-
విజేత హైదరాబాద్ పబ్లిక్ స్కూల్
సాక్షి, హైదరాబాద్: ఐసీఎస్ఈ, ఐఎస్సీ క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్పీఎస్) విజేతగా నిలిచింది. సికింద్రాబాద్లోని గీతాంజలి దేవశాల వేదికగా జరిగిన ఈ టోర్నీలో టైటిల్ను అందుకుంది. ఆదివారం జరిగిన నాసర్ స్కూల్తో జరిగిన ఫైనల్లో హెచ్పీఎస్ 2 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన హెచ్పీఎస్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది. అమన్ (57; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ చేశాడు. వైభవ్ (21) రాణించాడు. అనంతరం నాసర్ జట్టు 99 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. హర్షిల్ మిశ్రా (42) ఒంటరిపోరాటం చేశాడు. ప్రత్యర్థి బౌలర్లలో ఆకాశ్, ఆదిత్య చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. -
టీమ్ చాంపియన్ హెచ్పీఎస్
సాక్షి, హైదరాబాద్: సబ్ జూనియర్ అథ్లెటిక్స్ మీట్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్పీఎస్) బేగంపేట్ జట్టు సత్తా చాటింది. హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో మూడు టీమ్ చాంపియన్షిప్ టైటిళ్లను కైవసం చేసుకుంది. అండర్–10 బాలుర, అండర్–12 బాలబాలికల విభాగాల్లో హెచ్పీఎస్ జట్లు విజేతలుగా నిలిచాయి. అండర్–14 బాలబాలికల విభాగంలో సెయింట్ ఆండ్రూస్ బోయిన్పల్లి జట్లు టీమ్ చాంపియన్షిప్ టైటిళ్లను సాధించాయి. అండర్–10 బాలికల టీమ్ చాంపియన్షిప్ చిరెక్ ఇంటర్నేషనల్ స్కూల్ జట్టుకు దక్కింది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో గురువారం జరిగిన అండర్–14 బాలికల 4000మీ. పరుగులో చిరెక్ స్కూల్కు చెందిన దియా గంగ్వార్ చాంపియన్గా నిలిచింది. అదితి సింగ్ (జ్యోతి వీఎస్), ప్రియాంక దాస్ (సెయింట్ ఆండ్రూస్) వరుసగా రెండు, మూడు స్థానాలను సాధించారు. బాలుర విభాగంలో టి. రాహుల్ (సెయింట్ ఆండ్రూస్), ఎం. అరవింద్ (శాంతినికేతన్) వరుసగా స్వర్ణ, రజతాలను గెలుపొందగా, సుహాస్ చౌదరి (కేవీ గచ్చిబౌలి) కాంస్యాన్ని దక్కించుకున్నాడు. ఇతర ఈవెంట్ల విజేతల వివరాలు అండర్–14 బాలుర 800మీ. పరుగు: 1. మోహిన్ (టీర్ఈఐఎస్), 2. ఎం. అరవింద్ (శాంతినికేతన్), 3. ఎం. సాయి (ఎన్జేఎంహెచ్ఎస్); బాలికలు: 1. సీహెచ్ రాఘవి (కేవీజీవీ), 2. పి. శ్రేయ (సెయింట్ మార్క్ హైస్కూల్), 3. యువిక (కెన్నడీ వీఎస్). షాట్పుట్: 1. ఎం. చంద్ర కుమార్, 2. టి. ఎమ్మాన్యుయేల్ (హెచ్పీఎస్), 3. ఎం. సుహాస్ (కేవీ గచ్చిబౌలి); బాలికలు: 1. ధ్రుతి అనీశ్ కుమార్, 2. కె. ఖదీజ, 3. ఎం. వర్ణిక. హైజంప్: 1. ఎం. చంద్రకుమార్, 2. హిమవంత్ కృష్ణ, 3. బి. ప్రణయ్; బాలికలు: 1. అదితి సింగ్ (జ్యోతి విద్యాలయ), 2. ధ్రుతి, 3. సౌమ్య (హెచ్పీఎస్). అండర్–12 బాలుర 600మీ. పరుగు: 1. ఎన్. గణేశ్ (ప్రగతి వీఎంఎస్), 2. బి. మహేశ్ (పుడమి ఎన్హెచ్ఎస్), 3. ఎస్. గణేశ్ (కేవీ గచ్చిబౌలి); బాలికలు: 1. బీఎస్ జాష్వి (సెయింట్ ఆండ్రూస్), 2. జి. రితిక (హెచ్పీఎస్), 3, ఎ. వైష్ణవి (జీసీఏఏ). హైజంప్: 1. పి. భవదీప్ (ఆర్మీ స్కూల్), 2. సీహెచ్ సిద్ధార్థ్ (సెయింట్ మేరీస్), 3. బి. ఇషాన్ (హెచ్పీఎస్); బాలికలు: 1. అదితి సింగ్, 2. ధ్రుతి, 3. సౌమ్య. షాట్పుట్: 1. ఆర్. అద్నాన్ (ఎంఎస్బీ), 2. ఎం. ప్రణవ్ (హెచ్పీఎస్), 3. ఇడ్రిస్ (ఎంఎస్బీ); బాలికలు: 1. బి. వర్‡్ష రెడ్డి (హెచ్పీఎస్), 2. ఎం. అవని (జీసీఏఏ), 3. సి. అవని (జీసీఏఏ). అండర్–10 బాలుర 600మీ. పరుగు: 1. పి. బద్రీనాథ్, 2. కె. దర్శ్ (ఎన్ఏఎస్ఆర్), 3. ఎస్. శ్రుశాంత్ రెడ్డి (శ్రీనిధి హైస్కూల్); బాలికలు: 1. కె. మహేశ్వరి (సాయి చైతన్య హైస్కూల్), 2. ఎం. రేవతి (ప్రగతి హైస్కూల్), 3. బి. శ్రీనిక (శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్). -
విద్యార్థిని ఎందుకు డిమోట్ చేయడం లేదు?
సాక్షి, హైదరాబాద్: ఓ చిన్నారిని ఒకటవ తరగతిలో కాకుండా నేరుగా రెండో తరగతిలో చేర్చుకోవడంపై వివరణ ఇవ్వాలని ఉమ్మడి హైకోర్టు గురువారం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్పీఎస్) యాజమాన్యాన్ని ఆదేశించింది. రెండో తరగతిలో చేరిన తమ చిన్నారి ఆ పాఠాలను నేర్చుకోలేకపోతోందని, అందువల్ల ఒకటో తరగతికి డిమోట్ చేయాలన్న చిన్నారి నానమ్మ చేసిన అభ్యర్థనను తిరస్కరించడంపై వివరణ ఇవ్వాలంది. తదుపరి విచారణను ఈనెల 16కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ మంతోజ్ గంగారావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రెండో తరగతిలో చేరిన తమ చిన్నారి ఆ తరగతి పాఠాలను చదవలేకపోతోందని, అందువల్ల ఆ చిన్నారిని ఒకటో తరగతికి డిమోట్ చేయాలంటూ తాము చేసిన అభ్యర్థనను హెచ్పీఎస్ యాజమాన్యం తిరస్కరించడంపై కొమిరెడ్డి అద్వేత్య నానమ్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి పిటిషన్ను కొట్టేశారు. పిటిషనర్ కోరిక మేరకే రెండో తరగతిలో ప్రవేశం కల్పించామని హెచ్పీఎస్ యాజమాన్యం చెప్పడంతో దానిని పరిగణనలోకి తీసుకుంటూ న్యాయమూర్తి ఆ పిటిషన్ను కొట్టేశారు. దీనిపై అద్వేత్య నానమ్మ ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్పై గురువారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ, ఆ చిన్నారి భవిష్యత్తును, హక్కులను దృష్టిలో పెట్టుకుని ఈ కేసును విచారిస్తామని స్పష్టం చేసింది. ఆ చిన్నారిని ఎందుకు ఒకటో తరగతికి డిమోట్ చేయడం లేదో చెప్పాలని ఆదేశిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది. -
ఓవరాల్ చాంపియన్ హెచ్పీఎస్
సాక్షి, హైదరాబాద్: సీబీఎస్ఈ క్లస్టర్ స్పోర్ట్స్ మీట్లో భాగంగా అథ్లెటిక్స్ విభాగంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్పీఎస్–రామంతాపూర్) జట్టు సత్తా చాటింది. గచ్చిబౌలిలో జరిగిన ఈ టోర్నీలో మొత్తం 149 పాయింట్లు సాధించి ఓవరాల్ చాంపియన్షిప్ టైటిల్ను దక్కించుకుంది. మరోవైపు అండర్–14 బాలబాలికల టీమ్ చాంపియన్షిప్ టైటిళ్లను సెయింట్ ఆండ్రూస్ జట్టు కైవసం చేసుకుంది. అండర్–17 బాలు ర టీమ్ విభాగంలో హెచ్పీఎస్ రామంతాపూర్, బాలికల కేటగిరీలో సెయింట్ ఆండ్రూస్ జట్లు... అండర్–19 కేటగిరీలో హెచ్పీఎస్ (బాలుర), ఏపీఎస్ ఆర్కే పురం (బాలికల) జట్లు టీమ్ చాంపియన్షిప్ టైటిళ్లను గెలుచుకున్నాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ టోర్నీ శనివారం ముగిసింది. ముగింపు కార్యక్రమంలో డీపీఎస్ చైర్మన్ కొమురయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి బహుమతులు ప్రదానం చేశారు. డీపీఎస్ జోరు సీబీఎస్ఈ క్లస్టర్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్) జట్లు జోరు కనబరుస్తున్నాయి. శనివారం జరిగిన అండర్–17 మ్యాచ్ల్లో డీపీఎస్ (వరంగల్) 3–1తో జూబ్లీహిల్స్ హైస్కూల్పై, డీపీఎస్ (విజయవాడ) 4–0తో స్పార్కిల్ ఇంటర్నేషనల్ స్కూల్పై, డీపీఎస్ (ఖాజాగూడ) 1–0తో భవన్స్ రామకృష్ణ జట్లపై గెలుపొందాయి. ఇతర మ్యాచ్ల్లో పరమహంస స్కూల్ 1–0తో సెయింట్ పీటర్స్పై, ఓబుల్రెడ్డి పబ్లిక్ స్కూల్ 1–0తో దేవ్ పబ్లిక్ స్కూల్పై, ఆర్మీ పబ్లిక్ స్కూల్ (గోల్కొండ) 5–0తో ఓబుల్రెడ్డి పబ్లిక్ స్కూల్పై విజయం సాధించాయి. టైటిల్ పోరుకు డీపీఎస్, ఓక్రిడ్జ్ జట్లు బాస్కెట్బాల్ ఈవెంట్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్) నాచారం, ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ జట్లు టైటిల్ పోరుకు అర్హత సాధించాయి. శనివారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ల్లో డీపీఎస్ నాచారం 49–36తో గ్లెండేల్ అకాడమీ (తెలంగాణ)పై గెలుపొందగా, మరో సెమీస్ మ్యాచ్లో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ 32–15తో ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్పై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన క్వార్టర్స్ మ్యాచ్ల్లో డీపీఎస్ 66–37తో సెయింట్ ఆండ్రూస్ను, గ్లెండేల్ అకాడమీ 64–43తో ఇండస్ యూనివర్సల్ జట్టును ఓడించాయి. -
హెచ్పీఎస్ జట్టుకు టైటిల్
క్రికెట్ టోర్నమెంట్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రీజియన్ ఐసీఎస్ఈ–ఐఎస్సీ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్పీఎస్) బేగంపేట్ జట్టు సత్తా చాటింది. మీట్లో భాగంగా జరిగిన క్రికెట్ టోర్నమెంట్లో విజేతగా నిలిచి టైటిల్ను సాధించింది. శనివారం జరిగిన ఫైనల్లో గీతాంజలి స్కూల్పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన గీతాంజలి స్కూల్ 62 పరుగులకు ఆలౌటైంది. అర్జున్ (21) ఒక్కడే రాణించాడు. ప్రత్యర్థి బౌలర్లలో అనిరుధ్ 3 వికెట్లు పడగొట్టగా, అజీమ్, శార్దుల్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం ఆతిథ్య హెచ్పీఎస్ జట్టు 10 ఓవర్లలో 2 వికెట్లకు 63 పరుగులు చేసింది. అజీమ్ (27) ఆకట్టుకున్నాడు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ల్లో గీతాంజలి 12 పరుగుల తేడాతో జాన్సన్ గ్రామర్ స్కూల్పై, హెచ్పీఎస్ 80 పరుగుల తేడాతో సుజాత స్కూల్పై గెలుపొందింది. వాలీబాల్లోనూ శుభారంభం ఐసీఎస్ఈ–ఐఎస్సీ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్ వాలీబాల్ ఈవెంట్లోనూ హెచ్పీఎస్ జట్టు శుభారంభం చేసింది. నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీ సీనియర్ బాలుర విభాగంలో హెచ్పీఎస్ 15–8, 15–5తో షేర్వుడ్ పబ్లిక్ స్కూల్పై గెలిచి శుభారంభం చేసింది. ఇతర మ్యాచ్ల్లో ఎస్డీఏ సెకండరీ స్కూల్ 15–11, 15–8తో ఫ్యూచర్కిడ్స్పై, హెరిటేజ్ వ్యాలీ 12–15, 14–4, 15–8తో సెయింట్ జోసెఫ్ కింగ్ కోఠిపై, సుజాత పబ్లిక్ స్కూల్ 15–4, 15–2తో జాన్సన్ గ్రామర్ స్కూల్పై గెలుపొందాయి. జూనియర్ బాలుర లీగ్ మ్యాచ్ల ఫలితాలు హెచ్పీఎస్ కడప 15–11, 15–5తో లిటిల్ ఫ్లవర్ స్కూల్పై, షేర్వుడ్ 15–5, 15–11తో ఇంటర్నేషనల్ స్కూల్పై, ఇండియన్ బ్లోసమ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ 15–11, 15–5తో జాన్సన్ గ్రామర్ స్కూల్పై, సెయింట్ జోసెఫ్ హబ్సిగూడ 15–7, 15–9తో సెయింట్ మేరీస్పై, సుజాత పబ్లిక్ స్కూల్ 15–12, 15–11తో అభ్యాస స్కూల్పై, సెయింట్ జోసెఫ్ మలక్పేట్ 15–3, 15–5తో సెయింట్ జోసెఫ్ కింగ్కోఠిపై, సెయింట్ఆన్స్ 15–13, 15–13తో ఫ్యూచర్కిడ్స్ జట్లపై గెలిచి ముందంజ వేశాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
Advertisement