-
నేడు విహారి నిశ్చితార్థం
సాక్షి, హైదరాబాద్: భారత క్రికెటర్, ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్ గాదె హనుమ విహారి త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. తన చిరకాల స్నేహితురాలు యెరువ ప్రీతిరాజ్తో విహారి వివాహ నిశ్చితార్థం ఆదివారం హైదరాబాద్లో జరుగనుంది. ప్రముఖ వ్యాపారవేత్త యెరువ రాజానందరెడ్డి కుమార్తె అయిన ప్రీతిరాజ్ స్వీడన్లో మాస్టర్స్ చేశారు. ప్రస్తుతం ఆమె ఫ్యాషన్ డిజైనర్గా పనిచేస్తున్నారు. ఇటీవలే ఇంగ్లండ్ పర్యటనలో భారత టెస్టు జట్టు తరఫున అరంగేట్రం చేసిన 25 ఏళ్ల విహారి గతంలో హైదరాబాద్ రంజీ జట్టుకు కూడా కెప్టెన్గా వ్యవహరించాడు. వివాహ నిశ్చితార్థ కార్యక్రమానికి పలువురు భారత క్రికెటర్లతో పాటు హైదరాబాద్, ఆంధ్ర రంజీ జట్ల ఆటగాళ్లు హాజరయ్యే అవకాశముంది. -
రాజ్కోట్కు చేరిన భారత జట్టు
-
రాజ్కోట్కు చేరిన భారత జట్టు
రాజ్కోట్: విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత టెస్టు జట్టు శనివారం ఉదయం రాజ్కోట్కు చేరుకుంది. స్థానిక ఆటగాళ్లు పుజారా, జడేజా జట్టుతో పాటు కలిశారని.. హార్ధిక్ పాండ్యా రోడ్డు మార్గం ద్వారా రాజ్కోట్కు వచ్చినట్టు సౌరాష్ట్ర క్రికెట్ సంఘం మీడియా మేనేజర్ హిమాన్షు షా వెల్లడించారు. శనివారమే 28వ పడిలోకి అడుగుపెట్టిన కోహ్లి... జట్టు ఆటగాళ్లు, ప్రియురాలు అనుష్క శర్మతో కలిసి హోటల్లో ఘనంగా వేడుకలు జరుపుకున్నాడు. అటు కోహ్లి పుట్టిన రోజు సందర్భంగా సచిన్, సెహ్వాగ్, యూసుఫ్ పఠాన్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు రాజ్కోట్ ఎరుుర్పోర్ట్లో అభిమానులు పెద్ద సంఖ్యలో కేకులు, బొకేలతో కోహ్లికి స్వాగతం పలకగా తను అనుష్కతో కలిసి నేరుగా హోటల్కు వెళ్లిపోయాడు. -
అలా కలిసొస్తోంది!
16 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు... 22 వికెట్లు... 33 సగటు... ఈ గణాంకాలతో భారత టెస్టు జట్టులోకి బౌలింగ్ ఆధారంగా ఓ ఆటగాడు ఎంపికవుతాడనేది ఊహించని అంశం. కానీ హార్ధిక్ పాండ్యా ఇవే అంకెలతో భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. అంతేకాదు... ఇంగ్లండ్తో తొలి టెస్టు ద్వారా దాదాపుగా అరంగేట్రం చేయడం కూడా ఖాయంగానే కనిపిస్తోంది. 23 ఏళ్ల ఈ బరోడా ఆల్రౌండర్ ఇప్పటివరకు నాలుగు వన్డేలు, 16 అంతర్జాతీయ టి20లు ఆడాడు. ఈ ఏడాది జనవరి 26న ఆస్ట్రేలియాలో టి20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. టి20 ప్రపంచకప్ వరకూ భారత జట్టులో కొనసాగాడు. అరుుతే ఐపీఎల్లో పేలవ ఫామ్ వల్ల జింబాబ్వే పర్యటనకు ఎంపిక కాలేదు. కానీ ఆస్ట్రేలియా ‘ఎ’ పర్యటనకు ఎంపిక కావడం తన కెరీర్ను మార్చేసింది. ‘ఎ’ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ దగ్గర తను చాలా మెరుగయ్యాడు. అదే పర్యటనకు అప్పటి సెలక్టర్, ప్రస్తుత సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ కూడా వెళ్లారు. పాండ్యా ప్రోగ్రెస్ను ఆయన దగ్గరి నుంచి గమనించారు. ఇవన్నీ తనకి కలిసొచ్చారుు. వచ్చే ఏడాది చాంపియన్స ట్రోఫీ ఇంగ్లండ్లో జరుగుతున్నందున ఒక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ను వెతకాలనే ఆలోచనతో పాండ్యాను వన్డే జట్టులోకి తెచ్చారు. కపిల్ దేవ్ చేతుల మీదుగా వన్డే క్యాప్ అందుకున్న పాండ్యా ఆడిన తొలి మ్యాచ్లోనే అద్భుతంగా బౌలింగ్ చేసి సెలక్టర్ల అంచనాలను నిలబెట్టాడు. ధోనిని కూడా ఆకట్టుకున్నాడు. తన తొలి మ్యాచ్లోనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును కైవసం చేసుకున్నాడు. న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో పిచ్ స్పిన్కు అనుకూలించిన విశాఖలో తను బెంచ్కు పరిమితమయ్యాడు. కారణం... తుది జట్టులో ముగ్గురు స్పిన్నర్లు. ఇద్దరు స్పిన్నర్లు సరిపోతారనుకునే పిచ్ మీద మూడో పేసర్గా, ఆల్రౌండర్ స్లాట్లో ఆడించడానికే తనని తీసుకున్నారని అందరికీ స్పష్టత వచ్చింది. అరుుతే టెస్టు జట్టులోకి ఇంత తొందరగా వస్తాడని మాత్రం ఎవరూ ఊహించలేదు. కేవలం పది నెలల వ్యవధిలో మూడు ఫార్మాట్లలోకీ ప్రస్తుతం ఉన్న పోటీలో రావడం నిజంగా గొప్ప విషయమే. నిజానికి ఇంగ్లండ్ స్పిన్ బలహీనత వల్లే పాండ్యా జట్టులోకి వచ్చినట్లు కనిపిస్తోంది. ముగ్గురు స్పిన్నర్లతో ఆడిన సమయమంలో కొత్త బంతిపై పేస్ను తీయడానికి రెండో పేసర్గా తను పనికొస్తాడు. ఇక బ్యాట్స్మన్గా ఇప్పటికే కొంతవరకు తనని తాను నిరూపించుకున్నాడు. ముగ్గురిలో ఉత్తమం నిజానికి భారత్కు పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కొరత చాలా కాలంగా ఉంది. స్టువర్ట్ బిన్నీ ఇంతకాలం అడపాదడపా ఆ పాత్ర పోషిస్తూ వచ్చాడు. అరుుతే తనకు ఎన్ని అవకాశాలు లభించినా సద్వినియోగం చేసుకోలేదు. బ్యాట్స్మన్గా కొంత ఫర్వాలేదనిపించినా బౌలర్గా తను అంతంత మాత్రమే. ఇక రిషి ధావన్ బౌలర్గా ఉత్తమం. కానీ బ్యాటింగ్లో అంతగా ఆకట్టుకోలేదు. నిజానికి రిషి రంజీట్రోఫీలో కూడా నిలకడగా ఆడుతున్నాడు. న్యాయంగా అరుుతే పాండ్యా కంటే ముందు తను జట్టులోకి రావాలి. బ్యాటింగ్లో పాండ్యా మిగిలిన ఇద్దరి కంటే ఉత్తమం. కివీస్తో వన్డే సిరీస్ ద్వారా బౌలర్గా కూడా ఎదుగుదల చూపించడంతో మరో ఆలోచన లేకుండా జట్టులోకి వచ్చాడు. ఏదేమైనా ఇది తనకు సవర్ణావకాశం. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో లభించే ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే తన కలలను సాకారం చేసుకోగలుగుతాడు. ప్రస్తుతం ఒక రకంగా హార్ధిక్ పాండ్యా సీజన్ నడుస్తోంది. తనకు అంతా కలిసొస్తోంది. ఇక భవిష్యత్ ఏంటనేది పూర్తిగా అతని చేతుల్లోనే ఉంది. -
నా ఎంపిక షాక్ కు గురిచేసింది!
టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్ మన్ గౌతమ్ గంభీర్ భారత జట్టు తరఫున టెస్టు ఆడి రెండేళ్లు దాటిపోయింది. అయినా సరే మరోసారి అతడిపై పూర్తి నమ్మకంతో జట్టులోకి ఆహ్వానించారు. దేశవాళీ లీగ్ క్రికెట్లో ఈ సీనియర్ ప్లేయర్ ఫామ్ను చూసి జట్టులోకి ఆహ్వానించారా.. లేక అతడికి వీడ్కోలు మ్యాచ్ లకు ముందే సిద్ధం చేస్తున్నారా అనే సందేహాలు తలెత్తకమానదు. ఏది ఏమైతేనేం.. న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టు సందర్భంగా గాయపడిన లోకేశ్ రాహుల్ స్థానంలో గౌతమ్ గంభీర్ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. జట్టులో స్థానం కోల్పోయి మళ్లీ చోటు దక్కించుకున్న ఎందరో వెటరన్ ఆటగాళ్ల తరహాలోనే తన ఎంపికపై గంభీర్ హర్షం వ్యక్తంచేశాడు. తొలి టెస్టు ఆడే కుర్రాడు ఎలా ఉంటాడో.. ఆ బ్యాట్స్ మన్ ఏ విధంగా ఫీలవుతాడో.. తాను కూడా ప్రస్తుతం అలాంటి స్థితిలో ఉన్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపాడు. తన ఎంపికపై షాక్ తో పాటు ఎంతో ఒత్తిడికి గురైన అనుభూతిని పొందినట్లు గౌతీ పోస్ట్ లో పేర్కొన్నాడు. ఎన్నో ఆశలతో మళ్లీ జట్టులోకి వస్తున్నాను. దేశం తరఫున ఆడటంతో ఏ వ్యక్తిని ఎవరూ అడ్డుకోలేరు. టెస్ట్ క్రికెట్, రెడ్ బాల్, భారత్ క్యాప్ మళ్లీ తాను ధరించబోతున్నందుకు బీసీసీఐకి, తనకు అండగా నిలిచిన సభ్యులకు ధన్యవాదాలు తెలిపాడు. శుక్రవారం నుంచి రెండో టెస్టు జరిగే కోల్కతాలో గంభీర్ జట్టుతో పాటు చేరతాడన్న విషయం తెలిసిందే. తొలి టెస్టులో కివీస్ పై భారత్ ఘనవిజయం సాధించి సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. Excitement of a debutant, certainty of experienced, nervousness of a novice...am feeling it all. Eden here I come loaded with ambitions. — Gautam Gambhir (@GautamGambhir) 27 September 2016 Nothing beats playing again for d country. Test cricket, whites, red ball and India cap again. Thanks @BCCI, thanks 2 all for d prayers. — Gautam Gambhir (@GautamGambhir) 27 September 2016
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: ఇద్దరు లాలు ప్రసాద్లు... అయితే ఏంటి?
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
రైతు రుణమాఫీ ఊసేది..?
ఈవీఎంల రెండో విడత ర్యాండమైజేషన్
ప్రారంభమైన హోం ఓటింగ్
No Headline
No Headline
కూలీల కనీస వేతనం పెంచాలి
నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు భేష్
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలు
తప్పక చదవండి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
Advertisement