-
విలీనాలు, కొనుగోళ్ల నేలచూపు
ముంబై: గడిచిన క్యాలండర్ ఏడాది(2023)లో విలీనాలు, కొనుగోళ్ల(ఎంఅండ్ఏ) లావాదేవీలు 51 శాతం క్షీణించాయి. 83.8 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్ల గణాంకాల సంస్థ ఎల్ఎస్ఈజీ డీల్స్ ఇంటెలిజెన్స్(గతంలో రెఫినిటివ్) వివరాల ప్రకారం గతేడాది డీల్స్ భారీగా నీరసించాయి. ప్రయివేట్ రంగ ఫైనాన్షియల్ దిగ్గజాలు హెచ్డీఎఫ్సీ ద్వయం మధ్య నమోదైన భారీ డీల్ గణాంకాలకు కొంతమేర మద్దతిచ్చినట్లు ఎల్ఎస్ఈజీ నివేదిక తెలియజేసింది. నిజానికి 60.4 బిలియన్ డాలర్ల ఈ డీల్ను మినహాయిస్తే వార్షికంగా మరో 23 శాతం అదనపు క్షీణత నమోదయ్యేదని పేర్కొంది. 2023లో ప్రపంచవ్యాప్తంగా లావాదేవీల వాతావరణం మందగించడంతో భారీ డీల్స్ నీరసించినట్లు తెలియజేసింది. ఒకే ఒక్క డీల్ అంతక్రితం ఏడాది(2022)తో పోలిస్తే 3 బిలియన్ డాలర్లకు ఎగువన హెచ్డీఎఫ్సీ ద్వయం లావాదేవీ మాత్రమే నమోదైంది. 2022లో 5 భారీ డీల్స్కు తెరలేవగా.. పరిమాణంరీత్యా గతేడాది 1.7 శాతం క్షీణతే నమోదైనట్లు ఎల్ఎస్ఈజీ డీల్స్ సీనియర్ మేనేజర్ ఇలేన్ టాన్ పేర్కొన్నారు. వెరసి మధ్యస్థాయి మార్కెట్ లావాదేవీల హవా కొనసాగినట్లు తెలియజేశారు. అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం భారీగా నీరసించడంతో వడ్డీ రేట్లు దిగివచ్చే వీలుంది. ఫలితంగా 2024లో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేందుకు దారి ఏర్పడనుంది. తద్వారా చౌకగా పెట్టుబడులు సమకూర్చుకునేందుకు వీలు చిక్కనున్నట్లు టాన్ వివరించారు. ఈ నేపథ్యంలో దేశీయంగా సార్వత్రిక ఎన్నికల తదుపరి ఎంఅండ్ఏ డీల్స్ ఊపందుకునే అవకాశమున్నట్లు అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా సైతం ఈ ట్రెండ్కు వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. రష్యా–ఉక్రెయిన్ వివాదం నేపథ్యంలో 2022 మార్చిలో ఫండింగ్ వింటర్(పెట్టుబడులు తగ్గిపోవడం) ప్రారంభమైనట్లు తెలియజేశారు. అంతేకాకుండా అధిక వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితి దీనికి కారణమైనట్లు వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఎంఅండ్ఏ డీల్స్ 17 శాతం క్షీణించి దశాబ్ద కనిష్టం 2.9 ట్రిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఈక్విటీలు జూమ్ ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్ 60 శాతం ఎగసి 31.2 బిలియన్ డాలర్లమేర బలపడింది. 2021 తదుపరి వార్షికంగా గరిష్టస్థాయిలో నమోదైంది. ఫాలోఆన్ ఆఫర్లు రెట్టింపై 24.4 బిలియన్ డాలర్లను తాకాయి. మరోవైపు 1996 తదుపరి కొత్త ఈక్విటీ జారీ ఐపీవోలు 56 శాతం జంప్చేశాయి. కనీసం 236 ఎస్ఎంఈలు లిస్టింగ్ ద్వారా 6.8 బిలియన్ డాలర్లు అందుకున్నాయి. అయితే 2022తో పోలిస్తే ఇవి 11 శాతం తక్కువే! -
మేకింగ్ ఇండియా ప్రౌడ్! ఈ గౌరవం వారికి అంత ఈజీగా రాలే!
భారత సంతతికిచెందిన టాప్ సీఈవోలు ప్రపంచంలోని అనేక కంపెనీలు, టెక్ దిగ్జజాలకు అధిపతులుగా తమ ప్రతిభను చాటుకుంటున్నారు. అడోబ్ శంతను నారాయణ్, ఐబీఎం అరవింద్ కృష్ణ మొదలు, గూగుల్ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ల వరకు భారతీయులు గ్లోబల్ కంపెనీలకు సారధులుగా ఉండిమెప్పిస్తున్నారు. 76వ ఇండిపెండెన్స్డే సందర్భంగా దిగ్గజ కంపెనీల్లో టాప్ ప్లేస్లో కొనసాగుతూ, దేశ ప్రతిష్ఠను ప్రపంచ వ్యాప్తంగా చాటుకుంటున్న సీఈఓలు గురించి తెలుసుకుందాం. అయితే ఈ స్థాయి వారికి అలవోకగా రాలేదు. ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు ఎదుర్కొని, మొక్కవోని ధైర్యంతో అడుగులు వేయడమేకాదు, ఆధునిక టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కిస్తూ అందరికీ స్ఫూర్తి దాయకంగా నిలుస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే 1990 దశకం నుంచి భారత సంతతికి చెందిన టెక్ నిపుణులు, వ్యాపార దిగ్గజాలు గ్లోబల్ కంపెనీల్లో కీలక పదవుల్లో తమ సత్తా చాటుతూ వస్తున్నారు. ముఖ్యంగా రాహ్మ్ అండ్ హాస్ ఛైర్మన్, సీఈఓగా రాజ్ గుప్తా బాధ్యతలు స్వీకరించి కొత్త శకానికి నాంది పలికారు. ఆ తరువాత స్టాన్ర్ట్ఫోర్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఛైర్మన్, సీఈఓగా యూఎస్ ఎయిర్వేస్ గ్రూప్నకు రాకేశ్ గంగ్వాల్ సీఈగా ఎంపికై తమ ఘనతను చాటుకున్నారు. అజయ్పాల్ సింగ్ బంగా ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్పాల్ సింగ్ బంగా లేదా అజయ్బంగా ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ కుమారుడు. పూణేలోని ఖడ్కీ కంటోన్మెంట్లో జన్మించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ ,అహ్మదాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఎంబీఏ చేశారు.నెస్లే తన కెరీర్ను ప్రారంభించి ప్రస్తుతం వరల్డ్ బ్యాంకు అధ్యక్ష స్థాయికి ఎదిగారు. అజయ్పాల్ సింగ్ బంగా అట్లాంటిక్లో వైస్ చైర్మన్గా, అంతకు ముందు ఏప్రిల్ 12, 2010 నుంచి 11 సంవత్సరాల పాటు మాస్టర్కార్డ్ సీఈవోగా పనిచేశారు. గతంలో పెప్సికో ,సిటీ గ్రూప్లో కూడా పనిచేశారు.ఇండియా బిజినెస్ కౌన్సిల్ (USIBC) ఛైర్మన్గా కూడా ఉన్నారు. గీతా గోపీనాథ్ గీతా గోపీనాథ్ 1971లో పశ్చిమ బెంగాల్లోనికోల్కతాలో పుట్టారు. 2022లో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) తొలి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా ఎంపికై తన ప్రత్యేకతను చాటుకున్నారు. 2019-2022 దాకా ఐఎంఎఫ్ ముఖ్య ఆర్థికవేత్తగా పనిచేశారు. ఐఎంఎఫ్లో చేరడానికి ముందు, గోపీనాథ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని ఆర్థికశాస్త్ర విభాగంలో విద్యావేత్తగా రెండు దశాబ్దాలు సేవలందించారు. జాన్ జ్వాన్స్ట్రా ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ (2005-2022), అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నారు. గోపీనాథ్ క్రీడలు, సంగీతంపై కూడా మక్కువ ఎక్కువ. అల్ఫాబెట్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పిచాయ్ సుందరరాజన్ సుందర్పిచాయ్ తమిళనాడులో చెన్నైలోని అశోక్ నగర్లో జన్మించారు. తల్లి లక్ష్మి వృత్తిరీత్యా స్టెనోగ్రాఫర్, తండ్రి ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఐఐటీ ఖరగ్పూర్ నుండి మెటలర్జికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఎంఎస్ చేశారు. వార్టన్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ చేశారు. 2015లో గూగుల్ సీఈగా నియమితులయ్యారు. అనంతరం కేవలం నాలుగేళ్లకే 2019లో గూగుల్ మాతృ సంస్థ అల్పాబెట్ సీఈవోగా ఎంపిక కావడం గమనార్హం. సత్య నాదెళ్ల, మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ హైదరాబాద్లో జన్మించిన సత్యనాదెళ్ల. కర్ణాటకలోని మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో తన బ్యాచిలర్స్ డిగ్రీని, విస్కాన్సిన్-మిల్వాకీ విశ్వవిద్యాలయం నుండి కంప్యూటర్ సైన్స్లో ఎంఎస్ చేశారు. సన్ మైక్రోసిస్టమ్స్లో పనిచేసిన తర్వాత 1992లో మైక్రోసాఫ్ట్లో చేరారు. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ అండ్ ఎంటర్ప్రైజ్ గ్రూప్కి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాడు.2021లో మైక్రోసాఫ్ట్ ఛైర్మన్గా నియమితులయ్యారు. అరవింద్ కృష్ణ ఐబీఎం ఛైర్మన్ , సీఈవో 1990లో ఐబీఎంలోచేరారు కృష్ణ. ఏప్రిల్ 2020 నుంచి కంపెనీ సీఈవో ఆతరువాత జనవరి 2021లో ఛైర్మన్గా బాధ్యలను స్వీకరించారు. కృత్రిమ మేధస్సు, క్లౌడ్, క్వాంటం కంప్యూటింగ్ ,బ్లాక్చెయిన్, నానోటెక్నాలజీతో సహా కోర్, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల ఆవిష్కరణలతో ఐబీఎం మార్కెట్ను విస్తరించిన ఘనతను సొంతం చేసుకున్నారు. అరవింద్ న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు సభ్యుడు , అలాగే నార్త్రోప్ గ్రుమ్మన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో పుట్టిన అరవింద్ కాన్పూర్ ఐఐటీనుంచి డిగ్రీ , అర్బానా-ఛాంపెయిన్లోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ చేశారు. లక్ష్మణ్ నరసింహన్ స్టార్బక్స్ సీఈఓ 2023 ఏప్రిల్ 1న స్టార్బక్స్ సీఈవోగా ఎంపికయ్యారు. లక్ష్మణ్ నరసింహన్ యూనివర్సిటీ ఆఫ్ పుణెలో మెకానికల్ ఇంజినీరింగ్ డిగ్రీ , యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా జర్మన్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్లో ఆయనకు ఎంఏ, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాకు చెందిన వార్ష్టన్ స్కూల్ నుంచి ఆయన ఫైనాన్స్లో ఎంబీఏ పొందారు. ఇంద్రా నూయి: భారత సంతతికి చెందిన పెప్సికో సీఈఓ ఇంద్రా నూయి 12 ఏళ్ల పాటు అమెరికా దిగ్గజం పెప్సీకోకు సీఈవోగా పనిచేశారు. 2018లో ఆమె పదవీ విరమణ చేశారు. చెన్నైకి చెందిన నూయి, 1996లో పెప్సికోలో చేరిన ఆమె 2006- 2018 వరకు సీఈఓగా పనిచేశారు. శ్రీకాంత్ దాతర్ భారతీయ అమెరికన్ ఆర్థికవేత్త, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ డీన్. హార్వర్డ్ హార్వర్డ్ లో ఏకకాలంలో ఆర్థర్ లోవ్స్ డికిన్సన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెసర్ గా పనిచేసారు 2021లో ఆయనకు భారతదేశంలో నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ పురస్కారం లభించింది.చార్టర్డ్ అకౌంటెంట్ అయిన శ్రీకాంత్ 1976-78లో IIMAలో మేనేజ్మెంట్లో PGP చేసారు. 1978-80 టాటా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ తో కలిసి పనిచేశారు. 1985లో స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో వ్యాపారం (అకౌంటింగ్)లో పీహెచ్డీ పొందారు. కార్నెగీ మెల్లన్ అండ్ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో, 1996 నుండి, హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో IIMAలో విద్యార్థిగా, విద్యార్థి వ్యవహారాల మండలి సమన్వయకర్త (1977-78) గా పనిచేయడమే కాదు ఔట్ స్టాండింగ్ ఓవర్ ఆల్ పెర్పామెన్స్ అవార్డు' అందుకున్నారు. ఆతరువాత, IIMA బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ (2012-18)లో పనిచేశారు. డీబీఎస్ సీఈవో పీయూష్ గుప్తా 2009లో ఆసియాలోనే పాపులర్బ్యాంకు డీబీఎస్గ్రూప్ సీఈవో డైరెక్టర్గా ఎంపికైనారు.ఈ గ్రూప్ ఆస్తుల విలువ 2019లో నాటికి 500 బిలియన్ల కంటే ఎక్కువ. 1960లో మీరట్లో జన్మించిన పీయూష్ గుప్తా ఢిల్లీలోని సెయింట్ కొలంబా ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యను అభ్యసించారు. 1980లో అహ్మదాబాద్లో ఐఐఎంలో ఎంబీఏ చేశారు. ప్రముఖ కంపెనీల్లోని మరికొంతమంది భారత సంతతి సీఈవోలు వివేక్ శంకరన్- ఆల్బర్ట్సన్స్ అధ్యక్షుడు, సీఈవో సంజయ్ మెహ్రోత్రా- మైక్రాన్ టెక్నాలజీ ప్రెసిడెంట్,సీఈవో శాంతను నారాయణ్- అడోబ్ ఐఎన్సీ ఛైర్మన్, సీఈవో సీఎస్ వెంకట కృష్ణన్- బార్క్లేస్ సీఈవోపునిత్ రెన్జెన్- డెల్లాయిట్ సీఈవో రేవతి అద్వాతి- ఫ్లెక్స్ సీఈవో -
రెలిగేర్ కేసు: 11 సంస్థలకు షాక్, రూ.6 కోట్ల డిమాండ్ నోటీసులు
న్యూఢిల్లీ: రెలిగేర్ ఫిన్వెస్ట్ నిధుల మళ్లింపు కేసులో రూ. 6 కోట్లు చెల్లించాలంటూ 11 సంస్థలకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది. ఒకవేళ చెల్లించకపోతే అసెట్లు, ఖాతాలను జప్తు చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. నోటీసులు అందుకున్న వాటిల్లో టోరస్ బిల్డ్కాన్, ఆరి్టఫైస్ ప్రాపర్టీస్ రోజ్స్టార్ మార్కెటింగ్ మొదలైన సంస్థలు ఉన్నాయి. 2022 అక్టోబర్లో సెబీ విధించిన పెనాల్టీని చెల్లించకపోవడంతో తాజా నోటీసులు జారీ అయ్యాయి. ప్రమోటర్లకు ప్రయోజనం చేకూర్చేలా రెలిగేర్ ఫిన్వెస్ట్ నుంచి మాతృ సంస్థ రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ నిధులు మళ్లించిందన్న అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో 2022 అక్టోబర్లో మొత్తం 52 సంస్థలపై సెబీ రూ. 21 కోట్ల జరిమానా విధించింది. -
రియల్ ఎస్టేట్ జోరు.. 5.6 లక్షల ఇళ్ల నిర్మాణం!
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇళ్ల నిర్మాణం వేగాన్ని అందుకోనుంది. దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో ఈ ఏడాది 5,57,900 ఇళ్ల నిర్మాణం పూర్తి కావాల్సి ఉందని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ వెల్లడించింది. 2022లో 4,02,000 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని డెవలపర్లు నిర్ణయించినట్టు పేర్కొంది. అయితే, ఈ లక్ష్యాన్ని సాధించారా అన్నది తెలియజేయలేదు. నిర్మాణం పూర్తి చేసి డెలివరీ ఇవ్వాల్సిన ఇళ్ల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు అనరాక్ తెలిపింది. రియల్ ఎస్టేట్ రంగ నియంత్రణ విభాగం ‘రెరా’, నిర్మాణ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం, ఇళ్ల అమ్మకాల రూపంలో పెరిగిన నగదు ప్రవాహం, ఆర్థిక సంస్థల నుంచి నిధుల మద్దతు.. ఇవన్నీ ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యేందుకు సానుకూలించే అంశాలుగా పేర్కొంది. డెవలపర్లు ఇళ్ల నిర్మాణంలో జాప్యం లేకుండా ప్రయత్నిస్తున్నారని, ఆలస్యం కావడం వల్ల నిర్మాణ వ్యయాల భారం పెరుగుతుందని వివరించింది. ‘‘షెడ్యూల్ ప్రకారం 2023లో టాప్–7 పట్టణాల్లో 5.6 లక్షల ఇళ్లను నిర్మాణం పూర్తి చేసి కొనుగోలుదారులకు స్వాధీనం చేయాల్సి (డెలివరీ) ఉంది. క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 39 శాతం అధికం’’అని అనరాక్ వైస్ చైర్మన్ సంతోష్ కుమార్ తెలిపారు. హైదరాబాద్లో.. షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్ మార్కెట్లో డెవలపర్లు 23,800 ఇళ్లను ఈ ఏడాది నిర్మించి కొనుగోలుదారులకు ఇవ్వాల్సి ఉంది. క్రితం ఏడాది ఇలా షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాల్సి యూనిట్ల సంఖ్య 11,700గా ఉంది. ఢిల్లీ–ఎన్సీఆర్లో ఎక్కువ ఇళ్లను నిర్మించి ఇవ్వాల్సి ఉంది. ఆ తర్వాత ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ ఉంది. ఢిల్లీ–ఎన్సీఆర్లో 1,70,100 ఇళ్లను ఈ ఏడాది డెలివరీ చేయాల్సి ఉంది. ముంబై ఎంఎంఆర్లో 1,31,400 యూనిట్లను పూర్తి చేసి ఇవ్వాలి. ఇదీ చదవండి: తొందరొద్దు బాసూ.. ఆలోచించి కొను హౌసు! -
గుడ్లగూబ తన జీవితకాలంలో ఎన్ని ఎలుకల్ని తింటుందో తెలుసా?
Owls Facts In Telugu: మనిషికి ఎప్పుడూ హాని చేయలేదు.. అసలు చేయలేవు కూడా. అయినా ఆ జీవుల్ని మనం అసహ్యించుకుంటాం. వాటిని చూస్తేనే అశుభంగా భావిస్తాం. మన సమీపంలో వాటి ఉనికినే తట్టుకోలేం.. అపనమ్మకాలతో వాటికి నిలువ నీడ లేకుండా చేస్తున్నాం.. క్షుద్ర పూజల పేరుతో కొందరి అజ్ఞానానికి అవి బలవుతున్నా.. మనకు మాత్రం మేలే చేస్తున్నాయి. పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నాయి.. ఎలుకల బారి నుంచి పంటల్ని రక్షిస్తున్నాయి.. తద్వారా మనకు ఆహార భద్రతనిస్తున్నాయి.. గుడ్లగూబలకు అటవీ, జనసంచారం లేని ప్రాంతాలు ఆవాసాలు. ప్రస్తుతం వాటి ఆవాసాలు దెబ్బతింటున్నాయి. సాధారణంగా గుడ్లగూబలు రాత్రిపూట సంచరిస్తాయి.. అయితే కొన్ని జాతులు పగలు కూడా తిరుగుతాయి. వంద గడ్డిజాతి(బార్న్) గుడ్లగూబలు వాటి జీవిత కాలంలో తినే ఎలుకల వల్ల రెండు వేల మందికి ఆహార భద్రతను కల్పిస్తాయని అధ్యయనాల్లో తేలింది. అవి ఉన్న చోట ఎలుకల కోసం మందుల వాడకం తగ్గుతుంది. ఆ విధంగా పర్యావరణానికి మేలు జరుగుతుంది. రైతులకు మందుల ఖర్చు కూడా తగ్గుతుంది. పంటల దిగుబడీ పెరుగుతుంది. జీవితకాలం ఒకే జంటగా.. స్కాప్స్ వంటి చిన్న గుడ్లగూబలు 17 సెం.మీ. ఉంటే, ఇండియన్ ఈగిల్ వంటి గుడ్లగూబలు 60 సెం.మీ.వరకూ ఉంటాయి. గుడ్లగూబలకు పెద్ద కళ్లు ఉన్నాగానీ అవి వాటిని కదిలించలేవు. మెడను 270 డిగ్రీలకు తిప్పే అసాధారణ సామర్థ్యం వాటి సొంతం. దీని ద్వారానే అవి తమను తాము రక్షించుకుంటాయి. ఒక ఆడ, మగ గుడ్లగూబ జంట మనుషుల మాదిరిగానే జీవితకాలం కలిసుంటాయి. వాటి జీవితకాలం పదేళ్లయినా.. కొన్ని ఇంకా ఎక్కువ కాలమే బతుకుతాయి. అంతరించే దశలో పలు జాతులు పలు గుడ్లగూబ జాతులు ఆవాసాలను కోల్పోయి అంతరించే జాబితాలో ఉన్నాయి. మన దేశానికి చెందిన, టేకు అడవుల్లో నివాసముండే అడవి గుడ్లగూబ జాతి అంతరించిపోయిందని భావించారు. కానీ 1997లో మళ్లీ కనిపించింది. ప్రస్తుతం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో వాటి ఉనికిని గుర్తించారు. ఇండియన్ ఈగిల్ గుడ్లగూబ కొండ ప్రాంతాల్లో జరిగే తవ్వకాల కారణంగా ఆవాసాలను కోల్పోతోంది. పట్టణ ప్రాంతాల్లో బార్న్ గుడ్లగూబలు ఎత్తయిన భవనాలు, అపార్ట్మెంట్ బ్లాకుల్లో గూళ్లు పెడతాయి. అపనమ్మకాలతో వాటి గూళ్లను నాశనం చేస్తున్నారు. కొన్ని గుడ్లగూబ జాతుల్ని వేటాడి అక్రమంగా రవాణా చేస్తున్నారు. గుడ్లగూబలకు 1972లో వన్యప్రాణి సంరక్షణ చట్టం పరిధిలో రక్షణ ఉంది. వాటిని వేటాడడం, వ్యాపారం చేయడం శిక్షార్హమైన నేరం. పర్యావరణానికి మేలు గుడ్లగూబల గురించి పిల్లలు, పెద్దలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అవి ఉంటే వాటి పరిసరాల్లో ఎలుకలుండవు. తద్వారా అనేక వ్యాధులను నివారించొచ్చు. సహజ ఎలుకల నియంత్రణ కోసం రైతులు తమ పొలాల్లో గుడ్లగూబలను ఆహ్వానిస్తే ఎంతో మేలు జరుగుతుంది. సమాజంలో వాటి గురించి ఉన్న చెడు అభిప్రాయాన్ని మార్చగలిగితే.. అందమైన పక్షులను కాపాడుకుని మన పర్యావరణానికి మేలు చేసిన వారం అవుతాం. – బండి రాజశేఖర్, సిటిజన్ సైన్స్ కో–ఆర్డినేటర్, ఐఐఎస్ఈఆర్, తిరుపతి. పంట నేస్తం గుడ్లగూబ గురించి మరిన్ని విషయాలు.. మన దేశంలో 35 జాతులు. మన రాష్ట్రంలో 13 జాతులు. ఇండియన్ ఈగిల్ గుడ్లగూబ మన దేశంలో పెద్దది. నగరాలు, గ్రామాలు, అడవుల సమీపంలోని కొండలు దీనికి ఆవాసాలు. బార్న్ గుడ్లగూబ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా కనిపించే జాతి. నగరాల్లో ఎత్తయిన భవనాలపై గూళ్లు పెట్టుకుంటుంది. మచ్చల గుడ్లగూబ నగరాలు, గ్రామాలు, అడవులు, ఎడారుల్లో కనిపిస్తుంది. కీటకాలు, చిన్న చిన్న పక్షులు, ఎలుకల్ని తింటుంది. ఒక గుడ్లగూబ తన జీవితకాలంలో 11 వేల ఎలుకలను తింటుంది. ఆ ఎలుకలు 13 టన్నుల ఆహార పంటలను తినేస్తాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement