Hayley Matthews
-
హేలీ మాథ్యూస్ ఆల్రౌండ్ షో
లాహోర్: హేలీ మాథ్యూస్ మరోసారి ఆల్రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టడంతో... అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల వన్డే వరల్డ్కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో వెస్టిండీస్ తొలి విజయం నమోదు చేసుకుంది. మొదటి మ్యాచ్లో స్కాట్లాండ్ చేతిలో ఓడిన వెస్టిండీస్ జట్టు... రెండో మ్యాచ్లో ఐర్లాండ్పై విజయం సాధించింది. శుక్రవారం జరిగిన పోరులో విండీస్ 6 వికెట్ల తేడాతో ఐర్లాండ్ను చిత్తు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ను 33 ఓవర్లకు కుదించగా... మొదట బ్యాటింగ్ చేసిన కరీబియన్ జట్టు 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హేలీ మాథ్యూస్ (18 బంతుల్లో 23; 5 ఫోర్లు) జట్టుకు మెరుపు ఆరంభాన్నివ్వగా... చినెల్లి హెన్రీ (36 బంతుల్లో 46; 2 ఫోర్లు, 1 సిక్స్), స్టెఫానీ టేలర్ (56 బంతుల్లో 46; 5 ఫోర్లు), జైదా జేమ్స్ (36) రాణించారు. ఐర్లాండ్ బౌలర్లలో జేన్ మాగుర్ 3 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనలో ఐర్లాండ్ మహిళల జట్టు 32.2 ఓవర్లలో 175 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ అమీ హంటర్ (46 బంతుల్లో 48; 8 ఫోర్లు) ధాటిగా ఆడగా... మిగిలిన వాళ్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. గత మ్యాచ్లో బ్యాటింగ్లో వీరోచిత శతకంతో పాటు... బౌలింగ్లో 4 వికెట్లతో విజృంభించినా... జట్టును గెలిపించుకోలేకపోయిన హేలీ మాథ్యూస్... తాజా పోరులోనూ 4 వికెట్లతో సత్తా చాటింది. మైదానంలో పాదరసంలా కదులుతూ మూడు క్యాచ్లు సైతం అందుకుంది. ఇతర విండీస్ బౌలర్లలో ఆలియా, కరిష్మా చెరో 2 వికెట్లు తీశారు. తదుపరి మ్యాచ్లో సోమవారం ఆతిథ్య పాకిస్తాన్తో వెస్టిండీస్ తలపడుతుంది. -
WPL 2025: ముంబై మెరిసె... ఫైనల్లో హర్మన్ బృందం
సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన ముంబై ఇండియన్స్ జట్టు మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీ మూడో సీజన్లో టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. ఏకపక్షంగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 47 పరుగుల తేడాతో గుజరాత్ జెయింట్స్పై ఘనవిజయం సాధించింది. బ్యాట్తో హేలీ మాథ్యూస్, నాట్ సివర్ బ్రంట్, హర్మన్ప్రీత్ కౌర్ చెలరేగడంతో ముంబై భారీ స్కోరు చేసింది. అనంతరం బంతితోనూ ముంబై బౌలర్లు హడలెత్తించారు. దాంతో లక్ష్య ఛేదనలో గుజరాత్ జెయింట్స్ డీలా పడింది. ముంబై ఇండియన్స్ జట్టుతో ఆడిన ఏడోసారీ గుజరాత్ జట్టు పరాజయాన్నే మూటగట్టుకుంది. ముంబై: మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో రెండోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ 47 పరుగుల తేడాతో గుజరాత్ జెయింట్స్పై గెలిచి తుదిపోరుకు చేరింది. శనివారం జరిగే టైటిల్ పోరులో గత ఏడాది రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్తో ముంబై ఆడుతుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. హేలీ మాథ్యూస్ (50 బంతుల్లో 77; 10 ఫోర్లు, 3 సిక్స్లు), నాట్ సివర్ బ్రంట్ (41 బంతుల్లో 77; 10 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధశతకాలతో విజృంభించారు. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (12 బంతుల్లో 36; 2 ఫోర్లు, 4 సిక్స్లు) మెరిపించింది. గుజరాత్ జెయింట్స్ బౌలర్లలో గిబ్సన్ 2 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్ జెయింట్స్ జట్టు 19.2 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. గిబ్సన్ (24 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్), లిచ్ఫీల్డ్ (20 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్), భారతి (20 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్) పోరాడినా ఫలితం లేకపోయింది. ముంబై బౌలర్లలో హేలీ 3, అమేలియా కెర్ 2 వికెట్లు పడగొట్టింది. హేలీ మాథ్యూస్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. బాదుడే బాదుడు.. మొదట బ్యాటింగ్కు దిగిన ముంబైకి శుభారంభం దక్కలేదు. గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు వేయడంతో పవర్ప్లే ముగిసేసరికి యస్తిక భాటియా (15; 3 ఫోర్లు) వికెట్ కోల్పోయిన ముంబై 37 పరుగులే చేసింది. గిబ్సన్ వేసిన ఏడో ఓవర్లో సివర్ బ్రంట్ రెండు ఫోర్లతో జోరు పెంచగా... ప్రియా ఓవర్లో హేలీ ‘హ్యాట్రిక్’ ఫోర్లతో విరుచుకుపడింది. గుజరాత్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఈ జోడీ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదడంతో 11 ఓవర్లు ముగిసేసరికి ముంబై జట్టు 100/1తో నిలిచింది. ఈ క్రమంలో హేలీ 36 బంతుల్లో, సివర్ 29 బంతుల్లో అర్ధశతకాలు పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత ఈ జంట మరింత ధాటిగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. గిబ్సన్ వేసిన 15వ ఓవర్లో సివర్ రెండు భారీ సిక్సర్లు బాదగా... ప్రియ ఓవర్లో హేలీ వరుసగా 6, 6, 4 కొట్టింది. రెండో వికెట్కు 71 బంతుల్లో 133 పరుగులు జోడించిన అనంతరం హేలీ అవుట్ కాగా... హర్మన్ వచ్చిరావడంతోనే భారీ షాట్లతో విరుచుకుపడింది. తనూజ వేసిన 18వ ఓవర్లో 2 సిక్స్లు, 2 ఫోర్లు కొట్టిన హర్మన్... చివరి ఓవర్లో మరో 2 సిక్స్లు బాదింది. దీంతో ముంబై భారీ స్కోరు చేసింది. చివరి 5 ఓవర్లలో ముంబై జట్టు 73 పరుగులు రాబట్టింది.ఛేజింగ్లో జెయింట్స్ రనౌట్.. భారీ లక్ష్యఛేదనలో గుజరాత్ ప్రభావం చూపలేకపోయింది. తొలి ఓవర్లోనే ఓపెనర్ బెత్ మూనీ (6) పెవిలియన్ చేరగా... కెప్టెన్ ఆష్లీ గార్డ్నర్ (8), హర్లీన్ డియోల్ (8) ఎక్కువసేపు నిలవలేకపోయారు. దీంతో గుజరాత్ 43 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో గిబ్సన్, లిచ్ఫీల్డ్ కాస్త పోరాడినా... ముంబై బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొడుతూ ఒత్తిడి పెంచారు. క్రమశిక్షణతో కూడిన బౌలింగ్కు చక్కటి ఫీల్డింగ్ తోడవడంతో ముంబై జట్టు స్పష్టమైన ఆధిక్యం కనబర్చింది. భారతి, సిమ్రన్ (8 బంతుల్లో 17; 2 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులు ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే పరిమితమయ్యాయి. పేలవ ఫీల్డింగ్తో ముంబై బ్యాటర్లు ఇచ్చిన 4 క్యాచ్లు వదిలేసిన గుజరాత్ జట్టు... వికెట్ల మధ్య చురుకుగా పరిగెత్తలేక రనౌట్ రూపంలో 3 వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది.స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: యస్తిక భాటియా (సి) భారతి (బి) గిబ్సన్ 15; హేలీ మాథ్యూస్ (సి) మూనీ (బి) కాశ్వీ గౌతమ్ 77; సివర్ బ్రంట్ (సి) లిచ్ఫీల్డ్ (బి) గిబ్సన్ 77; హర్మన్ప్రీత్ కౌర్ (రనౌట్) 36; సజన (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 213. వికెట్ల పతనం: 1–26, 2–159, 3–198, 4–213. బౌలింగ్: కాశ్వీ గౌతమ్ 4–0–30–1; ఆష్లీ గార్డ్నర్ 2–0–15–0; తనూజ కన్వర్ 4–0–49–0; గిబ్సన్ 4–0–40–2; ప్రియా మిశ్రా 3–0–40–0; మేఘనా సింగ్ 3–0–35–0. గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: బెత్ మూనీ (సి) హేలీ మాథ్యూస్ (బి) షబ్నమ్ 6; గిబ్సన్ (రనౌట్) 34; హర్లీన్ డియోల్ (రనౌట్) 8; ఆష్లీ గార్డ్నర్ (బి) హేలీ మాథ్యూస్ 8; లిచ్ఫీల్డ్ (స్టంప్డ్) యస్తిక (బి) కెర్ 31; భారతి (బి) హేలీ 30; కాశ్వీ గౌతమ్ (రనౌట్) 4; సిమ్రన్ (సి) హర్మన్ప్రీత్ (బి) కెర్ 17; తనూజ (సి) అమన్జ్యోత్ (బి) సివర్ 16; మేఘన (సి) సివర్ (బి) హేలీ 5; ప్రియ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 7; మొత్తం (19.2 ఓవర్లలో ఆలౌట్) 166. వికెట్ల పతనం: 1–6, 2–34, 3–43, 4–81, 5–107, 6–112, 7–142, 8– 157, 9–165, 10–166. బౌలింగ్: షబ్నిమ్ 4–0–35–1; సివర్ 4–0–31–1; సైకా 1–0– 8–0; హేలీ 3.2–0–31–3, అమన్జ్యోత్ 3–0–32–0; అమేలియా కెర్ 4–0–28–2. -
మాథ్యూస్, స్కివర్ విధ్వంసం.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే?
డబ్ల్యూపీఎల్-2025లో ముంబై వేదికగా గుజరాత్ జెయింట్స్తో జరుగుతున్న ఎలిమినేటర్లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోర్ సాధించింది.ముంబై బ్యాటర్లలో హీలీ మాథ్యూస్(50 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 77), నాట్ స్కివర్ బ్రాంట్(41 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లతో 77) అద్బుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరూ గుజరాత్ బౌలర్లను ఊచకోత కోశారు. వీరిద్దరూ రెండో వికెట్కు 133 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ సీనియర్ ద్వయంతో పాటు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్(12 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 36) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది.గుజరాత్ బౌలర్లలో గిబ్సన్ రెండు, గౌతమ్ ఓ వికెట్ పడగొట్టారు. కాగా ఈ మ్యాచ్లో గుజరాత్ ఫీల్డర్లు సునాయస క్యాచ్లను జారవిడిచారు. అందుకు గుజరాత్ భారీ మూల్యం చెల్లుంచుకోవాల్సి వచ్చింది. అదేవిధంగా ఈ ఎలిమినేటర్ మ్యాచ్కు గుజరాత్ స్టార్ ప్లేయర్ డాటిన్ దూరమైంది. డాటిన్ లేని లోటు గుజరాత్ టీమ్లో స్పష్టంగా కన్పించింది. తుది జట్లుముంబై ఇండియన్స్: హేలీ మాథ్యూస్, అమేలియా కెర్, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), అమంజోత్ కౌర్, యాస్తిక భాటియా (వికెట్ కీపర్), సజీవన్ సజన, జి కమలిని, సంస్కృతి గుప్తా, షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాక్గుజరాత్: బెత్ మూనీ (వికెట్ కీపర్), కష్వీ గౌతమ్, హర్లీన్ డియోల్, ఆష్లీ గార్డనర్ (కెప్టెన్), ఫోబ్ లిచ్ఫీల్డ్, డేనియల్ గిబ్సన్, భారతీ ఫుల్మాలి, సిమ్రాన్ షేక్, మేఘనా సింగ్, తనూజా కన్వర్, ప్రియా మిశ్రా -
అజేయ శతకంతో కదంతొక్కిన కెప్టెన్.. తొలి వన్డేలో బంగ్లాపై విండీస్ ఘన విజయం
ఐసీసీ ఛాంపియన్షిప్ 2025లో భాగంగా బంగ్లాదేశ్ మహిళల క్రికెట్ జట్టు వెస్టిండీస్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో ఇరు జట్లు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్నాయి. వన్డే సిరీస్లో భాగంగా నిన్న (జనవరి 19) సెయింట్ కిట్స్లో తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఆతిథ్య వెస్టిండీస్ పర్యాటక బంగ్లాదేశ్ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. విండీస్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టి తమ విజయంలో ప్రధాన పాత్ర పోషించింది.తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్లో షర్మిన్ అక్తర్ (42), ముర్షిదా ఖాతూన్ (40), శోభన మోస్తరీ (35), షోమా అక్తర్ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఫర్జానా హక్ (10), కెప్టెన్ నిగర్ సుల్తానా (14), రబెయా ఖాన్ (1), నహిదా అక్తర్ (9), సుల్తానా ఖాతూన్ (2) విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో డియాండ్రా డొట్టిన్ మూడు వికెట్లతో చెలరేగగా.. ఆలియా అలెన్, హేలీ మాథ్యూస్ తలో రెండు, అఫీ ఫ్లెచర్ ఓ వికెట్ దక్కించుకున్నారు.అనంతరం బరిలోకి దిగిన వెస్టిండీస్ 31.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ హేలీ మాథ్యూస్ అజేయ సెంచరీతో (93 బంతుల్లో 104 నాటౌట్; 16 ఫోర్లు) విండీస్ను విజయతీరాలకు చేర్చింది. క్యియానా జోసఫ్ (79 బంతుల్లో 70; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించింది. మాథ్యూస్, జోసఫ్ తొలి వికెట్కు రికార్డు స్థాయిలో 163 పరుగులు జోడించారు. వన్డౌన్లో వచ్చిన షెర్మైన్ క్యాంప్బెల్ 14 పరుగులతో అజేయంగా నిలిచింది. క్వియానా జోసఫ్ వికెట్ రిబేయా ఖాన్కు దక్కింది. ఈ గెలుపుతో విండీస్ మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరు జట్ల మథ్య రెండో వన్డే జనవరి 21న జరుగనుంది.