breaking news
health reasons
-
మనసున లేనిది!
రక్తమాంసాలతో పాటు మనుషుల్లో భావోద్వేగాలు కూడా కలిసిపోయి ఉంటాయి. అవి లేబొరేటరీలలో బయటపడవు. మాటల్లోనే బయట పడతాయి. మాట జారితే వెనక్కు తీసుకోలేం. అలాగని మౌనంగా ఉండిపోతే.. మాట జారినప్పుడు జరిగే నష్టం కన్నా కొన్నిసార్లు మాటను బిగబట్టి ఉంచడమే ఎక్కువ చేటు చేస్తుంది. మరి ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు మౌనం వహించాలి? విజ్ఞులు, స్థితప్రజ్ఞులు అనుకుంటాం కానీ.. వారి దగ్గర కూడా ఈ ప్రశ్నకు సమాధానం దొరకదు. రక్తమాంసాలతో పాటు మనుషుల్లో భావోద్వేగాలు కూడా కలిసిపోయి ఉంటాయి. అవి లేబొరేటరీలలో బయటపడవు. మాటల్లోనే బయట పడతాయి. ఇక మౌనం అనేది రక్తమూ కాదు. మాంసమూ కాదు. ఉద్వేగమూ కాదు. ఊహించిన ఉపద్రవాన్నో, ఊహించని ఉత్పాతాన్నో తప్పించుకోవడానికి మనిషి ఆశ్రయించే స్థితి. అది కొన్నిచోట్లే పనిచేస్తుంది. మిగతాచోట్ల మనిషిని అనామకం చేస్తుంది. ‘నిరర్థక మౌనం’ అవుతుంది. దాని కన్నా మాటే నయం. ప్రాణి అన్నాక యాక్షనో, రియాక్షనో ఉండకపోతే ఎలా! ఆర్థికశాఖ మంత్రి అరుణ్జైట్లీ ఈ మధ్య పెద్దగా మాట్లాడ్డం లేదు. ఏవో ఆరోగ్య కారణాలు. ఆయనకు బదులుగా ‘లా’ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతున్నారు. మంత్రులకూ వాళ్లకూ ఎలా మాట్లాడాలో కూడా ప్రసాద్ చెబుతున్నారు. ‘కుఠువా’ మీద అలా మాట్లాడకండి, ‘ఉన్నావ్’ మీద అలా మాట్లాడండి అని ఆయనే డైరెక్ట్ చేస్తున్నారు. మోదీ అయితే.. ‘ఆచితూచి మాట్లాడండి’ అనే ఆదేశం కూడా జారీ చేశారు. అలా ఆదేశం జారీ అయిన కొద్ది గంటలకే కేంద్రమంత్రి సంతోష్ కుమార్ మాట జారారు. ‘ఇంత పెద్ద దేశంలో ఒకటీ అరా రేపులు జరగవా?!’ అన్నారు. తర్వాత.. ‘నా ఉద్దేశం అది కాదు’ అన్నారు. ఉద్దేశాలు ఏవైనా ఒకసారి జారిపోయాక మళ్లీ లేవలేం. ఒక్కోసారి ఉద్దేశం లేకుండా మాట వచ్చేస్తుందని మనోవైజ్ఞానిక నిపుణులు అంటారు. ‘ఫ్రాయిడియన్ స్లిప్’ అంటారు అలా జారడాన్ని. మనసులో లేనిది మాటగా బయటికి రావడం! సరే, వచ్చింది. నష్ట నివారణ ఏమిటి? రవిశంకర్ ప్రసాద్ అయితే ఒక మార్గం చెబుతున్నారు. ‘ట్విట్టర్ ఉంది కదా. అక్కడ మీ మాటలకు కరెక్షన్ చేసుకోండి’ అని. మాట గాయానికి ట్విట్టర్ కట్టు! – మాధవ్ శింగరాజు -
చేపలు తెస్తానని వెళ్లి...
చేపలు తెస్తానని వెళ్లి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి మృతదేహం లభ్యం అయింది. వరంగల్ జిల్లా మంగపేట మండల కేంద్రానికి చెందిన పూజారి సురేందర్(37) స్థానికంగా ఆటో మొబైల్ షాప్ నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం చేపలు తీసుకొస్తానని మంగపేట పుష్కర ఘాట్ వద్దకు వెళ్లాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు గాలింపు ప్రారంభించారు. సురేందర్ తీసుకెళ్లిన బైక్ ఘాట్ సమీపంలో ఉండటంతో గోదావరిలో పడి ఉంటాడని గాలింపు చర్యలు ప్రారంభించారు. సమాచారం అందుకున్న పోలీసులు కూడా రంగంలోకి దిగి మరపడవల సాయంతో వెతికారు. కాగా.. ఈ రోజు గోదావరి అవతలి ఒడ్డులో ఉన్న మడుగులో సురేందర్ మృతదేహం లభ్యమైంది . మృత దేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనారోగ్య కారణాల వల్లే గోదావరి లో దూకి ఉంటాడని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.