-
భారత మార్కెట్లలోకి మరో రెండు హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్..! ధర ఎంతంటే..?
భారత్కు చెందిన వార్డ్విజార్డ్ ఇన్నోవేషన్స్ అండ్ మొబిలిటీ సంస్థ రెండు కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. వోల్ఫ్+, నాను+ అనే రెండు హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింది. వీటితో పాటుగా డెలివరీ సేవలకోసం ఫ్లీట్ మేనేజ్మెంట్ విభాగంలో డెల్ గో ఎలక్ట్రిక్ స్కూటర్ను కూడా విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను గుజరాత్ వడోదరలోని తయారీ కేంద్రంలో తయారుకానున్నాయి. యువతే లక్ష్య ంగా..! యువతను లక్ష్యంగా చేసుకొని వోల్ప్ ప్లస్, నాను ప్లస్ హైస్పీడ్ బైక్స్ను కంపెనీ లాంచ్ చేసింది. వోల్ఫ్+ బైక్ పొడిగించిన వీల్బేస్తో వైడ్ లాంగర్ సీటుతో రానుంది. సిటీ ట్రాఫిక్ను దృష్టిలో ఉంచుకొని సులభమైన సీటింగ్తో నాను+ బైక్ను డిజైన్ చేశారు. డ్యూయల్ ఫోర్క్ హైడ్రాలిక్ సస్పెన్షన్ సెటప్ వెనుక వైపున మోనో షాక్ సస్పెన్షన్తో సౌకర్యంగా అందించనుంది. ఈ బైక్లను కీలెస్ స్టార్ట్/స్టాప్ ఆప్షన్ కూడా ఉంది. ఫీచర్స్ విషయానికి వస్తే..! వోల్ఫ్+, నాను+ బైక్లో వివిధ సెన్సార్ల కలయికతో అద్భుతమైన ఫీచర్స్తో రానుంది. 'జాయ్ ఇ-కనెక్ట్ యాప్' తో పనిచేయనుంది. బ్లూటూత్, ట్రాకింగ్, బ్యాటరీ స్టేటస్ ఫీచర్స్ను వార్డ్విజర్డ్ ఏర్పాటుచేసింది. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు మూడు డ్రైవ్ మోడ్స్ వస్తాయి. ఎకో, స్పోర్ట్స్ , హైపర్. రివర్స్ మోడ్ను మద్దతు ఇస్తాయి. జీపీఎస్ సెన్సింగ్, రియల్-టైమ్ పొజిషన్ , జియో-ఫెన్సింగ్ వంటి ఇతర ఫీచర్సు కూడా ఉన్నాయి. రేంజ్ విషయానికి వస్తే..! వోల్ఫ్+, నాను+ ఎలక్ట్రిక్ బైక్స్లో అద్భుతమైన రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్తో రానుంది. బ్రేక్ లివర్ని లాగిన ప్రతిసారీ బ్యాటరీని రీఛార్జ్ చేస్తోంది. ఈ బైక్స్లో 1500W మోటార్ 20 Nm టార్క్ను ఉత్పత్తి చేయనుంది. గరిష్ట వేగం 55 kmph. రెండు స్కూటర్లకు బ్యాటరీ 60V 35Ahగా రేట్ చేయబడింది. ఈ బైక్స్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తాయని కంపెనీ పేర్కొంది. ఈ బైక్స్పై మూడేళ్ల వారంటీతో రానుంది. వోల్ఫ్+ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1,10,185; కాగా నాను+ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1,06,991; డెల్ గో స్కూటర్ ధర రూ. 1,14,500 (ఎక్స్షోరూమ్) చదవండి: చైనాలో తయారు చేసి ఇండియాలో అమ్ముతానంటే ఎలా ? మేము ఒప్పుకోం ! -
విమానాల్లో ‘జీఎక్స్’ ఇంటర్నెట్ సేవలు
