-
జపాన్లో కొత్తగా 8 ఒమిక్రాన్ కేసులు.. ఆ దేశంలో రోజుకు 7 వేలకు పైనే..!
Omicron Variant Updates In Telugu టోక్యో: కొత్త వేరియంట్ ఒమిక్రాన్కు సంబంధించిన కేసులు మరో 8 నమోదయ్యినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దీనితో మొత్తం 12 కేసులకు పెరిగనట్లు ఆ దేశ ప్రభుత్వం శుక్రవారం మీడియాకు తెల్పింది. నవంబర్ చివరి నుంచి ఈ నెల ప్రారంభం వరకు వచ్చిన ప్రయాణికులకు ఈ వైరస్ సోకినట్లు ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెప్పింది. కాగా జపాన్లో నవంబర్ 30న మొదటి కేసు నమోదైన సంగతి తెలిసిందే. కొత్తగా వైరస్ సోకిన వారిలో 30 ఏళ్ల మహిళ, పురుషుడు కూడా ఉన్నారని చీఫ్ క్యాబినెట్ సెక్రటరీ సీజీ కిహారా తెలిపారు. వీరిద్దరూ నవంబర్ 28న నమీబియా నుంచి వచ్చారు. అదే విమానంలో జపాన్కు వచ్చిన నమీబియా దౌత్యవేత్తలకు కూడా వ్యాధి సోకినట్లు గుర్తించారు. జపాన్లో ఓమిక్రాన్ ఇన్ఫెక్షన్కు గురైన మొదటి కేసు ఇది. దీంతో జపాన్ మరోసారి విదేశీ ప్రయాణాల పట్ల కఠినంగా వ్యవహరించక తప్పలేదు. ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చే ప్రయాణాకులపై జపాన్ నిషేధం విధించింది. కొత్తగా ఒమిక్రాన్ బారీనపడ్డ వ్యక్తులు ఈ వారం ప్రారంభంలో యుఎస్, మొజాంబిక్, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో నుండి వచ్చినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దక్షిణ కొరియాలో గణనీయంగా నమోదవుతున్న కరోనా కేసులు దక్షిణ కొరియాలో కరోనా కొత్త కేసులు శుక్రవారం కూడా వరుసగా మూడవ రోజు 7000 కంటే ఎక్కువ నమోదయ్యాయి. వైరస్ వ్యాప్తిని త్వరగా తగ్గించడంలో విఫలమైతే దేశం అసాధారణమైన చర్యలు తీసుకోవలసి వస్తుంది అని ప్రధాని కిమ్ బూ-క్యుమ్ ఒక సమావేశంలో అన్నారు. కోవిడ్ చికిత్స కోసం మరో రెండు వేల పడకలను సంయుక్తంగా ఏర్పాటు చేయాలని దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. చాలామటుకు మైనర్ కేసులకు ఇంట్లోనే చికిత్స చేసేలా మెడికల్ రెస్పాన్స్ విధానాన్ని మెరుగుపరిచామని తెలిపారు. చదవండి: బూస్టర్ డోస్పై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాలేదు! -
పిల్లల ప్రయోజనాలే ముఖ్యం
సాక్షి, హైదరాబాద్: భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదాల విషయంలో వారి పిల్లల కస్టడీకి సంబంధించి విదేశీ కోర్టులు ఏవైనా ఆదేశాలు జారీచేసినప్పుడు, కస్టడీకి అప్పగించే విషయంలో మన దేశంలోని కోర్టులు ఆ పిల్లల సంక్షేమాన్ని, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఉమ్మడి హైకోర్టు స్పష్టంచేసింది. విదేశీ కోర్టు జారీచేసిన కస్టడీ ఆదేశాలు ఆ పిల్లల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటే.. మన కోర్టులు స్వీయ నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది. ఇలా ఓ కేసులో జన్మతః యునైటెడ్ కింగ్డమ్ (యూకే) పౌరులైన ఇద్దరు మైనర్ పిల్లల భవిష్యత్తు, చదువు తదితర విషయాలను దృష్టిలో పెట్టుకున్న కోర్టు వారిని తండ్రి కస్టడీకి అప్పగించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ జి.శ్యాంప్రసాద్లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. చిత్తూరు జిల్లా, మదనపల్లెకు చెందిన జి.శిరీషకు, యూకేలోని నేషనల్ హెల్త్ సర్వీసెస్లో ఫిజియోథెరపీ టీమ్ మేనేజర్గా పనిచేస్తున్న తిరుపతికి చెందిన తిప్పా శ్రీహరితో 2009లో వివాహం జరిగింది. వీరికి యూకేలోనే అభివన్, దివిత్ అనే ఇద్దరు పిల్లలు పుట్టగా.. అక్కడి పాఠశాలలోనే చదువుతున్నారు. భార్యభర్తల మధ్య వివాదాలు తలెత్తడంతో 2017లో శ్రీహరిపై శిరీష పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అతనిని పోలీసులు అరెస్ట్చేసి 24 గంటల పాటు జైల్లో ఉంచారు. శిరీష తన ఇద్దరు పిల్లలతో ఇండియాకొచ్చారు. ఈ నేపథ్యంలో విడాకులు కోరుతూ శ్రీహరి యూకే కోర్టులో దాఖలు చేసిన పిటిషన్కు స్పందించిన కోర్టు పిల్లలను తండ్రి కస్టడీలో ఉంచాలని శిరీషను ఆదేశించింది. దీనికి శిరీష స్పందించకపోవడంతో శ్రీహరి మన హైకోర్టులో దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ జరిపిన ధర్మాసనం పైఆదేశాలు జారీ చేసింది. -
‘విదేశీ కోర్టులు విడాకులు ఇవ్వకూడదు’
ముంబై: భారతీయ దంపతులు విదేశాల్లో నివసిస్తున్నంత మాత్రాన వారికి విడాకులు మంజూరు చేసే పరిధి సదరు దేశాల్లోని కోర్టులకు లేదని బాంబే హైకోర్టు పేర్కొంది. దుబాయ్లో ఉంటున్న ఓ భారతీయుడికి అక్కడి కోర్టు అతని భార్య నుంచి విడాకులు ఇచ్చిన కేసును విచారిస్తూ కోర్టు ఇటీవల ఈ వ్యాఖ్యలు చేసింది. ‘హిందూ వివాహ చట్టం ప్రకారం పెళ్లి చేసుకున్న భారతీయ జంటలకు సంబంధించిన కేసులను విచారించే పరిధి విదేశీ కోర్టులకు లేదని చట్టం పేర్కొంటోంది’ అని జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ అనుజా ప్రభుదేశాయ్ల ధర్మాసనం పేర్కొంది. ప్రస్తుత కేసులో భార్యాభర్తలిద్దరూ భారతీయులేననీ, పుట్టుకతోనే హిందువులై, హిందూ వేద హక్కుల ప్రకారం పెళ్లిచేసుకుని, హిందూ వివాహ చట్టం పరిధిలోకి వస్తున్నారని కోర్టు తెలిపింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement