ఏపీ భవన్‌లో కొలువుదీరనున్న కనకదుర్గమ్మ | Kankadurgamma is located in AP Bhavan | Sakshi
Sakshi News home page

Sep 25 2017 1:15 AM | Updated on Mar 28 2019 5:23 PM

Kankadurgamma is located in AP Bhavan - Sakshi

ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఢిల్లీలోని ఏపీ భవన్‌లో కనకదుర్గమ్మ అమ్మవారి ప్రతిమను ఏర్పాటు చేయనున్నారు. అమ్మవారికి నిత్యం పూజలు నిర్వహించేలా ఇంద్రకీలాద్రి దేవస్థానం అధికారులు అక్కడి వారితో సంప్రదింపులు జరిపారు. దీంతో నాలుగు అడుగుల అమ్మవారి ప్రతిమను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఆదివారం ఢిల్లీ తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. దసరా ఉత్సవాల అనంతరం ఏపీ భవన్‌లో దుర్గమ్మ ప్రతిమను ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఆలయ అధికారులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement