-
జిన్నింగ్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం
గుంటూరు: గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి మండలం, ధూళిపాళ్ల సమీపంలో జిన్నింగ్ మిల్లులో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గ‘లీజు’ దందా..
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిన్నింగ్ మిల్లుల్లో జిమ్మిక్కులు జరుగుతున్నాయి. సీసీఐ ఉన్నతాధికారులు, బడా పత్తి వ్యాపారులు కుమ్మక్కై పత్తి రైతును నిండా ముంచుతున్నారు. తమ జిన్నింగ్ మిల్లులను సీసీఐకి లీజుకు ఇచ్చి ఒకవైపు రూ.లక్షల్లో జిన్నింగ్, ప్రెసింగ్ చార్జీలను పొందుతూనే.. మరోవైపు అదే జిన్నింగ్ మిల్లుల్లో అక్రమంగా రైతుల వద్ద ప్రైవేటుగా పత్తి కొనుగోళ్లు చేపడుతున్నారు. ఇలా రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన పత్తిని కనీస మద్దతు ధర చొప్పున సీసీఐ ఖాతాలో వేసి నిత్యం రూ.లక్షలు దండుకుంటున్నారు. బహిరంగంగానే ఈ దందా కొనసాగుతునన్నా సంబంధిత శాఖల అధికారులు అటువైపు కన్నెత్తి చూడ్డం లేదు. నిబంధనల ప్రకారం సీసీఐకి లీజుకిచ్చిన మిల్లుల్లో ప్రైవేటుగా పత్తి వ్యాపారం చేయరాదు. మిల్లును లీజుకు తీసుకున్నందుకు గాను సీసీఐ ఆ యజమానికి రూ.లక్షల్లో చార్జీలను చెల్లిస్తుంది. దీంతో సంతృప్తి చెందని కొందరు బడా పత్తి వ్యాపారులు ఈ అక్రమ దందాకు తెరలేపారు. సీసీఐ అధికారులతో జతకట్టి రూ.లక్షల్లో దండుకుంటున్నారు. ఈ వ్యవహారంతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కలెక్టర్కు ఫిర్యాదు ఈ కొనుగోలు సీజనులో సీసీఐ ఆదిలాబాద్ జిల్లా శాఖ పరిధిలో 21 పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల్లో రైతుల వద్ద కొనుగోలు చేసిన పత్తిని జిన్నింగ్, ప్రెసింగ్ చేయించి బేళ్లుగా తయారు చేస్తుంది. ఇలా తయారైన బేళ్లను అంతర్జాతీయ మార్కెట్లో విక్రయిస్తుంది. ఇందుకోసం ఈ సీజన్లో జిల్లాలో 44 జిన్నింగ్ మిల్లులను సీసీఐ లీజుకు తీసుకుంది. అత్యధికంగా ఆదిలాబాద్లో 14 జిన్నింగ్ మిల్లులను లీజుకు తీసుకోగా, భైంసాలో నాలుగు మిల్లులతో ఒప్పందం చేసుకుంది. ఆసిఫాబాద్, లక్సెట్టిపేట, మంచిర్యాల, బోథ్, చెన్నూర్లో మూడేసి చొప్పున, నేరడిగొండలోని రెండు మిల్లులను మిగితా చోట్ల ఒక్కో జిన్నింగ్ మిల్లు చొప్పున లీజుకు తీసుకుంది. సీసీఐకి లీజుకు ఇచ్చిన యజమానులు ఆ మిల్లుల్లో ఎలాంటి పత్తి కొనుగోళ్లు చేపట్టరాదు. కానీ.. కొందరు యజమానులు ఈ నిబంధనలను తుంగలో తొక్కి తమ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఈ విషయమై ఇటీవల కొందరు రైతులు జిల్లా కలెక్టర్కు సైతం ఫిర్యాదు చేశారు. చక్రం తిప్పుతున్న బడా వ్యాపారి ఈ అక్రమాల్లో ఆరితేరిన ఓ బడా వ్యాపారి దందాను వెనకుండి నడిపిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ అక్రమ దందా చేస్తున్న పత్తి వ్యాపారులకు నాయకుడిగా చెలామణి అవుతున్న ఈయన వాణిజ్య పన్నులు, రెవెన్యూ, తూనికల కొలతలు, మార్కెటింగ్ శాఖల్లోని కీలక అధికారులకు సీజన్ వారీగా పెద్ద మొత్తంలో మామూళ్లు ముట్టజెప్పుతున్నట్లు సమాచారం. ఒక్కో శాఖలో అధికారి స్థాయిని బట్టి ముట్టజెప్పుతున్నట్లు సమాచారం. మొత్తం మీదా తమ కష్టాన్ని అందరూ కలిసి పంచుకుంటున్నారని పత్తి రైతులు వాపోతున్నారు. ఇకనైనా సీసీఐ విజిలెన్స్ విభాగం ఉన్నతాధికారులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో అక్రమార్కులపై నిఘా పెట్టి.. సీబీఐ వంటి ఉన్నత సంస్థలు ఈ అక్రమాలపై దృష్టి సారించాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement