breaking news
g.srinivas goud
-
మహానేత పథకాలతోనే అందరికి న్యాయం
వైఎస్సార్ సీపీ పటాన్చెరు అభ్యర్థి శ్రీనివాస్గౌడ్ జిన్నారం, న్యూస్లైన్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందని వైఎస్సార్ సీపీ పటాన్చెరు నియోజకవర్గ అభ్యర్థి జి.శ్రీనివాస్గౌడ్ అన్నారు. శనివారం జిన్నారం మండలం బొంతపల్లి, గుమ్మడిదల గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మహానేత వైఎస్ సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించారు. తాము చేపట్టే ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు శేఖర్, ఆంజనేయులు, చంద్రశేఖర్, నీలం సత్యనారాయణ, సురేష్, కృష్ణ, వెంకటేశ్, మురళి, దేవేందర్, రాజు తదితరులు పాల్గొన్నారు. పార్టీలో చేరికలు రామచంద్రాపురం: పట్టణానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు, మైనార్టీ యువకులు వైఎస్సార్ సీపీలో చేరారు. శుక్రవారం రాత్రి, శనివారం పట్టణంలోని పలు చోట్ల పార్టీ ఎన్నికల కార్యాలయాల ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గంలో వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ద్వారా అనేకమంది లబ్ధి పొందార ని తెలిపారు. వారందరూ వైఎస్సార్ సీపీకి అండగా ఉన్నారని చెప్పారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో నాయకులు రాజు, కృష్ణ, రమేశ్, ప్రసాద్, పవన్, బాలు పాల్గొన్నారు. -
వైఎస్ పథకాలే ప్రచార అస్త్రాలుగా
రామచంద్రాపురం, న్యూస్లైన్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను ప్రచార అస్త్రాలుగా చేసుకుని ఓటర్ల వద్దకు వెళ్తున్నట్టు వైఎస్సార్ సీపీ పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి జి.శ్రీనివాస్గౌడ్ తెలిపారు. సోమవారం ఆయన రామచంద్రాపురం పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని శ్రీనివాస్నగర్ కాలనీ, పాత రామచంద్రాపురంలో ఇంటింటి ప్రచారం చేశారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా అభ్యర్థి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ దివంగత నేత వైఎస్సార్ పథకాలను ఓటర్లకు వివరిస్తున్నట్టు తెలిపారు. పేదల సంక్షేమం కోసం మహానేత వైఎస్సార్ ఎన్నో పథకాలు, కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్తో ఎంతో మంది పేదలు ఉన్నత విద్యను అభ్యసించినట్టు తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లక్షల మంది కార్పొరేట్ వైద్యాన్ని అందుకున్నారన్నారు. ఇలాంటి ఎన్నో పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలు లబ్ధిపొందినట్టు ఆయన చెప్పారు. మహానేత పథకాలే తమను విజయ పథాన నిలుపుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు సంజీవరావు, సారా శ్రీనివాస్, విఠల్, మురళి, సతీష్ పాల్గొన్నారు.