-
ఇంటర్లో గ్రేస్ మార్కులు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల్లో కనీస పాస్ మార్కులను (గ్రేస్ మార్కులు) ఇచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడియట్ బోర్డు ప్రతిపాదనలు పంపించినా... కనీస పాస్ మార్కులు ఇచ్చేందుకే ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ ఇబ్బందికరమన్న ఆలోచన ప్రభుత్వ వర్గాల్లో ఉంది. ఇంటర్మీడియట్ బోర్డు కూడా మూడు ప్రతిపాదనలను ప్రభు త్వానికి పంపించింది. అందులో ప్రభుత్వం ఏ ప్రతిపాదనకు ఓకే అంటే దానిని అమలు చేయాలని బోర్డు అధికారులు భావిస్తున్నారు. (నిర్లక్ష్యమే అసలైన మహమ్మారి) వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయిన 3,29,340 మంది విద్యార్థులు అందరికీ పరీక్షలు నిర్వహించేలా ప్రతిపాదించారు. అందరికీ పరీక్షల నిర్వహణ కుదరదనుకుంటే 1,67,630 మంది ప్రథమ సంవత్సర విద్యార్థులను పక్కన పెట్టి... 1,61,710 మంది ద్వితీయ సం వత్సర విద్యార్థులకైనా పరీక్షలు నిర్వహించా లని మరో ప్రతిపాదన చేశారు. ఇక ఈ రెండూ వద్దనుకుంటే విద్యార్థులకు కనీస పాస్ మార్కులను ఇచ్చి ఉత్తీర్ణులను చేసే ప్రతిపాద నను పంపించారు. ఆ మూడు ప్రతిపాదన లతో కూడిన ఫైలు ప్రస్తుతం సీఎం ఆమోదం కోసం పంపించారు. అయితే గతంలో ఉన్నత స్థాయిలో జరిగిన భేటీలో ప్రస్తుత కరోనా పరి స్థితుల్లో పరీక్షల నిర్వహణ సాధ్యం కాకపోవ చ్చనే అభిప్రాయానికే అధికారులు వచ్చారు. 10 నుంచి 20 వరకు గ్రేస్ మార్కులు కలపాలనే ఆలోచన చేసినా... అప్పటికీ పాస్ కాని వారు కోర్టులకు వెళితే న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొనాల్సి వస్తుందనే భావనతో అందరికీ పాస్ మార్కులు వేయాలనే ప్రతిపాదన వైపే మొగ్గారు. మొత్తం మూడు ప్రతిపాదనలతో సీఎం ఆమోదానికి ఫైలును పంపించారు. సీఎం ఓకే చెప్పాక ఇంటర్ బోర్డు తదుపరి కార్యాచరణను చేపట్టనుంది. ఆర్ట్స్, భాషా సబ్జెక్టుల్లో విద్యార్థులకు 100 మార్కులకుగాను 35 మార్కులు వేసి పాస్ చేయనున్నారు. మ్యాథమెటిక్స్లో గరిష్ట మార్కులు 75కు గాను 27 మార్కులను వేసి పాస్ చేస్తారు. కెమిస్ట్రీ, ఫిజిక్స్, బోటనీ, జువాలజీ వంటి సబ్జెక్టుల్లో 60 మార్కులకు 21 మార్కులు వస్తే పాస్ కాబట్టి ఆ మార్కులను వేసి విద్యార్థులందరిని పాస్ చేయనున్నారు. మరోవైపు ఇపుడు విద్యార్థులు మార్చిలో పాస్ అయినట్లు ఇవ్వాలా? జూన్/జూలైలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ కింద పాస్ అయినట్లు ఇవ్వాలా? అన్న విషయంలోనూ నిర్ణయాన్ని ప్రభుత్వానికే వదిలేశారు. -
కానిస్టేబుల్ రాతపరీక్షలో 30 గ్రేస్ మార్కులు కలపాలి
హైదరాబాద్: ఇటీవల జరిగిన కానిస్టేబుల్ రాతపరీక్షకు హాజరైన అభ్యర్థులందరికీ 30 గ్రేస్ మార్కులు కలపాలని బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో ఔటాఫ్ సిలబస్ నుంచి ప్రశ్నలు అడిగారని , కొన్ని ప్రశ్నలు తప్పుగా వచ్చాయని ఆరోపించారు. బషీర్బాగ్లోని దేశోద్ధారక భవన్లో కానిస్టేబుల్ అభ్యర్థుల సం«ఘం గురువారం నిర్వహించిన రాష్ట్ర సదస్సులో కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. ప్రశ్నలు తప్పుగా రావటం వల్ల పరీక్షకు హాజరైన అభ్యర్థులు మానసిక ఆందోళనకు గురవుతున్నారని, ఎక్కువ మార్కులు సాధించలేక మరికొందరు ఆత్మహత్యకు పాల్పడ్డా్డరని తెలిపారు. తెలుగు మీడియం అభ్యర్థులకు ఈ రాత పరీక్ష మరింత భారమైందన్నారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వల్లపు కృష్ణ, గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, రామలింగం, ప్రొఫెసర్ పీఎల్.విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
‘నీట్’ తీర్పుపై సుప్రీం స్టే
న్యూఢిల్లీ: నీట్ ప్రశ్నపత్రాల్లో తప్పులు దొర్లినందుకు గాను విద్యార్థులకు గ్రేస్మార్కులు కలపాలన్న మద్రాస్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. నీట్ తమిళం ప్రశ్నపత్రంలో 49 ప్రశ్నలు తప్పుగా ప్రచురితమయ్యాయి. దీనిపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీన్ని విచారించిన మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ఇంగ్లిష్ నుంచి తమిళంలోకి అనువదించే క్రమంలో జరిగిన పొరపాటు కారణంగా తప్పుగా ప్రచురితమైన 49 ప్రశ్నలకుగాను పరిహారంగా నాలుగేసి మార్కుల చొప్పున మొత్తం 196 మార్కులు కలపాలని తీర్పిచ్చింది. ఫలితాల జాబితాను మళ్లీ విడుదల చేయాలని నీట్ను నిర్వహించిన సీబీఎస్ఈను ఆదేశించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సీబీఎస్ఈ సుప్రీంకోర్టును ఆశ్రయించగా శుక్రవారం సుప్రీంబెంచ్ విచారించింది. హైకోర్టు తీర్పును సమర్ధిస్తే.. తమిళ మాధ్యమంలో పరీక్ష రాసిన విద్యార్థులు మిగతా భాషల్లో రాసిన వారి కంటే మెరుగైన మార్కులు సాధించినట్లవుతుందని న్యాయస్థానం పేర్కొంది. ఈ రకమైన పద్ధతిలో మార్కులు కలపలేమని వ్యాఖ్యానించిన తదుపరి వాదనలను రెండు వారాలకు వాయిదా వేసింది. వైద్య, దంత కళాశాలల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్) మే 6వ తేదీన దేశవ్యాప్తంగా 136 నగరాల్లో జరిగింది. పరీక్షలో 180 ప్రశ్నలకు గాను 720 మార్కులుంటాయి. తమిళనాడులో తమిళ మాధ్యమంలో సుమారు లక్ష మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. -
గ్రేస్ మార్కుల విధానానికి స్వస్తి
- ఏ రాష్ట్రంలోనూ అమలు చేయొద్దన్న సీబీఎస్ఈ - టెన్త్, ఇంటర్లో అదనపు మార్కులు ఇవ్వొద్దని నిర్ణయం - ఈ విద్యా సంవత్సరం నుంచి గ్రేస్, యాడ్స్కోర్, మోడరేషన్ బంద్ సాక్షి, హైదరాబాద్: పదో తరగతి, ఇంటర్మీడియెట్లలో అదనపు మార్కుల విధానానికి స్వస్తి పలకాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్ణయించింది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా మోడరేషన్, యాడ్ స్కోర్, గ్రేస్ మార్కుల పేరుతో ఇస్తున్న అదనపు మార్కులను ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేయొద్దని నిర్ణయానికి వచ్చింది. ఇటీవల అన్ని రాష్ట్రాల విద్యాశాఖ అధికా రులతో సీబీఎస్ఈ సమావేశం నిర్వహించగా.. రాష్ట్రం నుంచి ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, పరీక్షల నియంత్రణాధికారి సుశీల్కుమార్, పాఠశాల విద్యా డైరెక్టర్ కిషన్, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సురేందర్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు మార్కుల విధానం వల్ల ప్రతిభావంతులైన విద్యార్థులు నష్టపోతున్నారని సమావేశంలో దృష్టికి వచ్చింది. ఇంటర్తోపాటు ఢిల్లీ, సెంట్రల్ వర్సిటీలకు చెందిన కాలేజీల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల్లో మార్కుల విషయంలో సమస్యలు తలెత్తుతున్నాయని తెలిసింది. ఈ నేపథ్యంలో అదనపు మార్కుల విధానానికి స్వస్తి పలకాలని సీబీఎస్ఈ నిర్ణయించింది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా పంజాబ్, హరియాణా, ఛత్తీస్గఢ్, కేరళలో కల్చరల్ స్పోర్ట్స్లో ఉన్న విద్యార్థులకు 10 మార్కుల చొప్పున కలుపుతున్నారు. అలాగే రాష్ట్ర స్థాయి క్రీడలు ఆడితే, నేషనల్ గేమ్స్లో పాల్గొంటే కొన్ని మార్కులు కలు పుతున్నారు. మన రాష్ట్రంతోపాటు మరికొన్ని రాష్ట్రా ల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ అయిన, ప్రశ్నలు కఠినంగా వచ్చిన సందర్భాల్లో ఒకటి, రెండు మార్కులతో పాస్ అయ్యే విద్యార్థులకు మార్కులను యాడ్ స్కోర్గా ఇస్తున్నారు. మరికొన్ని రాష్ట్రాల్లో 3 సెట్ల ప్రశ్నపత్రాలను ఇస్తుండటంతో మార్కుల్లో తేడాలొస్తున్నాయి. ఈ సందర్భాల్లోనూ మోడరేషన్ పేరుతో మార్కులు కలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఏ రకంగానూ మార్కులను అదనంగా ఇవ్వొద్దని అన్ని రాష్ట్రాల అధికారులు నిర్ణయించారు. -
గ్రేస్ మార్కులు కలిపేది లేదు : కామినేని
చేతులు తడవకుండానే పదోన్నతులు కల్పించాం సాక్షి, అమరావతి: పీజీ వైద్య విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇక కలపబోమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. రాష్ట్రం విడిపోయి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు గతంలో గ్రేస్ మార్కులు కలిపామని, ఇకపై అలాంటిదేమీ ఉండదన్నారు. తాజాగా వైద్యులకు ప్రొఫెసర్లుగా పదోన్నతులు చేతులు తడవకుండా కల్పించామని విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు.రాష్ట్రంలో పీపీపీ పద్ధతిలో సేవలు అందిస్తున్న సర్వీస్ ప్రొవైడర్స్ను తానెప్పుడూ కలవలేదని, వాళ్ల పనితీరును బట్టే చెల్లింపులు చేస్తున్నామన్నారు. మిగతా పథకాలకు నిధులు ఆపేసి మెడాల్కు మాత్రమే ఏడాదిలో రూ.102 కోట్లు ఎందుకు చెల్లించారని ప్రశ్నించగా.. మెడాల్ సంస్థ పనితీరు అద్భుతంగా ఉందని, జాతీయ స్థాయిలో ఎన్టీఆర్ వైద్య సేవలకు అవార్డు కూడా వచ్చిందని మంత్రి చెప్పుకొచ్చారు. వ్యవసాయ వర్సిటీ రిజిస్ట్రార్కు అవార్డు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ టీవీ సత్యనారాయణ గురువారం హరియాణా హిస్సార్లోని చౌదరీ చరణ్ సింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జాతీయ పురస్కారాన్ని అందుకోనున్నారు. భారత వ్యవసాయ ఇంజనీర్ల సమాఖ్య మూడు రోజుల జాతీయ సదస్సులో ఆయనకు నేషనల్ ఫెలోషి‹ప్ అవార్డును అందజేయనున్నట్టు సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఇంద్రమణి తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన శాస్త్రవేత్తకు గత 20 ఏళ్లలో ఇటువంటి పురస్కారం లభించడం ఇదే తొలిసారి. బాపట్ల వ్యవసాయ కళాశాలలో వ్యవసాయ విద్యను అభ్యసించిన డాక్టర్ సత్యనారాయణ నీటి యాజమాన్య సంస్థ, ఉప్పునీటి పరిశోధన కేంద్రం, భూగర్భ మురుగు నీటి పరిశోధన సంస్థల్లో శాస్త్రవేత్తగా పనిచేశారు. వ్యవసాయ యాంత్రీకరణ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆయనకు ఈ అవార్డు రావడంపై వర్సిటీ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఏపీలో సెంచూరియన్ యూనివర్సిటీ: వీసీ సాక్షి, విశాఖపట్నం: ఇప్పటిదాకా ఒడిశాలోని పర్లాకిమిడి, భువనేశ్వర్లలో ఉన్న తమ విశ్వవిద్యాలయాలను ఆంధ్రప్రదేశ్కూ విస్తరిస్తున్నట్టు సెంచూరియన్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ జీఎస్ఎన్ రాజు తెలిపారు. ఇందులో భాగంగా ప్రస్తుతం విశాఖ జిల్లా ఆనందపురం వద్ద ఉన్న తాత్కాలిక క్యాంపస్ను విజయనగరం జిల్లా గజపతినగరం సమీపంలో శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నామని విశాఖలో బుధవారం విలేకరులకు చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంజనీరింగ్ తరగతులను నిర్వహిస్తామన్నారు. వర్సిటీ చాన్సలర్ పి.పట్నాయక్ మాట్లాడుతూ ఏపీలో తమ విశ్వవిద్యాలయం ప్రత్యేకత పొందుతుందన్నారు. విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు డీఎన్ రావు మాట్లాడుతూ కొత్తగా రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే యూనివర్సిటీకి రూ.130 కోట్లు వెచ్చించబోతున్నామని చెప్పారు. తమ వర్సిటీ విద్యార్థులు రూపొందించిన ఈ–రిక్షాల అమ్మకానికి అనుమతి లభించిందని తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement