-
ఇంద్రకీలాద్రిపై నిత్యాన్నదానం పున:ప్రారంభం
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై సోమవారం నుంచి అమ్మవారి నిత్య అన్న ప్రసాద వితరణ పునఃప్రారంభమైంది. ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో భ్రమరాంబ మహా మండపం రెండో అంతస్తులోని అన్న ప్రసాద వితరణ విభాగంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్, ఈవోలు భక్తులకు అన్న ప్రసాదాన్ని స్వయంగా వడ్డించారు. అన్న ప్రసాద వితరణలో పాల్గొనే సిబ్బంది తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రతిరోజు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అమ్మవారి అన్న ప్రసాద వితరణ జరుగుతుంది. నిత్యం 2,500 మందికి, శుక్ర, ఆదివారాలలో 4,000 మందికి అన్న ప్రసాద వితరణ ఉంటుందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్శర్మ, పాలక మండలి సభ్యురాలు ఎన్.సుజాత, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
ఇంద్రకీలాద్రి: టికెట్ ఉంటేనే దర్శనం!
సాక్షి, అమరావతి: ఇంద్రకీలాద్రిపై ఈ నెల 17 నుంచి 25 వరకు జరగనున్న దసరా ఉత్సవాల్లో టికెట్లు కలిగి ఉన్న వారినే కనకదుర్గమ్మ వారి దర్శనానికి అనుమతించనున్నట్టు కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ వెల్లడించారు. ఆన్లైన్లో రూ.300లు, 100ల టికెట్లతో పాటు ఉచిత దర్శనం టికెట్లు అందుబాటులో ఉంచామన్నారు. సోమవారం క్యాంప్ కార్యాలయంలో దుర్గ గుడి చైర్మన్ పైలా స్వామినాయుడు, ఈవో ఎం.సురేష్బాబులతో కలిసి కలెక్టర్ విలేకరులతో మాట్లాడారు. కోవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉత్సవాలను నిర్వహించనున్నట్టు తెలిపారు. క్యూలైన్లలో భక్తులకు శానిటైజర్లు సమకూరుస్తామన్నారు. సాధారణ రోజుల్లో రోజూ 10 వేల టికెట్లు, మూలా నక్షత్రం రోజున 13 వేల టికెట్లు అందుబాటులో ఉంచామన్నారు. గంటకు వెయ్యి మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. పదేళ్ల లోపు, 65 ఏళ్ల పైబడ్డ వృద్ధులు, గర్భిణులు, దివ్యాంగులకు ఉత్సవాల్లో ఇంద్రకీలాద్రిపైకి అనుమతించడం లేదని స్పష్టం చేశారు. కోవిడ్ దృష్ట్యా ఇతర జిల్లాల పోలీసులను బందోబస్తుకు రప్పించడం లేదని తెలిపారు. ఆన్లైన్లో లక్ష టికెట్లు.. అమ్మవారి దర్శనానికి లక్ష టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచామని దేవస్థానం చైర్మన్ పైలా స్వామినాయుడు తెలిపారు. భక్తులు ఇప్పటికే సుమారు 67 వేల టికెట్లు తీసుకున్నారని తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో అన్ని జిల్లాల భవానీ దీక్ష గురువులతో మాట్లాడామన్నారు. దేవాలయంలో భవానీ దీక్షల మాలధారణ, విరమణలకు అనుమతించడం లేదని, వీటిని వారి గ్రామాల్లోనే చేపట్టాలని సూచించినట్టు తెలిపారు. అమ్మవారి తెప్పోత్సవం యథావిధిగా నిర్వహిస్తామని, కానీ భక్తులను అనుమతించబోమని స్పష్టం చేశారు. వీఐపీలకు ప్రత్యేక సమయాలు కేటాయిస్తామన్నారు. ఉదయం 5 నుంచి రాత్రి 8 వరకే దర్శనాలు ఉత్సవాల మొదటి రోజు అక్టోబర్ 17న ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు, ఆ తర్వాత రోజుల్లో ఉదయం 5 నుంచి రాత్రి 8 గంటల వరకే అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తామని ఈవో సురేష్బాబు తెలిపారు. మూలా నక్షత్రం (21న) రోజున అమ్మవారి దర్శనం ఉదయం 3 నుంచి రాత్రి 9 వరకు ఉంటుందన్నారు. వినాయక గుడి నుంచి భక్తులను అనుమతిస్తామని.. భక్తులు మాస్క్లు ధరించాలని, థర్మల్ స్క్రీనింగ్ చేయించుకోవాలని, తమ వెంట మంచినీరు తెచ్చుకోవాలని సూచించారు. ఆలయ బస్సులు, లిఫ్టు సౌకర్యాన్ని, ఘాట్రోడ్డు దారిని నిలిపి వేస్తున్నామన్నారు. ఆన్లైన్ ద్వారా ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, వాటికి సంబంధించిన ప్రసాదాన్ని, వస్త్రాలను పోస్టు ద్వారా పంపుతామని చెప్పారు. మీడియా పరిమిత సంఖ్యలో రెండు షిఫ్టుల్లో కవరేజీ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. -
ఏడు వారాల నగలతో దుర్గమ్మ దర్శనం
సాక్షి, విజయవాడ: ఈ నెల 12 నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఏడు వారాల నగలతో దర్శనమివ్వనున్నారు. శనివారం దుర్గగుడి ఈవో ఎంవి.సురేష్బాబు మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. సోమవారం-ముత్యాల అలంకారం, మంగళవారం-పగడాలు అలంకారం, బుధవారం-పచ్చల అలంకారం, గురువారం- కనక పుష్య రాగాల అలంకారం, శుక్రవారం-వజ్రాల అలంకారం, శనివారం-నీలాల అలంకారం, ఆదివారం- కెంపుల అలంకారంలో దర్శనమివ్వనున్నారని ఈవో వెల్లడించారు. అమ్మవారికి దేవస్థానంలో రెండు కిరీటాలు ఉన్నాయని.. వజ్ర కిరీటం చేయించాలనే యోచనలో ఉన్నామని తెలిపారు. దాతల నుంచి విరాళాలను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. ప్రసాదం పోటు, అన్నదానం, కేశ ఖండన శాల నిర్మాణాలకు ఈ నెలాఖరుకు ప్లాన్ పూర్తవుతుందన్నారు. త్వరలోనే టెండర్లు పిలిచి పూర్తి చేస్తామని తెలిపారు. కేశ ఖండనశాల వేలానికి ఈ-ప్రొక్యూర్మెంట్ ద్వారా నిర్వహించామన్నారు. కేశ ఖండనశాల తలనీలాల కాంట్రాక్ట్ను రద్దు చేశామని.. మరలా టెండర్లను ఆహ్వానిస్తామని ఈవో సురేష్బాబు పేర్కొన్నారు. -
అమ్మవారిని దర్శించుకున్న ఇళయరాజా..
సాక్షి, విజయవాడ: విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారిని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా దర్శించుకున్నారు. వేద మంత్రాలతో ఆలయ అర్చకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేదపండితుల చేత ఆశీర్వచనం తీసుకున్నారు. ఆ తర్వాత ఇళయరాజాకు అమ్మవారి చిత్రపటం, లడ్డు ప్రసాదాన్ని ఆలయ అర్చకులు అందజేసారు. -
ఉత్సవాలు మెప్పించేలా.. దుబారా తగ్గించేలా!
సాక్షి, విజయవాడ : మరో వారం రోజుల్లో దసరా ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతున్నాయి. సుమారు 15 లక్షల మంది కంటే ఎక్కువ మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా. గత ఏడాది దసరా ఉత్సవాలకు సుమారు రూ.15 కోట్లు ఖర్చు చేశారు. అయితే ఈ ఏడాది దసరాకు అయ్యే దబారాపై దుర్గగుడి ఈవో వి.కోటేశ్వరమ్మ ప్రత్యేక దృష్టి సారించారు. అనవసరపు ఖర్చుల్ని తగ్గించాలని నిర్ణయించారు. దీంతో ఈ ఏడాది రూ.8.3 కోట్లు వ్యయంతో దసరా ప్రణాళికలు సిద్ధం చేశారు. దాతల కోసం అన్వేషణ.. గతంలో శాశ్వత నిర్మాణాల కోసం మాత్రమే దాతల కోసం దేవస్థానం అధికారులు అన్వేషించేవారు. ప్రస్తుతం దసరా ఉత్సవాలకూ దాతల్ని అన్వేషిస్తున్నారు. ఆసక్తి గలవారికి ఒక్కొక్క పనిని అప్పగించి అమ్మవారికి సేవ చేయమని ప్రోత్సహిస్తున్నారు. ద్వారాకామాయి చారిటబుల్ ట్రస్టు ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో అయ్యే బియ్యం, కందిపప్పు ఖర్చును భరించేందుకు ముందుకు వచ్చింది. 12000 కేజీల బియ్యం, 2,500 కేజీల కందిపప్పు ఉచితంగా ఇచ్చారు. దీంతో అన్న ప్రసాదానికి అయ్యే ఖర్చు తగ్గుతుందని ఈవో కోటేశ్వరమ్మ చెబుతున్నారు. కోతలు మొదలు.. గతంలో సాంస్కృతిక కార్యక్రమాలకు భారీగా నిధులు కేటాయించేవారు. ఈ ఏడాది అమ్మవారిపై భక్తితో కళాకారులు ఉచితంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. దీంతో అనేక మంది భక్త కళాకారులు ముందుకు వచ్చారు. ఈ వ్యయాన్ని రూ.5 లక్షలకు పరిమితం చేస్తున్నారు. ఉభయదాతలుగా కుంకమార్చనలో పాల్గొన్నే మహిళలకు చీర, రవికెను దేవస్థానం తరఫున ఇవ్వడం ఆనవాయితీ. రవికె ముక్కలు కొనుగోలు చేయకుండా భక్తులు అమ్మవారికి పెట్టినవాటిని అమ్మవారి పేరిట తిరిగి భక్తులకే ఇస్తే వారు భక్తితో ఉపయోగించుకుంటారని, దేవస్థానానికి ఖర్చు తగ్గుతుందని ఈవో నిర్ణయించారు. ఈ వారంలోనూ ఇంకా దాతలు ముందుకు వస్తే వారి సేవలు వినియోగించుకోవాలని చూస్తున్నారు. ఉత్సవాల పేరుతో ఇష్టానుసారంగా సరుకు కొనుగోలు చేయకుండా ఈవో ఆంక్షలు విధించారని ఆయా శాఖల అధికారులు చెబుతున్నారు. బయట నుంచి వస్తువులు కొనుగోలు చేసే కంటే దేవస్థానం ఆధ్వర్యంలో అందుబాటులో ఉండే వస్తువులను ఉపయోగించుకుని ఉత్సవాలు ఏ విధంగా పూర్తిచేయాలో ఆలోచించాలని ఈవో సూచిస్తున్నట్లు తెలిసింది. మారాల్సింది ప్రభుత్వం తీరే.. అధికారులు రూపాయి రూపాయి పొదుపు చేస్తుంటే ప్రభుత్వం మాత్రం దేవస్థానం ఖజానాకు కన్నం వేస్తోంది. దసరా ఉత్సవాలు రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోంది. అటువంటప్పుడు అన్ని శాఖలు ఉచితంగా పనిచేయాలి. అయితే పోలీసు శాఖ రూ.75 లక్షలు దేవస్థానం నుంచి వసూలుచేస్తోంది. ఫైర్ డిపార్టుమెంట్కు రూ.1.20 లక్షలు, ఎలక్ట్రికల్ మెయింటినెన్స్కు రూ.2.5 లక్షలు, జలవనరుల శాఖకు రూ.2 లక్షలు, ఫిషరీస్ డిపార్టుమెంట్కు రూ.1.3 లక్షలు చొప్పున ప్రభుత్వం దేవస్థానం నుంచి వసూలు చేస్తోంది. ఇది చాలదన్నట్లు తెలుగుదేశం నేతలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామంటూ రూ.25 లక్షలు వరకు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు వచ్చినప్పుడు వారికి సత్కారాలు, దర్శనాలు కోసం దేవస్థానంపై రూ.లక్షల భారం పడుతోంది. భక్తులకు చేసే ఖర్చులపైనే కాకుండా ప్రభుత్వ పక్షం చేసే ఖర్చులపైన ఈవో కోటేశ్వరమ్మ కోత విధిస్తే బాగుంటుందని భక్త బృందాలు అభిప్రాయపడుతున్నాయి. ఇతర శాఖలకు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు తెచ్చే బాధ్యత పాలకమండలే తీసుకోవాలి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement