రంగారెడ్డి యాచారం మండలం సింగారంలో నిర్వహిస్తున్న కోడిపందాలపై ఎస్ఓటీ పోలీసులు ఆదివారం దాడి చేశారు.
హైదరాబాద్ : రంగారెడ్డి యాచారం మండలం సింగారంలో నిర్వహిస్తున్న కోడిపందాలపై ఎస్ఓటీ పోలీసులు ఆదివారం దాడి చేశారు. ఈ సందర్భంగా 29 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 3 లక్షల నగదు, 8 కార్లు, 31 సెల్ఫోన్లతోపాటు 23 కోళ్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.