న్యూఢిల్లీ: పాకిస్తాన్ వెలివేసిన బలూచ్ రిపబ్లికన్ పార్టీ (బీఆర్పీ) వ్యవస్థాపకుడికి భారత్ పౌరసత్వం ఇవ్వనుందా?. అవుననే అంటోంది పాకిస్తాన్ మీడియా. ప్రస్తుతం స్విట్జర్లాండ్ లో తలదాచుకుంటున్న బలూచ్ నాయకుడు బ్రహుందఘ్ బుగ్తీకి భారత్ పౌరసత్వం ఇవ్వనున్నట్లు పాక్ కు చెందిన జియో న్యూస్ చానెల్ ఓ కథనం ప్రసారం చేసింది. బ్రహుందఘ్ తో పాటు అతనికి నమ్మకస్తులైన షేర్ మహమ్మద్ బుగ్తీ, అజీజుల్లా బుగ్తీలకు కూడా భారత్ పౌరసత్వాన్ని ఇవ్వనున్నట్లు సదరు చానెల్ పేర్కొంది.
కాగా, దేశ వ్యతిరేక చర్యలు చేస్తున్నారంటూ బ్రహుందఘ్, ఆయన పార్టీని పాకిస్తాన్ బహిష్కరించింది. బెలూచిస్తాన్ లో మానవహక్కుల ఉల్లంఘన అంశాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ లేవనెత్తక ముందే.. భారత పౌరసత్వంపై అధికారులు బ్రహుందఘ్ ను సంప్రదించినట్లు మీడియా సంస్ధ పేర్కొంది. భవిష్యత్ లో భారతీయ మీడియా ద్వారా పాకిస్తాన్ పై పోరాటం చేస్తామని, బలూచ్ పై భారత ప్రధాని నరేంద్ర మోదీ చూపుతున్న దయకు ధన్యవాదాలని ఓ బీఆర్పీ నేత జియోతో చెప్పినట్లు వెల్లడించింది.
ప్రత్యర్ధులు ఎమనుకున్నా బీఆర్పీ మోదీకి మద్దతు తెలుపుతుందని నేత పేర్కొన్నట్లు తెలిపింది. ఈ నెల 18,19 తేదీల్లో బీఆర్పీ నేతలతో సమావేశం అనంతరం బ్రహుందఘ్ జెనీవా నుంచి భారత పౌరసత్వానికి దరఖాస్తు చేస్తారని జియో పేర్కొంది. దాదాపు 16 మంది బీఆర్సీ నేతలు బ్రహుందఘ్ ను స్విట్జర్లాండ్ లో కలవనున్నట్లు తెలిపింది. వీరిలో ఏడుగురు జర్మనీ, లండన్, నార్వే, స్వీడన్, స్విట్జర్లాండ్ ల నుంచి హాజరవుతారని చెప్పింది. సమావేశంలో భారత్ సహాయం తీసుకోవాలా? వద్దా? అనే అంశంపైనే చర్చించనున్నట్లు పేర్కొంది.
దలై లామా, షేక్ ముజీబ్-ఉర్-రెహమాన్ లాంటి వారికి భారత్ నీడనిచ్చింది, బ్రహుందఘ్, అతని బృందానికి భారత్ ఆశ్రయాన్ని కల్పిస్తుందని జియో కథనాన్ని ప్రచురించింది. 15వేలకు మంది బుగ్తీలు ఆప్ఘనిస్తాన్ లో చిక్కుకుపోగా, రెండు వేలకు మంది పైగా వివిధ యూరోపియన్ దేశాల్లో తలదాచుకుంటున్నారు. వారందరూ పౌరసత్వానికి దరఖాస్తు చేశారని, అయితే అవన్నీ పెండింగ్ లో ఉన్నాయని పేర్కొంది.
2006లో తన తాతయ్య హత్య అనంతరం బ్రహుందఘ్ ప్రాణాలు కాపాడుకోవడం కోసం సొంత ఊరు డేరా బుగ్తీని వదిలి ఆప్ఘనిస్తాన్ వెళ్లిపోయారు. 2010లో అక్కడి నుంచి కుటుంబంతో పాటు స్విట్జర్లాండ్ కు వెళ్లినట్లు జియో పేర్కొంది. స్విట్జర్లాండ్ పౌరసత్వం కోసం బుగ్తీ దరఖాస్తు చేసుకోవడంతో.. పాక్ ప్రభుత్వం స్విట్జర్లాండ్ పై ఒత్తిడిని తీసుకొచ్చింది. దీంతో స్విస్ తనకు పౌరసత్వాన్ని ఇవ్వదని తెలుసుకున్న బ్రహుందఘ్ భారత్ సాయం తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పింది.
బలూచ్ నాయకుడికి భారత పౌరసత్వం?
Published Fri, Sep 16 2016 12:25 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
SRH Vs LSG: ప్లే ఆఫ్స్ రేసు.. రెండింటికీ కీలక మ్యాచ్
శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై దుమారం.. మండిపడ్డ బీజేపీ
ఇదే మరి మ్యాజిక్ అంటే.. 'జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్'
బాబు కుట్రలు: సంక్షేమ పథకాల అమలును చంద్రబాబు అడ్డుకుంటున్నారు: అవంతి
SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
Sakshi News Cartoon: మన సారే! ఈ మధ్య మరీ దిగజారి మాట్లాడుతున్నారుగా!
KITEX Group: ‘ట్వంటీ20 పార్టీ.. తప్పుడు నిర్ణయాలతోనే ఇబ్బంది’
చంద్రబాబు నడిచొస్తే ఒక కుట్ర.. నిలబడితే భూకంపం.. కన్నబాబు సెటైర్లు
Sanjeeda Sheikh: చీరలో అదరగొడుతున్న హీరోయిన్ లుక్స్ (ఫోటోలు)
చంద్రబాబుపై విద్యార్థుల కామెంట్స్
తప్పక చదవండి
- బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- యూనిసెఫ్ భారత జాతీయ అంబాసిడర్గా కరీనా : భావోద్వేగం
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- హైదరాబాద్లో విషాదం.. ఏడుగురు మృతి
- రెచ్చిపోయిన పచ్చ మూక.. హోం మంత్రి తానేటి వనితపై దాడికి యత్నం
Advertisement