breaking news
hounor
-
సరూర్నగర్లో పరువు హత్య
చైతన్యపురి (హైదరాబాద్): రాచకొండ కమిషనరేట్లోని సరూర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో పరువు హత్య చోటు చేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువకుడిని దుండగులు దారుణంగా హతమార్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...రంగారెడ్డి జిల్లా మర్పల్లికి చెందిన ఓ యువకుడు (25), అదే జిల్లా పోతిరెడ్డిపల్లి మండలం మర్పల్లి ఘనపూర్కు చెందిన యువతి (23) కళాశాలలో స్నేహితులు. వేర్వేరు మతాలకు చెందిన వీరు పెద్దలకు ఇష్టం లేకుండా ఈ ఏడాది జనవరి 31న ఓల్డ్ సిటీ లాల్దర్వాజాలోని ఆర్య సమాజంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. యువకుడు మలక్పేటలోని ఓ కార్ల షోరూంలో సేల్స్మన్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో వారు సరూర్నగర్లో ఇల్లు అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. బుధవారం రాత్రి 9గంటల సమయంలో దంపతులిద్దరూ బైక్పై వీఎం హోం నుంచి సరూర్నగర్ పోస్టాఫీస్ వైపు వెళుతున్నారు. అదే సమయంలో బైక్పై వచ్చిన దుండగులు బైక్ను ఆపారు. యువకుడి హెల్మెట్ను తీయించి సెంట్రింగ్ రాడ్తో అతనిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన అతను రక్తపు మడుగులో అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు. తమ కళ్లెదుటే జరిగిన దారుణాన్ని చూసిన ప్రజలు భయకంపితులయ్యారు. మతాంతర వివాహం నేపథ్యంలో యువతి బంధువులే ఈ పాశవిక హత్యకు పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెళ్లి జరిగిన నాటి నుంచి కక్ష పెంచుకున్న యువతి సోదరుడు, అతని బావలు కలిసి యువకుడిని హతమార్చినట్లు అనుమానిస్తున్నారు. ఇటీవల యువతి తరఫు బంధువులు తమను వెంబడించడంతో, తమకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ దంపతులు వికారాబాద్, బాలాపూర్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ప్రేమ వివాహమే కారణం: ఏసీపీ హత్యోదంతం తెలుసుకున్న ఎల్బీనగర్ క్రైమ్ డీసీపీ యాదగిరి, ఏసీపీ శ్రీధర్రెడ్డి, సరూర్నగర్ సీఐ సీతారాం, ఎస్ఐ లక్ష్మయ్య ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. హత్యకు ప్రేమ వివాహమే కారణమని, నిందితులను త్వరలో అరెస్ట్ చేస్తామని ఏసీపీ తెలిపారు. -
హేమంత్ది పరువు హత్యే : పోలీసులు
సాక్షి, హైదరాబాద్: హేమంత్ కుమార్ హత్య కేసును పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి పరువు హత్యగా తేల్చారు. హేమంత్ను పక్కా ప్రణాళికతో పరువు కోసమే హత్య చేశారుని గచ్చిబౌలి పోలీసులు సోమవారం వెల్లడించారు. తమ కూతురు కులాంతర వివాహం చేసుకున్నందుకే లోకల్ గ్యాంగ్తో కలిసి హత్య చేయించినట్లు తండ్రి లక్ష్మారెడ్డి, మామ యుగంధర్ పోలీసులు ముందు నిజం ఒప్పుకున్నారు. అవంతి-హేమంత్ ప్రేమ వివాహం గురించి తెలిసిన లక్ష్మారెడ్డి ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టించాడని పోలీసులు తెలిపారు. ఆరు నెలల పాటు అవంతిని బయటకు వెళ్లకుండా తండ్రి తీవ్రంగా కట్టడిచేశాడని వెల్లడించారు. దీంతో జూన్ 10న ఇంట్లో కరెంట్ పోయిన సమయంలో అవంతి ఇంట్లో నుంచి పారిపోయి హేమంత్ను కలిసిందని పేర్కొన్నారు. ఇప్పటివరకు హేమంత్ హత్య కేసులో మొత్తం 22 మంది నిందితులు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: (హేమంత్ హత్య కేసు: కీలకంగా మారిన ట్రావెల్స్ హిస్టరీ..) నిందితులను ఐదు రోజుల పాటు కస్టడి కోరుతూ ఎల్బీనగర్ కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. సంఘటన స్థలానికి సంబంధించి జహీరాబాద్లో ఓఆర్ఆర్ మీద సీసీ కెమెరా దృశ్యాలను సేకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను కస్డడిలోకి తీసుకొని సీన్ రీ-కన్స్ట్రక్చన్ చేయనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు అవంతి, హేమంత్ కుటుంబసభ్యులు సీపీ సజ్జనార్ను కలవనున్నారు. రాష్ట్రంలో ఈ నెల 25న చోటు చేసుకున్న హేమంత్ హత్య రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. (హేమంత్ హత్య : అసలు తప్పెవరిది?) -
సత్కారసభ