న్యూఢిల్లీ: విమానాల్లో హై–స్పీడ్ ఇన్ఫ్లయిట్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు అవసరమైన లైసెన్సును ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ దక్కించుకుంది. దీనితో ఇకపై ఏవియేషన్, మారిటైమ్, ప్రభుత్వ విభాగాల్లో బ్రిటన్ శాటిలైట్ సంస్థ ఇన్మార్శాట్కు చెందిన గ్లోబల్ ఎక్స్ప్రెస్ (జీఎక్స్) మొబైల్ బ్రాడ్బ్యాండ్ సేవలను అందించనుంది. బీఎస్ఎన్ఎల్ వ్యూహాత్మక భాగస్వామ్య సంస్థ అయిన ఇన్మార్శాట్ ఈ విషయాలు వెల్లడించింది. వివిధ సరీ్వసులను దశలవారీగా ప్రవేశపెట్టనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే స్పైస్జెట్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తదితర సంస్థలు జీఎక్స్ సరీ్వసులు పొందేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఇన్మార్శాట్ ఇండియా ఎండీ గౌతమ్ శర్మ తెలిపారు. వీటితో భారత గగనతలంలో ఎగిరే దేశ, విదేశ ఎయిర్లైన్స్లో వేగవంతమైన ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుంది. దీనితో విమాన ప్రయాణికులు ఆకాశంలో కూడా ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకోవడం, సోషల్ మీడియాను చెక్ చేసుకోవడం, ఈమెయిల్స్ పంపడం, యాప్స్ ద్వారా వాయిస్ కాల్స్ చేయడం వంటివి వీలవుతుంది. -
న్యూవిస్టాడోమ్ కోచ్తో మరుపురాని ప్రయాణం!
న్యూఢిల్లీ: దేశీయంగా తయారుచేసిన న్యూ డిజైన్ విస్టాడోమ్ కోచ్లపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. వీటిలో ప్రయాణాలు చిరస్మరణీయాలుగా మారతాయన్నారు. ► ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో వీటిని ఉత్పత్తి చేశారు. ఈ కోచ్లో 44 ప్యాసెంజర్ సీట్లుంటాయి. వీటిని 180 డిగ్రీల మేర తిప్పుకోవచ్చు. ► పైకప్పు గాజుతో చేయడం వల్ల వ్యూ ఏరియా మరింత పెరుగుతుంది. మంగళవారం ఈ కోచ్లు 180 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ వద్ద ట్రయిల్ రన్ పూర్తి చేసుకున్నాయి. ► వీటిని తొలిసారి ఎల్హెచ్బీ ప్లాట్ఫామ్పై నిర్మించారు. కోచ్లో వైఫై ఆధారిత ప్రయాణీకుల సమాచారం ఉంటుంది. ► ఎయిర్ స్ప్రింగ్ సస్పెన్షన్లు, పెద్ద గాజు కిటికీలు, ప్రతిసీటుకి మొబైల్ చార్జింగ్ సాకెట్, డిజిటల్ డిస్ప్లే స్క్రీన్లు, స్పీకర్లు, వెడల్పైన ఎంట్రన్స్ డోర్లు, ఎల్ఈడీ డెస్టినేషన్ బోర్డులు, మల్టీటైర్ లగేజ్ ర్యాక్స్, మిని ప్యాంట్రీ, సీసీటీవీ నిఘా, మాడ్యులర్ టాయిలెట్స్, ఆటోమేటిక్ ఫైర్ డిటెక్షన్ సిస్టమ్ తదితరాలు ఈ కోచ్ల ప్రత్యేకతలు. ► ప్రస్తుతం ఐసీఎఫ్ పది విస్టాడోమ్ కోచ్లను తయారుచేస్తోంది. ఇప్పటికే రెండింటి ఉత్పత్తి పూర్తికాగా మిగిలినవి వచ్చేమార్చి చివరకు పూర్తి చేస్తారు. వీటిని పర్యాటకులు ఎక్కువగా ప్రయాణించే మార్గాల్లో ఉపయోగిస్తారు. -
నిద్రమత్తు ప్రాణం తీసింది
కొనకనమిట్ల: అతివేగం, నిద్రమత్తు వెరసి కారు యజమాని ప్రాణం తీసింది. ఈ సంఘటన ఒంగోలు–గిద్దలూరు రహదారిలో కొనకనమిట్ల మండలం చినారికట్ల జంక్షన్ సమీపంలోని ఎర్రవాగు బ్రిడ్జి దగ్గర ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా బట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామానికి చెందిన వల్లభనేని వెంకటేశ్వరరావు (65) వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలం రామేశ్వరం గ్రామం దగ్గర కొంత పొలం కొన్నాడు. ఆ పొలంలో ఇటీవల ఒక ఇల్లు నిర్మించాడు. కాగా ఆ ఇంటికి రంగులు వేసేందుకు తన గ్రామానికి చెందిన పెయింటర్స్ ఇస్లావత్ రాజేంద్రప్రసాద్ నాయక్, కృష్ణమూర్తి, ప్రసాద్లను తీసుకొని మారుతీ సుజికి కారులో రామేశ్వరం వెళుతున్నాడు. కారును క్రాంతి కిరణ్ అనే డ్రైవర్ నడుపుతున్నాడు. వాహనం చినారికట్ల జంక్షన్ ఎస్ఆర్ పెట్రోలు బంక్ సమీపంలో ఎర్రవాగు దగ్గరకు వేగంగా వచ్చింది. ఇదే సమయంలో డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకోవడంతో అదుపు తప్పి ఎర్రవాగుపై నిర్మించిన బ్రిడ్జి డివైడర్ను బలంగా ఢీ కొట్టింది. అతని పక్కసీటులో కూర్చుని ఉన్న కారు యజమాని వెంకటేశ్వరరావు తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్కు స్వల్ప గాయాలు కాగా కారు వెనుక సీట్లో కూర్చుని ఉన్న రాజేంద్రప్రసాద్ నాయక్, ప్రసాద్, కృష్ణమూర్తి తీవ్రంగా గాయపడ్డారు. కారు ముందు భాగం దెబ్బతింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన కొనకనమిట్ల ఏఎస్ఐ మనోహరరాజు, కానిస్టేబుల్ మోహన్లు ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం వెంకటేశ్వరరావు మృతదేహాన్ని పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడు వెంకటేశ్వరరావుకు భార్య పిల్లలున్నారు. బతుకు దెరువు కోసం ఎక్కడో ఊరు కాని ఊర్లో పొలం కొని అక్కడ ఇల్లు కట్టించుకొన్న వెంకటేశ్వరరావు మృతి చెందటంతో బంధువులు భోరున రోదించారు. కూలి పనికి వెళుతూ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారు ఆ తర్వాత ఒంగోలుకు వైద్యశాలకు తరలించడంతో బంధువులు వచ్చి పరామర్శించారు. -
అతివేగం వల్లే ప్రమాదం
ఏర్పేడు ఘటనపై తిరుపతి ఎస్పీ స్పష్టీకరణ తిరుపతి క్రైం: చిత్తూరు జిల్లా ఏర్పేడులో ఈ నెల 21న లారీ అతివేగంగా రావడం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ జయలక్ష్మి పేర్కొన్నారు. మంగళవారం తన కార్యాలయంలో ఆమె ఘటన వివరాలను మీడియాకు వెల్లడిం చారు. ఈ ఘటనలో లారీ దూసుకు పోవడం వల్ల 15 మంది ప్రాణాలు కోల్పోగా, 25 మందికి పైగా గాయపడ్డారన్నారు. లారీలో ఇద్దరు డ్రైవర్లున్నారని, ఘటన జరిగిన వెంటనే ఒక డ్రైవర్ గురవయ్యను స్థానికులు పోలీసులకు అప్పగించారన్నారు. అతను మద్యం సేవించి ఉండడం వల్ల వైద్య పరీక్షలు చేయించి, భద్రతా కారణాల దృష్ట్యా ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించామన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో లారీ నడుపుతున్న డ్రైవర్ సుబ్రమణ్యం అలియాస్ మణి, లారీ యజమాని రమేష్లు మంగళవారం ఉదయం 7 గంటలకు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అక్కరపాక గ్రామం ఇన్చార్జి వీఆర్వో ముందు హాజరై సంఘటన జరిగిన తీరును వివరించార న్నారు. వీఆర్వో ద్వారా సమాచారం అందుకున్న ఏర్పేడు పోలీసులు వారిద్దరినీ స్టేషన్లో డీఎస్పీ ముందు హాజరు పరిచారని చెప్పారు. వారిని విచారించగా లారీ యజమాని టి.రమేష్ వారికి లైసెన్స్ లేదని తెలిసినా చేర్చుకున్నాడని తేలిందన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
రేవంత్ దుకాణం బంద్ కావాలి
సమయం లేదు మిత్రమా..!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement