-
ఉగ్ర మసూద్ మృతి?
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: పేరుమోసిన ఉగ్రవాది, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధిపతి మసూద్ అజార్ (50) పాకిస్తాన్లో చనిపోయినట్లుగా మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో ఆదివారం వార్తలు వచ్చాయి. ఈ వార్తలు నిజమో కాదో కనుగొనేందుకు నిఘా వర్గాలు ప్రయత్నిస్తున్నాయని భారత అధికారులు చెప్పారు. అయితే మసూద్ చనిపోయాడంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని పాకిస్తాన్కు చెందిన జియో ఉర్దూ న్యూస్ ఆ వార్తలను కొట్టిపారేసింది. మసూద్ బతికే ఉన్నాడన్న విషయాన్ని అతని కుటుంబానికి సన్నిహితుల ద్వారా తాము తెలుసుకున్నామంది. మరోవైపు ఇప్పటివరకు దీనిపై పాకిస్తాన్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన, సమాచారం లేదు. మూత్రపిండాల వైఫల్యం కారణంగా మసూద్ అజార్ ఇస్లామాబాద్లోని సైనిక వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడన్న సమాచారం మాత్రమే తమకు ప్రస్తుతానికి తెలుసుననీ, అంతకు మించి వివరాలు లేవని అధికారులు అంటున్నారు. 2001లో భారత పార్లమెంటుపై దాడి, ఆ తర్వాతి కాలంలో జమ్మూ కశ్మీర్ శాసనసభపై ఆత్మాహుతి దాడి, 2016లో పఠాన్కోట్ వైమానిక స్థావరంపై దాడి, తాజాగా పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై దాడి తదితర కీలక కేసుల్లో మసూద్ అజార్ సూత్రధారి అన్న ఆరోపణలు ఉన్నాయి. మసూద్ అజార్ తమ దేశంలోనే ఉన్నాడనీ, అయితే అతను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడని పాక్ విదేశాంగ శాఖ మంత్రి షా ముహ్మద్ ఖురేషీ ఇటీవల సీఎన్ఎన్ ఇంటర్వ్యూలో ఒప్పుకున్నారు. అయితే భారత్ గట్టి ఆధారాలను సమర్పిస్తే తప్ప ఉగ్రవాద దాడుల విషయంలో మసూద్పై చర్యలు తీసుకోలేమని స్పష్టం చేశారు. కాగా, పుల్వామా దాడిలో జైషే మహ్మద్ కుట్రను వివరిస్తూ భారత్ ఒక ఫైల్ను కూడా ఇటీవలే పాకిస్తాన్కు అప్పగించి, ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన మాట నిలుపుకోవాలని సవాల్ చేసింది. 1999లో భారత్ నుంచి విడుదల మసూద్ అజార్ 1968లో పాకిస్తాన్ పంజాబ్లోని బహవాల్పూర్లో జన్మించాడు. తొలుత పోర్చుగీస్ పాస్పోర్టు మీద అతను జమ్మూ కశ్మీర్లోకి ప్రవేశించి అనేక ఉగ్రవాద సంస్థలు, బృందాలతో పరిచయాలు ఏర్పరచుకున్నాడు. ఉగ్రవాదం ఆరోపణలపై 1994లో భారత అధికారులు అతణ్ని అరెస్టు చేయగా, ‘మీరు నన్ను ఎక్కువ రోజులు లోపల ఉంచలేరు’ అని జైలు సిబ్బందితో అనేవాడని చెబుతారు. జైలు నుంచి పారిపోయేందుకు తోటి ఉగ్రవాదులతో కలిసి సొరంగం తవ్వాడనీ, అందులో ఇరుక్కుపోవడంతో ఆ ప్రయత్నం విఫలమైందని ఓ అధికారి చెప్పినట్లు ఏఎఫ్పీ పేర్కొంది. అతను 1999 వరకు జైలులోనే ఉన్నాడు. ఆ ఏడాది కఠ్మాండు నుంచి ఢిల్లీ వస్తున్న, ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసి, కాందహార్కు తరలించారు. అందులోని ప్రయాణికులను విడిపించడం కోసం మసూద్ అజార్తోపాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను జైలు నుంచి భారత్ విడుదల చేసింది. ఆ హైజాకర్లలో మసూద్ అజార్ తమ్ముడు ఇబ్రహీం అథార్ కూడా ఉన్నాడని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మసూద్ అజార్ 2000 ఏడాదిలో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. అల్కాయిదాచీఫ్ ఒసామా బిన్ లాడెన్, తాలిబన్ను స్థాపించిన ముల్లా మహ్మద్ ఒమర్లను మసూద్ అఫ్గానిస్తాన్లో కలిశాడని అమీర్ రాణా అనే భద్రత విషయాల విశ్లేషకుడు చెప్పారు. 2001లో భారత పార్లమెంటుపై దాడి కేసులో అజార్ను పాక్ గృహనిర్బంధంలో ఉంచింది. ఈ కేసులో ఆధారాల్లేవంటూ లాహోర్ కోర్టు తీర్పునివ్వడంతో 2002లో విడుదలయ్యాడు. 2016లో ఉడీ సైనిక శిబిరంపై దాడి అనంతరం కూడా మసూద్ను పాక్ కస్టడీలోకి తీసుకున్నప్పటికీ నేరారోపణలేవీ మోపలేదు. గతేడాది జూలైలో అతను గుర్తు తెలియని ప్రదేశం నుంచి ఫోన్ ద్వారా పీవోకేలోని ముజఫరాబాద్లో మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత నుంచి అతని జాడ లేదు. త్వరలో మసూద్పై పాక్ చర్యలు భారత్తో ఉద్రిక్తతలను తగ్గించడం కోసం మసూద్పై చర్యలు తీసుకునేందుకు పాకిస్తాన్ నిర్ణయించిందని ఆ దేశ ప్రభుత్వంలోని ఓ ఉన్నతాధికారి చెప్పారు. మరోవైపు మసూద్పై ఐక్యరాజ్య సమితి ‘ప్రపంచ ఉగ్రవాది’ అని ముద్ర వేసే విషయంలో తరచూ అడ్డు చెబుతున్న పాక్.. ఈసారి అందుకు వ్యతిరేకత తెలపకపోవచ్చని ఆ దేశంలోని ఓ మీడియా సంస్థ పేర్కొంది. భారత్, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర దేశాలు మసూద్ అజార్పై ఐరాస చేత ఉగ్రవాదిగా ముద్ర వేయించేందుకు ప్రయత్నిస్తున్నా ఇన్నాళ్లూ చైనా అడ్డుతగులుతుండటం తెలిసిందే. మసూద్ స్థాపించిన జైషే మహ్మద్ను ఐక్యరాజ్య సమితి ఇప్పటికే నిషేధించింది. మసూద్పై కూడా ఉగ్రవాదిగా ముద్ర వేయించేందుకు మరోసారి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్లు భద్రతా మండలిలో గత బుధవారం ప్రతిపాదించాయి. -
బలూచ్ నాయకుడికి భారత పౌరసత్వం?
న్యూఢిల్లీ: పాకిస్తాన్ వెలివేసిన బలూచ్ రిపబ్లికన్ పార్టీ (బీఆర్పీ) వ్యవస్థాపకుడికి భారత్ పౌరసత్వం ఇవ్వనుందా?. అవుననే అంటోంది పాకిస్తాన్ మీడియా. ప్రస్తుతం స్విట్జర్లాండ్ లో తలదాచుకుంటున్న బలూచ్ నాయకుడు బ్రహుందఘ్ బుగ్తీకి భారత్ పౌరసత్వం ఇవ్వనున్నట్లు పాక్ కు చెందిన జియో న్యూస్ చానెల్ ఓ కథనం ప్రసారం చేసింది. బ్రహుందఘ్ తో పాటు అతనికి నమ్మకస్తులైన షేర్ మహమ్మద్ బుగ్తీ, అజీజుల్లా బుగ్తీలకు కూడా భారత్ పౌరసత్వాన్ని ఇవ్వనున్నట్లు సదరు చానెల్ పేర్కొంది. కాగా, దేశ వ్యతిరేక చర్యలు చేస్తున్నారంటూ బ్రహుందఘ్, ఆయన పార్టీని పాకిస్తాన్ బహిష్కరించింది. బెలూచిస్తాన్ లో మానవహక్కుల ఉల్లంఘన అంశాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ లేవనెత్తక ముందే.. భారత పౌరసత్వంపై అధికారులు బ్రహుందఘ్ ను సంప్రదించినట్లు మీడియా సంస్ధ పేర్కొంది. భవిష్యత్ లో భారతీయ మీడియా ద్వారా పాకిస్తాన్ పై పోరాటం చేస్తామని, బలూచ్ పై భారత ప్రధాని నరేంద్ర మోదీ చూపుతున్న దయకు ధన్యవాదాలని ఓ బీఆర్పీ నేత జియోతో చెప్పినట్లు వెల్లడించింది. ప్రత్యర్ధులు ఎమనుకున్నా బీఆర్పీ మోదీకి మద్దతు తెలుపుతుందని నేత పేర్కొన్నట్లు తెలిపింది. ఈ నెల 18,19 తేదీల్లో బీఆర్పీ నేతలతో సమావేశం అనంతరం బ్రహుందఘ్ జెనీవా నుంచి భారత పౌరసత్వానికి దరఖాస్తు చేస్తారని జియో పేర్కొంది. దాదాపు 16 మంది బీఆర్సీ నేతలు బ్రహుందఘ్ ను స్విట్జర్లాండ్ లో కలవనున్నట్లు తెలిపింది. వీరిలో ఏడుగురు జర్మనీ, లండన్, నార్వే, స్వీడన్, స్విట్జర్లాండ్ ల నుంచి హాజరవుతారని చెప్పింది. సమావేశంలో భారత్ సహాయం తీసుకోవాలా? వద్దా? అనే అంశంపైనే చర్చించనున్నట్లు పేర్కొంది. దలై లామా, షేక్ ముజీబ్-ఉర్-రెహమాన్ లాంటి వారికి భారత్ నీడనిచ్చింది, బ్రహుందఘ్, అతని బృందానికి భారత్ ఆశ్రయాన్ని కల్పిస్తుందని జియో కథనాన్ని ప్రచురించింది. 15వేలకు మంది బుగ్తీలు ఆప్ఘనిస్తాన్ లో చిక్కుకుపోగా, రెండు వేలకు మంది పైగా వివిధ యూరోపియన్ దేశాల్లో తలదాచుకుంటున్నారు. వారందరూ పౌరసత్వానికి దరఖాస్తు చేశారని, అయితే అవన్నీ పెండింగ్ లో ఉన్నాయని పేర్కొంది. 2006లో తన తాతయ్య హత్య అనంతరం బ్రహుందఘ్ ప్రాణాలు కాపాడుకోవడం కోసం సొంత ఊరు డేరా బుగ్తీని వదిలి ఆప్ఘనిస్తాన్ వెళ్లిపోయారు. 2010లో అక్కడి నుంచి కుటుంబంతో పాటు స్విట్జర్లాండ్ కు వెళ్లినట్లు జియో పేర్కొంది. స్విట్జర్లాండ్ పౌరసత్వం కోసం బుగ్తీ దరఖాస్తు చేసుకోవడంతో.. పాక్ ప్రభుత్వం స్విట్జర్లాండ్ పై ఒత్తిడిని తీసుకొచ్చింది. దీంతో స్విస్ తనకు పౌరసత్వాన్ని ఇవ్వదని తెలుసుకున్న బ్రహుందఘ్ భారత్ సాయం తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పింది.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement