breaking news
international support
-
అంతర్జాతీయ సంఘీభావమే ఆయుధం
రష్యన్ నియంత పుతిన్కి వ్యతిరేకంగా నిలబడాలంటే మాకు ప్రస్తుతం ఉన్న గొప్ప ఆయుధాలు ఏవంటే – అంతర్జాతీయ సంఘీభావం, మద్దతు మాత్రమే! బయటినుంచి మద్దతు లేకుండా మేం గెలుపు సాధించలేం. ఉక్రెయిన్ చరిత్రలోనే కాదు, ప్రజాస్వామ్య రక్షణ కోసం కూడా ఇది కీలకమైంది. ఇది ఉక్రెయిన్కి, రష్యాకి మధ్య ప్రాంతీయ ఘర్షణ ఏమాత్రం కాదు. నిరంకుశత్వానికీ, సామ్రాజ్యవాదానికీ వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం ఇది. ఉక్రెయిన్ కోసం మేం చేస్తున్న పోరాటంలో విజయం అనివార్యమని నేను బలంగా నమ్ముతున్నాను. తమ స్వాతంత్య్రం కోసం, ఆత్మగౌరవం కోసం సామాన్యులైన ఉక్రెయిన్ పౌరులు తమకు సంబంధించిన సమస్తాన్నీ అందిస్తున్నప్పుడు, విజయం ఒక్కటే మాకు దక్కాల్సి ఉంది. మక్సీమ్ కురొచ్కిన్ ఒక నాటక రచయిత. ఈయన, మరో 20 మంది నాటక రచయితలు కలిసి పాత కీవ్ నడిబొడ్డున ఒక కొత్త రంగస్థలాన్ని నిర్మించాలని దాదాపు మూడేళ్లుగా ప్లాన్ చేస్తున్నారు. మార్చి 12న నాటక రచయితల థియేటర్ని ప్రారంభించడం కోసం, ఒక అద్భుతమైన పాత నిర్మాణాన్ని వారు కనుగొన్నారు. కానీ ఫిబ్రవరి 24నే మక్సీమ్, ఆయన సహచరులు భీతి కలిగించే బాంబుల శబ్దాలకు మేలుకున్నారు. ఆ తర్వాత మార్చి 12 వచ్చి అలా వెళ్లిపోయింది. తామను కున్న కొత్త థియేటర్ని ఘనంగా ప్రారంభించడానికి బదులుగా మక్సీమ్ ఇప్పుడు రష్యన్ దురాక్రమణదారులను ఓడించడానికి అవసరమైన సైనిక వ్యూహాలను రచిస్తున్నారు. తన చేతిలో కలానికి బదులుగా ఇప్పుడాయన ఆయుధాన్ని పట్టుకుని మోస్తున్నారు. రష్యన్ సైన్యం చట్టవిరుద్ధంగా మా సరిహద్దులను దాటి వచ్చి ఇప్పటికి రెండు నెలలయింది. ఉక్రెయిన్ను ఆక్రమించడానికి వారు చేస్తూవచ్చిన అన్ని ప్రయత్నాల్లోనూ వారు ఓడిపోతూనే ఉన్నారు. ఇంతటి తీవ్రమైన, వీరోచితమైన ప్రతిఘటనను వారు ఊహించలేక పోవడమే వారి వైఫల్యానికి కారణాల్లో ఒకటి. మన అత్యాధునిక సైన్యం, రష్యన్ ఆక్రమణ దాడి వాస్తవాన్ని గ్రహించి పోరాడటానికి ఆయుధాలు చేత పట్టాలని నిర్ణయించుకున్న మక్సీమ్ వంటి స్థానిక రక్షకులే ఉక్రెయిన్ గడ్డపై రష్యన్ల వైఫల్యానికి కారణం. మనపై ఇప్పుడు పడుతున్న బాంబులకు కారణం వాటి బటన్లు నొక్కుతున్న రష్యన్ హస్తాలేనని ప్రజలకు వివరించడానికి నేను అవిరామంగా ప్రయత్నిస్తున్నాను. ఉక్రెయిన్లోని మరీయూపోల్లో షెల్టర్గా ఉపయోగిస్తున్న థియేటర్పై మార్చి 18న రష్యన్ సైన్యం ప్రయోగించిన బాంబు దాడిలో 300 మంది ప్రజలు మరణించారు. నా కుమార్తెతో సహా ఈ సాహసోపేతులైన ప్రాదేశిక రక్షకులలో చాలామంది యుద్ధం ప్రారంభమైన తక్షణం యుద్ధంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. వీరిలో ఏ ఒక్కరికీ సైనిక శిక్షణ లేదు, అంతకు ముందు ఎలాంటి సైనిక ఘర్షణల్లోనూ పాల్గొన్న అనుభవమూ లేదు. ప్రాదేశిక రక్షక బలగంలో చేరడానికి తమ పెళ్లిని సైతం వాయిదా వేసుకున్న యువ జంట గానీ, ఆనారోగ్యం బారినపడిన వృద్ధులకు సహాయపడే పనుల్లో ఉండి ఫైటర్గా మారాలని నిర్ణయించుకున్న ఆ కమెడియన్ గానీ... ఉక్రెయిన్ ప్రజల చెదరని స్ఫూర్తిని ప్రపంచానికి ప్రదర్శించారు. వీరిలో కొందరు విషాదకరంగా ఈ సమరంలో నేల కూలారు. ఇక బుచా, ఖార్కివ్, మరీయూపోల్ వంటి నగరాల్లో పోరాడుతున్న వారిని రష్యన్ సైనికులు చంపేశారు. సామూహిక ఖనన స్థలాలను తిరిగి తవ్వి, ధ్వంసమైపోయిన మా నగరాల శిథిలాలను తొలగిస్తే తప్ప మా పౌరుల్లో ఎంతమంది చనిపోయిందీ మాకు తెలిసే అవకాశం లేదు. ఈ కథనాలన్నీ వినడానికే షాక్ కలిగిస్తున్నాయి. నియంత వ్లాదిమిర్ పుతిన్ నేతృత్వంలోని క్రూర రష్యన్ సైన్యం నుంచి సరిగ్గా దీన్నే మేం ఊహించాము. 2000 సంవత్సరంలో పుతిన్తో నాకు పరిచయం కలిగింది. అప్పట్లో నేనూ, పుతిన్ ఇరువురం మా భూభాగాలకు ప్రధానమంత్రులుగా వ్యవహరించాము. 2004లో నేను ఉక్రెయిన్ అధ్యక్షుడిగా పోటీ చేసినప్పుడు పుతిన్ నాకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. తాను కోరుకున్నది సాధించడానికి పుతిన్ ఎంతకైనా తెగిస్తారన్నది అప్పుడే నాకు స్పష్టమైంది. కానీ అందుకు నేను అవకాశం ఇవ్వలేదు. ఆ ఎన్నికల్లో నేను గెలిచాక, తూర్పున ఉన్న మా పొరుగుదేశం నేతగా ఆయనతో ఫలప్రదమైన సంబంధాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని నేను గుర్తించాను. పుతిన్కి వ్యతిరేకంగా మాకు ప్రస్తుతం ఉన్న గొప్ప ఆయుధాలు ఏవంటే అంతర్జాతీయ సంఘీభావం, మద్దతు మాత్రమే. ఇదే నన్ను వాస్తవానికి కలతపెడుతోంది. ఉక్రెయిన్లో యుద్ధం ప్రపంచ వార్తలుగా మారుతున్నప్పుడు, పలు వారాలపాటు అంతర్జాతీయ చర్చనీయాంశమవుతున్నప్పుడు మా ప్రాదేశిక రక్షకుల పోరాట గాథలపై ఆసక్తి తగ్గిపోతూ వచ్చింది. యుద్ధానికి సంబంధించిన భయానక వాస్తవాలు సాధారణం. సిరియాలో, యెమెన్లో, మా సొంత డాన్బాస్లో మేం వీటిని చూశాం కూడా. కానీ ఉక్రెయిన్లో ఉన్న మేం ఎంతమాత్రం అలసట చెందలేదు. అలా అలసిపోవడమే జరిగివుంటే మేం విజయాన్ని కోల్పోయి ఉండేవాళ్లం. మా బలమే ఇప్పుడు మాకు అన్నిటికంటే ముఖ్యం. రష్యన్లు పలుచోట్ల వెనుకంజ వేయడం జరుగుతున్నప్పటికీ, రష్యన్ బలగాలు తిరిగి సమీకృతం అవుతున్నారనీ, తమ దాడిని కొనసాగించడానికి ప్లాన్ చేస్తున్నారనీ మేం వింటున్నాం. ఇప్పుడు మేం ఈ యుద్ధంలో గెలుపొందడానికి మరింత కృతనిశ్చయంతో ఉండాలి. అయితే బయటినుంచి మద్దతు లేకుండా మేం ఇప్పుడు గెలుపు సాధించలేం. ఈ యుద్ధం ఒక నిర్ణయాత్మక ఘటన. ఉక్రెయిన్ చరిత్ర లోనే కాదు, ప్రజాస్వామ్య రక్షణ కోసం కూడా ఇది కీలకమైంది. ఇది ఉక్రెయిన్కి రష్యాకి మధ్య ప్రాంతీయ ఘర్షణ ఏమాత్రం కాదు. నిరంకుశత్వానికీ, సామ్రాజ్యవాదానికీ వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం ఇది. మా మిత్రదేశాలన్నింటినుంచి మా సైన్యానికి ఇప్పుడు ఆయుధాలు, ఇతర సైనికపరమైన సామగ్రి మాకు చాలా అవసరం. మా బలమైన ఆర్థిక వ్యవస్థను చిన్నా భిన్నం చేసిన యుద్ధ గాయాలను మాన్పడానికి ద్రవ్యపరమైన సహాయం మాకు ఇప్పుడు చాలా అవసరం. మా దేశ నాయకత్వం రష్యాతో యుద్ధంలో ముందుపీఠిన ఉండటమే కాదు, అంతర్జాతీయ కార్యాలయాలను, సంస్థలను కాపాడేందుకు కూడా, సమరరంగంలో మా నాయకత్వం నిలబడి పోరాడుతోంది. ఉక్రెయిన్లో శాంతిని నెలకొల్పి స్వాతంత్య్రాన్ని పునరుద్ధరించడానికి మాకు అవసరమైన మిత్రుల మద్దతును పొందడానికి వారి కార్యాలయాలను కాపాడటం కూడా మాకు ఎంతో అవసరమే. అదే సమయంలో, మా ప్రాదేశిక రక్షకులకు తగిన సరఫరాలను తప్పక అందించాల్సిన వలంటీర్ల సేన కూడా మాకు ఉంది. యుద్ధ రంగంలో పోరాడేందుకు అవసరమైన రక్షణ సామగ్రిని వారికి అందించడం ఎంతో అవసరం. ఉక్రెయిన్ వరల్డ్ కాంగ్రెస్ వంటి పౌర సమాజ సంస్థలు మా ప్రాదేశిక రక్షకులకు ప్రాణాంతకం కాని సరఫరాలను అందించడంలో అవిరామంగా కృషి చేస్తున్నాయి. మాకు ఎంతో అవసరమైన ఆయుధాలను మా మిత్ర దేశాలు పంపిం చేందుకు తగిన సూచనలు అందించడంలో వీరు నిరవధికంగా చేస్తున్న ప్రయత్నాలు ఎన్నదగినవి. రష్యన్ దురాక్రమణను ఓడించ డానికి అవసరమైన దిగ్బంధన, ఆంక్షల విధింపులో కూడా వీరు సహకరిస్తున్నారు. మేం తుది విజయం సాగించేవరకు మా ప్రాదేశిక రక్షకులు పోరాడుతూనే ఉంటారు. అదే సమయంలో మా మద్దతు దారులు మాకు చేయదగిన ప్రతి సహాయాన్ని చేస్తూనే ఉంటారన డంలో సందేహమే లేదు. ఉక్రెయిన్ కోసం మేం చేస్తున్న పోరాటంలో విజయం అనివార్య మని నేను బలంగా నమ్ముతున్నాను. తమ స్వాతంత్య్రం కోసం, ఆత్మగౌరవం కోసం సామాన్యులైన ఉక్రెయిన్ పౌరులు తమకు సంబంధించిన సమస్తాన్నీ అందిస్తున్నప్పుడు, విజయం ఒక్కటే మాకు దక్కాల్సి ఉంది. ఈ యుద్ధం చివరకి ముగిసిపోయే రోజు కోసం నేను ఎక్కువకాలం వేచి ఉండలేను. మక్సీమ్, అతడి సహచరులు తమ థియేటర్ను ప్రారంభించి, కొత్త నాటకాలను ప్రదర్శించే రోజు కోసం ఎదురు చూస్తున్నాను. వారి తాజా రచనలు కేవలం ప్రచారానికి సంబంధించినవి కాదు. అవి వారి స్వరాలు, వారి భావల సమాహారం. మేం ఈరోజు స్వాతంత్య్రం కోసం పోరాడు తున్నాం. రేపు ఉక్రెయిన్ అంటే ఏమిటో నిర్వచిస్తూ స్వాతంత్యాన్ని గెల్చుకున్న మా రచయితలు ప్రదర్శించే నాటకాలను కూడా మేం తిలకిస్తాము. విక్టర్ యుష్చెంకో ,వ్యాసకర్త ఉక్రెయిన్ మాజీ అధ్యక్షుడు (‘ద గార్డియన్’ సౌజన్యంతో) -
ఇంట గెలిచి.. రచ్చ గెలవని మోదీ
పాకిస్థాన్ భూభాగంలోకి భారత భద్రతా దళాలు చొచ్చుకుపోయి టెర్రరిస్టు శిబిరాలపై సర్జికల్ దాడులు జరపడంలో విజయం సాధించడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశంలో తన పరువు, ప్రతిష్టలను ఇనుమడింపజేసుకున్నారు. ఇదే అంశంలో అంతర్జాతీయంగా పాకిస్థాన్ను ఏకాకిని చేయడంలో మాత్రం మోదీ ప్రస్తుతానికి ఓడిపోయారనే చెప్పవచ్చు. బ్రిక్స్ దేశాలను తనదారికి తీసుకొచ్చి పాకిస్థాన్ను ఒంటరిని చేయాలనే ప్రయత్నంలో మోదీ దౌత్యం విఫలమైంది. తొలుత భారత్ విజ్ఞప్తి మేరకు సూత్రప్రాయంగా టెర్రరిజాన్ని ఖండించిన చైనా, రష్యా దేశాలు టెర్రరిజాన్ని పాకిస్థాన్ ప్రోత్సహిస్తోందన్న ఫిర్యాదును పట్టించుకోలేదు. బ్రిక్స్ సదుస్సు తీర్మానంలో కనీసం పాకిస్థాన్ పేరును పరోక్షంగా కూడా ప్రస్తావించేందుకు చైనా అంగీకరించలేదు. ఈ విషయంలో చైనాకే రష్యా మద్దతు పలికింది. ఇక మోదీ చేసేది లేక పాక్ పేరును ప్రస్తావించకుండానే ఉగ్రవాద నిర్మూలన గురించి ధర్మోపన్యాసం ఇచ్చి తప్పుకున్నారు. పాకిస్థాన్ భూభాగం నుంచి పనిచేస్తున్న లష్కరే తాయిబా, జైషే మొహమ్మద్ లాంటి టెర్రరిస్టు సంస్థల పేర్లను ప్రస్తావించేందుకు కూడా ఆ రెండు దేశాలు అంగీకరించలేదు. పాకిస్థాన్ టెర్రరిస్టు మసూద్ అజర్పై ఆంక్షలు విధించేందుకు ఐక్యరాజ్యసమితిలో భారత్ చేసిన ప్రయత్నాలను కూడా నెలరోజుల క్రితం చైనా అడ్డుకుంది. పాత మిత్రుడైన రష్యా కూడా భారత్తో కలసి రాకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో భారత్కు తెలియని పరిస్థితి. పైగా పాకిస్థాన్తో కలసి రష్యా సైనిక దళాలు ఇటీవలే సంయుక్త విన్యాసాలు నిర్వహించాయి. పాక్ భూభాగంపై భారత్ జరిపిన సర్జికల్ దాడులను ముందుగా సమర్థించిన బంగ్లాదేశ్ ఆ తర్వాత రష్యా కారణంగా మెత్తపడింది. భారత్ వ్యూహాత్మకంగా బంగ్లాదేశ్లో 200 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెడితే, రష్యా అక్కడ ఏకంగా 2,500 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టింది. అలాంటప్పుడు వాళ్లపై ఎవరి ఆదేశం ముద్ర ఉంటుందో సులభంగానే అర్థం చేసుకోవచ్చు. భారత్ జరిపిన సర్జికల్ దాడులను సమర్థిస్తూ పాక్ టెర్రరిజాన్ని ఖండించిన అమెరికా కూడా పాకిస్థాన్ను టెర్రరిస్టు దేశంగా ప్రకటించేందుకు ససేమిరా అంగీకరించలేదు. పాక్ను టెర్రరిస్టు దేశంగా ప్రకటించాలని కోరుతూ టెర్రరిజమ్పై అమెరికా పార్లమెంట్కు చెందిన సబ్ కమిటీ చైర్మన్ టెడ్ పో ప్రవేశపెట్టిన బిల్లును ఒబామా అధికార యంత్రాంగం ఆమోదిస్తుందన్న ఆశ ఏ మాత్రం లేదు. సర్జికల్ దాడులతో ఇంట గెలిచిన మోదీ రచ్చ గెలవాలంటే భారత విదేశాంగ విధానంలో వ్యూహాత్మక మార్పులు తేవాల్సిందే. -
భారత ఆపరేషన్కు అంతర్జాతీయ మద్దతు: వెంకయ్య
ఉగ్రవాదులపై భారత సైన్యం చేసిన దాడికి ప్రపంచ దేశాలన్నింటి నుంచి మద్దతు లభిస్తోందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. పాకిస్థాన్ ఇప్పటికైనా ఉగ్రవాదులకు సాయం చేయడాన్ని మానుకోవాలని అన్నారు. భారత సైన్యం పాకిస్థాన్ పరిధిలోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడంలో పాకిస్థాన్ తన బాధ్యతను గుర్తుంచుకోవాలని చెప్పారు. దేశ భద్రతను కాపాడేందుకు పటిష్ఠమైన చర్యలు తీసుకుంటామని ప్రధానమంత్రి మోదీ చెప్పారని ఆయన తెలిపారు. భారత దేశ ఐక్యత, భద్రత, రక్షణలను కాపాడటంలో తన బాధ్యతను నిర్వర్తించడంలో భాగంగానే ఆర్మీ ఆపరేషన్ చేసిందన్నారు. భారత భూభాగంలోకి ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలను భగ్నం చేసే ప్రక్రియలో భాగంగానే భారత సైన్యం ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. పాకిస్థాన్ భూభాగంలో ఉగ్రవాద కార్యకలాపాలకు అనుమతి ఇవ్వకూడదని ఆ దేశాన్ని భారతదేశం పదే పదే కోరుతున్నట్లు చెప్పారు. తాము ఎంత సానుకూలంగా చెబుతున్నా, అటువైపు నుంచి ఉగ్రవాదులకు ప్రోత్సాహం మాత్రమే లభిస్తోందని వెంకయ్య నాయుడు అన్నారు. I compliment the Indian Army for their surgical operations against terrorist launch pads across the Line of Control. #ModipunishesPak — M Venkaiah Naidu (@MVenkaiahNaidu) 29 September 2016 These ops r a part of d mandate of the Army to prevent infiltration of terrorists into J&K from across the Line of Control. #ModipunishesPak — M Venkaiah Naidu (@MVenkaiahNaidu) 29 September 2016 -
భారత ఆపరేషన్కు అంతర్జాతీయ మద్దతు