breaking news
hen fight
-
కోడిపందాలపై దాడి : 30 మంది అరెస్ట్
మచిలీపట్నం : కృష్ణాజిల్లా బంటుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం కోడిపందాలపై పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. 23 బైకులతోపాటు, రూ. 5200 నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కోడిపందాల స్థావరాలపై దాడి: ఏడుగురు అరెస్ట్
విజయనగరం: విజయనగరం జిల్లా ఎల్ కోట మండలం తామరాపల్లిలో కోడిపందాల స్థావరాలపై బుధవారం పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. వారి వద్ద నుంచి రూ. 18,00 నగదుతోపాటు ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కోడిపందాలపై దాడి: 29 మంది అరెస్ట్
హైదరాబాద్ : రంగారెడ్డి యాచారం మండలం సింగారంలో నిర్వహిస్తున్న కోడిపందాలపై ఎస్ఓటీ పోలీసులు ఆదివారం దాడి చేశారు. ఈ సందర్భంగా 29 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 3 లక్షల నగదు, 8 కార్లు, 31 సెల్ఫోన్లతోపాటు 23 కోళ్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సమరానికి సై
కాలుదువ్వుతున్న పందెం కోళ్లు పెద్ద పండగకు సిద్ధం చేసుకుంటున్న పందెంరాయుళ్లు ఒక్కొక్కటి రూ.5 వేల నుంచి రూ.25 వేలకు కొనుగోలు రాయవరం/ఉప్పలగుప్తం : మరో మూడు వారాల్లో పెద్ద పండగ రానుంది. ధనుర్మాసం ప్రారంభం కావడంతో ఇప్పటికే హరిదాసులు, గంగిరెద్దుల వాళ్లు, జంగమదేవర్లు, పగటివేషగాళ్లు గ్రామాల్లో సందడి చేస్తున్నారు. అన్నిటికంటే ప్రధానమైనది సంక్రాంతిలో కోడిపందేలు. వీటి పై నిషేధం విధించినా.. చాటుమాటుగా పందెంరాయుళ్లు కోడిపందేలు నిర్వహిస్తూనే ఉంటారు. రెండేళ్లుగా ప్రభుత్వం దీనిని చూసీచూడనట్టు వ్యవహరించడంతో.. ఈ ఏడాది కూడా అవే పరిస్థితులు ఉంటాయన్న ఉద్దేశంతో పందెంరాయుళ్లు సుమారు మూడు నెలల ముందుగానే పుంజులను కొనుగోలు చేసి, పందేలకు సిద్ధం చేస్తున్నారు. పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ పందెం కోడిపుంజులు అనగానే వాటి పెంపకం తీరు ప్రత్యేకంగా ఉంటుంది. వాటి ఆరోగ్యం కోసం చెరువులో ఈత, వాకింగ్, ఎండలో కట్టి ఉంచడం వంటివి చేస్తారు. ఆహారంగా బాదం, పిస్తా, జీడిపప్పు, తాటిబెల్లం, నువ్వుల నూనెతో చేసిన ఉండలు, కోడిగుడ్లు, ఉడికించిన వేటమాంసంతో పాటు చోళ్లు, గంట్లు, వడ్లను తినిపిస్తారు. వారానికోకసారి టెర్రామైసిన్, రెవిటాల్ వంటి టాబ్లెట్లు వేస్తారు. ఇలా రోజుకు ఒక్కో కోడికి రూ.40 నుంచి రూ.100 వరకు ఖర్చు చేస్తారు. ఈ లెక్కన పందెంరాయుళ్లు ఒక్కోదానికి రూ.6 వేల వరకు కేవలం వాటి ఆహారానికే ఖర్చు చేస్తున్నారు. ఆర్థికంగా స్థితిమంతులైతే రూ.10 వేల వరకూ ఖర్చు చేయడానికి వెనుకాడడం లేదు. పెద్దఎత్తున విక్రయాలు ఒక్కో వ్యక్తి రెండు నుంచి నాలుగు పుంజులను పందేలకు సిద్ధం చేస్తున్నారు. వాటిని విక్రయించే వారు సుమారు 20 పుంజుల వరకు పోషిస్తున్నారు. జిల్లాలోని మండపేట, రావులపాలెం, ఐ.పోలవరం, అమలాపురం, పెదపూడి, జగ్గంపేట తదితర ప్రాంతాల్లో పందెంకోళ్ల విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నట్టు తెలిసింది. జిల్లాలో సుమారు 50 వేల పందెం కోడిపుంజులను సిద్ధం చేస్తున్నట్టు అంచనా. ఒకొక్కటి రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు విక్రయిస్తున్నారు. గతేడాది పెద్ద పండగ మూడు రోజులు రూ.100 కోట్ల పైబడి పందేలు సాగినట్టు చెప్పుకొంటున్నారు. పందెంరాయుళ్లు కోడిపుంజుల కొనుగోలుకు వేలాది రూపాయలు వెచ్చిస్తుండడంతో గ్రామాల్లో అనేకమంది వీటిని పెంచుతూ, ఉపాధి పొందుతున్నారు. కోడిపుంజుల్లోరకాలు కోడి పుంజుల్లో వాటి ఈకల ఆధారంగా రకాలను నిర్ణయిస్తారు. డేగ, కాకి, పూల, పర్ల, సేతువ, రసంగి, నెమలి, మసరకాకి, తెల్లచెవల, గేరువా డేగ, కాకినెమలి, కాకి డేగ, కోడి డేగ, నల్లచెవల, పెట్టమారు, అబ్రాస్ తదితర రకాల కోడిపుంజులున్నాయి.. -
కోడి పందేలపై సుప్రీంకోర్టులో పిటిషన్
హైదరాబాద్: కోడి పందేలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన బీజేపీ నాయకుడు రఘురామ కృష్ణంరాజు శనివారం సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పు సంప్రదాయాలకు విఘాతం కలిగించేలా ఉందని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. కోళ్లకు కత్తి కట్టకుండా, బెట్టింగులకు పాల్పడకుండా కోడి పందేలకు అనుమతి ఇవ్వాలంటూ ఆయన సుప్రీంకోర్టును కోరారు. ఈ పిటిషన్ జనవరి 7వ తేదీన విచారణకు వచ్చే అవకాశం ఉంది. -
ఉభయగోదావరి పందేలకు హైదరాబాద్ నుంచే కోళ్లు