలల్లో ఉంటాయి. ఈ టూర్ గుర్తుగా తక్కువలో తక్కువగా వచ్చే పాతిక రూపాయల పాన్ అయినా రుచి చూడాలి.8వ రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత హోటల్ గది చెక్ అవుట్ చేసి రోడ్డు మార్గాన అజంతా గుహలకు వెళ్లాలి. అజంతా గుహల సందర్శన తర్వాత మధ్యాహ్న భోజనం, ఆ తర్వాత భుసావల్ రైల్వేస్టేషన్కు వెళ్లి రైలెక్కాలి. రైలు సాయంత్రం ఆరు గంటలకు ఝాన్సీకి బయలుదేరుతుంది. రాత్రి భోజనం, బస రైల్లోనే. బౌద్ధ చిత్రాల అజంతఎల్లోరా– అజంతా గుహలు మనదేశంలో బౌద్ధం పరిఢవిల్లిందని చెప్పడానికి మనకున్న గొప్ప చారిత్రక ఆధారాలు. యునెస్కో ఈ గుహలను వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది. ఇందులో కొన్ని గుహలు చైత్యాలు. అంటే ప్రార్థన మందిరాలు. కొన్ని విహారాలు... అంటే నివాస ప్రదేశాలు. రంగురంగుల పెయింటింగ్స్ కోసమే ఈ గుహలకు వెళ్లాలి. ఎల్లోరా గుహల్లో శిల్పాలుంటాయి. అజంతాగుహలు చిత్రాలకు ప్రసిద్ధి.9వ రోజుఉదయం టీ, బ్రేక్ఫాస్ట్ తర్వాత ఏడుగంటలకు రైలు వీరాంగణ లక్ష్మీబాయ్ ఝాన్సీ రైల్వే స్టేషన్కు చేరుతుంది. రైలు దిగి ఓర్చాలో హోటల్ గదికి వెళ్లి రిఫ్రెష్మెంట్ తర్వాత చెక్ అవుట్ చేయాలి. ఓర్చాలో ఉన్న రామ్ రాజా టెంపుల్, చతుర్భుజ టెంపుల్, జహంగీర్ మహల్ చూసుకుని లంచ్ తర్వాత ఝాన్సీ వైపు సాగి΄ోవాలి. ఝాన్సీ కోట, మ్యూజియం సందర్శన తర్వాత ఝాన్సీ రైల్వే స్టేషన్కు చేరుకుని రైలెక్కాలి. రైలు రాత్రి తొమ్మిది గంటలకు ఢిల్లీ, సఫ్దర్జంగ్ స్టేషన్కు బయలుదేరుతుంది. రాత్రి భోజనం, బస రైల్లోనే.ఉత్తరాదిలో సంక్రాంతి వేడుకరామ్ రాజా మందిర్... ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రం, ఓర్చా పట్టణంలో ఉంది. ఓర్చా టెంపుల్గా వ్యవహారంలోకి వచ్చింది. ఈ ఆలయంలో ఏటా శైవ, వైష్ణవ పర్వదినాలతోపాటు మకర సంక్రాంతి వేడుకలు కూడా నిర్వహిస్తారు, రాముడి ఆలయం. రాముడి ఆలయం అంటే ధనుర్ధారిౖయె సీతాలక్ష్మణ సమేతంగా అడవుల బాట పట్టిన కోదండ రాముడి రూపమే ఉంటుంది. ఇక్కడ మాత్రం రాముడు రాజు హోదాలో పూజలందుకుంటున్నాడు. ఇక్కడ ఉన్న శిల్పాల సముదాయాన్ని చూస్తే అరణ్యవాసం, రామరావణ యుద్ధం పూర్తయిన తర్వాత అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం చేసుకున్న రాముడిని తలపిస్తుంది. ఆలయ నిర్మాణం కూడా అంతఃపురాన్ని ΄ోలి ఉంటుంది.ఝాన్సీ కోటలో రాణిమహల్ఝాన్సీ కోట శత్రుదుర్భేద్యంగా ఉంటుంది. కానీ ప్యాలెస్లు నిరాడంబరంగా ఉంటాయి. చతుర్భుజి ఆకారంలో రెండతస్థుల భవనం, మధ్యలో బావి, ఫౌంటెయిన్, లాన్, గదుల్లోపల గోడలకు చక్కటి పెయింటింగులతో ఝాన్సీ రాణి లక్ష్మీబాయ్ ప్యాలెస్ అందంగా ఉంటుంది. బ్రిటిష్ సైన్యంతో ΄ోరాడిన ధీర మహిళ లక్ష్మీబాయ్. ఆమె యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధమై, బిడ్డను వీపుకు కట్టుకుని కోట గోడ మీద నుంచి అమాంతం గుర్రం మీదకు దూకిన ప్రదేశాన్ని చూపిస్తారు. ఝాన్సీలో ప్రభుత్వం నిర్వహిస్తున్న మ్యూజియంలో టెర్రకోట బొమ్మలు, లోహపు బొమ్మలు, ఆయుధాలు, శిల్పాలు, చేతి రాత ప్రతులు, చిత్రలేఖనాలు, బంగారు, వెండి, రాగి నాణేలు, లోహపు విగ్రహాలు, దుస్తులను చూడవచ్చు. 10వ రోజుఉదయం ఆరు గంటలకు రైలు ఢిల్లీలోని సఫ్దర్గంజ్ స్టేషన్కు చేరుతుంది. టీ తర్వాత రైలు దిగడంతో పర్యటన పూర్తవుతుంది.స్వర్ణిమ్ భారత్ యాత్ర (సీడీబీజీ 30), ఇది పది రోజుల టూర్. ఆగస్ట్ 14న మొదలై 23వ తేదీతో పూర్తవుతుంది. ఇందులో అహ్మదాబాద్, మొథేరా, పూనే, ఔరంగాబాద్, ఓర్చా, ఝాన్సీ ప్రదేశాలు కవర్ అవుతాయి. టూర్ కోడ్... SWARNIM BHARAT YATRA (CDBG30) -
రైల్వేలో ఫుడ్ కేటరింగ్ మెరుగుపడనుందా..?
రైల్వే ప్రయాణీకులకు మరింత మెరుగైన ఫుడ్ క్యాటరింగ్ సర్వీసులు అందించేందుకు భారతీయ రైల్వే క్యాటరింగ్, టికెటింగ్ అండ్ టూరిజం విభాగం ఐఆర్సీటీసీ కట్టుబడి ఉంది. ఇందుకోసం తాజాగా ఐటీసీ, టాటా గ్రూప్, హార్వెస్ట్ గోల్డ్తో జతకట్టింది. ఈ సహకారం వల్ల రైళ్లలో ఆహార ఆఫర్లను పునరుద్ధరించడం, ప్రయాణీకులకు అధిక నాణ్యమైన భోజనాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.ఇప్పటికే ఐఆర్సీటీసీ 90 పట్టణాలు, 100 రైల్వే స్టేషన్లలో వేలాది మంది వినియోగదారులకు ఫుడ్ అగ్రిగేటింగ్ ప్లాట్ఫామ్ జొమాటోతో సహకారం కుదుర్చుకుని సేవలందిస్తోంది. తాజాగా ఐటీసీ, టాటా గ్రూప్, హార్వెస్ట్ గోల్డ్తో చేసుకున్న ఒప్పందం రైళ్లలో లభించే ఆహారం నాణ్యతను పెంచుతుందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఐఆర్సీటీసీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ జైన్ మాట్లాడుతూ..‘ప్రస్తుతం రోజుకు 16 లక్షల భోజనాలను అందిస్తున్నాం. జోజనం మెనూను మెరుగుపరచడం కోసం కస్టమర్ల నుంచి నిరంతరం ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నాం. మెనూను అప్డేట్ చేసి ఫుడ్ ఆఫర్ ట్రయల్స్ త్వరలో నిర్వహిస్తాం. ఇందుకోసం తాజాగా ప్రముఖ కంపెనీలతో చేసుకున్న ఒప్పందం ఎంతో ఉపయోగపడుతుంది’ అన్నారు.ఇదీ చదవండి: ఆహార ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు సమగ్ర ప్యాకేజీచిన్న పరిశ్రమలకు మద్దతుకేటరింగ్, టూరిజం విభాగంలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు (ఎంఎస్ఈ) చేయూతనిచ్చేందుకు ఐఆర్సీటీసీ కట్టుబడి ఉందని స్పష్టం చేసింది. వస్తువులు, సేవల కోసం సుమారు 63% ఎంఎస్ఈలపైనే ఆధారపడుతున్నట్లు ఐఆర్సీటీసీ తెలిపింది. ఇది ప్రభుత్వం నిర్దేశించిన 25% కంటే చాలా ఎక్కువ. ఎంఎస్ఈలతోపాటు సంస్థ వృద్ధిపై ఐఆర్సీటీసీ దృష్టి సారించినట్లు పేర్కొంది. -
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్, రూ.20కే కడుపు నిండా భోజనం!
ట్రైన్ జర్నీ చేసే చాలామంది కొన్ని సందర్భాల్లో ఫుడ్ కోసం ఇబ్బందిపడే ఉంటారు. అధిక ధరలు లేదా నాణ్యత లేకపోవడం వంటివి నిజ జీవితంలో ఎదురై ఉండే అవకాశం ఉంది. అయితే ఇలాంటి వాటికి 'ఐఆర్సీటీసీ' (IRCTC) చరమగీతం పాడటానికి సిద్ధమైంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ప్రయాణికుల కోసం రైల్వే ఓ కొత్త విధానం తీసుకువచ్చింది. సరసమైన ధరతోనే ప్రయాణికులకు మంచి భోజనం అందించాలనే సదుద్దేశ్యంతో రైల్వే బోర్డు ఇప్పటికే డివిజనల్ యూనిట్లకు 'రైల్వేస్ జనతా ఖానా' ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సర్వీస్ కేవలం 'నార్త్ వెస్ట్రన్ రైల్వే జైపూర్ జంక్షన్'లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ సదుపాయం రానున్న రోజుల్లో మరింత విస్తరించడానికి ప్రణాళికలు చేపడుతున్నారు. (ఇదీ చదవండి: బీచ్లో చిల్ అవుతున్న మస్క్, జుకర్బర్గ్.. ఏంటి, కలిసిపోయారా?) రైల్వేస్ జనతా ఖానా.. ఐఆర్సీటీసీ ఈ ఫుడ్ రెండు కేటగిరీలలో అందించనుంది. 7 పూరీలు (175 గ్రామ్స్), పొటాటో వెజిటేబుల్స్ (150 గ్రామ్స్), ఊరగాయ (12 గ్రామ్స్) వంటివి కేవలం రూ. 20 మాత్రమే. అయితే రూ. 50 కాంబో ప్యాక్లో 350 గ్రామ్స్ రాజ్మా లేదా రైస్, పాప్ బాజీ, మసాలా దోశ, కిచిడి మొదలైనవి ఉంటాయి. ఇక 200 మీలీ వాటర్ బాటిల్ ఖరీదు కేవలం రూ. 3 మాత్రమే. ఈ కొత్త విధానం సమర్థవంతంగా సాగితే ప్రయాణికులకు చాలా అనుకూలంగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. -
ఐఆర్సీటీసీ స్వదేశ్ దర్శన్ పర్యాటక రైళ్లు.
సాక్షి, హైదరాబాద్: ఉత్తరాదిలోని పుణ్యక్షేత్రాల పర్యటనకు స్వదేశీ దర్శన్ పర్యాటక రైళ్లను నడపనున్నట్లు ఐఆర్సీటీసీ జనరల్ మేనేజర్ శ్రీనివాస్, డిఫ్యూటీ జనరల్ మేనేజర్ కిషోర్ తెలిపారు. కోవిడ్ అనంతరం అన్ని రకాల జాతీయ, అంతర్జాతీయ పర్యటనలను పునరుద్ధరించేందుకు ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు. ఈ మేరకు గురువారం సికింద్రాబాద్లోని ఐఆర్సీటీసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కొద్ది రోజులుగా పర్యాటకుల రద్దీ పెరిగిందని, ప్రజలు పెద్ద సంఖ్యలో ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాలకు, పుణ్యక్షేత్రాలకు తరలి వెళ్తున్నారన్నారు. గత ఏప్రిల్లోనే రూ.1.5 కోట్ల ఆదాయం లభించినట్లు తెలిపారు. గతేడాది సుమారు 50 వేల మంది ఐఆర్సీటీసీ ప్యాకేజీలను వినియోగించుకున్నారని, ఈ ఏడాది 70 వేల మందికి పైగా ఐఆర్సీటీని ద్వారా జాతీయ, అంతర్జాతీయ టూర్లకు వెళ్లే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. ఐఆర్సీటీసీ టూర్లు ఇవీ... తిరుపతి, విజయవాడ, సికింద్రాబాద్ మీదుగా ఈ నెల 27న స్వదేశీ దర్శన్ రైలు బయలుదేరనుంది. జూన్ 3వ తేదీ వరకు పర్యటన కొనసాగుతుంది. ఈ టూర్లో ఆగ్రా, మధుర, వైష్ణోదేవి ఆలయం, అమృత్సర్, తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. అన్ని రకాల సదుపాయాలతో స్లీపర్ క్లాస్ రూ.18,120, ఏసీ క్లాస్ రూ.22,165 చొప్పున ప్యాకేజీ ఉంటుంది. మరో ట్రైన్ మహాలయ పిండదాన్– సికింద్రాబాద్ నుంచి సెప్టెంబర్ 15న బయలుదేరి 20న తిరిగి చేరుకుంటుంది. ఈ పర్యటనలో వారణాసి, ప్రయాగ్, గయ, తదితర ప్రాంతాలను సందర్శిస్తారు. స్లీపర్ రూ.14,485, ఏసీ రూ.18,785 చొప్పున చార్జీ ఉంటుంది. అన్ని సదుపాయాలు ఉంటాయి. షిరిడి సాయి దర్శనానికి, తిరుపతి పుణ్యక్షేత్రానికి, ఒడిషా జగన్నాధ రథయాత్రకు ప్రత్యేక డొమెస్టిక్ పర్యాటక ప్యాకేజీలను కూడా సిద్ధం చేశారు. కేరళ, జమ్ముకాశ్మీర్, అస్సామ్, మేఘాలయ, తదితర ప్రా ంతాలకు ప్రత్యేక ప్యాకేజీలను ఐఆర్సీటీసీ సిద్ధం చేసింది. అంతర్జాతీయ పర్యటనల్లో భాగంగా రాయల్ నేపాల్ టూర్ ను అందుబాటులోకి తెచ్చారు. జూన్ 26 నుంచి 5 రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. అన్ని వసతులతో కలిపి రూ.40 వేల వరకు చార్జీ ఉంటుంది. (చదవండి: మాస్కు మస్ట్... ఆలస్యమైన అనుమతించరు) -
తిరుమల సందర్శకులకు తీపికబురు!
తిరుమల తిరుపతి వెళ్లే శ్రీవారి భక్తులకు శుభవార్త. ఐఆర్సీటీసీ టూరిజం పంచదేవాలయం టూర్ పేరుతో సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీ కింద తిరుమలలోని శ్రీవారి దర్శనంతో పాటు తిరుచానూర్, శ్రీనివాస మంగాపురం, కాణిపాకం, శ్రీకాళహస్తి వంటి పుణ్య క్షేత్రాలను దర్శనం చేసుకోవచ్చు. భక్తులు తిరుపతి చేరుకున్న తర్వాత నుంచి ప్యాకేజీ మొదలవుతుంది. తిరుపతికి చేరుకునే భక్తులు శ్రీవారి దర్శనంతో పాటు ఇతర ఆలయాలను సందర్శించడం కోసం ఈ ప్యాకేజీని రూపొందించారు. ఇది 1 రాత్రి, 2 రోజుల ప్రత్యేక టూర్ ప్యాకేజీ. పంచదేవాలయం టూర్ ప్యాకేజీలో ట్రిపుల్ ఆక్యుపెన్సీ(ముగ్గరు కలిసి షేర్ చేసుకుంటే ఒక్కొరికి) ధర రూ.5,270 కాగా, డబుల్ ఆక్యుపెన్సీ(ఇద్దరు కలిసి షేర్ చేసుకుంటే ఒక్కొరికి) ధర రూ.7,010, సింగిల్ ఆక్యుపెన్సీ (ఒకరు మాత్రమే) ధర రూ.11,750. ప్యాకేజీలో తిరుపతిలో ఒక రోజు అకామడేషన్, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం, తిరుచానూర్, శ్రీనివాస మంగాపురం, కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాల్లో దర్శనంతో పాటు బ్రేక్ఫాస్ట్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. ఈ ప్యాకేజీ ప్రతీరోజు అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను ఐఆర్సీటీసీ టూరిజం వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. -
కశ్మీర్ సోయగం: ఒక్కొక్కరికి ఎంత ఖర్చంటే!
ఐఆర్సీటీసీ (ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్) నిర్వహించే ‘శ్రీనగర్– గుల్మార్గ్– పహల్గావ్– శ్రీనగర్’ టూర్లో పర్యాటకులను మొదటి రోజు శ్రీనగర్ ఎయిర్పోర్టులో పికప్ చేసుకుంటారు. ఈ పర్యటనలో శ్రీనగర్ షాలిమర్ తోటలు, శంకర్ నారాయణ్ టెంపుల్, గుల్మార్గ్ (గౌరీ మార్గ్), పహల్గావ్లోని కుంకుమ పువ్వు తోటల్లో విహారం, అవంతిపురా పర్యటన, థాజ్వాస్ గ్లేసియర్ తీరాన గుర్రపు స్వారీ, శ్రీనగర్లో శికారా రైడ్ ఉంటాయి. చివరి రోజు తిరిగి శ్రీనగర్ ఎయిర్పోర్టులో డ్రాప్ చేస్తారు. ఇవి ఉండవు! ఈ ప్యాకేజ్లో విమాన ప్రయాణ చార్జీలు కలిసి లేవు. శ్రీనగర్కు వెళ్లడానికి, శ్రీనగర్ నుంచి తిరిగి స్వస్థలం రావడానికి విమాన టిక్కెట్లను పర్యాటకులు సొంతంగా బుక్ చేసుకోవాలి. శ్రీనగర్లో దిగినప్పటి నుంచి తిరిగి విమానాశ్రయానికి చేర్చే వరకు రవాణా ప్యాకేజ్లో ఉంటుంది. అలాగే ఉదయం బ్రేక్ఫాస్ట్, సాయంత్రం డిన్నర్ కూడా ప్యాకేజ్లోనే. ఈ పర్యటనకు ఏప్రిల్ నుంచి జూలై వరకు పీక్ సీజన్. జనవరి నుంచి మార్చి వరకు పీక్ సీజన్ కాకపోవడంతో పర్యాటకుల తాకిడి తక్కువ. ఆరు రోజుల (ఐదు రాత్రులు) ఈ ప్యాకేజ్లో ఒక్కరికి 35 వేలవుతుంది. డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరికి 18 వేలవుతుంది. ముగ్గురు కలిసి వెళ్లినప్పుడు ఒక్కొక్కరికి 15 వేలకు మించదు. పీక్ సీజన్లో ప్యాకేజ్ చార్జ్లు మరో రెండు వేలు పెరుగుతాయి. గమనిక: పర్యాటకులు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. పోస్ట్పెయిడ్ సిమ్కార్డు ఉండాలి. ప్యాకేజ్ పేరు ‘శ్రీనగర్– గుల్మార్గ్– పహల్గావ్- శ్రీనగర్ ప్యాకేజీ. -
3 నైట్స్/4 డేస్... ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ
కాచిగుడ : తిరుమల తిరుపతి వెంకటేశుని దర్శించుకోవాలని చాలా మందికి ఎంతో ఆశగా ఉంటుంది. ఈ దేవుడిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడ నుంచో వస్తుంటారు. తాజాగా హైదరాబాద్ నుంచి వెంకటేశుని దర్శించుకోవడానికి వెళ్లాలనుకునే వారికి దేశీయ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) ఓ స్పెషల్ టూర్ ప్యాకేజీ ప్రకటించింది. కాచిగుడా నుంచి రూ.5400 ప్రారంభ ధరకు నాలుగు రోజుల టూర్ ప్యాకేజీ ప్రారంభమవుతుందని ట్వీట్ ద్వారా తెలియజేసింది. బాలాజి దేవస్థానంతో పాటు ఆ పక్కనే దగ్గరిలో ఉన్న కాణిపాక వినాయక దేవాలయం, శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వంటివి ఈ ప్యాకేజీలో భాగంగా దర్శించుకుని రావచ్చట. మూడు రోజులు, నాలుగు రోజులు కలిగిన ఈ టూర్ ప్యాకేజీ ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటుంది. ‘వెంకటాద్రి’ పేరుతో ఐఆర్సీటీసీ వెబ్సైట్లో ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ‘వెంకటాద్రి’ టూర్ ప్యాకేజీ వివరాలు... ఈ టూర్ ప్యాకేజీలో కవర్ చేసే గమ్యస్థలం తిరుపతి. ట్రైన్, రోడ్డు మార్గన ప్రయాణానికి ఈ ప్యాకేజీ వర్తిస్తుంది. ప్రతి శుక్రవారం రాత్రి 8.05లకు కాచిగుడ రైల్వే స్టేషన్ నుంచి రైలు బయలుదేరుతుంది. 3 ఏసీ, స్లీపర్ క్లాస్ టిక్కెట్లు ఈ ఆఫర్ కింద అందుబాటులో ఉంటాయి. స్టాండర్డ్ క్లాస్ కింద ఒక్కో వ్యక్తి ఈ టూర్ ఖర్చు రూ.5750 అవుతుంది. కంపోర్ట్ క్లాస్ కింద టూర్ ఖర్చు ఒక్కో వ్యక్తికి రూ.9038 అవుతుంది. యాత్రికులు/పర్యాటకులందరూ కూడా తమ వెంట ఒరిజినల్ ఐడీ కార్డులు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ ఒరిజినల్ ఐడీ కార్డులు చూపించకపోతే, టీటీడీ సిబ్బంది భక్తులను వెంకటేశుడి దర్శనానికి అనుమతించరు. -
ఐఆర్సీటీసీ నుంచి హెలికాప్టర్ సర్వీసులు!
ఐఆర్సీటీసీ అనగానే కేవలం రైళ్ల టికెట్లు బుక్ చేసుకోడానికే అనుకుంటాం కదూ.. కానీ ఇప్పుడు సరికొత్త సేవల్లోకి కూడా ఈ సంస్థ దిగుతోంది. ముంబై నగరాన్ని హెలికాప్టర్లోంచి చూపించే సౌకర్యాన్ని ఐఆర్సీటీసీ కల్పిస్తోంది. రెండు రోజుల క్రితమే ఈ సేవను ప్రారంభించారు. ముంబై నగరాన్ని ఒక్కసారి హెలికాప్టర్లో అలా చుట్టి రావాలంటే.. రూ. 5,580 చార్జీ అవుతుందని ఐఆర్సీటీసీ రీజనల్ డైరెక్టర్ వీరేందర్ సింగ్ తెలిపారు. జుహు ఏరోడ్రమ్ నుంచి హెలికాప్టర్ ఎక్కి అలా చుట్టు తిరగొచ్చు. మంగళ, శుక్రవారాల్లో దక్షిణ ముంబై పర్యటన ఉంటుంది. జుహు, బాంద్రా-వర్లి సీలింక్, హజీ అలీ ప్రాంతాలు ఇందులో కవర్ అవుతాయి. ఉత్తర ముంబై మార్గానికి సోమ, శనివారాల్లో ట్రిప్పులుంటాయి. అందులో జుహు, వెర్సోవా, మలాడ్, గొరాయ, పగోడా, ఎస్సెల్ వరల్డ్ ప్రాంతాలు కవరవుతాయి. హెలికాప్టర్ సముద్రమట్టానికి వెయ్యి అడుగుల ఎత్తున ఎగురుతుంది కాబట్టి ఇదంతా చాలా సరదాగా ఉంటుందని వీరేందర్ సింగ్ చెప్పారు.