breaking news
fighter jet plane
-
13 రోజులైనా కేరళలోనే యూకే యుద్ధ విమానం
త్రివేండ్రం: కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండయిన బ్రిటన్ నేవీ యుద్ధ విమానం ఎఫ్–35 గత 13 రోజులుగా అక్కడే ఉంది. టేకాఫ్ ప్రయత్నాలు విఫలం కావడంతో రాయల్ బ్రిటీష్ నేవీ కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టింది. హైడ్రాలిక్ స్నాగ్ కారణంగా ఉండిపోయిన ఎఫ్–35బీ యుద్ధనౌకను తరలించడం కోసం యూకే నుంచి ప్రత్యేక టో వాహనం వస్తోంది. 40 మంది బ్రిటిష్ ఇంజనీర్లు, నిపుణుల బృందం కూడా కేరళకు బయల్దేరింది. ఫైటర్ జెట్ను భారత్లోనే మరమ్మతు చేయనున్నట్లు సమాచారం. యుద్ధవిమానం పార్కింగ్ కోసం బ్రిటన్ భారీగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. సరిపడా ఇంధనం లేకపోవడంతో పాటు వాతావరణం అనుకూలించక విమాన వాహన నౌక తిరిగి రాకపోవడంతో ఎఫ్–35బి జూన్ 14న తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండవడం తెలిసిందే. సురక్షిత ల్యాండింగ్కు భారత వైమానిక దళం వీలు కల్పించింది. ఇంధనం నింపడంతో పాటు అన్నిరకాల మద్దతు అందించింది. కానీ హైడ్రాలిక్ వైఫల్యంతో జెట్ ఎగరలేకపోయింది. దాన్ని సరిచేయడానికి రాయల్ నేవీ టెక్నీషియన్ల చిన్న బృందం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. విమానం ప్రస్తుతం సెంట్రల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) రక్షణలో బే 4 వద్ద ఉంది. ‘‘తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎఫ్–35బీని వీలైనంత త్వరగా మరమ్మతు చేయడానికి యూకే కృషి చేస్తోంది. భారత అధికారుల నిరంతర మద్దతుకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము’’అని భారత్లోని బ్రిటిష్ హైకమిషన్ పేర్కొంది. నిపుణుల బృందం మరమ్మత్తు ప్రయత్నాలు కూడా విఫలమైతే జెట్ను యూకేకి విమాన మార్గంలో తరలించడమే చివరి మార్గమని చెబుతున్నారు. జోరుగా మీమ్స్ బ్రిటన్ యుద్ధ విమానం రెండువారాలుగా కేరళలోనే ఉండటంపై ఆన్లైన్లో జోరుగా మీమ్స్ పుట్టుకొస్తున్నాయి. 11 కోట్ల డాలర్ల విలువైన జెట్ను కేవలం 4 కోట్లకే ఓఎల్ఎక్స్లో అమ్మకానికి ఉంచినట్లు ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. రెండు వారాలుగా ఇక్కడే ఉంటున్నందున ఆ జెట్కు భారత పౌరసత్వానికి అర్హత వచ్చిందని కొందరు చమత్కరించారు. ‘‘బహిరంగ ప్రదేశంలో పార్క్ చేయబట్టి సరిపోయింది. మరెక్కడైనా అయితే దొంగతనానికి గురయ్యేది’’అంటూ మీమ్స్ వైరలవుతున్నాయి. -
సెల్యూట్ పైలట్ సిద్ధార్థ్!
అంతా బాగున్నప్పుడు కాదు, ప్రమాదపుటంచున ఉన్నప్పుడు ఎలా స్పందిస్తామన్నది మన వ్యక్తిత్వానికి కొలమానంగా నిలుస్తుంది. బుధవారం రాత్రి గుజరాత్లోని జామ్నగర్లో కూలిపోయిన భారత వైమానిక దళ జాగ్వార్ ఫైటర్ జెట్ పైలట్ సిద్ధార్థ్ యాదవ్ అలాంటి గొప్ప వ్యక్తిత్వమున్న వారి కోవకే వస్తారు. సాంకేతిక లోపాలతో విమానం కుప్పకూలనుందని అర్థమైంది. 28 ఏళ్ల యువకుడు. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు. పైగా 10 రోజుల కిందే నిశ్చితార్థం కూడా అయింది. కో పైలట్తో కలిసి సురక్షితంగా ఎజెక్టయ్యే అవకాశముంది. అయినా సిద్ధార్థ్ తన ప్రాణాల కోసం పాకులాడలేదు. ప్రజల భద్రత గురించే ఆలోచించారు. విమానంజనావాసాల్లో పడకుండా జాగ్రత్తపడ్డారు. సురక్షితంగా మైదానంలో కూలిపోయేలా చూశారు. తద్వారా ఎంతోమంది పౌరుల మరణాలను నివారించారు. ఆ క్రమంలో దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయినా తన సాటిలేని త్యాగంతో జాతి గుండెల్లో చిరంజీవిగా మిగిలిపోయారు. కో పైలట్ సురక్షితంగా ఎజెక్టయినా గాయాలపాలయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. చివరి క్షణాల్లోనూ... బయల్దేరిన కాసేపటికే విమానంలో సాంకేతిక వైఫల్యం తలెత్తింది. విమానాన్ని నియంత్రించడానికి ప్రయత్నించినా లాభం లేకపోయింది. ప్రమాదం తప్పదని స్పష్టమైంది. దాంతో పైలెట్లిద్దరూ ఎజెక్షన్ ప్రారంభించారు. అంతటి క్లిష్ట సమయంలోనూ ముందు కో పైలట్ సురక్షితంగా బయటపడేలా సిద్ధార్థ్ జాగ్రత్త తీసుకున్నారు. తర్వాత కూడా విమానాన్ని వెంటనే వదిలేయకుండా నివాస ప్రాంతాలకు దూరంగా తీసుకెళ్లారు. ఆ క్రమంలో ప్రాణాలనే పణంగా పెట్టారు. కుటుంబమంతా దేశ సేవలోనే.. ఫ్లైట్ లెఫ్టినెంట్ సిద్ధార్థ్ స్వస్థలం హరియాణాలోని రేవారీ. వారిది తరతరాలుగా సైనిక కుటుంబమే. ఆయన ముత్తాత బ్రిటిష్ హయాంలో బెంగాల్ ఇంజనీర్స్ విభాగంలో పనిచేశారు. తాత పారామిలటరీ దళాల్లో సేవలందించారు. తండ్రి కూడా వైమానిక దళంలో పనిచేశారు. సిద్ధార్థ్ 2016లో వైమానిక దళంలో చేరారు. రెండేళ్ల సర్వీసు తర్వాత ఫ్లైట్ లెఫ్టినెంట్గా పదోన్నతి పొందారు. మార్చి 23నే నిశ్చితార్థం జరనిగింది. నవంబర్ 2న పెళ్లి జరగాల్సి ఉంది. మార్చి 31 దాకా కుటుంబీకులతో గడిపి ఇటీవలే విధుల్లో చేరారు. ఆయన మరణవార్తతో కుటుంబం, స్నేహితులే గాక పట్టణమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. విమానంలో ప్రయాణించాలని, దేశానికి సేవ చేయా లని సిద్ధార్థ్ ఎప్పుడూ కలలు కనేవాడని చెబుతూ తండ్రి సుజీత్ యాదవ్ కన్నీటిపర్యంతమయ్యారు. ‘‘సిద్ధార్థ్ తెలివైన విద్యారి్థ. తనను చూసి ఎప్పుడూ గర్వపడేవాళ్లం. ప్రజల ప్రాణాలు కాపాడుతూ తన ప్రాణాలర్పించాడు. నా కొడుకును చూసి చాలా గర్వపడుతున్నా. మాకు ఒక్కగానొక్క కొడుకు తను’’అంటూ గుండెలవిసేలా రోదించారు. సిద్ధార్థ్ పారి్థవదేహం శుక్రవారం రేవారీకి చేరింది. పూర్వీకుల గ్రామం భలాకి మజ్రాలో పూర్తి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చైనా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లకు పైలట్ల కొరత
బీజింగ్: ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ల (విమానవాహక నౌకల)పై నుంచి యుద్ధ విమానాలను నడపడంలో సుశిక్షితులైన పైలట్లు దొరక్క డ్రాగన్ దేశం తంటాలు పడుతోంది. విమానవాహక నౌకల కోసం తయారు చేసిన యుద్ధ విమానాలు ముఖ్యంగా జె–15 జెట్లు నడిపే అర్హులైన పైలట్ల డిమాండ్ను తీర్చేందుకు చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ (పీఎల్ఏఎన్) శిక్షణ కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. మొదటి విమాన వాహక నౌక లియోనింగ్ను ప్రారంభించిన దశాబ్దం తర్వాత చేపట్టిన ఈ శిక్షణ కార్యక్రమం అనేక అవరోధాలను ఎదుర్కొంటోందని చైనా మిలటరీ మేగజీన్ ఆర్డినెన్స్ ఇండస్ట్రీ సైన్స్ టెక్నాలజీ తాజా కథనంలో తెలిపింది. గత వారం సముద్రంలో ట్రయల్స్ ప్రారంభించిన అత్యాధునిక మూడో విమాన వాహక నౌక ఫుజియాన్పై ఉండే 130 యుద్ధ విమానాలను నడిపేందుకు కనీసం 200 మంది క్వాలిఫైడ్ పైలట్లు అవసరం ఏర్పడిందని అందులో తెలిపింది. అంతేకాదు, అమెరికాతో సరితూగగల ఇలాంటి మరికొన్ని ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లను తయారు చేసుకోవాలని చైనా ప్రణాళికలు వేస్తోంది. ‘అయితే, విమానాల డిజైనింగ్తోపాటు అందుకు తగ్గట్లుగా పైలట్లను తయారు చేసుకోవడం చాలా కష్టతరమైన అంశం. ఎందుకంటే ఇలాంటి కీలక సాంకేతిక అంశాలను మీతో ఎవరూ పంచుకోరు. ఎవరికి వారు వీటిని సొంతంగా సమకూర్చుకోవాల్సిందే’ అని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. చైనా కనీసం ప్రతి రెండు నెలలకో యుద్ధ నౌకను రంగంలోకి దించుతూ తన నావికాశక్తిని వేగంగా ఆధునీకరిస్తోంది. పైలట్ల కొరతను అధిగమించేందుకు నేవీ అధికారులు ఎయిర్ఫోర్స్లోని అర్హులైన సిబ్బందికి బదులు హైస్కూల్ విద్య పూర్తి చేసిన 19 ఏళ్ల వారిని ఎంపిక చేస్తూ శిక్షణను వేగవంతం చేసినట్లు అధికార చైనా సెంట్రల్ టెలివిజన్ తెలిపింది. పలు సాంకేతిక అంశాల్లో అమెరికాతో పోలిస్తే చైనా పైలట్లు శిక్షణలో వెనుకబడినట్లే భావించాల్సి ఉంటుందని ఆర్డ్నెన్స్ ఇండస్ట్రీ సైన్స్ టెక్నాలజీ పత్రిక పేర్కొంది. -
కూలిన సుఖోయ్ -30 విమానం
పుణె:ఓ యుద్ధ విమానం కూలి పోయిన ఘటన పుణెలో మంగళవారం సంభవించింది. భారత యుద్ధ విమానం సుఖోయ్ 30 ఎమ్ -ఐ తూర్పు పుణెకు 35 కిలోమీటర్ల దూరంలో కుప్పుకూలింది. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. ఈ ఘటనలో పైలెట్ తో సహా కో పైలెట్ కూడా క్షేమంగా బయటపడ్డారు. వారు స్వల్పపాటి గాయాలతో బయటపడ్డారు. ఈ ఇద్దరి పైలెట్లను ఒక ఐఎఎఫ్ హెలికాప్టర్ లో తీసుకొచ్చినట్లు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ తెలిపింది. ఈ దుర్ఘటన మంగళవారం మధ్యాహ్నం 1.10 ప్రాంతంలో జరిగినట్టు లాహ్ గాన్ ఏఎఫ్ఎస్ అధికారి స్పష్టం చేశారు. గాలిలోకి ఎగిరిన కాసేపట్లోనే విమానం కూలినట్లు తెలిపారు.