breaking news
East Zone
-
'డీఆర్ఎస్ ఏముందిలే బ్రో.. కాబోయే కెప్టెన్వి నువ్వు’
ఇషాన్ కిషన్ సారథ్యంలోని ఈస్ట్జోన్ జట్టు 13 ఏళ్ల తర్వాత దులీప్ ట్రోఫీని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కెప్టెన్గా మాత్రమే గాక బ్యాటర్గానూ అదరగొట్టిన ఇషాన్ రెండు ఇన్నింగ్స్లు కలిపి 350కి పైగా పరుగులు సాధించి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. మరోవైపు సెమీస్లో (తొలి ఇన్నింగ్స్లో 92 రన్స్, రెండో ఇన్నింగ్స్లో 40 పరుగులు) కీలక ఇన్నింగ్స్ ఆడిన వైభవ్ సూర్యవంశీ ఫైనల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కానీ తనకిచ్చిన వైస్ కెప్టెన్సీ బాధ్యతలను మాత్రం వైభవ్ సమర్థంగా నిర్వహించాడు. మ్యాచ్లో ఇషాన్ కిషన్కు తలలో నాలుకలా కొనసాగుతూ వచ్చిన వైభవ్ తన కెప్టెన్ డీఆర్ఎస్ నిర్ణయాలు తీసుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. అంతేకాదు సెమీస్లో ఇషాన్ గాయంతో కొన్ని ఓవర్ల పాటు మైదానంలోకి రాలేదు. ఆ సమయంలో వైభవ్ స్టాండిన్ కెప్టెన్గానూ అదరగొట్టాడు. అతడు తీసుకున్న డీఆర్ఎస్ ఫలితాలు అనుకూలంగా రావడంతో తొలి విజయం సాధించాడు. ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈస్ట్జోన్ డగౌట్ వద్ద ఇషాన్ కిషన్.. వైభవ్ సూర్యవంశీని ఆకాశానికెత్తిన వీడియోను బీసీసీఐ కాస్త ఆలస్యంగా విడుదల చేసింది. ఈ వీడియోలో వైభవ్ను ఇషాన్ కిషన్ సరదాగా ఆటపట్టించాడు. వైభవ్ ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన ఇషాన్ తన సమక్షంలో వైభవ్ మాట్లాడాలంటూ నవ్వుతూ పేర్కొన్నాడు.ఇషాన్ మాట్లాడుతూ.."డీఆర్ఎస్ విషయంలోనూ ప్రతి చోటా క్రెడిట్ అంతా వైభవ్కే దక్కింది. నిజానికి రివ్యూ తీసుకోవాలని నేను నిర్ణయించుకున్నా. కానీ దగ్గరికి వచ్చి చాలా కాన్ఫిడెంట్గా ‘రివ్యూ లే లో భాయ్’ అంటూ చెప్పాడు. అంతే.. ఇంటర్నెట్ అంతా ‘వైభవ్, వైభవ్..’ అంటూ ప్రశంసలు. కెప్టెన్గా డీఆర్ఎస్ తీసుకునేది నేను.. క్రెడిట్ అంతా ఈ చిచ్చర పిడుగుకే వచ్చింది" అంటూ ఇషాన్ సరదాగా వైభవ్ను ట్రోల్ చేశాడు.దీనికి వైభవ్ సూర్యవంశీ కూడా ఇషాన్కు స్టన్నింగ్ రిప్లై ఇచ్చాడు. "మీరు ఉన్నప్పుడు రివ్యూ తీసుకోమని చెప్పింది నేనే.. కానీ గాయంతో పెవిలియన్లో ఉన్నప్పుడు డీఆర్ఎస్ తీసుకున్నది ఎవరు? అది కూడా చెప్పండి" అంటూ వైభవ్ చురక వేశాడు. వైభవ్ సమాధానాన్ని ఇషాన్ అలా చూస్తూ ఉండిపోయాడు.‘అవును.. అప్పుడు కూడా వైభవే రివ్యూలు తీసుకున్నాడు. సక్సెస్ అయ్యాడు. అతడిలో కెప్టెన్ అయ్యే లక్షణాలు చాలా ఉన్నాయి. భవిష్యత్తులో వైభవ్ కెప్టెన్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చూద్దాం అతడి కెరీర్ ఎలా సాగుతుందో. వైభవ్ జట్టులో ఉండటం వల్ల చాలా వరకు ఒత్తిడి తగ్గుతుంది. జట్టులోని ప్రతి ఒక్కరినీ.. అది జూనియర్ అయినా, సీనియర్ అయినా.. జాగ్రత్తగా చూసుకుంటాడు. ఓహ్.. జూనియర్ అంటే నువ్వు ఒక్కడివే కదా! సారీ.. సారీ’ అంటూ ఇషాన్ మరోసారి సరదాగా వ్యాఖ్యానించాడు.Ishan Kishan with Vaibhav Sooryavanshi. 😂❤️ pic.twitter.com/hAB688xia1— Mufaddal Vohra (@mufaddal_vohra) September 11, 2026Read: ‘వైభవ్.. నువ్వు నా కెరీర్కు కూడా సాటి రాలేవు’ -
దుమ్ములేపిన ఇషాన్ కిషన్.. 13 ఏళ్ల తర్వాత మరో టైటిల్
దేశవాళీ ప్రతిష్టాత్మక ఫస్ట్ క్లాస్ టోర్నీ దులీప్ ట్రోఫీని ఈస్ట్ జోన్ జట్టు మూడోసారి సొంతం చేసుకుంది. దాదాపు పదమూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మరోసారి చాంపియన్గా అవతరించింది. కెప్టెన్గా, ఆటగాడిగా ఈ విజయంలో ఇషాన్ కిషన్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు.. సౌత్ జోన్ సారథిగా వ్యవహరించిన తిలక్ వర్మ బ్యాటర్గా రాణించినప్పటికీ.. కెప్టెన్గా మాత్రం చేదు అనుభవం ఎదుర్కొన్నాడు.𝙏𝙝𝙖𝙩 𝙒𝙞𝙣𝙣𝙞𝙣𝙜 𝙁𝙚𝙚𝙡𝙞𝙣𝙜 🏆 Congratulations to the Ishan Kishan-led East Zone on winning their third #DuleepTrophy title 👏👏#EZvSZ | @ishankishan51 pic.twitter.com/u6D4UvOTEp— BCCI Domestic (@BCCIdomestic) September 10, 2026చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఈస్ట్ జోన్- సౌత్ జోన్ జట్ల మధ్య దులిప్ ట్రోఫీ-2026 ఫైనల్ ఆదివారం మొదలైంది. టాస్ గెలిచి తొలి రెండురోజుల పాటు బ్యాటింగ్ చేసిన ఈస్ట్ జోన్ జట్టు.. మొదటి ఇన్నింగ్స్లో ఏకంగా 708 పరుగులు చేసి ఆలౌట్ అయింది.ఇషాన్ డబుల్ సెంచరీటాపార్డర్లో ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (72), వైభవ్ సూర్యవంశీ (44).. వన్డౌన్ బ్యాటర్ శిఖర్ మోహన్ (85) అదరగొట్టారు. మిడిలార్డర్లో ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ (270)తో కదం తొక్కాడు. మరోవైపు.. కుమార్ కుశాగ్రా శతక్కొట్టగా (101).. అనుకుల్ రాయ్ (45), ఎండీ కౌనియన్ ఖురేషి (40) రాణించారు.అనంతరం బ్యాటింగ్కు దిగిన సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్లో కేవలం 336 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కెప్టెన్ తిలక్ వర్మ 99 పరుగులు చేయగా.. దేవదత్ పడిక్కల్ 62 పరుగులతో రాణించాడు. మిగతా వాళ్లలో సీవీ మిలింద్ 43 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.ఈస్ట్ జోన్ బౌలర్లలో ముకేశ్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ షమీ, ఎండీ కౌనియన్ ఖురేషి, శిఖర్ మోహన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో సౌత్ జోన్ 336 పరుగులకు ఆలౌట్ కావడంతో ఈస్ట్కు తొలి ఇన్నింగ్స్లో 372 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఫాలో ఆన్ ఆడించకుండా..ఆ తర్వాత సౌత్కు ‘ఫాలోఆన్’ ఇవ్వకుండా ఈస్ట్ బుధవారమే బ్యాటింగ్కు దిగింది. వైభవ్ సూర్యవంశీ (8), ఈశ్వరన్ (3) విఫలమైనా...ఇషాన్ కిషన్, శిఖర్ మోహన్ మూడో వికెట్కు 126 పరుగులు జోడించి జట్టు ఆధిక్యాన్ని మరింత పెంచారు.ఇషాన్ 80 పరుగులు చేయగా.. శిఖర్ మోహన్ 52 పరుగులతో రాణించాడు. ఇక ఆఖరిదైన గురువారం నాటి ఐదో రోజు ఆటలో ఆల్రౌండర్ ఖురేషి అజేయ శతకం (116)తో రాణించగా.. అనుకుల్ రాయ్ హాఫ్ సెంచరీ (64) సాధించాడు. మిగిలిన వారిలో కుమార్ కుశాగ్రా 46 పరుగులు చేశాడు.మ్యాచ్ డ్రా.. ఈస్ట్దే టైటిల్ఈ క్రమంలో 388 పరుగుల వద్ద ఏడు వికెట్ల నష్టానికి ఈస్ట్ తమ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తద్వారా మొత్తంగా 760 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించింది. దీంతో ఆఖరి రోజు ఆట కాబట్టి సౌత్ జోన్ ‘డ్రా’కు అంగీకరించింది. నిబంధనల ప్రకారం తొలి ఇన్నింగ్స్లోనూ ఈస్ట్ ఆధిక్యంలో ఉన్నందున ట్రోఫీ ఈస్ట్ జోన్కే దక్కింది. ఇషాన్ కిషన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవగా.. తిలక్ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.Handshakes in the middle to conclude a fantastic Final 🤝East Zone clinch the #DuleepTrophy 2026 title by virtue of first-innings lead 🏆#EZvSZ pic.twitter.com/4DJjNHkAHD— BCCI Domestic (@BCCIdomestic) September 10, 2026 -
చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. 65 ఏళ్లలో ఒకే ఒక్కడు
చెపాక్ వేదికగా సౌత్ జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అసాధరణ ప్రదర్శన చేశాడు. తొలి ఇన్నింగ్స్లో భారీ డబుల్ సెంచరీతో కదం తొక్కిన ఇషాన్(270).. రెండో ఇన్నింగ్స్లో వన్డే తరహాలో మెరుపులు మెరిపించాడు. కేవలం 98 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 80 పరుగులు చేశాడు.ఈ భారత వికెట్ కీపర్ బ్యాటర్ మొత్తంగా రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 350 పరుగులు చేశాడు. తద్వారా 65 ఏళ్ల దులీప్ ట్రోఫీ చరిత్రలో ఒక మ్యాచ్లో 350 పరుగులు చేసిన తొలి బ్యాటర్గా కూడా కిషన్ నిలిచాడు. ఇంతకుముందు భారత మాజీ క్రికెటర్ రామణ్ లంబా చేసిన 320 పరుగులే అత్యధికంగా ఉండేది. 1987లో భిలాయ్ వేదికగా వెస్ట్ జోన్తో జరిగిన మ్యాచ్లో నార్త్ జోన్ తరపున లంబా ఈ ఫీట్ సాధించాడు. తాజా నాక్తో లంబాను అధిగమించి కిషన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.అడుగు దూరంలోఇక ఈ ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీని ఈస్ట్ జోన్ జట్టు మూడోసారి సొంతం చేసుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. సౌత్జోన్తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్కు నేడు చివరి రోజు కాగా... ప్రస్తుతం ఈస్ట్ ఓవరాల్గా 584 పరుగులు ముందంజలో ఉంది. మ్యాచ్ ‘డ్రా’ కావడం ఖాయం కాబట్టి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం అందుకున్న ఈస్ట్ విజేతగా నిలవడం లాంఛనమే. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఈస్ట్ జోన్ తమ రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లకు 212 పరుగులు చేసింది. తిలక్ వర్మ 99 అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 242/6తో బుధవారం ఆట కొనసాగించిన సౌత్జోన్ తమ మొదటి ఇన్నింగ్స్లో 336 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ తిలక్ వర్మ (99; 9 ఫోర్లు) ఒక్క పరుగు తేడాతో శతకం చేజార్చుకోగా, సీవీ మిలింద్ (43; 7 ఫోర్లు) రాణించాడు. ఈస్ట్కు తొలి ఇన్నింగ్స్లో 372 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఆ తర్వాత సౌత్కు ‘ఫాలోఆన్’ ఇవ్వకుండా ఈస్ట్ బ్యాటింగ్కు దిగింది. వైభవ్ సూర్యవంశీ (8), ఈశ్వరన్ (3) విఫలమైనా...ఇషాన్ కిషన్, శిఖర్ మోహన్ మూడో వికెట్కు 126 పరుగులు జోడించి జట్టు ఆధిక్యాన్ని మరింత పెంచారు.చదవండి: పసికూనపై సౌతాఫ్రికా ప్రతాపం.. 99 పరుగుల తేడాతో ఘన విజయం -
584 పరుగుల ఆధిక్యం.. టైటిల్కు అడుగు దూరంలో ఈస్ట్జోన్!
దులీప్ ట్రోఫీని అందుకునేందుకు ఈస్ట్జోన్ జట్టు అడుగుదూరంలో నిలిచింది. సౌత్జోన్తో జరుగుతున్న ఫైనల్లో నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి ఈస్ట్జోన్ తమ రెండో ఇన్నింగ్స్లో 51 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. కుమార్ కుషాగ్ర (34), ఖురేషీ (26) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఈస్ట్జోన్ 584 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. గురువారం ఆటకు చివరి రోజు కావడంతో ఈస్ట్జోన్ గెలుపు లాంఛనమే. ఐదోరోజు ఉదయం సెషన్లో వేగంగా బ్యాటింగ్ చేసి సౌత్జోన్ ముంగిట 650 పరుగుల లక్ష్యాన్ని టార్గెట్గా ఉంచే అవకాశముంది. ఇంత టార్గెట్ ఛేదించడం అసాధ్యం కాబట్టి మ్యాచ్ డ్రా అవనుంది. దీంతో నిబంధనల ప్రకారం తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యం సాధించిన ఈస్ట్జోన్ విజేతగా నిలవనుంది. దీంతో 13 ఏళ్ల తర్వాత దులీప్ ట్రోఫీలో ఫైనల్ చేరిన ఈస్ట్జోన్ చాంపియన్గా నిలిచేందుకు అడుగుదూరంలో ఉంది.Photo Credit: BCCI Twitterతొలి ఇన్నింగ్స్ మాదిరే రెండో ఇన్నింగ్స్ను వేగంగా ఆరంభించిన ఈస్ట్జోన్కు ఓపెనర్లు వైభవ్ (8), అభిమన్యు ఈశ్వరన్ (3) శుభారంభం అందించలేకపోయారు. అయితే మిడిలార్డర్లో శిఖర్ మోహన్ (52), కెప్టెన్ ఇషాన్ కిషన్ (80), కుమార్ కుషాగ్ర (34) రాణించడంతో ఈస్ట్జోన్ 200 పరుగుల మార్క్ను దాటింది. సౌత్జోన్ బౌలర్లలో సిరాజ్, త్రిపురానా విజయ్, నిదీష్, షేక్ రషీద్లు తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు సౌత్జోన్ తమ తొలి ఇన్నింగ్స్లో 336 పరుగులకు ఆలౌటైంది. తిలక్ వర్మ (99) సెంచరీ చేజార్చుకోగా, పడిక్కల్ (62), సీవీ మిలింద్ (43) పర్వాలేదనిపించారు. ముఖేశ్కుమార్ 3 వికెట్లు తీయగా, షమీ, ఖురేషీ, శికర్ మోహన్లు తలా 2 వికెట్లు పడగొట్టారు.MD Nidheesh breaks the partnership 👏He gets the crucial wicket of East Zone captain Ishan Kishan who played yet another superb knock of 80(98) 🙌Scorecard ▶️ https://t.co/BhTkGWeeoD#DuleepTrophy | #EZvSZ pic.twitter.com/j9C01OLgmB— BCCI Domestic (@BCCIdomestic) September 9, 2026Read: షాకింగ్.. కోహ్లిపై ఆధారపడిన పాక్ మహిళా ప్లేయర్లు! -
ఏ బౌలర్ను వదల్లేదు.. భీకర ఫామ్లో ఇషాన్ కిషన్!
టీమిండియా వికెట్ కీపర్, ఈస్ట్జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ భీకర ఫామ్లో ఉన్నాడు. సౌత్జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఇప్పటికే డబుల్ సెంచరీతో బీభత్సం సృష్టించిన ఇషాన్ కిషన్ రెండో ఇన్నింగ్స్లోనూ అదే జోరును ప్రదర్శిస్తున్నాడు. రెండో ఇన్నింగ్స్లో వన్డే తరహా బ్యాటింగ్తో అలరించిన ఇషాన్ 98 బంతుల్లో 80 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. అతడికి తోడు శిఖర్ మోహన్ (52) అర్థసెంచరీతో చెలరేగాడు. 41 ఓవర్లు ముగిసేసరికి ఈస్ట్జోన్ 5 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఈస్ట్జోన్ ఇప్పటికే 533 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది.త్రిపురానాను దంచికొట్టాడు..ఫిఫ్టీ మార్క్ సాధించిన తర్వాత త్రిపురానా వేసిన ఇన్నింగ్స్ 25వ ఓవర్లో ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించాడు. ఆ ఓవర్లో వరుసగా 4,6,6, 4 బాదడంతో పాటు సింగిల్ సహా మొత్తం 17 పరుగులు పిండుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ బాదే క్రమంలో ఏ బౌలర్ను విడిచిపెట్టని ఇషాన్ రెండో ఇన్నింగ్స్లోనూ అదే జోరును కనబరుస్తూ ప్రతీ బౌలర్ను చితక్కొడుతూ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్లో 708 పరుగులకు ఆలౌటైన ఈస్ట్జోన్, ఆ తర్వాత సౌత్జోన్ను 336 పరుగులకే కట్టడి చేసి తొలి ఇన్నింగ్స్లో 372 పరుగుల ఆధిక్యం సాధించింది. మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం ఉండడంతో నిబంధనల ప్రకారం తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన ఈస్ట్జోన్ దులీప్ ట్రోఫీ టైటిల్ అందుకోనుంది.4,6,6,4 BY ISHAN KISHAN - He smashing everyone in Duleep Trophy final 🥶 pic.twitter.com/lKPAA2awOY— Johns. (@CricCrazyJohns) September 9, 2026Read: ఆరేళ్లుగా ఎదురుచూపులు.. 50వేల టికెట్లు హాంఫట్! -
300 పరుగులు పూర్తి చేసిన ఇషాన్ కిషన్
సౌత్ జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ మరో మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 270 పరుగులు చేసిన అతడు.. రెండో ఇన్నింగ్స్లోనూ సత్తా చాటి, మ్యాచ్ మొత్తంలో 300 పరుగులు పూర్తి చేశాడు. త్రిపురణ విజయ్ బౌలింగ్లో భారీ సిక్సర్ బాది ఈ ఘనత సాధించాడు. నాలుగో రోజు టీ విరామం సమయానికి ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ (8), అభిమన్యు ఈశ్వరన్ (3) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. ఇషాన్ కిషన్ 48, శిఖర్ మోహన్ 34 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. సిరాజ్, త్రిపురణ విజయ్కు తలో వికెట్ దక్కింది.తృటిలో సెంచరీ చేజార్చుకున్న తిలక్అంతకుముందు తిలక్ వర్మ ఒంటరిపోరాటం చేయడంతో సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 336 పరుగులకు ఆలౌటైంది. తిలక్ 99 పరుగుల వద్ద ఔటయ్యాడు. తిలక్కు చామ మిలింద్ (43) సహకరించడంతో సౌత్ జోన్ 300 పరుగుల మార్కును దాటగలిగింది. దీనికి ముందు దేవ్దత్ పడిక్కల్ (62) అర్ద సెంచరీతో రాణించాడు. సౌత్ జోన్ ఇన్నింగ్స్లో పడిక్కల్, తిలక్ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. ఈస్ట్ జోన్ బౌలర్లలో ముకేశ్ కుమార్ 3, షమీ, ఖురేషి, శిఖర్ మోహన్ తలో 2 వికెట్లు తీశారు.ఇషాన్ డబుల్ ధమాకాఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 708 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇషాన్ కిషన్ ఏకంగా 270 పరుగులతో చెలరేగాడు. కుమార్ కుషాగ్రా (101) సెంచరీతో సత్తా చాటాడు. అభిమన్యు ఈశ్వరన్ (72), శిఖర్ మోహన్ (85) అర్ద సెంచరీలతో రాణించగా.. వైభవ్ సూర్యవంశీ (44), అనుకూల్ రాయ్ (45), కౌనైన్ ఖురేషి (40) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. త్రిపురణ విజయ్ 4 వికెట్లతో రాణించాడు.ఈస్ట్జోన్దే టైటిల్సౌత్జోన్ తొలి ఇన్నింగ్స్లో 336 పరుగులకు ఆలౌట్ కావడంతో ఈస్ట్జోన్కు 372 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. మ్యాచ్కు ఒకరోజు మాత్రమే మిగిలి ఉండడంతో డ్రా అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.దీంతో నిబంధనల ప్రకారం తొలి ఇన్నింగ్స్లో ఏ జట్టు ఆధిక్యంలో నిలిస్తే వారికే దులీప్ ట్రోఫీ దక్కనుంది. ఈ లెక్కన తొలి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యం సాధించిన ఈస్ట్జోన్ 13 సంవత్సరాల తర్వాత టైటిల్ అందుకోనుంది. చదవండి: సిక్కోలు కుర్రాడి మ్యాజిక్.. వైభవ్ సూర్యవంశీ మైండ్ బ్లాంక్ -
ఈస్ట్జోన్దే టైటిల్!.. చరిత్ర సృష్టించనున్న వైభవ్!
దులీప్ ట్రోఫీని ఈసారి ఈస్ట్ జోన్ గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫైనల్లో సౌత్జోన్ తమ తొలి ఇన్నింగ్స్లో 336 పరుగులకు ఆలౌట్ కావడంతో ఈస్ట్జోన్కు 372 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. మ్యాచ్కు ఒకరోజు మాత్రమే మిగిలి ఉండడంతో డ్రా అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దీంతో నిబంధనల ప్రకారం తొలి ఇన్నింగ్స్లో ఏ జట్టు ఆధిక్యంలో నిలిస్తే వారికే దులీప్ ట్రోఫీ దక్కనుంది. ఈ లెక్కన తొలి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యం సాధించిన ఈస్ట్జోన్ 13 సంవత్సరాల తర్వాత టైటిల్ అందుకోనుంది. ఇదే సమయంలో జట్టులో సభ్యుడిగా ఉన్న వైభవ్ సూర్యవంశీ కూడా చరిత్ర సృష్టించనున్నాడు. వైభవ్ సూర్యవంశీ వయసు 15 ఏళ్లు కావడంతో, అత్యంత పిన్న వయస్సులో దులీప్ ట్రోఫీ నెగ్గిన జట్టలోని ఆటగాడిగా రికార్డులకెక్కనున్నాడు. ఇప్పటికే టోర్నీలో సెమీఫైనల్లో హాఫ్ సెంచరీ సాధించి అత్యంత పిన్నవయస్కుడిగా నిలిచిన వైభవ్, కప్ను ఈస్ట్జోన్ సొంతం చేసుకుంటే మాత్రం పైన చెప్పుకున్న ఘనత కూడా వైభవ్ ఖాతాలో చేరనుంది.డ్యాన్స్ చేసిన వైభవ్..ఇక మ్యాచ్లో సౌత్జోన్ ఇన్నింగ్స్ సందర్భంగా త్రిపురానా విజయ్ వికెట్ పడినప్పుడు వైభవ్ సూర్యవంశీ డ్యాన్స్ మూమెంట్ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 708 పరుగులు చేసిన ఈస్ట్జోన్కు పోటీ ఇచ్చే క్రమంలో సౌత్జోన్ తరఫున ఆ జట్టు కెప్టెన్ తిలక్ వర్మతో పాటు దేవదత్ పడిక్కల్, సీవీ మిలింద్ కాస్త ప్రతిఘటించారు. తాను ఒక ఎండ్లో పాతుకుపోయినప్పటికీ, మరో ఎండ్లో మాత్రం వరుసగా వికెట్లు పడడంతో వైభవ్ ఉబ్బితబ్బియయ్యాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన త్రిపురానా విజయ్ కెప్టెన్తో ఏర్పడిన సయన్వయ లోపంతో రనౌట్గా వెనుదిరిగాడు. ఖురేషీ వేసిన ఆఫ్స్టంప్ బంతిని తిలక్ వర్మ కట్షాట్ ఆడాడు. తనవైపు వచ్చిన బంతిని అభిజిత్ సర్కార్ వేగంగా అందుకొని అంతే వేగంతో వికెట్ కీపర్ ఇషాన్ వైపు విసిరాడు. అప్పటికే తిలక్ సింగిల్ తీయాలా వద్దా అనే డైలమాలోనే ముందుకు పరిగెత్తాడు. దీంతో కాస్త లేటుగా రనప్ అందుకున్న త్రిపురానా విజయ్ స్ట్రైక్ ఎండ్కు చేరేలోపే ఇషాన్ వికెట్లను గిరాటేయడంతో అతడు రనౌట్ అయ్యాడు. విజయానికి చేరువ కావడంతో సంతోషం పట్టలేని వైభవ్ చిన్న డ్యాన్స్ మూమెంట్ ఇవ్వడం కెమెరాలకు చిక్కింది. ఇక తొలి ఇన్నింగ్స్లో ఈస్ట్జోన్ 708 పరుగులకు ఆలౌటైంది. ఇషాన్ కిషన్ (270) డబుల్ సెంచరీ సాధించగా, కుమార్ కుషాగ్ర (101) సెంచరీ చేశాడు. అభిమన్యు ఈశ్వరన్ (72), శిఖర్ మోహన్ (85) అర్థసెంచరీలు సాధించారు. సౌత్జోన్ బౌలర్లలో త్రిపురానా విజయ్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం సౌత్జోన్ 107.3 ఓవర్లలో 336 పరుగులకు ఆలౌటైంది. తిలక్ వర్మ (99) ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్ చేసుకోగా, పడిక్కల్ (62) అర్థసెంచరీ సాధించాడు. ఈస్ట్జోన్ బౌలర్లలో ముకేశ్ కుమార్ మూడు వికెట్లు తీయగా, షమీ, ఖురేషి, శిఖర్ మోహన్ తలా 2 వికెట్లు పడగొట్టారు.Excellent reflex catch and run out ⚡️Top-fielding efforts bring wickets for East Zone 👌South Zone are 322/8 Scorecard ▶️ https://t.co/BhTkGWeeoD#DuleepTrophy | #EZvSZ pic.twitter.com/FKDmQcDYG3— BCCI Domestic (@BCCIdomestic) September 9, 2026Read: ‘పూటుగా తాగి పీడకలనుకొని మరిచిపోతా’ -
708 పరుగులు.. అయినా నో డిక్లరేషన్.. తెలివిలేదా?
దులిప్ ట్రోఫీ-2026 ఫైనల్లో ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో అతి భారీ స్కోరు సాధించింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సౌత్ జోన్తో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక టైటిల్ పోరులో.. ఇషాన్ కిషన్ సేన సమిష్టిగా రాణించింది.ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (72), వైభవ్ సూర్యవంశీ (44) శుభారంభం అందిస్తే.. వన్డౌన్ బ్యాటర్ శిఖర్ మోహన్ (85) భారీ స్కోరు దిశగా పునాది వేశాడు. నాలుగో స్థానంలో వచ్చిన సుదీప్ కుమార్ ఘరామీ (6) విఫలమైనప్పటికీ.. కెప్టెన్ ఇషాన్ కిషన్ మాత్రం పట్టుదలగా ముందుకు సాగాడు.270 పరుగులుఈ క్రమంలో ద్విశతకం పూర్తి చేసుకున్న తర్వాత ఇషాన్ కిషన్ రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగినప్పటికీ.. ఆఖర్లో మళ్లీ బ్యాటింగ్కు వచ్చాడు. మొత్తంగా 334 బంతులు ఎదుర్కొన్న లెఫ్టాండర్ బ్యాటర్.. 30 ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 270 పరుగులు సాధించాడు. ఇషాన్కు తోడుగా కుమార్ కుశాగ్రా శతకం (101)తో చెలరేగాడు.I.C.Y.M.I2️⃣7️⃣0️⃣ runs3️⃣3️⃣4️⃣ balls3️⃣0️⃣ fours7️⃣ sixes8️⃣0️⃣.8️⃣3️⃣ SRWatch 🎥 highlights of Ishan Kishan's marathon knock 👌👌Scorecard ▶️ https://t.co/BhTkGWeeoD#DuleepTrophy | #EZvSZ pic.twitter.com/An6sT09tfu— BCCI Domestic (@BCCIdomestic) September 8, 2026708 పరుగులు చేసి ఆలౌట్మిగిలిన వారిలో అనుకూల్ రాయ్ (45) ఎండీ కౌనేన్ ఖురేషి (40) రాణించగా.. టెయిలెండర్ మహ్మద్ షమీ 28 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఈస్ట్ జోన్ ఈ మేరకు సమిష్టిగా రాణించి రెండు రోజులు పూర్తి స్థాయిలో బ్యాటింగ్ చేసింది. మొత్తంగా మొదటి ఇన్నింగ్స్లో ఈస్ట్ జోన్ 163 ఓవర్లు ఆడి 708 పరుగులు చేసి ఆలౌట్ అయింది.తెలివిలేదా?.. నిజానికి రెడ్బాల్ మ్యాచ్లో ఫలితం తేలాలంటే.. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు ఈ స్థాయి భారీ స్కోరు సాధించడం కంటే.. కాస్త ముందుగానే డిక్లేర్ చేసి.. ఫలితం సాధించే దిశగా ముందుకు వెళ్తుంది. కానీ ఇషాన్ కిషన్ మాత్రం జట్టు ఆలౌట్ అయ్యేంత వరకు బ్యాటింగ్ చేయించాడు. ఇందుకు రెండు రోజులు తీసుకున్నాడు.నిబంధనల ప్రకారమే తెలివిగానిజానికి ఇలా చేయడం ద్వారా మ్యాచ్ డ్రా అవుతుందే తప్ప ఫలితం తేలదు. అయినా ఇషాన్ ఎందుకిలా చేశాడు?.. ఇషాన్ మాత్రమే కాదు.. ఆ స్థానంలో ఏ కెప్టెన్ ఉన్నా ఇలాగే చేస్తాడు. ఎందుకంటే.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రెడ్బాల్ క్రికెట్ నిబంధనల ప్రకారం..రంజీ ట్రోఫీ, దులిప్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మక టోర్నీల్లో ఫైనల్ మ్యాచ్ కోసం టెస్టు మాదిరే ఐదు రోజులు కేటాయిస్తారు. అయితే, ఒకవేళ మ్యాచ్ డ్రా అయితే గనుక తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యంలో ఉన్న జట్టును విజేతగా ప్రకటిస్తారు. అందుకే ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు చేసేందుకే మొగ్గుచూపింది.336 పరుగులకే ఆలౌట్.. ఈస్ట్ జోన్ గెలుపు లాంఛనమేఇక సౌత్ జోన్ తమ తొలి ఇన్నింగ్స్లో 709 పరుగులు చేస్తేనే మ్యాచ్పై ఆశలు సజీవంగా ఉంటాయి. కానీ తిలక్ వర్మ కెప్టెన్సీలోని సౌత్ జోన్ ఈ విషయంలో దారుణంగా విఫలమైంది. బుధవారం నాటి నాలుగో రోజు ఆట సందర్భంగా తొలి ఇన్నింగ్స్లో కేవలం 336 పరుగులు చేసి ఆలౌట్ అయింది.ఫలితంగా ఈస్ట్ జోన్కు 372 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇక బుధవారం ఇంకా రెండు సెషన్ల ఆట మిగిలి ఉండగా.. గురువారం ఒక్కరోజు మిగిలి ఉంది. ఇలాంటి సమయంలో ఈస్ట్ జోన్ ఫాలో ఆన్ ఆడించకుండా డ్రా చేసుకునేందుకే మొగ్గుచూపే అవకాశం ఉంది. కాబట్టి దులిప్ ట్రోఫీ-2026 విజేతగా ఈస్ట్ జోన్ గెలుపు లాంఛనమే అని చెప్పవచ్చు.చదవండి: టీమిండియా సెమీస్ ప్రత్యర్థి ఎవరంటే? -
పాపం తిలక్ వర్మ.. ఒక్క పరుగు చేసి ఉంటే?
ఈస్ట్ జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. తిలక్ వర్మ సారథ్యంలోని సౌత్జోన్ జట్టు తమ మొదటి ఇన్నింగ్స్లో 336 పరుగులకు ఆలౌటైంది. ప్రత్యర్థి విధించిన ఫాలో-ఆన్ మార్కును సౌత్జోన్ అందుకోలేకపోయింది. ఫాలో-ఆన్కు 173 పరుగుల దూరంలోనే నిలిచిపోయింది. దీంతో తొలి ఇన్నింగ్స్లో ఈస్ట్జోన్ జట్టుకు 372 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.పాపం తిలక్ వర్మఈ తుది పోరులో సౌత్జోన్ కెప్టెన్ తిలక్ వర్మ విరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. ఒకవైపు సహచర బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కడుతున్నా.. తిలక్ మాత్రం బాధ్యతాయుతమైన నాక్తో జట్టును ముందుకు నడిపించాడు. అయితే దురదృష్టవశాత్తూ తిలక్ తన 9వ ఫస్ట్క్లాస్ సెంచరీకి అడుగు దూరంలో నిలిచిపోయాడు. ఈ హైదరాబాదీ 99 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కౌనైన్ ఖురైషీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.అతడితో పాటు దేవ్దత్త్ పడిక్కల్(62), సీవీ మిలింద్(43), జగదీశన్(32) రాణించారు. ఈస్ట్జోన్ బౌలర్లలో ముఖేష్ కుమార్ మూడు, ఖురేషీ, మహ్మద్ షమీ, శిఖర్ మోహన్ తలా రెండు వికెట్లు చొప్పున పడగొట్టారు.అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఈస్ట్జోన్ తమ తొలి ఇన్నింగ్స్లో 708 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కెప్టెన్ ఇషాన్ కిషన్(270) భారీ డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. కాగా ఫస్ట్క్లాస్ క్రికెట్ నిబంధనల ప్రకారం.. మ్యాచ్ డ్రా అయితే ఏ జట్టుకు అయితే తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యం లభిస్తుందో ఆ టీమ్నే విజేతగా నిర్ణయిస్తారు.చదవండి: వెస్టిండీస్తో సిరీస్.. టీమిండియాలోకి ఆర్సీబీ కెప్టెన్? -
షమీకి వార్నింగ్
టీమిండియా వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీకి అంపైర్ వార్నింగ్ ఇచ్చారు. సౌత్ జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో బంతి స్థితిని మార్చే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానంతో షమీతో పాటు ఈస్ట్ జోన్ ఆటగాళ్లందరినీ అంపైర్ హెచ్చరించారు.మ్యాచ్ మూడో రోజు చివరి సెషన్లో (60వ ఓవర్) ఫీల్డ్ అంపైర్ వీరేందర్ శర్మ బంతిని పరిశీలించారు. బంతిని మెరిపించేందుకు ఆటగాళ్లు (ఈస్ట్ జోన్) అతిగా చెమటను ఉపయోగించవద్దని సూచించారు. నిబంధనల ప్రకారం బంతి స్వభావాన్ని ఉద్దేశపూర్వకంగా మార్చడం నిషేధం.కాగా, ఈస్ట్ జోన్ బౌలర్లు పాత బంతితోనూ రివర్స్ స్వింగ్ రాబట్టి సౌత్ జోన్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. ముఖ్యంగా షమీ (2-17), ముకేశ్ కుమార్ (2-36) అద్బుతంగా బౌలింగ్ చేసి సౌత్ జోన్ను కష్టాల్లోకి నెట్టారు. వీరి ధాటికి సౌత్ జోన్ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 242 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. ఆ జట్టు ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 466 పరుగులు వెనుకపడి ఉంది. సౌత్ జోన్ను కెప్టెన్ తిలక్ వర్మ (56 నాటౌట్) గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు.అంతకుముందు ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 708 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇషాన్ కిషన్ ఏకంగా 270 పరుగులతో చెలరేగాడు. కుమార్ కుషాగ్రా (101) సెంచరీతో సత్తా చాటాడు. అభిమన్యు ఈశ్వరన్ (72), శిఖర్ మోహన్ (85) అర్ద సెంచరీలతో రాణించగా.. వైభవ్ సూర్యవంశీ (44), అనుకూల్ రాయ్ (45), కౌనైన్ ఖురేషి (40) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. త్రిపురణ విజయ్ 4 వికెట్లతో రాణించాడు.చదవండి: నిప్పులు చెరిగిన షమీ.. సౌత్జోన్ కకావికలం -
పోరాడుతున్న తిలక్ వర్మ
ఈస్ట్ జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో సౌత్ జోన్ జట్టు కష్టాల్లో కూరుకుపోయింది. ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 708 పరుగుల అతి భారీ స్కోర్ చేయగా.. సౌత్ జోన్ తమ తొలి ఇన్నింగ్స్లో 242 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఎదురీదుతుంది (మూడో రోజు ఆట ముగిసే సమయానికి). ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఆ జట్టు ఇంకా 466 పరుగులు వెనుకపడి ఉంది.129 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సౌత్ జోన్ను తిలక్ ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. స్మరణ్ రవిచంద్రన్తో కలిసి ఐదో వికెట్కు 45 పరుగులు, శ్రేయస్ గోపాల్తో కలిసి ఆరో వికెట్కు 66 పరుగులు జోడించాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి తిలక్ 56, చామ మిలింద్ 2 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.సౌత్ జోన్ ఇన్నింగ్స్లో దేవ్దత్ పడిక్కల్ (62) అర్ద సెంచరీతో రాణించగా.. రికీ భుయ్ 1, నారాయణ్ జగదీశన్ 32, షేక్ రషీద్ 27, స్మరణ్ రవిచంద్రన్ 23, శ్రేయస్ గోపాల్ 26 పరుగులు చేసి ఔటయ్యారు. ఈస్ట్ జోన్ బౌలర్లలో షమీ, ముకేశ్ కుమార్ తలో 2 వికెట్లు తీయగా.. శిఖర్ మోహన్, ఖురేషి చెరో వికెట్ దక్కించుకున్నారు.అంతకుముందు ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 708 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇషాన్ కిషన్ ఏకంగా 270 పరుగులతో చెలరేగాడు. కుమార్ కుషాగ్రా (101) సెంచరీతో సత్తా చాటాడు. అభిమన్యు ఈశ్వరన్ (72), శిఖర్ మోహన్ (85) అర్ద సెంచరీలతో రాణించగా.. వైభవ్ సూర్యవంశీ (44), అనుకూల్ రాయ్ (45), కౌనైన్ ఖురేషి (40) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. త్రిపురణ విజయ్ 4 వికెట్లతో రాణించాడు.చదవండి: పాక్తో కయ్యానికి కాలు దువ్విన ఆఫ్గన్ క్రికెట్ బోర్డు! -
నిప్పులు చెరిగిన షమీ.. సౌత్జోన్ కకావికలం
దులీప్ ట్రోఫీలో ఈస్ట్జోన్ తరఫున ఆడుతున్న టీమిండియా పేసర్ మహ్మద్ షమీ సౌత్జోన్తో ఫైనల్లోనూ చెలరేగుతున్నాడు. సెమీఫైనల్లో ఐదు వికెట్లు తీసిన షమీ ఫైనల్లో బంతులో నిప్పులు చెరిగాడు. 11 ఓవర్లు వేసిన షమీ 4 మెయిడెన్లు సహా 17 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. ముఖేశ్ కుమార్ కంటే తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేసిన షమీని ఎదుర్కోవడంలో సౌత్జోన్ బ్యాటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం సౌత్జోన్ జట్టు 69 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. కెప్టెన్ తిలక్ వర్మ (37), శ్రేయస్ గోపాల్ (13) క్రీజులో ఉన్నారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఈస్ట్జోన్ జట్టు 163 ఓవర్లలో 708 పరుగులకు ఆలౌటైంది. ఇషాన్ కిషన్ (270) డబుల్ సెంచరీతో మెరవగా, కుమార్ కుశాగ్ర (101) సెంచరీతో రాణించగా, అభిమన్యు ఈశ్వరన్ (72), శిఖర్ మోహన్ (85) అర్థశతకాలతో రాణించారు. త్రిపురణ విజయ్ నాలుగు వికెట్లతో మెరిశాడు.ఇటీవలే షమీ ఫస్ట్క్లాస్ క్రికెట్లో 900 వికెట్ల మార్క్ను అందుకున్న సంగతి తెలిసిందే. 2023 వన్డే ప్రపంచకప్లో టోర్నీ లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచిన మహ్మద్ షమీ భారత్ తరఫున చివరిసారిగా 2025 చాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు.చదవండి: చరిత్రలో తొలిసారి.. ఒకే జట్టుకు ఆడనున్న మెస్సీ, రొనాల్డో! -
వారెవ్వా వైభవ్ సూర్యవంశీ!.. ఇషాన్ను ఒప్పించి మరీ!
టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. విమర్శించిన వాళ్లకు ఆటతో పాటు నాయకత్వ నైపుణ్యాలతోనూ అదిరిపోయేలా కౌంటర్ ఇస్తున్నాడంటూ కొనియాడుతున్నారు. కాగా రెడ్బాల్ క్రికెట్లో అంతగా అనుభవం లేనప్పటికీ పదిహేనేళ్ల వైభవ్కు బీసీసీఐ కీలక బాధ్యతను అప్పగించిన సంగతి తెలిసిందే.అపుడే వైస్ కెప్టెన్గానా?ప్రతిష్టాత్మక దులిప్ ట్రోఫీ-2026 టోర్నీలో ఈస్ట్ జోన్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న ఇషాన్ కిషన్కు వైభవ్ను డిప్యూటీగా నియమించింది. దీంతో చిన్న వయసులోనే, అనుభవం లేని వైభవ్ సూర్యవంశీని వైస్ కెప్టెన్గా ఎలా నియమిస్తారని భారత మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు.అయితే, వైభవ్ అటు ఆటగాడిగా రాణిస్తూనే.. తన నాయకుడిగానూ తానేం తక్కువ కాదని నిరూపిస్తున్నాడు. సెంట్రల్ జోన్తో సెమీ ఫైనల్లో ఇషాన్ గైర్హాజరీలో వైభవ్ ఒకరోజు మొత్తం కెప్టెన్గా వ్యవహరించాడు. ఈ మ్యాచ్లో ఈస్ట్ జోన్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్కు చేరింది.708 పరుగులకు ఆలౌట్ఇక టైటిల్ పోరులో ఈస్ట్ జోన్ సౌత్ జోన్తో తలపడుతోంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆదివారం మొదలైన ఈ మ్యాచ్లో.. ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో ఏకంగా 708 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఈ క్రమంలో మంగళవారం నాటి మూడో రోజు ఆట సందర్భంగా సౌత్ జోన్ తమ బ్యాటింగ్ మొదలుపెట్టింది.సందిగ్దంలో జట్టుఈ నేపథ్యంలో ఆరో ఓవర్లో ఈస్ట్ జోన్ పేసర్ ముకేశ్ కుమార్ వేసిన రెండో బంతిని సౌత్ జోన్ ఓపెనర్ రికీ భుయ్ బౌండరీ దిశగా తరలించే ప్రయత్నం చేశాడు. అయితే, లెంగ్త్ను తప్పుగా అంచనా వేసిన రికీ షాట్ ఆడటంలో విఫలం కాగా.. వికెట్ కీపర్ కుమార్ కుశాగ్రా బంతిని క్యాచ్ పట్టి.. అప్పీలు చేశాడు.ఇషాన్ను ఒప్పించిన వైభవ్అయితే, ఫీల్డ్ అంపైర్ మాత్రం నాటౌట్ ఇచ్చాడు. దీంతో రివ్యూకు వెళ్లాలా? వద్దా? అన్న సందేహంలో ఉన్న కెప్టెన్ ఇషాన్ కిషన్ దగ్గరికి వెళ్లిన వైభవ్ సూర్యవంశీ.. ‘రివ్యూ తీసుకో.. పర్లేదు’ అంటూ సలహా ఇచ్చాడు. కానీ మిగతా ఆటగాళ్లు మాత్రం బంతి ముందుగా బ్యాట్ను తాకిందా? లేదంటే ప్యాడ్కు తాకిందా? అనే సందేహంలో ఉన్నారు.అయితే, ఇషాన్ కిషన్ వైభవ్ మాట మీద నమ్మకంతో రివ్యూకు వెళ్లగా.. రికీ భుయ్ అవుటైనట్లు తేలింది. దీంతో ఈస్ట్ జోన్ సంబరాలు అంబరాన్నంటాయి. వైభవ్ సూర్యవంశీని ఇషాన్, ముకేశ్తో పాటు మిగతా జట్టు సభ్యులందరూ అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా దులిప్ ట్రోఫీ ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ తొలి ఇన్నింగ్స్లో 37 బంతులు ఎదుర్కొని 44 పరుగులు చేశాడు.చదవండి: IND vs AUS: భారత జట్టులో మార్పులు🗣️ Take it...take itVaibhav Sooryavanshi 🤝 ReviewThe vice-captain urges the captain to take the review, and it turns out to be successful 🙌Scorecard ▶️ https://t.co/BhTkGWeeoD#DuleepTrophy | #EZvSZ pic.twitter.com/MmtESDSnMy— BCCI Domestic (@BCCIdomestic) September 8, 2026 -
చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. ఈస్ట్ జోన్ అతి భారీ స్కోరు
సౌత్ జోన్తో జరుగుతున్న దులిప్ ట్రోఫీ-2026 ఫైనల్లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. చెన్నై వేదికగా ఈ వికెట్ కీపర్ బ్యాటర్ భారీ డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా టైటిల్ పోరులో ఈస్ట్ జోన్ 708 పరుగుల మేర అతి భారీ స్కోరు సాధించింది. An innings of pure class 👌Watch 🎥 snippets of Ishan Kishan's fantastic double century so far 💯💯Scorecard ▶️ https://t.co/KQf5Km69nk#DuleepTrophy | #SZvEZ | @ishankishan51 pic.twitter.com/jOndIaA5Uo— BCCI Domestic (@BCCIdomestic) September 7, 2026ఈస్ట్ జోన్- సౌత్ జోన్ జట్ల మధ్య దేశవాళీ ప్రతిష్టాత్మక రెడ్బాల్ టోర్నీ దులిప్ ట్రోఫీ ఫైనల్ ఆదివారం మొదలైంది. చెపాక్ స్టేడియంలో టాస్ గెలిచిన ఈస్ట్ జోన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో సోమవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా తొలి ఇన్నింగ్స్లో 708 పరుగులు చేసి ఆలౌట్ అయింది. టాపార్డర్ సూపర్ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (72), వైభవ్ సూర్యవంశీ (44) శుభారంభం అందించగా.. వన్డౌన్ బ్యాటర్ శిఖర్ మోహన్ భారీ అర్ధ శతకం (85)తో ఆకట్టుకున్నాడు. అయితే, నాలుగో స్థానంలో వచ్చిన సుదీప్ కుమార్ ఘరామీ (6) మాత్రం విఫలమయ్యాడు. ఈ క్రమంలో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇషాన్ డబుల్ సెంచరీసౌత్ జోన్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిన ఇషాన్.. డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత గాయపడి మైదానం వీడాడు. అయితే, జట్టుకు అవసరమైన మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. మొత్తంగా 334 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 30 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 270 పరుగులు సాధించాడు. శతక్కొట్టిన కుశాగ్రాట్రిపుల్ సెంచరీ దిశగా పయనిస్తున్న వేళ త్రిపురాన విజయ్ బౌలింగ్లో స్మరణ్ రవిచంద్రన్కు క్యాచ్ ఇవ్వడంతో ఇషాన్ కిషన్ మారథాన్ ఇన్నింగ్స్కు తెరపడింది. మిగిలిన వారిలో కుమార్ కుశాగ్రా శతక్కొట్టగా (101), అనుకూల్ రాయ్ (45), ఎండీ కొనియన్ ఖురేషి (40) రాణించారు. టెయిలెండర్లలో మహ్మద్ షమీ 28 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. ముకేశ్ కుమార్ డకౌట్ అయ్యాడు. సౌత్ జోన్ బౌలర్లలో త్రిపురాణ విజయ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. చామా మిలింద్, శ్రేయస్ గోపాల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. షేక్ రషీద్కు ఒక వికెట్ దక్కింది.చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్దులిప్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన వికెట్ కీపర్ బ్యాటర్గా ఇషాన్ కిషన్ రికార్డు సాధించాడు. గతంలో ఈ రికార్డు నమన్ ఓజా పేరిట ఉండేది. సెంట్రల్ జోన్ తరఫున 2014లో నార్త్ జోన్తో మ్యాచ్ సందర్భంగా అతడు 217 పరుగులు స్కోరు చేశాడు. తాజాగా ఇషాన్ 270 పరుగులు సాధించి నమన్ ఓజాను అధిగమించాడు.చదవండి: షఫాలీ పట్ల దురుసు ప్రవర్తన.. మూల్యం చెల్లించిన పాక్ కెప్టెన్! -
రెస్ట్ తీసుకోమన్నా వినలేదు; నొప్పిని భరిస్తూనే డబుల్ సెంచరీ
చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. ఇషాన్ 128 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నప్పుడు నిదీశ్ వేసిన బంతి పొత్తి కడుపు కింద భాగంలో బలంగా తాకింది. బంతి బలంగా తాకడంతో నొప్పితో విలవిల్లాడిపోయిన ఇషాన్ స్క్వేర్ లెగ్ రీజియన్ దిశగా పరిగెత్తి అక్కడే కూర్చుండిపోయాడు. ఫిజియో వచ్చి ఇషాన్ గాయాన్ని పర్యవేక్షించాడు. అదే సమయంలో ఫిజియోతో వచ్చిన డాక్టర్ ‘రెస్ట్ తీసుకో’ అని సలహా ఇచ్చాడు. కానీ ఇషాన్ మాత్రం తాను బ్యాటింగ్ కంటిన్యూ చేస్తానని చెప్పాడు. ఆ తర్వాత నొప్పిని భరిస్తూనే బ్యాటింగ్ చేసిన ఇషాన్ డబుల్ సెంచరీ మార్క్ కూడా అందుకున్నాడు. 270 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించిన మరో 30 బంతుల్లో 250 మార్క్ను చేరుకున్నాడు. ఆ తర్వాత నొప్పి తిరగబెట్టడంతో ఇషాన్ చాలా ఇబ్బంది పడ్డాడు. ఫిజియో వచ్చి ఇషాన్తో మాట్లాడాడు. ఆ వెంటనే ఇషాన్ కిషన్ రిటైర్డ్ హర్ట్గా మైదానం వీడాడు. మరి మిగతా మ్యాచ్కు ఇషాన్ కిషన్ అందుబాటులో ఉంటాడా? ఉండడా అనే ప్రశ్న అభిమానులను తొలిచేస్తుంది. ఏది ఏమైనా డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పినా వినకుండా పట్టువదలని విక్రమార్కుడిలా ఇషాన్ బ్యాటింగ్ కొనసాగించి అందరి మన్ననలు పొందాడు.అయితే స్కోరు కార్డుపై మాత్రం ఇషాన్ రిటైర్డ్ హర్ట్ అయినట్లు ప్రదర్శించడంతో అతడు మళ్లీ బ్యాటింగ్కు వచ్చే అవకాశముంది. ఇప్పటికే ఈస్ట్జోన్ 650 పరుగుల మార్క్ను దాటడంతో తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసే అవకాశం లేకపోలేదు. 13 ఏళ్ల తర్వాత ఈస్ట్ జోన్ దులీప్ ట్రోఫీ ఫైనల్కు చేరడం గమనార్హం. ఇషాన్ కిషన్ కెప్టెన్సీలో ఈస్ట్జోన్ తాజాగా టైటిల్ గెలుచుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఈస్ట్జోన్ 650 పరుగుల మార్క్ను దాటడంతో సౌత్జోన్ అంత స్కోరు చేయాలన్నా రెండు రోజులు పడుతుంది. ఇప్పటికే రెండు రోజుల ఆట ముగియడం, మరో మూడు రోజులు ఉండడంతో మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ లెక్కన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా ఈస్ట్ జోన్ ఛాంపియన్గా నిలిచే అవకాశం ఉంది.Ishan Kishan brings up his 2️⃣0️⃣0️⃣ in style 💯💯 🙌What a magnificent knock from the East Zone captain so far 👏👏Scorecard ▶️ https://t.co/KQf5Km69nk#DuleepTrophy | #SZvEZ pic.twitter.com/2NaE6qG4VK— BCCI Domestic (@BCCIdomestic) September 7, 2026Doctor: rest loIshan: century laga deta hu 💀🙏Ishan Kishan during a Duleep Trophy match, sarcastically noting an apparent injury with "oops🤕" before adding he recovered quickly and is batting well. pic.twitter.com/5eZraPJVix— CricketIndian_🚩🇮🇳 (@CricketIndian_) September 7, 2026 That moment when Ishan Kishan reached 2️⃣5️⃣0️⃣ 👏👏Scorecard ▶️ https://t.co/KQf5Km69nk#DuleepTrophy | #SZvEZ pic.twitter.com/6YJYiwNtjV— BCCI Domestic (@BCCIdomestic) September 7, 2026చదవండి: భారత్తో టీ20 సిరీస్ ముంగిట చెలరేగిన ఆఫ్గన్ బౌలర్ -
ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ.. 26 ఫోర్లు, 2 సిక్స్లతో
చెపాక్ స్టేడియం వేదికగా సౌత్జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుతమైన డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. ఈ భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ 270 బంతుల్లో తన రెండో ఫస్ట్క్లాస్ డబుల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్లో 26 ఫోర్లు, 2 సిక్స్లు ఉన్నాయి. ఫస్ట్క్లాస్ క్రికెట్లో కిషన్ అత్యధిక స్కోర్ 273గా ఉంది. రంజీ ట్రోఫీ (2016–17) మ్యాచ్లో ఢిల్లీ జట్టుపై ఢిల్లీపై అతడు ఈ స్కోర్ సాధించాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ఈస్ట్జోన్ జట్టు తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది.122 ఓవర్లు ముగిసే సరికి ఈస్ట్జోన్ 5 వికెట్ల నష్టానికి 555 పరుగుల భారీ స్కోర్ సాధించింది. క్రీజులో కిషన్(204)తో పాటు అనుకుల్ రాయ్(30) ఉన్నాడు. సౌత్ జోన్ బౌలర్లు ప్రత్యర్ధి బ్యాటర్లను ఔట్ చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.కాగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్కు దిగిన ఈస్ట్జోన్కు ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (72), వైభవ్ సూర్యవంశీ (44) శుభారంభం అందించారు. అనంతరం ఫస్ట్ డౌన్ బ్యాటర్ శిఖర్ మోహన్(85) హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఈ క్రమంలో ఐదో స్ధానంలో బ్యాటింగ్ వచ్చిన ఇషాన్ కిషన్.. తనదైన శైలిలో మైదానం నలుమూలలా షాట్లు ఆడుతూ అభిమానులను అలరించాడు. కుమార్ కుషాగ్ర (101)తో కలిసి ఐదో వికెట్కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రెండో రోజు ఆటలో కుషాగ్ర ఔటైనప్పటికి కిషన్ మాత్రం తన జోరును కొనసాగిస్తున్నాడు.చదవండి: స్మృతి మంధానపై భారత మాజీ క్రికెటర్ విమర్శలు -
'అందని ద్రాక్ష పుల్లన'.. అతడి విషయంలో నిజమైంది!
దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్జోన్ జట్టు తరఫున ఆడుతున్న 31 ఏళ్ల అభిమన్యు ఈశ్వరన్ ఫస్ట్క్లాస్ క్రికెట్లో చాలా సీనియర్ ఆటగాడు. 2019 దులీప్ ట్రోఫీ ఫైనల్లో సెంచరీ బాది వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత ఇండియా-ఏ జట్టుకు కూడా ఎంపికయ్యాడు. ఆ తర్వాత ఫస్ట్క్లాస్ క్రికెట్లో స్థిరమైన ప్రదర్శన కనబరిచినప్పటికీ ఇండియా-ఏ తరఫున మాత్రం పెద్దగా రాణించలేదు. దేశవాళీ టోర్నీలో ప్రదర్శన ఆధారంగా 2021 జనవరిలో అభిమన్యు ఈశ్వరన్ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. టీమిండియా టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ తుది జట్టులో మాత్రం స్థానం లభించలేదు. అలా 2021 నుంచి 2026 దాకా టెస్టుల్లో అరంగేట్రం కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తూనే వస్తున్నాడు అభిమన్యు ఈశ్వరన్. ఇక్కడ మరో విచిత్రమైన విషయమేంటంటే.. అభిమన్యు ఈశ్వరన్ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికైన 2021 నుంచి అతడి కళ్ల ముందే 11 మంది ఆటగాళ్లు టెస్టుల్లో అరంగేట్రం చేయడం గమనార్హం. ఒక రకంగా అభిమన్యు ఈశ్వరన్ టాలెంట్ను తొక్కసినట్లేననిపిస్తోంది. ఇప్పటివరకు అభిమన్యు ఈశ్వరన్ ఫస్ట్క్లాస్ క్రికెట్లో 197 ఇన్నింగ్స్ల్లో 8,545 పరుగులు సాధించాడు. ఇందులో 38 అర్థసెంచరీలు, 27 సెంచరీలు ఉన్నాయి. అందని ద్రాక్ష పుల్లన అంటే ఇదేనేమో!చెన్నై వేదికగా జరుగుతున్న తాజా దులీప్ ట్రోఫీ ఫైనల్లోనూ ఈస్ట్జోన్కు ఆడుతున్న అభిమన్యు ఈశ్వరన్ మరోసారి ఆకట్టుకున్నాడు. 120 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 85 పరుగులు సాధించాడు. ప్రస్తుతం తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఈస్ట్జోన్ జట్టు 79 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (111 నాటౌట్), కుమార్ కుషాగ్ర (63 నాటౌట్) క్రీజులో ఉన్నారు.Meet Abhimanyu Easwaran 🥲>31-year-old Abhimanyu Easwaran was born in Dehradun, Uttarakhand.>At the age of 10, he moved to Kolkata and started his cricket journey.>In the 2019 Duleep Trophy final, he smashed a brilliant century.>After that, he was named in the India A squad.… pic.twitter.com/ryHD2qxmTn— Sam (@cricsam02) September 6, 2026చదవండి: సెంచరీతో ఇరగదీసిన ఇషాన్ కిషన్.. తొలిరోజు ఈస్ట్జోన్దే -
సెంచరీతో ఇరగదీసిన ఇషాన్ కిషన్.. తొలిరోజు ఈస్ట్జోన్దే
చెన్నై చిదంరం స్టేడియం వేదికగా జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్జోన్ తొలిరోజే స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. ఈస్ట్జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అజేయ సెంచరీతో కదం తొక్కడంతో ఆ జట్టు భారీ స్కోరు దిశగా పరుగులు పెడుతోంది. ఆదివారం సౌత్జోన్తో మొదలైన ఫైనల్ మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఈస్ట్జోన్ 79 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (135 బంతుల్లో 111 నాటౌట్), కుమార్ కుషాగ్ర (75 బంతుల్లో 63 నాటౌట్) క్రీజులో ఉన్నారు. సౌత్జోన్ బౌలర్లలో సీవీ మిలింద్ 2 వికెట్లు తీయగా, త్రిపురాణా విజయ్ ఒక వికెట్ పడగొట్టాడు.వైభవ్ మాస్.. అభిమన్యు, శిఖర్ క్లాస్టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఈస్ట్జోన్కు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. వన్డే తరహాలో వేగంగా ఆడిన వైభవ్ సూర్యవంశీ (35 బంతుల్లో 44, 5 ఫోర్లు, ఒక సిక్సర్) దంచికొట్టాడు. మరో ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (86 బంతుల్లో 72 పరుగులు) మరో ఎండ్లో నింపాదిగా ఆడాడు. వైభవ్ ఔటయ్యాకా బరిలోకి దిగిన శ్రీకర్ మోహన్ (120 బంతుల్లో 85 పరుగులు) కూడా తనదైన శైలి బ్యాటింగ్తో అలరించాడు. అభిమన్యు, సుదీప్ కుమార్ స్వల్ప వ్యవధిలో వెనుదిరిగిన్పటికీ, శిఖర్కు జత కలిసిన ఇషాన్ కిషన్ చెలరేగిపోయాడు. సౌత్జోన్ బౌలింగ్ను చీల్చి చెండాడిన ఇషాన్ అర్ధసెంచరీ మార్క్ చేరుకున్నాడు. శిఖర్ ఔటైనప్పటికీ, కుమార్ కుషాగ్ర వేగంగా ఆడి పరుగులు రాబట్టాడు. ఇషాన్ కిషన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాగా ఇషాన్ కిషన్కు ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఇది పదో సెంచరీ. అనంతరం కాసేపటికే కుమార్ కుషాగ్ర కూడా అర్థసెంచరీ సాధించాడు. ఈ నేపథ్యంలో మరో 10 ఓవర్లు మిగిలి ఉండగానే బ్యాడ్లైట్ కారణంగా అంపైర్లు తొలి రోజు ఆట ముగిసినట్లు ప్రకటించారు.💯 for Ishan Kishan 👏He brings it up in style 💥The East Zone captain leading from the front with a superb knock 🙌Scorecard ▶️ https://t.co/KQf5Km69nk#DuleepTrophy | #SZvEZ pic.twitter.com/ql9el4G60Q— BCCI Domestic (@BCCIdomestic) September 6, 2026చదవండి: సాత్విక్-చిరాగ్ జోడీ చరిత్ర.. చైనా గోడను బద్దలుకొట్టి విజేతలుగా! -
ఈస్ట్ జోన్ X సౌత్ జోన్
చెన్నై: దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్తో సౌత్ జోన్ అమీతుమీకి సిద్ధమైంది. తిలక్ వర్మ సారథ్యంలోని సౌత్ జోన్ జట్టులో భారత ఆటగాళ్లు దేవదత్ పడిక్కల్, మొహమ్మద్ సిరాజ్తో పాటు రికీ భుయ్, షేక్ రషీద్, జగదీశన్, స్మరణ్, శ్రేయస్ గోపాల్ ఉన్నారు. కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్ ఆడడం లేదని సారథి తిలక్ మ్యాచ్కు ముందు రోజు వెల్లడించాడు. గాయం కారణంగా జట్టుకు దూరమైన కావెరప్ప స్థానంలో హైదరాబాద్ ఆల్రౌండర్ సీవీ మిలింద్కు సౌత్ జోన్ జట్టులో చోటు దక్కింది. మరోవైపు ఇషాన్ కిషన్ సారథ్యంలోని ఈస్ట్జోన్లో 15 ఏళ్ల ఓపెనర్ వైభవ్ సూర్యవంశీపై అందరి దృష్టి నిలవనుంది. సెమీఫైనల్లో దంచికొట్టిన అతడు ఫైనల్లో ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడనేది కీలకం. వందో ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడుతున్న సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ తనలో వాడి తగ్గలేదని చాటుతుండగా... ముకేశ్ కుమార్, అభిజిత్ సర్కార్ అతడికి అండగా నిలుస్తున్నారు. -
‘ఆకలిగొన్న సింహంలా ఉన్నాడు.. అతడి రీఎంట్రీ ఆపలేరు’
టీమిండియా సీనియర్ ఆటగాడు మహ్మద్ షమీ జాతీయ జట్టులో చోటు కోల్పోయినప్పటికీ దేశవాళీ క్రికెట్లో మాత్రం అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. దులీప్ ట్రోఫీలో 13 ఏళ్ల తర్వాత ఈస్ట్జోన్ ఫైనల్కు చేరడంలో షమీ కీలకపాత్ర పోషించాడు. బెంగళూరు వేదికగా సెంట్రల్ జోన్తో జరిగిన సెమీఫైనల్లో షమీ రెండు ఇన్నింగ్స్లు కలిపి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఆదివారం నుంచి ఈస్ట్జోన్, సౌత్జోన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈస్ట్జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ శనివారం సాయంత్రం మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఆటగాడు బాగా రాణిస్తున్నాడంటే ఎంపికకు అతడి వయసుతో సంబంధముండదని తెలిపాడు. షమీ విషయంలోనూ అదే వర్తిస్తుందని, జట్టులో చోటు కోల్పోయినప్పటి నుంచి షమీ కసితో ఉన్నాడని, అతడిని టీమిండియాకు ఎంపిక చేయాల్సిన సమయం వచ్చిందని ఇషాన్ అభిప్రాయపడ్డాడు.Photo Credit: BCCI Twitterఇషాన్ మాట్లాడుతూ.. ‘‘అత్యుత్తమ ఆటగాళ్లలో షమీ ఒకడని నేను భావిస్తున్నాను. స్టార్గా వెలుగొందుతున్న షమీ బెంగాల్ తరఫున ఆడడం మొదలుపెట్టినప్పటి నుంచి మంచి ప్రదర్శన చేస్తున్నాడు. ప్రతీ మ్యాచ్లో వికెట్లు తీస్తూ కీలక బౌలర్గా మారిపోయాడు. ఒక బౌలర్గా టీమిండియాకు కూడా ఎంతో సేవ చేశాడు. వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే అని నేను భావిస్తాను. కష్టపడుతున్న సమయంలో వయసును లెక్కలోకి తీసుకోకూడనేది నా అభిప్రాయం. షమీ భాయ్లో ఆ కసి నాకు స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ఎలా ఆడాడు అనేదాన్ని పక్కనబెట్టి ఇప్పుడెలా ఆడుతున్నాడనే దానిపై బీసీసీఐ సెలెక్టర్లు దృష్టి సారించాల్సిన అవసరముంది. ప్రస్తుతం ఈస్ట్జోన్ జట్టుకు షమీ ఆడుతుండడం మా అదృష్టం. అతడు మా జట్టులో ఉండడం మాకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. 36 ఏళ్ల వయసులో ఎక్కువ ఓవర్లు వేస్తే అలసిపోయే బౌలర్లతో పోలిస్తే షమీ వేరుగా కనిపిస్తాడు. Photo Credit: BCCI Twitterనేను అడగకముందే జట్టుకు వికెట్ అవసరమైనప్పుడల్లా తాను బౌలింగ్ చేస్తానంటూ షమీ భాయ్ ముందుకు వచ్చేవాడు. ఒక కెప్టెన్గా అతడి కసిని చూస్తుంటే ముచ్చటగా అనిపిస్తుంది. టీమిండియాలోకి మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలనే అతడి తాపత్రయం నా కళ్లకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆకలిగొన్న సింహంలా కనిపిస్తున్నాడు. షమీ భాయ్ రీఎంట్రీని ఎవరూ ఆపలేరు.’ అని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు. ఇక సౌత్జోన్ కెప్టెన్ తిలక్ వర్మ కూడా షమీపై ప్రసంశల జల్లు కురిపించాడు. షమీ లాంటి చాకచక్యమైన పేసర్ను ఎదుర్కోవడానికి తమ జట్టు సిద్ధంగా ఉందని తిలక్ వర్మ పేర్కొన్నాడు. షమీ భాయ్తో ఆడడం మాకు ఎప్పుడూ ఇష్టమే అని తిలక్ వెల్లడించాడు. ఇటీవలే షమీ ఫస్ట్క్లాస్ క్రికెట్లో 900 వికెట్ల మార్క్ను అందుకున్న సంగతి తెలిసిందే. 2023 వన్డే ప్రపంచకప్లో టోర్నీ లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచిన మహ్మద్ షమీ భారత్ తరఫున చివరిసారిగా 2025 చాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు.Read: నాలుగేళ్ల తర్వాత బరిలో విలియమ్స్ సిస్టర్స్.. ఫలితం ఏంటంటే? -
గెలిపించిన షమీ, ఇషాన్ కిషన్.. ఫైనల్లో ఈస్ట్జోన్
దులీప్ ట్రోఫీ 2026-27 సీజన్లో ఈస్ట్ జోన్ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. బెంగళూరులోకి బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్-1లో జరిగిన సెమీఫైనల్లో ఈస్ట్జోన్ 4 వికెట్ల తేడాతో సెంట్రల్ జోన్పై విజయాన్ని అందుకుంది. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఈస్ట్జోన్ 39.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేధించింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (39 నాటౌట్), మహ్మద్ షమీ (8 నాటౌట్) అజేయంగా నిలిచి ఈస్ట్జోన్ను గెలిపించారు. వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ (40) రాణించాడు. సెంట్రల్ జోన్ బౌలర్లలో హర్ష్ దూబే 4 వికెట్లు తీయగా, సారాంశ్ జైన్, యశ్ ఠాకూర్ చెరొక వికెట్ పడగొట్టారు. ఇక సెంట్రల్ జోన్ తమ ఇన్నింగ్స్లో 266 పరుగులకు ఆలౌట్ కాగా, ఈస్ట్ జోన్ కూడా తమ తొలి ఇన్నింగ్స్లో 266 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే రెండో ఇన్నింగ్స్లో షమీ, ముకేశ్ కుమార్ మెరుపులతో సెంట్రల్ జోన్ అనూహ్యంగా 158 పరుగులకే కుప్పకూలింది. అయితే ఛేదనలో ఈస్ట్జోన్ కాస్త తడబడినప్పటికీ, ముందు వైభవ్.. చివర్లో ఇషాన్, షమీలు బాధ్యతగా ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.139 పరుగుల ఆధిక్యంలో నార్త్జోన్మరోవైపు నార్త్జోన్, సౌత్జోన్ మధ్య జరుగుతున్న రెండో సెమీఫైనల్లో నార్త్జోన్ 139 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. మూడోరోజు ఆట ముగిసే సమయానికి నార్త్జోన్ 66 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. నిషాంత్ సింధూ (20), అన్షుల్ కంబోజ్ (29) క్రీజులో ఉన్నారు. అంతకముందు సౌత్జోన్ తొలి ఇన్నింగ్స్లో 312 పరుగులకు ఆలౌటైంది.𝐄𝐀𝐒𝐓 𝐙𝐎𝐍𝐄 𝐀𝐑𝐄 𝐈𝐍 𝐓𝐇𝐄 𝐃𝐔𝐋𝐄𝐄𝐏 𝐓𝐑𝐎𝐏𝐇𝐘 𝐅𝐈𝐍𝐀𝐋! 🔥🏆A statement win over defending champions Central Zone, sends East Zone into the Duleep Trophy summit clash! 💥👏 pic.twitter.com/lNed1OiRyt— CricTracker (@Cricketracker) September 1, 2026Read: రిటైర్మెంట్ విషయంలోనూ మెస్సీ రికార్డు -
మరోసారి దంచికొట్టిన వైభవ్ సూర్యవంశీ.. కానీ!
దులిప్ ట్రోఫీ-2026 సెమీ ఫైనల్లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి మెరుపులు మెరిపించాడు. యశ్ ఠాకూర్ బౌలింగ్లో వరుసగా బౌండరీలు బాది దుమ్ములేపాడు. అయితే, ఆఖరికి యశ్ ఠాకూర్ పైచేయి సాధించడంతో.. అదే ఓవర్లో అవుటై వైభవ్ పెవిలియన్ చేరాడు.దులిప్ ట్రోఫీ తొలి సెమీ ఫైనల్లో భాగంగా ఈస్ట్ జోన్- సెంట్రల్ జోన్ తలపడుతున్నాయి. బెంగళూరు వేదికగా ఆదివారం మొదలైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఈస్ట్ జోన్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. సౌత్ జోన్ తమ మొదటి ఇన్నింగ్స్లో 266 పరుగులకు ఆలౌట్ అయింది.ధనాధన్ఆ తర్వాత ఈస్ట్ జోన్ సైతం సరిగ్గా 266 పరుగులే చేసి తొలి ఇన్నింగ్స్లో ఆలౌట్ అయింది. ఓపెనర్లలో అభిమన్యు ఈశ్వరన్ హాఫ్ సెంచరీ (69) సాధించగా.. వైభవ్ సూర్యవంశీ ఆది నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పొట్టి క్రికెట్ మాదిరి చెలరేగి కేవలం 42 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.ఆ తర్వాత కూడా ఇదే జోరు కొనసాగించిన వైభవ్ సూర్యవంశీ.. సెంచరీకి ఎనిమిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. మొత్తంగా 81 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఏడు ఫోర్లు, ఏడు సిక్స్ల సాయంతో 92 పరుగులు చేశాడు. అయితే, హర్ష్ దూబే బౌలింగ్లో భారీ షాట్కు యత్నించి విఫలం కాగా.. అర్షద్ ఖాన్ క్యాచ్ పట్టడంతో వైభవ్ ఇన్నింగ్స్కు తెరపడింది.నెమ్మదిగా మొదలుపెట్టినా..ఇదిలా ఉంటే.. సౌత్ జోన్ తమ రెండో ఇన్నింగ్స్లో 158 పరుగులకే కుప్పకూలింది. దీంతో మంగళవారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా ఈస్ట్ జోన్ 159 పరుగుల లక్ష్య ఛేదనకు దిగింది. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ ఆరంభంలో కాస్త నెమ్మదిగానే ఆడినా.. 14వ ఓవర్లో మాత్రం దూకుడు ప్రదర్శించాడు. 4⃣,6⃣,4⃣,4⃣, 🇼Vaibhav Sooryavanshi 🆚 Yash Thakur battle part 2⃣ 🔥#DuleepTrophy | #CZvEZScorecard ▶️ https://t.co/kyExeix2VY pic.twitter.com/wX8L5AHdTB— BCCI Domestic (@BCCIdomestic) September 1, 2026ఆఖరి బంతికి అవుట్సౌత్ జోన్ పేస్ బౌలర్ యశ్ ఠాకూర్ బౌలింగ్లో మొదటి బంతికి ఫోర్ బాదిన వైభవ్.. రెండో బంతిని సిక్సర్గా మలిచాడు. మూడు, నాలుగు బంతుల్లో మళ్లీ ఫోర్లు బాదాడు. అయితే, ఐదో బంతికి పరుగుకు యత్నించని వైభవ్.. ఆఖరి బంతికి మరోసారి షాట్కు యత్నించి వికెట్ సమర్పించుకున్నాడు.What. A. Catch 😮Central Zone captain Rajat Patidar pulls off an absolute blinder 🔥Scorecard ▶️ https://t.co/kyExeix2VY#DuleepTrophy | #CZvEZ pic.twitter.com/NfAD3Kk9RH— BCCI Domestic (@BCCIdomestic) September 1, 2026యశ్ ఠాకూర్ వేసిన బౌండరీ వైపు తరలించగా.. సౌత్ జోన్ కెప్టెన్ రజత్ పాటిదార్ అద్భుత రీతిలో క్యాచ్ అందుకోవడంతో వైభవ్ ఇన్నింగ్స్ ముగిసిపోయింది. లక్ష్య ఛేదనలో మొత్తంగా 43 బంతులు ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 40 పరుగులు చేశాడు. చదవండి: ‘నువ్వెంత కష్టపడ్డావో చూశాను.. మన పిల్లలకు నువ్వే హీరో’ -
35 ఏళ్ల వయసులో ఇరగదీస్తున్నాడు; ట్రోల్ చేసినోళ్లకు హెచ్చరిక
దులీప్ ట్రోఫీలో ఈస్ట్జోన్కు ప్రాతినిధ్యం వహిస్తున్న టీమిండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ బౌలింగ్లోనే కాదు ఫీల్డింగ్లోనూ సత్తా చాటుతున్నాడు. సెంట్రల్ జోన్తో జరుగుతున్న సెమీఫైనల్లో షమీ రెండు ఇన్నింగ్స్లు కలిపి ఐదు వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్లో షమీ తీసిన మూడు వికెట్లు తీయగా.. అందులో క్రీజులో పాతుకుపోయిన హర్ష్ దూబేని అద్భుత రీతిలో కాట్ అండ్ బౌల్డ్గా పెవిలియన్ చేర్చడం విశేషం. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్ 1లో సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. సెంట్రల్ జోన్ ఇన్నింగ్స్ 46వ ఓవర్ షమీ యార్కర్ బాల్ వేశాడు. హర్ష్ దూబే డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేయగా, బంతి ఎడ్జ్ అయి షమీ వైపు దూసుకొచ్చింది. అప్రమత్తమైన షమీ ఎలాంటి పొరపాటు చేయకుండా ఒంటిచేత్తో క్యాచ్ అందుకోవడంతో హర్ష్ దూబే షాక్ తిన్నాడు. Photo Credit: BCCI Twitterఅప్పటికే హర్ష్ దూబే 51 బంతుల్లో 24 పరుగులతో క్రీజులో నిలదొక్కుకున్నాడు. హర్ష్దూబే వెనుదిరిగిన వెంటనే సెంట్రల్ జోన్ ఆలౌటైంది. షమీ 56 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. దీంతో సెంట్రల్ జోన్ 50.2 ఓవర్లలో 158 పరుగులకు ఇన్నింగ్స్ను ముగించింది. 35 ఏళ్ల వయసులోనూ సూపర్ ఫిట్నెస్తో అదరగొడుతున్న షమీని జాతీయ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దులీప్ ట్రోఫీలో షమీ నుంచి ఇలాంటి ప్రదర్శన రావడం అభినందించాల్సిన విషయం.గతేడాది విజయ్ హజారే ట్రోఫీలోనూ షమీ అంచనాలకు మించి రాణించాడు. ఏడు ఇన్నింగ్స్లు కలిపి 15 వికెట్లు పడగొట్టాడు. ఇక సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26 సీజన్లో షమీ బెంగాల్ తరఫున ఏడు మ్యాచ్ల్లో 16 వికెట్లు పడగొట్టాడు. రంజీ ట్రోఫీలోనూ షమీ ఏడు మ్యాచ్ల్లోనే 37 వికెట్లు పడగొట్టి సెలెక్టర్లకు హెచ్చరికలు పంపాడు.షమీ భారత్ తరఫున చివరిసారి 2025 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. అప్పటినుంచి షమీ మళ్లీ జాతీయ జట్టుకు ఆడలేదు. 2023లో భారత్లో జరిగిన వన్డే ప్రపంచకప్లో షమీ లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఈ టోర్నీలో 24 వికెట్లు పడగొట్టడం విశేషం. ఇంత మంచి ప్రదర్శన చేసినప్పటికీ, గాయాలు అతడిని తరచూ ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు అదే గాయాల సాకుతో టీమిండియా మేనేజ్మెంట్ షమీని పూర్తిగా పక్కనబెట్టేయడం గమనార్హం.Brilliant reflexes 👌Mohd. Shami pulls off a fantastic one-handed-catch off his own bowling to dismiss Harsh Dubey 🙌#DuleepTrophy | #CZvEZScorecard ▶️ https://t.co/kyExeix2VY pic.twitter.com/G7ZYgbpmi7— BCCI Domestic (@BCCIdomestic) September 1, 2026Read: కెప్టెన్గా శార్దూల్ ఠాకూర్పై వేటు -
రింకూ సింగ్ విఫలం.. వైభవ్ సూర్యవంశీ దంచికొడితే!
దులిప్ ట్రోఫీ-2026 సెమీ ఫైనల్లో ఈస్ట్ జోన్ బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. సెంట్రల్ జోన్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తూ వరుస విరామాల్లో వికెట్లు కూల్చారు. ఫలితంగా సెంట్రల్ జోన్ తమ రెండో ఇన్నింగ్స్లో 158 పరుగులకే కుప్పకూలింది.నామమాత్రపు లక్ష్యంతద్వారా ఈస్ట్ జోన్కు 159 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని విధించగలిగింది. కాగా బెంగళూరు వేదికగా ఆదివారం మొదలైన ఈ సెమీస్ మ్యాచ్లో టాస్ గెలిచిన ఈస్ట్ జోన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. అయితే, కెప్టెన్ ఇషాన్ కిషన్ గాయపడగా.. అతడి డిప్యూటీ వైభవ్ సూర్యవంశీ తొలిరోజే తాత్కాలిక కెప్టెన్గా పగ్గాలు చేపట్టాడు.ఈ క్రమంలో మొదటి ఇన్నింగ్స్లో ఈస్ట్ జోన్.. సెంట్రల్ జోన్ను 266 పరుగులకు ఆలౌట్ చేసింది. ముకేశ్ కుమార్, అభిజీత్ సర్కార్ మూడేసి వికెట్లు కూల్చగా.. మహ్మద్ షమీ, ఎండీ కౌనియన్ ఖురేషి చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.టీ20 ఫార్మాట్ తరహాలో ధనాధన్అనంతరం బ్యాటింగ్కు దిగిన ఈస్ట్ జోన్ కూడా తమ తొలి ఇన్నింగ్స్లో సరిగ్గా 266 పరుగులకే ఆలౌట్ అయింది. ఈస్ట్ జోన్ ఈ స్కోరు చేయడంలో ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్, వైభవ్ సూర్యవంశీదే కీలక పాత్ర. అభిమన్యు అర్ధ శతకం (106 బంతుల్లో 69)తో ఆకట్టుకోగా.. వైభవ్ మాత్రం టీ20 ఫార్మాట్ తరహాలో ధనాధన్ దంచికొట్టాడు.అయితే, దురదృష్టవశాత్తూ సెంచరీకి ఎనిమిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. మొత్తంగా 81 బంతులు ఎదుర్కొన్న వైభవ్.. ఏడు ఫోర్లు, ఏడు సిక్సర్లు బాది 92 పరుగులు సాధించాడు. మిగిలిన వారిలో సుదీప్ ఘరామి (25) ఒక్కడే చెప్పుకోగదగ్గ స్కోరు చేశాడు.చెలరేగిన ముకేశ్ కుమార్, షమీఈ క్రమంలో రెండో రోజు తమ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌత్ జోన్.. ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. ఇక మంగళవారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా 158 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లలో అమన్ మోఖడే (41) రాణించాడు. సౌత్ జోన్ ఇన్నింగ్స్లో అతడిదే టాప్ స్కోరు.Superb bowling 🙌Mukesh Kumar outsmarts Aman Mokhade with an excellent setup👌#DuleepTrophy | #CZvEZ pic.twitter.com/voMx1Bt43n— BCCI Domestic (@BCCIdomestic) September 1, 2026మిగిలిన వారిలో రింకూ సింగ్ (20) నిరాశపరచగా.. హర్ష్ దూబే 24, అర్షద్ ఖాన్ 25 పరుగులు రాబట్టారు. ఈస్ట్ జోన్ బౌలర్లలో ముకేశ్ కుమార్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. మహ్మద్ షమీ మూడు వికెట్లు కూల్చాడు. అనుకుల్ రాయ్, ఎండీ కౌనియన్ ఖురేషి, అభిజిత్ సర్కార్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. మూడో రోజు ఆట సందర్భంగా ఈస్ట్ జోన్ సారథి ఇషాన్ కిషన్ తిరిగి వచ్చాడు. దీంతో బ్యాటింగ్ లైనప్ మరింత పటిష్టమైంది.Brilliant reflexes 👌Mohd. Shami pulls off a fantastic one-handed-catch off his own bowling to dismiss Harsh Dubey 🙌#DuleepTrophy | #CZvEZScorecard ▶️ https://t.co/kyExeix2VY pic.twitter.com/G7ZYgbpmi7— BCCI Domestic (@BCCIdomestic) September 1, 2026ఇక సౌత్ జోన్ విధించిన 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఈస్ట్ జోన్ బరిలోకి దిగింది. తొలి ఇన్నింగ్స్లో మాదిరే వైభవ్ సూర్యవంశీ దంచికొడితే మాత్రం ఈస్ట్ జోన్ సులువుగానే ఫైనల్ చేరడం ఖాయం.చదవండి: భారత్తో సిరీస్.. ఆసీస్ జట్ల ప్రకటన -
దుమ్మురేపుతున్న షమీ.. ప్రొఫెషనల్ క్రికెట్లో అరుదైన ఫీట్
భారత జట్టులో చోటు కోల్పోయినప్పటికీ సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ దేశవాళీ క్రికెట్లో తన బౌలింగ్తో దుమ్మురేపుతున్నాడు. తాజాగా దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో ఈస్ట్ జోన్ తరఫున ఆడుతున్న షమీ.. సెంట్రల్ జోన్పై రెండు వికెట్లు తీసి ప్రొఫెషనల్ క్రికెట్లో 900 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ప్రస్తుతం ఫస్ట్క్లాస్, లిస్ట్-ఎ, టీ20 ఫార్మాట్లలో కలిపి షమీ 900 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా భారత్ తరఫున ప్రొఫెషనల్ క్రికెట్లో 900 వికెట్లు సాధించిన ఆరో బౌలర్గా షమీ రికార్డులకెక్కాడు. ఇక షమీ ఖాతాలో ఫస్ట్-క్లాస్ క్రికెట్లో 379 వికెట్లు, లిస్ట్-ఏ క్రికెట్లో 283 వికెట్లు, టీ20ల్లో 238 వికెట్లు పడగొట్టాడు.ఇక ప్రొఫెషనల్ క్రికెట్లో భారత పేసర్లలో కపిల్ దేవ్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా తొలి స్థానంలో ఉన్నాడు. కపిల్దేవ్ ఖాతాలో 1170 వికెట్లు ఉన్నాయి. రెండో స్థానంలో జహీర్ ఖాన్ (1168 వికెట్లు), జయదేవ్ ఉనద్కత్ (941 వికెట్లతో) మూడవ స్థానంలో ఉన్నాడు. జవగల్ శ్రీనాథ్ 940 వికెట్లతో నాలుగవ స్థానం, వినయ్ కుమార్ 923 వికెట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.షమీ చివరిసారిగా గతేడాది ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జెర్సీలో ఆడాడు. అప్పటి నుంచి అతనికి జాతీయ జట్టులో అవకాశం రాలేదు. గాయం నుంచి కోలుకున్నప్పటికీ.. హెడ్కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ యువ ఆటగాళ్లపైనే దృష్టి సారించడంతో షమీని పట్టించుకోవడం లేదు.ఇక బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ 900 వికెట్ల మార్క్ అందుకున్న షమీకి కృతజ్ఞతలు తెలిపింది. "మహ్మద్ షమీకి అభినందనలు. ప్రొఫెషనల్ క్రికెట్లో 900 వికెట్లు తీసిన ఆరో భారత పేసర్గా నిలవడం అంత సులభం కాదు. షమీ ఫస్ట్-క్లాస్ క్రికెట్లో 379 వికెట్లు, లిస్ట్ ఎ క్రికెట్లో 283, టీ20లలో 238 వికెట్లు పడగొట్టాడు. అతని ఈ ఘనతకు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ గర్విస్తోంది." అని పేర్కొంది.THE CLASS OF SHAMI 🫡🔥- He completed 900 wickets in Professional cricket. pic.twitter.com/0t4jUs6fMZ— Johns. (@CricCrazyJohns) August 31, 2026Read: జకోవిచ్.. ప్లీజ్ రిటైరవ్వు; ఇలా చూడలేకపోతున్నాం! -
పాపం వైభవ్ సూర్యవంశీ!.. చరిత్రకెక్కినా చేదు అనుభవం!
టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీకి చేదు అనుభవం ఎదురైంది. ఫస్ట్క్లాస్ క్రికెట్లో సెంచరీ చేసే అవకాశాన్ని ఈ పదిహేనేళ్ల పిల్లాడు మరోసారి తృటిలో చేజార్చుకున్నాడు. కాగా దేశవాళీ ప్రతిష్టాత్మక రెడ్బాల్ టోర్నీ దులిప్ ట్రోఫీ-2026లో వైభవ్ సూర్యవంశీ ఈస్ట్ జోన్కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో సెమీ ఫైనల్లో భాగంగా కెప్టెన్ ఇషాన్ కిషన్ గాయపడగా.. అతడి డిప్యూటీ అయిన వైభవ్ తాత్కాలిక సారథిగా పగ్గాలు చేపట్టాడు. బెంగళూరు వేదికగా ఆదివారం సెంట్రల్ జోన్తో మొదలైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఈస్ట్ జోన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 266 పరుగులు చేసి ఆలౌట్ అయింది.అనంతరం తమ మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈస్ట్ జోన్కు అభిమన్యు ఈశ్వరన్తో కలిసి వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. కేవలం 42 బంతుల్లోనే ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో విరుచుకుపడ్డ ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.100-run stand 🙌Vaibhav Sooryavanshi and Abhimanyu Easwaran with a solid opening stand so far 🤝Scorecard ▶️ https://t.co/kyExeix2VY pic.twitter.com/7eVSb3iuPU— BCCI Domestic (@BCCIdomestic) August 31, 2026 ఇదే జోరు కొనసాగిస్తూ వైభవ్ సూర్యవంశీ సెంచరీకి చేరువయ్యాడు. అయితే, 92 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హర్ష్ దూబే బౌలింగ్లో అర్షద్ ఖాన్కు క్యాచ్ ఇచ్చి ఈ ఓపెనింగ్ బ్యాటర్ పెవిలియన్కు చేరాడు. మొత్తంగా 81 బంతుల్లో ఏడు ఫోర్లు, ఏడు సిక్సర్లు బాదిన వైభవ్ సెంచరీకి ఎనిమిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో వైభవ్ సూర్యవంశీ అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 93. ఇప్పుడు 92 పరుగుల వద్ద అవుటై దురదృష్టవశాత్తూ మరోసారి సెంచరీ మిస్ అయ్యాడు.తొలి ప్లేయర్గా ఘనతకాగా సెంచరీ చేజార్చుకున్నప్పటికీ అత్యంత పిన్న వయసులోనే దులిప్ ట్రోఫీలో హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్గా వైభవ్ సూర్యవంశీ చరిత్రకెక్కాడు. 15 ఏళ్ల 157 రోజుల వయసులో అతడు ఈ ఘనత సాధించాడు.ఆల్ టైమ్ రికార్డు మిస్అయితే, కాస్త నెమ్మదిగా ఆడి ఉంటే.. దులిప్ ట్రోఫీ చరిత్రలో అత్యంత చిన్న వయసులోనే శతక్కొట్టిన ప్లేయర్గా వైభవ్ సూర్యవంశీ ఆల్టైమ్ రికార్డు సాధించేవాడు. కానీ హర్ష్ దూబే బౌలింగ్లో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన వైభవ్ విఫలమయ్యాడు. బంతిని గాల్లోకి లేపగా డీప్ మిడ్వికెట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న అర్షద్ క్యాచ్ పట్టడంతో వైభవ్ మెరుపు ఇన్నింగ్స్కు తెరపడింది. ఇదిలా ఉంటే.. అభిమన్యు ఈశ్వరన్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.భోజన విరామ సమయానికి ఈస్ట్ జోన్ 31 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. అభిమన్యు ఈశ్వరన్ 58, సుదీప్ కుమార్ ఘరామీ 16 పరుగులతో క్రీజులో నిలిచారు. వైభవ్ అవుటైన వెంటనే వన్డౌన్ బ్యాటర్ కుమార్ కుశాగ్రా డకౌట్గా వెనుదిరిగాడు.చదవండి: అదంతా నాటకం: పాక్ ఓపెనర్పై ఇంగ్లండ్ దిగ్గజం ఫైర్! -
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. దెబ్బకు 57 ఏళ్ల రికార్డ్ బ్రేక్
బెంగళూరు వేదికగా సెంట్రల్ జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో ఈస్ట్జోన్ తాత్కాలిక కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. ఓపెనర్గా బరిలోకి దిగిన ఈ యువ సంచలనం.. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. 15 ఏళ్ల వైభవ్ టీ20 తరహాలో బ్యాటింగ్ చేస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.ఈ క్రమంలో కేవలం 42 బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్స్లతో తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. మొత్తంగా 92 పరుగులు చేసి తన ఫస్ట్క్లాస్ సెంచరీని తృటిలో చేజార్చకున్నాడు. కాగా ఈ ఫైరీ ఫిప్టీతో సూర్యవంశీ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.దులీప్ ట్రోఫీలో హాఫ్ సెంచరీ చేసిన అతి పిన్న వయష్కుడిగా వైభవ్ చరిత్ర సృష్టించాడు. 15 ఏళ్ల 157 రోజుల వయస్సులో సూర్యవంశీ ఈ ఘనత సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత లెజెండరీ క్రికెటర్ లక్ష్మణ్ సింగ్ పేరిట ఉండేది. అతడు 1969లో 16 ఏళ్ల 23 ఏళ్ల వయస్సులో ఈ ఫీట్ నమోదు చేశాడు. తాజా మ్యాచ్తో 57 ఏళ్ల లక్ష్మణ్ సింగ్ రికార్డ్ను వైభవ్ బద్దలు కొట్టాడు.తొలి ఇన్నింగ్స్లో ఈస్ట్జోన్ 25 ఓవర్లకు రెండు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. క్రీజులో అభిమన్యు ఈశ్వరన్(53), ఎస్ కుమార్(4) ఉన్నారు. అంతకుముందు సెంట్రల్ జోన్ తమ తొలి ఇన్నింగ్స్లో 266 పరుగులకు ఆలౌటైంది. పేస్ బౌలర్లు ముకేశ్ కుమార్, అభిజిత్ కె. సర్కార్ తలా మూడు వికెట్లతో సత్తా చాటారు. వీరితో పాటు మహమ్మద్ షమీ, ఖురేషీ చెరో రెండు వికెట్లు తీశారు. సెంట్రల్ జోన్ బ్యాటర్లలో రింకూ సింగ్ (88 బంతుల్లో 60) అర్ధశతకంతో టాప్ స్కోరర్గా నిలవగా.. ఆర్యన్ జుయల్ (46), యశ్ ఠాకూర్ (30) పర్వాలేదనిపించారు.చదవండి: చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ.. ప్రపంచ రికార్డ్ బ్రేక్100-run stand 🙌Vaibhav Sooryavanshi and Abhimanyu Easwaran with a solid opening stand so far 🤝Scorecard ▶️ https://t.co/kyExeix2VY pic.twitter.com/7eVSb3iuPU— BCCI Domestic (@BCCIdomestic) August 31, 2026 strong> -
రింకూ సింగ్ ఒంటరి పోరాటం
బెంగళూరు వేదికగా సెంట్రల్ జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో ఈస్ట్ జోన్ బౌలర్లు అదరగొట్టారు. పేస్ బౌలర్లు ముకేశ్ కుమార్, అభిజిత్ కె. సర్కార్ తలా మూడు వికెట్లతో సత్తా చాటారు. వీరితో పాటు మహమ్మద్ షమీ, ఖురేషీ చెరో రెండు వికెట్లు తీశారు. వీరి ధాటికి సెంట్రల్ జోన్ తమ తొలి ఇన్నింగ్స్లో 266 పరుగులకు ఆలౌటైంది. సెంట్రల్ జోన్ బ్యాటర్లలో రింకూ సింగ్ (88 బంతుల్లో 60) అర్ధశతకంతో టాప్ స్కోరర్గా నిలవగా.. ఆర్యన్ జుయల్ (46), యశ్ ఠాకూర్ (30) పర్వాలేదనిపించారు. మిగతా ఆటగాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. కాగా, ఈ మ్యాచ్లో ఈస్ట్ జోన్కు వైభవ్ సూర్యవంశీ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ ఇషాన్ కిషన్ తొలి రోజు ఆట ఆరంభంలోనే గాయపడటంతో జట్టును నడిపించే బాధ్యతను వైభవ్ తన భుజాన వేసుకున్నాడు.మరోవైపు సౌత్జోన్తో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో నార్త్జోన్ తమ తొలి ఇన్నింగ్స్లో 195 పరుగులకే కుప్పకూలింది. విద్వత్ కావేరప్ప నాలుగు వికెట్లు పడగొట్టి నార్త్జోన్ పతనాన్ని శాసించాడు. ఖమ్రాన్ ఇక్బాల్(76) టాప్ స్కోరర్గా మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ జోన్ రెండు వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసింది. క్రీజులో జగదీశన్(340, తిలక్ వర్మ(1)ఉన్నారు.చదవండి: అంపైర్కే షాక్ ఇచ్చిన వైభవ్ సూర్యవంశీ.. 3 సెకెన్లలో! వీడియో వైరల్ -
అంపైర్కే షాక్ ఇచ్చిన వైభవ్ సూర్యవంశీ.. 3 సెకెన్లలో! వీడియో వైరల్
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సెంట్రల్ జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో ఈస్ట్ జోన్ జట్టుకు కెప్టెన్గా వ్యహరిస్తున్నాడు. రెగ్యులర్ సారధి ఇషాన్ కిషన్ గాయం కారణంగా మైదానం వీడడడంతో వైస్ కెప్టెన్గా ఉన్న వైభవ్ జట్టు బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. ఈ క్రమంలో అతడు తీసుకున్న ఒక సంచలన నిర్ణయం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. వైభవ్ అద్భుతమైన రివ్యూతో సెంట్రల్ జోన్ స్టార్ బ్యాటర్ ఆర్యన్ జుయల్ను పెవిలియన్కు పంపాడు.సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్ 39వ ఓవర్ వేసిన ముఖేష్ కుమార్ తొలి బంతిని జుయల్కు ఔట్ సైట్ ఆఫ్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని ఆర్యన్ జుయల్ ఆఫ్ సైడ్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్కు దగ్గరగా వెళ్తూ వికెట్ కీపర్ కుమార్ కుశాగ్ర చేతుల్లో పడింది. వెంటనే వికెట్ కీపర్తో పాటు ఈస్ట్ జోన్ ఆటగాళ్లు క్యాచ్కు అప్పీల్ చేశారు. అంపైర్ నాటౌట్ అంటూ తల ఊపాడు. స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న కెప్టెన్ వైభవ్ మొదట రివ్యూ తీసుకోవాలా వద్దా అనే సందేహంలో పడ్డాడు. అయితే సహచర ఆటగాళ్లతో చర్చించి 3 సెకన్ల సమయం మాత్రమే మిగిలి ఉండగా వైభవ్ డీఆర్ఎస్కు వెళ్లాడు. థర్డ్ అంపైర్ 'అల్ట్రాఎడ్జ్' పరిశీలించగా బంతి బ్యాట్ను తాకినట్లు స్పష్టమైన స్పైక్ కనిపించింది. దీంతో ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని అవుట్గా ప్రకటించాడు. 15 ఏళ్ల వయసులోనే కెప్టెన్గా వైభవ్ సూర్యవంశీ చూపించిన సమయస్ఫూర్తికి జట్టు సభ్యులంతా హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.చదవండి: బీసీసీఐ బిగ్ ప్లాన్.. ఇంగ్లండ్కు ‘కాశ్మీర్ ఎక్స్ప్రెస్’ ఆకిబ్ నబీ!Stand-in Captain Vaibhav Sooryavanshi goes for the review with 3 seconds remaining...and gets it right 👏DRS done right as the set Aryan Juyal (46) is dismissed ✅The celebrations say it all 🙌#DuleepTrophy pic.twitter.com/IwBQbr8hJQ— BCCI Domestic (@BCCIdomestic) August 30, 2026 -
15 ఏళ్లకే కెప్టెన్గా వైభవ్ సూర్యవంశీ
టీమిండియా యువ సంచలనం, బ్యాటింగ్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ మరో ఘనత సాధించాడు. 15 ఏళ్ల వయసులోనే సీనియర్ జట్టుకు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టి రికార్డు నెలకొల్పాడు. దులీప్ ట్రోఫీ 2026లో భాగంగా సెంట్రల్ జోన్తో ఇవాళ మొదలైన తొలి సెమీఫైనల్లో వైభవ్ ఈస్ట్ జోన్ తాత్కాలిక కెప్టెన్గా నియమితుడయ్యాడు.CAPTAIN VAIBHAV SOORYAVANSHI 🔥- Vaibhav Sooryavanshi is currently leading the Easy Zone team in Duleep Trophy. pic.twitter.com/cGaFDpceMD— Johns. (@CricCrazyJohns) August 30, 2026రెగ్యులర్ కెప్టెన్ ఇషాన్ కిషన్ వికెట్ కీపింగ్ చేస్తున్న సమయంలో గాయపడటంతో వైభవ్కు ఈ అవకాశం వచ్చింది. సీనియర్ జట్టు కెప్టెన్గా తొలిసారి బాధ్యతలు చేపట్టిన సమయంలో వైభవ్ చిరునవ్వుతో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మ్యాచ్లో వైభవ్ మహ్మద్ షమీ, ముకేశ్ కుమార్ లాంటి సీనియర్ బౌలర్లను హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. వారితో అతడు ఎలా వ్యవహరిస్తాడోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.వైభవ్కు ఇది కేవలం రెండో దులీప్ ట్రోఫీ మ్యాచ్. ఓవరాల్గా 10వ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ మాత్రమే. ఇంత తక్కువ అనుభవంలో షమీ లాంటి అనుభవజ్ఞుడైన పేసర్ను వైభవ్ ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచిన ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈస్ట్ జోన్కు త్రిపుర పేసర్ అభిజిత్ సర్కార్ శుభారంభం అందించాడు. అమన్ మొఖాడే (8), కునాల్ చందేలా (6)లను ఆదిలోనే ఔట్ చేశాడు. కొద్ది సేపటికే ముకేశ్ కుమార్ సెంట్రల్ జోన్ కెప్టెన్ రజత్ పాటిదార్ (12)ను క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్కు పంపాడు. దీంతో సెంట్రల్ జోన్ 63 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. లంచ్ విరామం సమయానికి ఆ జట్టు స్కోర్ 81-3గా ఉంది. ఆర్యన్ జుయల్ (42), యశ్ రాథోడ్ (6) క్రీజ్లో ఉన్నారు. చదవండి: భారత్-ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు సంబంధించి కీలక అప్డేట్స్ -
ఇన్నింగ్స్ తేడాతో గెలిచిన ఇషాన్, వైభవ్ జట్టు
దులీప్ ట్రోఫీ 2026 తొలి క్వార్టర్ ఫైనల్లో ఇషాన్ కిషన్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ (వైస్ కెప్టెన్) నేతృత్వంలోని ఈస్ట్ జోన్ జట్టు నార్త్ ఈస్ట్ జోన్పై ఇన్నింగ్స్ 210 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, సెమీఫైనల్కు దూసుకెళ్లింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఈస్ట్ జోన్.. సుదీప్ కుమార్ ఘరామీ (146), షాబాజ్ అహ్మద్ (167) సెంచరీలతో కదంతొక్కడంతో 467 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. అనంతరం బరిలోకి దిగిన నార్త్ ఈస్ట్ జోన్ జట్టు.. అభిజిత్ సర్కార్ (5-20), షాబాజ్ అహ్మద్ (3-20) ధాటికి 111 పరుగులకే కుప్పకూలింది.ఆతర్వాత ఫాలో ఆన్లోనే ఏమాత్రం ప్రతిఘటించలేకపోయిన నార్త్ ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్లోనూ 146 పరుగులకే ఆలౌటై, ఇన్నింగ్స్ తేడాతో పరాజయంపాలైంది. అనుకూల్ రాయ్ (5-37) రెండో ఇన్నింగ్స్లో నార్త్ ఈస్ట్ జట్టును దెబ్బకొట్టాడు. ఈ మ్యాచ్లో బ్యాటింగ్లో విఫలమైన చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ రెండో ఇన్నింగ్స్లో బంతితో సత్తా చాటి 2 వికెట్లు (4 బంతుల వ్యవధిలో) తీశాడు. చదవండి: బౌలర్గానూ ఇరగదీసిన వైభవ్ సూర్యవంశీ -
బౌలర్గానూ ఇరగదీసిన వైభవ్ సూర్యవంశీ
బ్యాటింగ్ సంచలనం, టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ బంతితోనూ ఇరగదీశాడు. నార్త్ ఈస్ట్ జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ క్వార్టర్ఫైనల్లో కేవలం నాలుగు బంతుల వ్యవధిలో రెండు వికెట్లు పడగొట్టి తన ఫస్ట్క్లాస్ వికెట్ల ఖాతా తెరిచాడు. ఈ టోర్నీలో వైభవ్ ఈస్ట్ జోన్కు వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.నాలుగు బంతుల్లో రెండు వికెట్లునార్త్ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్లో 26వ ఓవర్ వద్ద ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్.. షాబాజ్ అహ్మద్ స్థానంలో వైభవ్ సూర్యవంశీకి బంతిని అందించాడు. తొలి ఓవర్లో రెండు పరుగులు మాత్రమే ఇచ్చిన వైభవ్.. ఆ తర్వాత ఓవర్లో అద్భుతం చేశాడు.28వ ఓవర్లో కిషన్ లింగ్డోహ్ను ఔట్ చేసి తన తొలి ఫస్ట్క్లాస్ వికెట్ సాధించాడు. వైభవ్ బంతిని అటాక్ చేయడానికి లింగ్డోహ్ ముందుకొచ్చాడు. అయితే బంతికి భారీ లీడింగ్ ఎడ్జ్ రావడంతో కవర్ ప్రాంతం వైపు వెళ్లింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న డెనిష్ దాస్ ఎలాంటి పొరపాటు చేయకుండా క్యాచ్ అందుకున్నాడు.ఆ తర్వాత మరో మూడు బంతులకే వైభవ్ మరో వికెట్ తీశాడు. ఇమ్లివాటి లెమ్తుర్ బ్యాట్ అంచును తాకిన బంతిని ఇషాన్ కిషన్ అద్భుతమైన రిఫ్లెక్స్తో క్యాచ్ పట్టాడు. దీంతో ఒకే ఓవర్లో వైభవ్కు రెండు వికెట్లు దక్కాయి.VAIBHAV SOORYAVANSHI, THE BOWLER 🔥- Sooryavanshi picks 2 wickets in 4 balls in Duleep Trophy Quarter-Final. pic.twitter.com/G5pfCmFXYF— Johns. (@CricCrazyJohns) August 25, 2026బంతితోనూ వైభవ్కు మంచి భవిష్యత్తు..?వైభవ్ సూర్యవంశీ ప్రధానంగా బ్యాటర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. భారీ షాట్లు ఆడగల సామర్థ్యంతో అతను ఇప్పటికే భారత క్రికెట్లో ప్రత్యేక గుర్తింపు పొందాడు.అయితే వైభవ్ స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్ కూడా. అతని బౌలింగ్లో హిప్ రొటేషన్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. దులీప్ ట్రోఫీలో లభించిన అవకాశాన్ని అతను చక్కగా ఉపయోగించుకుని నాలుగు బంతుల్లోనే రెండు వికెట్లు పడగొట్టాడు.దీంతో భవిష్యత్తులో అవసరమైనప్పుడు బంతితోనూ జట్టుకు ఉపయోగపడే పార్ట్టైమ్ ఆల్రౌండర్గా ఎదిగే అవకాశం వైభవ్కు ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సచిన్తో మరో పోలికచిన్న వయసులోనే ప్రొఫెషనల్ క్రికెట్లోకి వచ్చి సంచలనాలు సృష్టిస్తున్న వైభవ్ను ఇప్పటికే పలువురు సచిన్ టెండూల్కర్తో పోల్చుతున్నారు. సచిన్ కూడా చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి బ్యాట్తో పాటు అప్పుడప్పుడు బంతితోనూ భారత్కు కీలక వికెట్లు అందించాడు. ఇప్పుడు వైభవ్ కూడా బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో తన ప్రతిభను చూపించడం ఆసక్తికరంగా మారింది.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో ఈస్ట్ జోన్ గెలుపు దిశగా సాగుతోంది. ఫాలో ఆన్ ఆడుతున్న ఆ జట్టు రెండో ఇన్నింగ్స్లో 102 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి భారీ ఇన్నింగ్స్ ఓటమి దిశగా పరుగులు పెడుతోంది. తొలి ఇన్నింగ్స్లో ఆ జట్టు 111 పరుగులకే కుప్పకూలింది. దీనికి ముందు ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 467 పరుగుల భారీ స్కోర్ చేసింది. చదవండి: సిరాజ్ రెచ్చగొట్టాడు.. ప్రసిద్ద్ పని కానిచ్చేశాడు..! -
అభిజిత్ పాంచ్ పటాకా.. ఈస్ట్జోన్కు భారీ ఆధిక్యం
దులీప్ ట్రోఫీ 2026లో భాగంగా నార్త్ ఈస్ట్ జోన్తో జరుగుతున్న మ్యాచ్లో ఈస్ట్జోన్ భారీ ఆధిక్యం సాధించింది. ఈస్ట్జోన్ బౌలర్లు అభిజిత్, షాబాజ్ అహ్మద్ ధాటికి నార్త్ ఈస్ట్ జోన్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. ఫలితంగా నార్త్ ఈస్ట్ జోన్ 111 పరుగులకే కుప్పకూలింది. అర్పిత్ సుభాష్ (32) టాప్ స్కోరర్గా నిలవగా, రాంగ్సన్ జొనాథన్ (21) పర్వాలేదనిపించాడు. అభిజిత్ సర్కార్ 5 వికెట్లతో చెలరేగగా, షాబాజ్ అహ్మద్ 3 వికెట్లు తీశాడు. దీంతో తొలి ఇన్నింగ్స్లో 356 పరుగుల ఆధిక్యం సాధించిన ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్ ఆడకుండా నార్త్ ఈస్ట్ను ఫాలోఆన్ ఆడిస్తోంది. రెండోరోజు ఆట ముగిసే సమయానికి నార్త్ ఈస్ట్ జోన్ జట్టు వికెట్ నష్టపోకుండా 7 పరుగులు చేసింది. అంతకముందు ఈస్ట్జోన్ తమ తొలి ఇన్నింగ్స్లో 467 పరుగులకు ఆలౌటైంది. సుదీప్ కుమార్ (185 బంతుల్లో 146), షాబాజ్ అహ్మద్ (244 బంతుల్లో 167) సెంచరీలతో చెలరేగారు. కుమార్ కుషాగ్రా (55) అర్ధసెంచరీ సాధించాడు. నార్త్ ఈస్ట్ బౌలర్లలో ఫిరోజైమ్ జొతిన్, ఆకాశ్ చౌదరీ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.ఎవరీ అభిజిత్ సర్కార్?త్రిపురకు చెందిన అభిజిత్ సర్కార్ కుడిచేతి ఫాస్ట్ బౌలర్. 2022లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ద్వారా అభిజిత్ తొలిసారి వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్పై మూడు వికెట్ల ప్రదర్శనతో టోర్నమెంట్ను ప్రారంభించిన అభిజిత్, నాలుగు మ్యాచ్ల్లో ఐదు వికెట్లు తీశాడు. ఆ తర్వాత 2022-23 రంజీ ట్రోఫీ సీజన్లో త్రిపుర తరఫున అభిజిత్ ఏడు ఇన్నింగ్స్ల్లోనే 12 వికెట్లు పడగొట్టాడు. ఇందులో విదర్భపై ఆరు వికెట్ల చిరస్మరణీయ ప్రదర్శన ఉంది. ఇక 2024-25 రంజీ ట్రోఫీ సీజన్లో కేవలం ఆరు ఇన్నింగ్స్లలోనే 15 వికెట్లు పడగొట్టాడు. ఆ సీజన్లో బరోడాపై ఐదు వికెట్ల ప్రదర్శనలతో మెరిశాడు.pic.twitter.com/fNCliUpmou 🚨 THREE WICKETS IN ONE OVER! 🔥🔥🔥Abhijit Sarkar completes his five-wicket haul in style, ripping through the batting with three wickets in the over! 🎯That’s how you finish a fifer! 💥#DuleepTrophy #3rdManView— Third Man View (@3rdManView) August 24, 2026Read: కష్టాల్లో పడిన లంక.. రెండోరోజు భారత్దే ఆధిపత్యం -
వైభవ్ సూర్యవంశీ ప్లాఫ్ షో వెనుక కారణమిదే?
దులీప్ ట్రోఫీ 63వ ఎడిషన్ ఆదివారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈస్ట్ జోన్తో నార్త్ఈస్ట్ జోన్, నార్త్ జోన్తో వెస్ట్ జోన్ తలపడుతున్నాయి. అయితే దులీప్ ట్రోఫీలో అందరి కళ్లు ఈస్ట్జోన్కు ప్రాతినిధ్యం వహిస్తున్న వైభవ్ సూర్యవంశీపై నెలకొని ఉన్నాయి. కానీ మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే వైభవ్ మూడు ఫోర్లు కొట్టినప్పటికీ చెత్త షాట్ ఆడి పెవిలియన్ చేరాడు. నార్త్ఈస్ట్ జోన్ పేసర్ బిష్వోర్జిత్ కొంతోజమ్ బౌలింగ్లో వైభవ్ వెనుదిరిగాడు. అయితే పెవిలియన్ చేరుతున్న క్రమంలో వైభవ్ జెర్సీ వెనుక భాగంలో ఉన్న సంఖ్యకు టేప్ అంటించి ఉండడం అభిమానులు గమనించారు. ఆ తర్వాత ఫీల్డింగ్ సమయంలోనూ వైభవ్ జెర్సీ వెనుక భాగంలో టేప్ అలాగే ఉండడం కనిపించింది. దీంతో అసలు వైభవ్ జెర్సీకి టేప్ ఎందుకు వేసుకున్నాడనే దానిపై ఆరా తీశారు. దీంతో విషయం బయటపడింది.మ్యాచ్లో వైభవ్ 13వ నంబర్ ఉన్న జెర్సీని ధరించాడు. నిజానికి వైభవ్ సూర్యవంశీ జెర్సీ నెంబర్ 3. ఐపీఎల్ రాజస్తాన్ రాయల్స్ జట్టు తరఫున ఇదే జెర్సీ నెంబర్తో బరిలోకి దిగాడు. ఆ తర్వాత టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన సమయంలోనూ వైభవ్ మూడు నెంబర్ జెర్సీతోనే ఆడాడు. అయితే దులీప్ ట్రోఫీలో వైభవ్కు మూడో నెంబర్ జెర్సీ స్థానంలో 13వ నెంబర్ జెర్సీ అందించారు. ఈస్ట్ జోన్ జట్టు వైభవ్ కోసం తనకు అచ్చొచ్చిన మూడో నెంబర్ జెర్సీని అందించడంలో విఫలమైందని లాజిస్టిక్స్ మేనేజర్ తెలిపాడు. తనకు మూడు నెంబర్ జెర్సీ అయితేనే అచ్చొస్తుందని భావించాడేమో.. అందుకే వైభవ్ తనకు ఇచ్చిన 13వ నెంబర్ జెర్సీలో ఒకటి సంఖ్య కనిపించకుండా టేప్ అంటించాడు. ఒకటి సంఖ్య లేకపోవడంతో ఇప్పుడు ఆ జెర్సీ 3 నెంబర్గా మారిపోయింది. ఇక మ్యాచ్లో ఓపెనర్గా వచ్చిన వైభవ్ 6 బంతుల్లో 8 పరుగులు చేసి నిష్క్రమించాడు. దీంతో అభిమానులు వైభవ్ జెర్సీపై ఫన్నీ కామెంట్స్ చేశారు. "పాపం జెర్సీ మారడంతో వైభవ్కు లక్ కలిసిరాలేదని కొందరు పేర్కొంటే... ఒకవేళ తనకు అచ్చొచ్చిన 3వ జెర్సీ నెంబర్ను ఇచ్చి ఉంటే మ్యాచ్లో ఇరగదీసేవాడేమో" అని మరికొందరు తెలిపారు. అయితే వైభవ్ తన జెర్సీని తెప్పించాలని ఇప్పటికే ఈస్ట్జోన్ జట్టుకు సమాచారం ఇచ్చాడట. రెండో ఇన్నింగ్స్లో వైభవ్ సూర్యవంశీ తన లక్కీ నెంబర్ జెర్సీతోనే బరిలోకి దిగే అవకాశం లేకపోలేదు.Exciting early battle 🔥4️⃣,4️⃣,🇼Bishworjit Konthoujam wins the contest against Vaibhav Sooryavanshi 👌#DuleepTrophyScorecard ▶️ https://t.co/XJFhfvvTIU pic.twitter.com/4xGnLaAhpx— BCCI Domestic (@BCCIdomestic) August 23, 2026Read: బ్యాడ్మింటన్ దిగ్గజం సైనా నెహ్వాల్ కీలక ప్రకటన! -
ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ విఫలమైనా.. భారీ స్కోరు!
దులిప్ ట్రోఫీ- 2026 క్వార్టర్ ఫైనల్ తొలి ఇన్నింగ్స్లో ఈస్ట్ జోన్ భారీ స్కోరు సాధించింది. మిడిలార్డర్ బ్యాటర్ సుదీప్ కుమార్ ఘరామి, బౌలింగ్ ఆల్రౌండర్ షాబాజ్ అహ్మద్ భారీ శతకాలతో చెలరేగి జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. ప్రతిష్టాత్మక దేశీ రెడ్బాల్ టోర్నీ దులిప్ ట్రోఫీ మ్యాచ్లు ఆదివారం మొదలయ్యాయి.ఇందులో భాగంగా బెంగళూరు వేదికగా తొలి క్వార్టర్ ఫైనల్లో ఈస్ట్ జోన్- నార్త్ ఈస్ట్ జోన్ తలపడుతున్నాయి. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్ 2లో టాస్ గెలిచిన నార్త్ ఈస్ట్ జోన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ఈస్ట్ జోన్కు ఆరంభంలో ఎదురుదెబ్బలు తగిలాయి.వైభవ్ సూర్యవంశీ విఫలంఓపెనర్లలో సీనియర్ అభిమన్యు ఈశ్వరన్ (15), వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ (8) పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో వన్డౌన్లో వచ్చిన కుమార్ కుశాగ్రా (55).. నాలుగో నంబర్ బ్యాటర్ సుదీప్ కుమార్ ఘరామీ కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దారు.ఘరామీ, షాబాజ్ సెంచరీలుఈ క్రమంలో ఘరామీ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 185 బంతులు ఎదుర్కొన్న అతడు.. 25 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 146 పరుగులు సాధించాడు. మిగిలిన వారిలో విరాట్ సింగ్ (2), కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (4) నిరాశపరిచారు.ఇలాంటి తరుణంలో బౌలింగ్ ఆల్రౌండర్ షాబాజ్ అహ్మద్ అనూహ్య రీతిలో నిలకడైన ఆటతో సెంచరీతో కదం తొక్కాడు. మొత్తంగా 244 బంతులు ఎదుర్కొన్న షాబాజ్.. 167 పరుగులతో దుమ్ములేపాడు. అతడి ఇన్నింగ్స్లో 17 ఫోర్లు, నాలుగు సిక్స్లు ఉన్నాయి. ఇక మిగిలిన వారిలో అనుకూల్ రాయ్ (37) ఓ మోస్తరుగా రాణించగా.. మహ్మద్ షమీ 11, ముకేశ్ 7, అభిజిత్ సర్కార్ 9 (నాటౌట్) పరుగులు చేశారు.A masterclass in grit and determination! 🏏Shahbaz Ahmed brings up a magnificent 150 (211) for East Zone in the Duleep Trophy 2026-27, anchoring the innings with pure class. 🌟#DuleepTrophy #EastZone #ShahbazAhmed #CAB pic.twitter.com/RChs72osxT— CABCricket (@CabCricket) August 24, 2026 స్కోరెంతంటే?ఫలితంగా ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 112.5 ఓవర్లు ఆడి 467 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఘరామీ- షాబాజ్ అత్యధికంగా ఆరో వికెట్కు 150 పరుగులు జోడించారు. మరోవైపు.. అనుకుల్ రాయ్తో కలిసిషాబాజ్ ఏడో వికెట్కు 103 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇక నార్త్ ఈస్ట్ జోన్ బౌలర్లలో ఆకాశ్ చౌదరి, ఫిరోయిజామ్ జోటిన్ మూడేసి వికెట్లు తీయగా.. బిశ్వోర్జిత్ కొంతుజమ్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. కెప్టెన్ రంగ్సేన్ జొనాథన్, టెచి నెరి తలా ఒక వికెట్ పడగొట్టారు.చదవండి: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్ -
నిరాశపరిచిన వైభవ్ సూర్యవంశీ.. అంచనాలు తల్లకిందులు
దులీప్ ట్రోఫీ 2026 క్వార్టర్ఫైనల్లో ఈస్ట్ జోన్ తరఫున ఆడుతున్న బ్యాటింగ్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ దారుణంగా నిరాశపరిచాడు. రెడ్బాల్ క్రికెట్ తొలి పరీక్షలోనే అతడు ఘోరంగా విఫలమయ్యాడు. నార్త్ ఈస్ట్ జోన్తో బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఇవాళ ప్రారంభమైన మ్యాచ్లో వైభవ్ 6 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.ఈ మ్యాచ్కు ముందు వైభవ్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈస్ట్ జోన్కు వైస్ కెప్టెన్గా ఎంపిక కావడం అతడి రెడ్బాల్ సామర్థ్యాన్ని పరీక్షించే కీలక అవకాశంగా ఉండింది. అయితే ఈ అవకాశాన్ని వైభవ్ ఒడిసిపట్టుకోలేకపోయాడు. తక్కువ స్కోర్కే ఔటై, అభిమానులను నిరాశపరిచాడు.ఈ మ్యాచ్లో ఈస్ట్ జోన్ తొలుత బ్యాటింగ్కు దిగగా, కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్తో కలిసి వైభవ్ ఓపెనర్గా వచ్చాడు. రెండో ఓవర్లో బంతిని ఎదుర్కొన్న అతడు బిష్వర్జిత్ కొంథౌజమ్ బౌలింగ్లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు. దీంతో భారీ స్కోర్ చేసేలా కనిపించాడు.అయితే అదే ఓవర్ చివరి బంతికి అతడి ఇన్నింగ్స్ ముగిసింది. కొంథౌజమ్ ఆఫ్ స్టంప్ వెలుపల గుడ్ లెంగ్త్లో బంతిని వేశాడు. దానిని పాయింట్ దిశగా ఆడేందుకు ప్రయత్నించగా, గల్లీలో ఫీల్డర్కు క్యాచ్ ఇచ్చాడు.వైట్బాల్ క్రికెట్లో దూకుడుగా ఆడే వైభవ్కు రెడ్బాల్ ఫార్మాట్లో ప్రధాన సవాలు షాట్ ఎంపిక, ఓపికగా బ్యాటింగ్ చేయడం. కొత్త బంతిపై ప్రతి బంతినీ దాడి చేయకుండా, పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ గేర్ మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది.సూర్యవంశీకి ఇదే మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్లో మరో అవకాశం లభించే అవకాశం ఉంది. అక్కడ భారీ స్కోరు సాధిస్తే తొలి ఇన్నింగ్స్లో ఎదురైన వైఫల్యాన్ని కొంతవరకు భర్తీ చేయడమే కాకుండా, భవిష్యత్తులో మరిన్ని రెడ్బాల్ అవకాశాలకు తనను తాను బలంగా ప్రతిపాదించుకోగలడు.మ్యాచ్ విషయానికొస్తే.. 27 ఓవర్లు ముగిసే సమయానికి ఈస్ట్ జోన్ స్కోర్ 13-4గా ఉంది. అభిమన్యు ఈశ్వరన్ (15), వైభవ్ సూర్యవంశీ (8), కుమార్ కుషాగ్రా (55), విరాట్ సింగ్ (2) ఔట్ కాగా.. కెప్టెన్ ఇషాన్ కిషన్ (4), సుదీప్ కుమార్ ఘరామీ (49) క్రీజ్లో ఉన్నారు. -
సీనియర్లు ఉండగా ఇదేం పద్ధతి?: భారత మాజీ క్రికెటర్ ఫైర్
ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్గా వైభవ్ సూర్యవంశీని నియమించడంపై విమర్శలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే ఈ విషయంలో సెలక్టర్ల నిర్ణయాన్ని తప్పుబట్టగా.. తాజాగా భారత మాజీ క్రికెటర్ దీప్ దాస్ గుప్తా సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. రెడ్బాల్ క్రికెట్లో అనుభవం లేని ఆటగాడిని ఏకంగా వైస్ కెప్టెన్ను చేయడం ఏమిటని ప్రశ్నించాడు.అనుభవం తక్కువకాగా దేశవాళీ ప్రతిష్టాత్మక దులిప్ ట్రోఫీ తాజా ఎడిషన్లో ఈస్ట్ జోన్ జట్టుకు కెప్టెన్గా టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్ ఎంపిక కాగా.. అతడి డిప్యూటీగా పదిహేనేళ్ల వైభవ్కు అవకాశం దక్కింది. ఇక ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టినప్పటికీ ఈ బిహారీ పిల్లాడు రెడ్బాల్ క్రికెట్లో మాత్రం ఇప్పటికి కేవలం 8 మ్యాచ్లు ఆడి 207 పరుగులు చేశాడు.ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీకి ఏకంగా వైస్ కెప్టెన్గా ప్రమోషన్ ఇవ్వడంపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ విషయం గురించి భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దీప్ దాస్ గుప్తా సైతం సెలక్టర్ల నిర్ణయంపై పెదవి విరిచాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ..సీనియర్లు ఉండగా ఇదేం పద్ధతి?‘‘వైభవ్ను వైస్ కెప్టెన్గా నియమించడాన్ని నేను అస్సలు సమర్థించను. అనుకూల్ రాయ్ వంటి సీనియర్ ప్లేయర్లు ఎంతో మంది జట్టులో ఉన్నారు. చాలా ఏళ్లుగా వాళ్లంతా రెడ్బాల్ క్రికెట్లో సేవలు అందిస్తున్నారు. అలాంటి వాళ్లకి నాయకత్వ బృందంలో చోటివ్వాలి.15, 16 ఏళ్ల వయసుకే వైభవ్ సూర్యవంశీ క్రికెటర్గా పరిణతి సాధించాడని నేను ఒప్పుకొంటాను. అతడి ప్రతిభ విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. అయితే, రెడ్బాల్ క్రికెట్లో పూర్తిగా ఆడకముందే అతడికి వైస్ కెప్టెన్గా బాధ్యత ఇవ్వడం సరికాదు.అతడు ఇప్పుడిప్పుడే ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. వైస్ కెప్టెన్ స్థాయికి తగ్గ గణాంకాలు కూడా ప్రస్తుతం అతడి ఖాతాలో లేవు. ముందు అతడిని ఆడనివ్వండి. తనను తాను నిరూపించుకోనివ్వండి’’ అని దీప్ దాస్ గుప్తా సెలక్టర్లకు హితవు పలికాడు.మా నిర్ణయం సరైందేఇదిలా ఉంటే.. ఈస్ట్ జోన్ సెలక్టర్ ప్రవంజన్ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్న సంగతి తెలిసిందే. వైభవ్ సూర్యవంశీ ఏదో ఒకరోజు టీమిండియా కెప్టెన్ స్థాయికి ఎదుగుతాడని.. అన్నీ తెలిసే తాము అతడిని ఇప్పుడు వైస్ కెప్టెన్ని చేశామని పేర్కొన్నాడు. దులిప్ ట్రోఫీలో ప్రదర్శన ఆధారంగా వైభవ్ భారత టెస్టు జట్టుకు ఎంపికయ్యే అవకాశం ఉందన్నాడు.చదవండి: ఇంగ్లండ్ గడ్డ మీద ఇరగదీస్తున్న కుల్దీప్ యాదవ్ -
అందుకే వైస్ కెప్టెన్గా వైభవ్: కుండబద్దలు కొట్టిన సెలక్టర్
టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీకి దక్కిన ప్రమోషన్ పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పదిహేనేళ్ల ఈ బిహారీ పిల్లాడు ప్రతిష్టాత్మక దులిప్ ట్రోఫీ టోర్నీలో ఈస్ట్ జోన్కు వైస్ కెప్టెన్గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఇషాన్ కిషన్ సారథ్యంలో వైభవ్ అతడికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు.అయితే, వైభవ్ సూర్యవంశీకి ఏకంగా వైస్ కెప్టెన్గా బాధ్యతలు ఇవ్వడం పట్ల కామెంటేటర్ హర్షా భోగ్లే అభ్యంతరం వ్యక్తం చేశాడు. రెడ్బాల్ క్రికెట్లో పెద్దగా అనుభవం లేని పిల్లాడిని కీలక పదవికి ఎలా ఎంపిక చేస్తారని సెలక్టర్లను ప్రశ్నించాడు. అందుకే అతడిని వైస్ కెప్టెన్ని చేశాముఈ నేపథ్యంలో ఒడిశా మాజీ క్రికెటర్, ఈస్ట్ జోస్ సెలక్షన్ కమిటీలో భాగమైన ప్రవంజన్ ములిక్ స్పందించాడు. క్రిక్బజ్తో మాట్లాడుతూ.. ‘‘వైభవ్ను కెప్టెన్గా నియమించలేదు కదా!.. అతడు ఇప్పుడు కేవలం వైస్ కెప్టెన్ మాత్రమే. ఆ జట్టుకు ఇషాన్ కిషన్ సారథి. అయితే, ఇషాన్ వికెట్ కీపర్ కూడా!రోజంతా ఇషాన్ యాక్టివ్గానే ఉంటాడు. కాబట్టి వైభవ్కు పెద్దగా పనేమీ ఉండదు. అయితే, ఇషాన్కు డిప్యూటీగా అతడు ఎంతో కొంత నేర్చుకుంటాడు. మరింత పరిణతి సాధిస్తాడు. అందుకే అతడిని వైస్ కెప్టెన్గా ఎంపిక చేశాము. ఏదో ఒకరోజు టీమిండియా కెప్టెన్ అవుతాడుదులిప్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మక టోర్నీలో ఉప నాయకుడిగా ఉండటం గొప్ప అవకాశం. అతడు టీమిండియా తరఫున బాగా ఆడాలని కోరుకుంటున్నాడు. మేము కూడా యువ ఆటగాళ్లకు సరైన సమయంలో అవకాశాలు ఇవ్వాలని భావిస్తున్నాము. ఎవరికి తెలుసు.. ఏదో ఒకరోజు వైభవ్ టీమిండియా కెప్టెన్ కూడా అవ్వొచ్చు.ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకునే మేము అతడికి వైస్ కెప్టెన్గా అవకాశం ఇచ్చాము. ఇంతకు ముందు భారత అండర్-19 జట్టుకు, బిహార్ ఫస్ట్క్లాస్ క్రికెట్ జట్టుకు అతడు వైస్ కెప్టెన్గా వ్యవహరించాడు. దులిప్ ట్రోఫీ సందర్భంగా జాతీయ సెలక్టర్లు అతడి ఆటను తప్పక పరిశీలిస్తారు. అతడు త్వరలోనే భారత టెస్టు జట్టుకు కూడా ఎంపికయ్యే అవకాశాలు లేకపోలేదు కదా!’’ అని ప్రవంజన్ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు.చదవండి: టీమిండియాకు శుభవార్త -
వైస్ కెప్టెన్గా ఎంపికైన వైభవ్ సూర్యవంశీ
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. జింబాబ్వే పర్యటనలో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు అందుకున్న కొద్ది రోజులకే, భారత దేశవాళీ క్రికెట్లో ప్రతిష్ఠాత్మకమైన దులీప్ ట్రోఫీ 2026 కోసం ప్రకటించిన ఈస్ట్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు.కేవలం 15 ఏళ్ల వయసులోనే భారత జట్టులో చోటు సంపాదించిన వైభవ్ ఇప్పటివరకు ఎనిమిది ఫస్ట్క్లాస్ మ్యాచ్లు మాత్రమే ఆడినా, భారత క్రికెట్ భవిష్యత్తు స్టార్గా గుర్తింపు పొందుతున్నాడు.జూలై 29న ప్రకటించిన 15 మంది సభ్యుల ఈస్ట్ జోన్ జట్టుకు భారత వికెట్కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కెప్టెన్గా ఎంపిక కాగా, వైభవ్ సూర్యవంశీకి వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు.ఈ జట్టులో భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ, ముకేశ్ కుమార్, షాబాజ్ అహ్మద్, అభిమన్యు ఈశ్వరన్, అనుకుల్ రాయ్, విరాట్ సింగ్ తదితరులు కూడా చోటు దక్కించుకున్నారు.దులీప్ ట్రోఫీ 2026 ఈస్ట్ జోన్ జట్టు: అభిమన్యు ఈశ్వరన్, సుదీప్ కుమార్ ఘరామి, షాబాజ్ అహ్మద్, సూరజ్ సింధు జైస్వాల్, మహ్మద్ షమీ, ముకేశ్ కుమార్, ఇషాన్ కిషన్ (కెప్టెన్), కుమార్ కుషాగ్ర, శిఖర్ మోహన్, అనుకుల్ రాయ్, విరాట్ సింగ్, సుభ్రాంశు సేనాపతి, వైభవ్ సూర్యవంశీ (వైస్ కెప్టెన్), దెనీష్ దాస్, అభిజిత్ సర్కార్.స్టాండ్బై ఆటగాళ్లు: ఆయుష్ లోహరుకా, శ్రీదామ్ పాల్, సాంబిత్ ఎస్. బరాల్, శరణ్దీప్ సింగ్, స్వస్తిక్ సమల్.కాగా, దులీప్ ట్రోఫీ ఆగస్ట్ 23 నుండి సెప్టెంబర్ 10 వరకు జరుగనుంది. 23నే ప్రారంభం కానున్న తొలి క్వార్టర్ ఫైనల్లో ఈస్ట్ జోన్ జట్టు నార్త్ ఈస్ట్ జోన్తో తలపడనుంది. ఆగస్ట్ 15 నుండి 27 మధ్యలో టీమిండియా శ్రీలంక పర్యటనలో రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడనున్నప్పటికీ.. టెస్ట్ జట్టులో ఇషాన్, వైభవ్కు చోటు దక్కని విషయం తెలిసిందే. -
కెప్టెన్ ఇషాన్ కిషన్ అవుట్.. కారణం ఇదే!
దులిప్ ట్రోఫీ ఆరంభానికి ముందు ఈస్ట్ జోన్ జట్టుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) ఈ రెడ్బాల్ టోర్నీకి దూరమయ్యాడు. ఒడిశాకు చెందిన ఆశిర్వాద్ స్వైన్ ఇషాన్ స్థానంలో ఈస్ట్ జోన్కు ఎంపికయ్యాడు. కాగా జాతీయ జట్టుకు చాన్నాళ్లుగా దూరంగా ఉన్న ఇషాన్ కిషన్.. ఇటీవల ఇంగ్లండ్లో కౌంటీ క్రికెట్ ఆడాడు.టీమిండియా సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చినా..నాటింగ్హాంప్షైర్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఇషాన్.. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే టీమిండియా సెలక్టర్ల నుంచి పిలుపు అందుకున్నాడు. ఇంగ్లండ్తో నాలుగో టెస్టు సందర్భంగా రిషభ్ పంత్ (Rishabh Pant) గాయపడి.. ఆఖరి మ్యాచ్కు దూరం కాగా.. ఈ వికెట్ కీపర్తో పంత్ స్థానాన్ని భర్తీ చేయాలని సెలక్టర్లు భావించారు.అయితే, ఇషాన్ కిషన్ స్కూటీ మీద నుంచి కిందపడిన కారణంగా.. అతడి ఎడమ పాదానికి గాయమైనట్లు తెలిసింది. దీంతో బోర్డు నుంచి పిలుపు వచ్చినా అతడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ క్రమంలో దులిప్ ట్రోఫీ (Duleep Trophy 2025)లో ఈస్ట్ జోన్ కెప్టెన్గా ఇషాన్ కిషన్కు మరోసారి తనను తాను నిరూపించుకునే అవకాశం వచ్చింది.కారణం ఇదేనా?కానీ.. ఫిట్నెస్ కారణాల వల్ల ఇషాన్ కిషన్ ఈ టోర్నీ మొత్తానికి దూరం కానున్నట్లు తాజా సమాచారం. అతడి స్థానంలో బెంగాల్ మేటి ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ ఈస్ట్ జోన్ సారథిగా వ్యవహరించనున్నాడు. అదే విధంగా.. ఒడిశా యువ ఆటగాడు ఆశిర్వాద్.. వికెట్ కీపర్గా ఇషాన్ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు.ఒడిశా నుంచి మూడో ప్లేయర్ఇక ఒడిశా నుంచి ఇప్పటికే ఈస్ట్ జోన్ జట్టులో సందీప్ పట్నాయక్ ఉండగా.. స్వస్తిక్ సమాల్ స్టాండ్ బై ప్లేయర్గా ఉన్నాడు. కాగా ఇషాన్ కిషన్ దులిప్ ట్రోఫీ టోర్నీకి దూరం కావడానికి స్పష్టమైన కారణాలు మాత్రం తెలియలేదు. అయితే, ఒడిషా క్రికెట్ అసోసియేషన్ ప్రకటన ద్వారానే.. ఇషాన్ స్థానంలో ఆశిర్వాద్ జట్టులోకి వచ్చినట్లు వెల్లడైంది.కాగా 2021లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఇషాన్ కిషన్.. ఇప్పటి వరకు రెండు టెస్టులు, 27 వన్డేలు, 32 టీ20లు ఆడాడు. ఈ ఓపెనింగ్ బ్యాటర్ టెస్టుల్లో 78, వన్డేల్లో 933, టీ20 మ్యాచ్లలో 796 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. ఆగష్టు 28 నుంచి బెంగళూరు వేదికగా దులిప్ ట్రోఫీ-2025 ఆరంభం కానుంది. కాగా ఇషాన్ కంటే ముందు ఆకాశ్ దీప్ కూడా ఈస్ట్ జోన్ జట్టుకు దూరమయ్యాడు.దులిప్ ట్రోఫీ-2025 టోర్నీకి ఈస్ట్ జోన్ జట్టు (అప్డేటెడ్)అభిమన్యు ఈశ్వరన్, ఆశీర్వాద్ స్వైన్ (వికెట్ కీపర్), సందీప్ పట్నాయక్, విరాట్ సింగ్, డెనిష్ దాస్, శ్రీదామ్ పాల్, శరణ్దీప్ సింగ్, కుమార్ కుషాగ్రా, రియాన్ పరాగ్, ఉత్కర్ష్ సింగ్, మనీషి, సూరజ్ సింధు జైస్వాల్, ముఖేష్ కుమార్, మహ్మద్ షమీ.స్టాండ్ బై ప్లేయర్లుముఖ్తార్ హుస్సేన్, వైభవ్ సూర్యవంశీ, స్వస్తిక్ సమాల్, సుదీప్ కుమార్ ఘరామి, రాహుల్ సింగ్.చదవండి: ‘ఆసియా కప్-2025 జట్టు ఇదే: సంజూ, రింకూ, తిలక్లకు నో ఛాన్స్’ -
ఇషాన్ కిషన్ సేనకు భారీ షాక్.. టీమిండియా స్టార్ ఆటగాడు దూరం
దులీప్ ట్రోఫీ-2025 ప్రారంభానికి ముందు ఇషాన్ కిషన్ నేతృత్వం వహిస్తున్న ఈస్ట్ జోన్ జట్టుకు భారీ షాక్ తగిలింది. కీలక పేసర్ ఆకాశ్దీప్ జట్టు నుంచి తప్పించబడ్డాడు. కారణం ఏమో తెలీదు కాని, ఆకాశ్దీప్ స్థానంలో అస్సాం మీడియం పేసర్ ముక్తర్ హుసేన్ జట్టులోకి వచ్చాడు. ఎన్సీఏ ఆకాశ్దీప్ను విశ్రాంతి తీసుకోవాలని సిఫార్చు చేసినట్లు పీటీఐ చెబుతుంది.ఆకాశ్దీప్ కొద్ది రోజుల కిందట ప్రకటించిన 15 మంది సభ్యుల ఈస్ట్ జోన్ జట్టులో ఉన్నాడు. అతను టీమిండియా పేసర్లు మహ్మద్ షమీ, ముకేశ్ కుమార్లతో కలిసి బంతిని పంచుకోవాల్సి ఉండింది. అయితే అతను అనూహ్యంగా జట్టు నుంచి తప్పించబడ్డాడు.ఆకాశ్దీప్ తాజాగా ముగిసిన ఇంగ్లండ్ పర్యటనలో సంచలన ప్రదర్శనలు నమోదు చేశాడు. టీమిండియా గెలిచిన బర్మింగ్హమ్ టెస్ట్లో 10 వికెట్ల ప్రదర్శన సహా ఓవల్ టెస్ట్లో నైట్ వాచ్మన్గా కీలకమైన హాఫ్ సెంచరీ చేశాడు.కాగా, ఈస్ట్ జోన్ జట్టుకు టీమిండియా ప్లేయర్ ఇషాన్ కిషన్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. అతడికి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) అభిమన్యు ఈశ్వరన్ ఎంపికయ్యాడు. జట్టులో విధ్వంసకర ఆటగాడు రియాన్ పరాగ్ చోటు దక్కించుకున్నాడు. భారత యువ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ రిజర్వ్ ప్లేయర్గా ఎంపికయ్యాడు.దులీప్ ట్రోఫీ కోసం ఈస్ట్ జోన్ జట్టు- ఇషాన్ కిషన్ (wk/c), అభిమన్యు ఈశ్వరన్, సందీప్ పట్నాయక్, విరాట్ సింగ్, డెనిష్ దాస్, శ్రీరామ్ పాల్, శరణ్దీప్ సింగ్, కుమార్ కుషాగ్రా, రియాన్ పరాగ్, ఉత్కర్ష్ సింగ్, మనీషి, సూరజ్ జైస్వాల్, ముఖేష్ కుమార్, ముక్తార్ హుసేన్, మొహమ్మద్ షమీస్టాండ్బై ప్లేయర్లు- ముఖ్తార్ హుస్సేన్, ఆశీర్వాద్ స్వైన్, వైభవ్ సూర్యవంశీ, స్వస్తిక్ సమాల్, సుదీప్ కుమార్ ఘరామి, రాహుల్ సింగ్ -
కెప్టెన్గా ఇషాన్ కిషన్.. జట్టులో వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్
త్వరలో ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీ కోసం 15 మంది సభ్యుల ఈస్ట్ జోన్ జట్టును ఇవాళ (ఆగస్ట్ 1) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా టీమిండియా పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ ఎంపికయ్యాడు. అతనికి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న అభిమన్యు ఈశ్వరన్ వ్యవహరించనున్నాడు.ఫిట్నెస్ సమస్యల కారణంగా ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక కాని మొహమ్మద్ షమీ ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు. షమీ తన బెంగాల్ సహచరుడు ముకేశ్ కుమార్, ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న ఆకాశ్దీప్తో కలిసి పేస్ బౌలింగ్ బాధ్యతలను పంచుకోనున్నాడు.జట్టులో అసోం సారధి, రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ కూడా చోటు దక్కించుకున్నాడు. భారత యువ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ రిజర్వ్ ప్లేయర్గా ఎంపికయ్యాడు. ఈ జట్టుకు సారధిగా ఎంపికైన ఇషాన్ ఇటీవల ఇంగ్లండ్ కౌంటీల్లో విశేషంగా రాణించాడు. ఇంగ్లండ్ పర్యటనలో రిషబ్ పంత్ గాయపడటంతో అతనికి ప్రత్యామ్నాయంగా ఇషాన్ను సంప్రదించినప్పటికీ.. అతను కూడా గాయంతో బాధపడుతున్నట్లు తెలిపాడు. దీంతో పంత్కు ప్రత్యామ్నాయంగా ఎన్ జగదీశన్ను ఎంపిక చేశారు.దులీప్ ట్రోఫీ కోసం ఈస్ట్ జోన్ జట్టు- ఇషాన్ కిషన్ (wk/c), అభిమన్యు ఈశ్వరన్, సందీప్ పట్నాయక్, విరాట్ సింగ్, డెనిష్ దాస్, శ్రీరామ్ పాల్, శరణ్దీప్ సింగ్, కుమార్ కుషాగ్రా, రియాన్ పరాగ్, ఉత్కర్ష్ సింగ్, మనీషి, సూరజ్ జైస్వాల్, ముఖేష్ కుమార్, ఆకాశ్దీప్, మొహమ్మద్ షమీస్టాండ్బై ప్లేయర్లు- ముఖ్తార్ హుస్సేన్, ఆశీర్వాద్ స్వైన్, వైభవ్ సూర్యవంశీ, స్వస్తిక్ సమాల్, సుదీప్ కుమార్ ఘరామి, రాహుల్ సింగ్ -
Riyan Parag: ఓవరాక్షన్ ప్లేయర్ అన్న నోళ్లతోనే శభాష్ అనిపించుకున్నాడు..!
ఆన్ ఫీల్డ్ బిహేవియర్ కారణంగా ఓవరాక్షన్ ప్లేయర్గా ముద్ర వేసుకున్న టీమిండియా యువ ఆటగాడు రియాన్ పరాగ్.. తనను తిట్టిన నోళ్లతోనే పొగిడించుకుంటున్నాడు. ఆట కంటే అతి ఎక్కువగా చేసి బాగా పాపులరైన రియాన్.. తాజాగా ముగిసిన దియోదర్ ట్రోఫీ-2023లో బ్యాట్తో బంతితో చెలరేగి విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు. దియోదర్ ట్రోఫీలో 5 మ్యాచ్లు ఆడిన రియాన్.. 2 సెంచరీలు, అర్ధసెంచరీ సాయంతో 88.50 సగటున 354 పరుగులు చేసి టోర్నీ టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ టోర్నీలో పరుగుల వరద పారించిన రియాన్.. బంతితోనూ మెరిశాడు. 19.09 సగటున 11 వికెట్లు తీశాడు. ఈ టోర్నీలో ఆల్రౌండ్ ప్రదర్శనతో ఇరగదీసిన రియాన్.. ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు సైతం సొంతం చేసుకున్నాడు. తన జట్టు (ఈస్ట్ జోన్) కష్ట సమయాల్లో ఉన్నప్పుడు కీలక ఇన్నింగ్స్లు ఆడిన రియాన్.. మ్యాచ్ విన్నర్గా నిలిచాడు. సౌత్ జోన్తో నిన్న (ఆగస్ట్ 3) జరిగిన ఫైనల్లోనూ ఆల్రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకున్న 21 ఏళ్ల రియాన్.. తన జట్టును గెలిపించేందుకు శత విధాల ప్రయత్నించి విఫలమయ్యాడు. తొలుత బంతితో (2/68) మ్యాజిక్ చేసిన రియాన్.. ఆ తర్వాత బ్యాట్తో చెలరేగి విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్లో 65 బంతులు ఎదుర్కొన్న రియాన్.. 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 95 పరుగులు చేశాడు. భారీ లక్ష్య ఛేదనలో కుమార్ కుషాగ్రాతో (68) కలిసి కీలక భాగాస్వామ్యం నెలకొల్పిన రియాన్.. ఆరో వికెట్గా వెనుదిరగడంతో ఈస్ట్ జోన్ ఓటమి ఖరారైంది. కాగా, దియోదర్ ట్రోఫీ ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ జోన్.. రోహన్ కున్నుమ్మల్ (107), మయాంక్ అగర్వాల్ (63) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన ఈస్ట్ జోన్.. 46.1 ఓవర్లలో 283 పరుగులకు ఆలౌటై 45 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈస్ట్ జోన్ ఇన్నింగ్స్లో రియాన్ పరాగ్, కుషాగ్రా మినహా ఎవ్వరూ రాణించలేకపోయారు. దియోదర్ ట్రోఫీ-2023లో రియాన్ పరాగ్ స్కోర్లు, వికెట్లు.. నార్త్ ఈస్ట్ జోన్పై 13 పరుగులు, 4 వికెట్లు నార్త్ జోన్పై 131 పరుగులు, 4 వికెట్లు సౌత్ జోన్పై 13 పరుగులు, ఒక వికెట్ వెస్ట్ జోన్పై 102 నాటౌట్ ఫైనల్లో సౌత్ జోన్పై 95 పరుగులు, 2 వికెట్లు -
రియాన్ పరాగ్ మెరుపులు వృథా.. దేవధర్ ట్రోఫీ విజేత సౌత్జోన్
దేశవాళీ జోనల్ వన్డే క్రికెట్ టోర్నీ దేవధర్ ట్రోఫీలో మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని సౌత్జోన్ జట్టు అజేయ విజేతగా నిలిచింది. పుదుచ్చేరిలో గురువారం జరిగిన ఫైనల్లో సౌత్జోన్ 45 పరుగుల తేడాతో ఈస్ట్జోన్ జట్టును ఓడించి తొమ్మిదోసారి దేవధర్ ట్రోఫీని సొంతం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌత్జోన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 328 పరుగులు చేసింది. రోహన్ (75 బంతుల్లో 107; 11 ఫోర్లు, 4 సిక్స్లు) సెంచరీ సాధించాడు. మయాంక్ (63; 4 ఫోర్లు), జగదీశన్ (54; 2 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం 329 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఈస్ట్జోన్ 46.1 ఓవర్లలో 283 పరుగులకు ఆలౌటైంది. రియాన్ పరాగ్ (95; 8 ఫోర్లు, 5 సిక్స్లు) మెరిపించినా మిగతావాళ్లు రాణించడంలో విఫలమయ్యారు. సౌత్జోన్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు తీయగా... వైశాఖ్, కౌశిక్, విద్వత్ రెండు వికెట్ల చొప్పున పడగొట్టారు. టోర్నీలో 354 పరుగులు చేయడంతో పాటు 11 వికెట్లు తీసిన రియాన్ పరాగ్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. 𝗦𝗢𝗨𝗧𝗛 𝗭𝗢𝗡𝗘 are WINNERS of the #DeodharTrophy 2023-24! 🙌 Congratulations to the @mayankcricket-led unit 👏👏 East Zone fought hard in a high-scoring battle here in Puducherry 👌👌 Scorecard - https://t.co/afLGJxp77b#Final | #SZvEZ pic.twitter.com/x6PEjFp5Pr — BCCI Domestic (@BCCIdomestic) August 3, 2023 చదవండి: IND vs WI: టీమిండియా బౌలర్ అరుదైన ఘనత.. రెండో భారత క్రికెటర్గా -
సిక్సర్ల వర్షం.. సెంచరీతో పాటు 4 వికెట్లు! రియాన్ పరాగ్ విధ్వంసం.. నిజమేనా?
Deodhar Trophy 2023- North Zone vs East Zone: దియోధర్ ట్రోఫీ-2023లో ఈస్ట్ జోన్ బ్యాటర్ రియాన్ పరాగ్ అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. నార్త్ జోన్తో జరిగిన మ్యాచ్లో సెంచరీ సాధించాడు. తన విలువైన ఇన్నింగ్స్లో జట్టును గెలిపించాడు. కాగా పుదుచ్చేరి వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్లో నార్త్ జోన్- ఈస్ట్ జోన్ తలపడ్డాయి. టాస్ గెలిచిన ఈస్ట్ జోన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ శుభారంభం అందుకోలేకపోయింది. టాపార్డర్లో మొత్తం పూర్తిగా విఫలమైంది. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్(10), ఉత్కర్ష్ సింగ్(11) స్వల్ప స్కోర్లకే వెనుదిరగగా.. వన్డౌన్లో వచ్చిన విరాట్ సింగ్ కేవలం 2 పరుగులు చేశాడు. రియాన్ పరాగ్ సిక్సర్ల వర్షం ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్ చేసిన సుభ్రాంషు సేనాపతి (13), కెప్టెన్ సౌరభ్ తివారి(16) సైతం నిరాశపరిచారు. ఈ క్రమంలో ఆరో స్థానంలో బరిలోకి దిగిన రియాన్ పరాగ్ ఓవైపు వికెట్లు పడుతున్నా పట్టుదలగా నిలబడ్డాడు. వికెట్ కీపర్ బ్యాటర్ కుశర్గ(98)తో కలిసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. అద్భుత సెంచరీ 102 బంతుల్లో 5 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 131 పరుగులు సాధించాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఈస్ట్ జోన్ 8 వికెట్ల నష్టపోయి ఏకంగా 337 పరుగులు సాధించింది. లక్ష్య ఛేదనకు దిగిన నార్త్ జోన్ బ్యాటింగ్ ఆర్డర్ను రియాన్ పరాగ్ కకావికలం చేశాడు. నాలుగు వికెట్లు తీసి 10 ఓవర్ల బౌలింగ్లో 57 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. షాబాజ్ అహ్మద్ 3 వికెట్లు పడగొట్టగా.. ఉత్కర్ష్, ఆకాశ్ దీప్, ముఖ్తార్ హుసేన్ తలా ఓ వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. దీంతో 45.3 ఓవర్లలోనే నార్త్ జోన్ కథ ముగిసింది. 249 పరుగులకే ఆ జట్టు ఆలౌట్ కావడంతో.. 88 పరుగులతో ఈస్ట్జోన్ జయభేరి మోగించింది. అస్సలు ఊహించలేదు.. ఈ నేపథ్యంలో రియాన్ పరాగ్ ప్రదర్శనపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఎన్నాళ్లకెన్నాళ్లకు.. రియాన్ పరాగ్ ఇప్పటికైనా నువ్వున్నావని గుర్తించేలా చేశావు... అది కూడా ఆటతో! అస్సలు ఊహించలేదు’’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. కాగా ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ అసోం కుర్రాడు.. ఆట కంటే తన చేష్టలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. ఓవరాక్షన్ ప్లేయర్గా ముద్రపడి విమర్శలు ఎదుర్కొన్నాడు. తాజా సీజన్లో 7 ఇన్నింగ్స్ ఆడి 78 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో రియాన్ దియోదర్ ట్రోఫీ ప్రదర్శనపై నెటిజన్లు ఈ మేరకు కామెంట్లు చేయడం గమనార్హం. చదవండి: టీమిండియా క్రికెటర్లలో ప్రభుత్వ ఉద్యోగులు వీరే! లిస్టులో ఊహించని పేర్లు.. -
హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పునర్వ్యవస్థీకరణ పూర్తి.. నయా స్వరూపం ఇలా..
సాక్షి, హైదరాబాద్: సిటీ పోలీసు కమిషనరేట్ పునర్ వ్యవస్థీకరణ కొలిక్కి వచి్చంది. నగరంలో కొత్తగా రెండు జోన్లు, 10 డివిజన్లు, 13 ఠాణాలు ఏర్పాటు కానున్నాయి. దీంతో జోన్ల సంఖ్య ఐదు నుంచి ఏడుకు, డివిజన్లు 17 నుంచి 27కు, ఠాణాలు 60 నుంచి 73కు చేరనున్నాయి. ఈ మార్పు చేర్పుల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న కొన్ని డివిజన్లు మాయమవుతుండగా.. ఠాణాల పరిధులు మారుతున్నాయి. పక్షం రోజుల్లో వీటికి సంబంధించిన కార్యాలయాల ఎంపిక పూర్తి చేయాలని, కొత్త ఏడాది నుంచి పని ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇటీవల పోలీసు విభాగానికి 3,966 పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటి నుంచి సిటీకి మూడు డీసీపీ, 12 ఏసీపీ, 26 ఇన్స్పెక్టర్ సహా 1,252 పోస్టులు వచ్చాయి. గతేడాది డిసెంబర్లో నగర కొత్వాల్గా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. వీటిలో భాగంగానే పునర్ వ్యవస్థీకరణపైనా ఆయన దృష్టి పెట్టారు. ప్రభుత్వ అనుమతితో ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన తుది నివేదికకు ఇటీవలే ప్రభుత్వ ఆమోదం లభించింది. వచ్చే జనవరి 1 నుంచి పని ప్రారంభించేందుకు సీపీ ఆనంద్ సన్నాహాలు చేస్తున్నారు. ఈస్ట్ జోన్: ప్రస్తుతం సుల్తాన్బజార్, కాచిగూడ, మలక్పేట డివిజన్లు.. సుల్తాన్బజార్, చాదర్ఘాట్, అఫ్జల్గంజ్, కాచిగూడ, నల్లకుంట, ఉస్మానియా యూనివర్సిటీ, మలక్పేట, సైదాబాద్, అంబర్పేట్ ఠాణాలు ఉన్నాయి. తాజా మార్పుచేర్పులతో నార్త్జోన్, సెంట్రల్ జోన్లలోని కొన్ని ఠాణాలు దీంట్లోకి వస్తున్నాయి. కాచిగూడ, మలక్పేట డివిజన్లు మాయమై అంబర్పేట, చిలకలగూడ, ఉస్మానియా యూనివర్సిటీ పేరు తో కొత్తవి వస్తున్నాయి. వారాసిగూడ పేరుతో కొత్త ఠాణా, చిలకలగూడ, లాలాగూడ, నారాయణగూడ ఠాణాలు ఈ జోన్లోకి వస్తున్నాయి. నార్త్జోన్: ఇందులో గోపాలపురం, మహంకాళి, బేగంపేట సబ్–డివిజన్లు, గోపాలపురం, తుకారాంగేట్, లాలాగూడ, చిలకలగూడ, మహంకాళి, మార్కెట్, మారేడ్పల్లి, కార్ఖానా, బేగంపేట, బోయిన్పల్లి, బొల్లారం, తిరుమలగిరి ఠాణాలు ఉన్నాయి. తాజా మార్పుచేర్పులతో తిరుమలగిరి కేంద్రంగా డివిజన్ ఏర్పడుతోంది. తాడ్బన్లో కొత్త ఠాణాతో పాటు మధ్య మండల నుంచి రామ్గోపాల్పేట ఈ జోన్లోకే వస్తోంది. సౌత్ జోన్: ప్రస్తుతం చార్మినార్, మీర్చౌక్, ఫలక్నుమా, సంతోష్నగర్ డివిజన్లు, చార్మినార్, బహదూర్పుర, కామాటిపుర, హుస్సేనిఆలం, కాలాపత్తర్, మీర్చౌక్, డబీర్పుర, మొఘల్పుర, రెయిన్బజార్, ఫలక్నుమా, చాంద్రాయణగుట్ట, శాలిబండ, ఛత్రినాక, కంచన్బాగ్, భవానీనగర్, మాదన్నపేట, సంతోష్నగర్ ఠాణాలు ఉన్నాయి. పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ జోన్లో ఉండే ఫలక్నుమా డివిజన్ మాయమవుతోంది. దాని స్థానంలో బహదూర్పుర వస్తుండగా.. పోలీసుస్టేషన్ల 11కు తగ్గుతున్నాయి. వెస్ట్ జోన్: ప్రస్తుతం పంజగుట్ట, బంజారాహిల్స్, ఆసిఫ్నగర్ డివిజన్లు, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఎస్సార్నగర్, ఆసిఫ్నగర్, హుమాయున్నగర్, లంగర్హౌస్, గోల్కొండ, టప్పాచబుత్ర, షాహినాయత్గంజ్, హబీబ్నగర్, కుల్సుంపుర, మంగళ్హాట్ ఠాణాలు ఉన్నాయి. తాజా మార్పుచేర్పులతో ఆసిఫ్నగర్ డివిజన్ ఈ జోన్ నుంచి మాయమవుతోంది. దీని స్థానంలో జూబ్లీహిల్స్ పేరుతో కొత్తది వస్తోంది. మాసబ్ట్యాంక్, రెహ్మత్నగర్, ఫిలింనగర్, బోరబండల్లో కొత్త ఠాణాలు వస్తున్నాయి. వీటితో పాటు ఈ జోన్లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, ఎస్సార్నగర్ ఠాణాలు మాత్రమే ఉంటాయి సౌత్ ఈస్ట్ జోన్: కమిషనరేట్లో ఆరో జోన్గా సౌత్ ఈస్ట్ ఏర్పడుతోంది. ఇందులో కొత్తగా ఏర్పాటయ్యే చాంద్రాయణగుట్ట, సైదాబాద్ సబ్–డివిజన్లతో పాటు ఈస్ట్ నుంచి వచ్చే మలక్పేట, సౌత్ నుంచి వచ్చే సంతోష్నగర్ డివిజన్లు ఉండనున్నాయి. ఆ రెండు జోన్ల నుంచి వేరయ్యే చంద్రాయణగుట్ట, కంచన్బాగ్, చాదర్ఘాట్, మలక్పేట, మాదన్నపేట, సైదాబాద్, రెయిన్బజార్, భవానీనగర్, సంతోష్నగర్లతో పాటు కొత్తగా బండ్లగూడ, ఐఎస్ సదన్ ఠాణాలు ఈ కొత్త జోన్లో ఉంటాయి. సౌత్ వెస్ట్ జోన్: ఏడో జోన్గా పరిగణించే సౌత్ వెస్ట్ మరో కొత్త జోన్గా అవతరిస్తోంది. ఇందులో వెస్ట్, సెంట్రల్ జోన్ల నుంచి వేరైన ఆసిఫ్నగర్, బేగంబజార్తో పాటు కొత్తగా గోల్కొండ, కుల్సుంపుర డివిజన్లు వచ్చి చేరుతున్నాయి. ఆ రెండు జోన్ల నుంచే విభజించిన ఆసిఫ్నగర్, హుమాయున్నగర్, హబీబ్నగర్, బేగంబజార్, షాహినాయత్గంజ్, మంగళ్హాట్, గోల్కొండ, లంగర్హౌస్, కుల్సుంపుర, టప్పాచబుత్ర ఠాణాలతో పాటు కొత్తగా టోలిచౌకి, గుడిమల్కాపూర్ పోలీసుస్టేషన్లు రానున్నాయి. సెంట్రల్ జోన్: ప్రస్తుతం ఈ జోన్లో అబిడ్స్, చిక్కడపల్లి, సైఫాబాద్ డివిజన్లు.. అబిడ్స్, నారాయణగూడ, బేగంబజార్, గాంధీనగర్, ముషీరాబాద్, చిక్కడపల్లి, నాంపల్లి, రామ్గోపాల్పేట, సైఫాబాద్ పోలీసుస్టేషన్లు ఉన్నాయి. తాజా మార్పు చేర్పులతో గాం«దీనగర్ డివిజన్గా ఏర్పడుతోంది. దోమలగూడ, లేక్ పోలీసు, ఖైరతాబాద్ల్లో కొత్త ఠాణాలు ఏర్పాడుతున్నాయి. నారాయణగూడ, బేగంబజార్, నాంపల్లి, రామ్గోపాల్పేట్ ఠాణాలు ఈ జోన్లో ఉండవు. -
గతంలో భరత్పై కేసు పెట్టలేదు : ఈస్ట్ జోన్ డీసీపీ
సాక్షి, హైదరాబాద్ : బర్కత్పురాలో ఇంటర్ విద్యార్థినిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది భరత్ను పోలీసులు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ రెడ్డి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కొబ్బరి బోండాలకు వాడే కత్తితో నిందితుడు అమ్మాయిపై దాడి చేసి.. విచక్షణారహితంగా నరికాడని తెలిపారు. మెరుగైన వైద్యం కోసం బాధితురాలిని యశోదా ఆస్పత్రికి తరలించామని.. ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని పేర్కొన్నారు. (ప్రేమోన్మాది భరత్ అరెస్టు) అప్పుడు కేసు మాత్రం పెట్టలేదు.. నిందితుడు భరత్ను పట్టుకునేందుకు పోలీసులు మూడు టీములగా విడిపోయి వెదికినట్లు డీసీపీ తెలిపారు. అతడిని మూసీ నది సమీపంలో అదుపులోకి తీసుకున్నామన్నారు. బాధితురాలు- నిందితుడు ఒకే కాలనీలో ఉంటున్నారని పేర్కొన్నారు. అమ్మాయి ఇంటికి సమీపంలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని తెలిపారు. గతంలో తమ కూతురిని వేధిస్తున్నాడని బాధితురాలి కుటుంబ సభ్యులు భరోసా సెంటర్ను ఆశ్రయించారన్నారు. అయితే కేసు మాత్రం పెట్టలేదని వెల్లడించారు. ప్రస్తుతం భరత్ తమ కస్టడీలోనే ఉన్నాడని.. దాడి చేయడానికి గల కారణాలను పూర్తి స్థాయిలో విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. (హైదరాబాద్ బర్కత్పురాలో ఘోరం) -
సెమీస్లో సౌత్జోన్, ఈస్ట్ జోన్
ఎఫ్సీఐ ఇంటర్ జోనల్ బ్యాడ్మింటన్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: ఆలిండియా ఎఫ్సీఐ ఇంటర్ జోనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో సౌత్ జోన్, ఈస్ట్ జోన్ జట్లు సెమీఫైనల్కు చేరుకున్నారుు. ఎల్బీ స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన టీమ్ చాంపియన్షిప్ తొలి క్వార్టర్స్ ఫైనల్లో సౌత్జోన్ జట్టు... వెస్ట్ జోన్ జట్టుపై గెలుపొందింది. సింగిల్స్ మ్యాచ్లో సిద్ధార్థ్ ఠాకూర్ 21-8, 21-8తో లిఖిత్పై గెలుపొందాడు. డబుల్స్ మ్యాచ్లో సిద్ధార్థ్- సృజన్ జోడీ 21-15, 21-10తో లిఖిత్- సుశ్రుత్ జంటపై విజయం సాధించింది. రెండో క్వార్టర్ ఫైనల్లో ఈస్ట్ జోన్ జట్టు... నార్త్ ఈస్ట్ జట్టును ఓడించి సెమీస్కు చేరుకుంది. మహిళల క్వార్టర్స్ మ్యాచ్ల్లో నార్త్జోన్ జట్టు... ఈస్ట్ జోన్పై గెలుపొందింది. టేబుల్ టెన్నిస్ ఈవెంట్లో బుధవారం జరిగిన పురుషుల టీమ్ చాంపియన్షిప్లో నార్త్ఈస్ట్, వెస్ట్జోన్ జట్లు... మహిళల విభాగంలో ఈస్ట్జోన్, హెడ్క్వార్టర్ జట్లు గెలుపొందాయి. ఈ పోటీలను ఎఫ్సీఐ చీఫ్ జనరల్ మేనేజర్ ఒ.పి. డాని ప్రారంభించారు. -
కుక్కకు భయపడి...
► భవనంపై నుంచి దూకిన ముగ్గురు కూలీలు ► ఇద్దరు మృతి, ఒకరికి గాయాలు ► ఏపీ మంత్రి అయ్యన్న వియ్యంకుడి ఇంట్లో ఘటన ద్వారకానగర్ (విశాఖ): ఓ పెంపుడు కుక్క రెండు నిండు ప్రాణాలు పోవడానికి కారణమైంది. ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడి వియ్యంకుడు, ఉత్తరాంధ్ర వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నరవ రాంబాబు ఏపీలోని విశాఖలో కొత్తగా నిర్మిస్తున్న ఇంటిలో గురువారం ఈ దారుణం జరిగింది. నాలుగో పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలోని అక్కయ్యపాలెం లలితానగర్లో రాంబాబు మూడంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. అక్కయ్యపాలెం చెన్నూరు మసీద్ సెంటర్కు చెందిన నాచి గోపి(27), ఎమ్డీ హుస్సేన్ వలీ(44), విజయనగరం జిల్లా కోనాడ గ్రామానికి చెందిన బొండా శ్రీనులు పది రోజులుగా అందులో ఇంటీరియర్ పనులు చేస్తున్నారు. రోజూ మాదిరిగానే గురువారం వచ్చి పనులు చేసుకుంటున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో రాంబాబు ఇంటిలో ఉన్న జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన కుక్క ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. దాన్ని చూసి కింద పని చేస్తున్న కూలీలు భయపడి, కుక్కా కుక్కా అని అరుస్తూ రెండో అంతస్తులోకి పరిగెత్తారు. ఈ అరుపులు విని అక్కడ పనిచేస్తున్న ముగ్గురు కూలీలు భయంతో కిందికి దూకేశారు. తీవ్ర గాయాలతో గోపీ అక్కడికక్కడే మరణించాడు. హుస్సేన్ వలీ, శ్రీనులను స్థానికులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ హుస్సేన్ చనిపోయాడు. తీవ్ర గాయాలతో శ్రీను చికిత్స పొందుతున్నాడు. ఈస్ట్ జోన్ ఏసీపీ అన్నెపు నర్సింహమూర్తి ఆస్పత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. నాలుగో పట్టణ ఎస్సై గణేష్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. రాంబాబు పెంచుకుంటున్న ఈ కుక్క కొద్ది రోజుల క్రితం ఓ మేస్త్రిని కరిచినట్లు క్షతగాత్రుడు శ్రీను వెల్లడించాడు. అప్పటి నుంచి ఇంటిలో పని జరుగుతున్నంతసేపూ కుక్కను గొలుసులతో కట్టి ఉంచుతున్నారు. ఆ గొలుసు తెగిపోవడంతో కుక్క బయటకు వచ్చింది. అకస్మాత్తుగా దాన్ని చూసిన కూ లీలు కిందకు దూకేశారు. -
నిఘా నీడలో ఈస్ట్జోన్
ముఖ్యమైన జంక్షన్లు, పార్కులు, ఆలయాల వద్ద నిఘానేత్రం 753 కెమెరాల ఏర్పాటుకు ప్రతిపాదన ఇప్పటికే 531 బిగింపు తగ్గిన స్నాచింగ్లు-పెరిగిన రికవరీలు సిటీబ్యూరో: లండన్ తరహా సీసీ కెమెరా వ్యవస్థను నగరంలో ఏర్పాటు చేస్తామని కమిషనర్ ఎం.మహేందర్రెడ్డి పేర్కొన్నట్లుగానే ఈస్ట్ జోన్ పోలీసులు అందుకు తగిన ప్రణాళికను సిద్ధం చేశారు. ఈస్ట్జోన్ డీసీపీ పరిధిలోని తొమ్మిది పోలీసుస్టేషన్ల పరిధిలో ముఖ్యమైన పార్కులు, జంక్షన్లు, ఆలయాలు, షాపింగ్ సెంటర్ల వద్ద ఏర్పాటు చేయనున్న కెమెరాల నివేదికను డీసీపీ రవీందర్కు ఆయా స్టేషన్ల ఇన్స్పెక్టర్లు సోమవారం అందజేశారు. ఇక జోన్ పరిధిలో ఏ చిన్న నేరం జరిగినా నిందితులను క్షణాల్లో గుర్తించేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. జోన్ పరిధిలో మొత్తం 753 కెమెరాలు ఏర్పాటు చేయడానికి రెండు నెలల క్రితమే ప్రతిపాదనలు తయారయ్యాయి. నిన్నటి వరకు 531 కెమెరాలను ఏర్పాటు చేశారు. మిగిలిన వాటిని జనవరి మొదటి వారంలోపు పూర్తి చేయాలని డీసీపీ ఆదేశించారు. ఎక్కువ సంఖ్యలో సీసీ కెమెరాల ఏర్పాటులో సుల్తాన్బజార్ మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో నల్లకుంట ఉంది. ఈ రెండు ప్రాంతాలు అత్యంత కీలకమైనవి కావడంతో ఎక్కువ కెమెరాలు ఇక్కడే ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా స్నాచింగ్లు తగ్గుముఖం పడతాయని అధికారుల అంచనా. ఈ ఏడాది తగ్గిన స్నాచింగ్ కేసులు మూడేళ్ల స్నాచింగ్ గణాంకాలను పరిశీలిస్తే ఈ ఏడాది 25 శాతం వరకు తగ్గాయి. మూడేళ్లలో మొత్తం 536 స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. వాటిలో 302 కేసులు పరిష్కారమయ్యాయి. అంతేకాకుండా రికవరీల శాతం కూడా ఈ ఏడాది పెరిగింది. మలక్పేట డివిజన్ పరిధిలోనే ఎక్కువ స్నాచింగ్లు జరిగాయి. నేరం చేయాలంటే దడ పుట్టాల్సిందే... నేరం చేయాలంటే దడ పుట్టేలా జోన్ పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటు ఉంటుంది. స్మార్ట్ అండ్ సేఫ్ సిటీలో భాగంగా సీసీ కెమెరాలకు అత్యధిక ప్రాధానం కల్పించాం. స్కూళ్లు, సినిమా థియేటర్లు, షాపింగ్ సెంటర్ల యాజమాన్యాలు సహకారం ఉంటేనే ఈ ప్రయోగం విజయవంతమవుతుంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోనివారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. - డీసీపీ రవీందర్ -
సౌత్జోన్ 236/9
రాబిన్ ఉతప్ప సెంచరీ దులీప్ ట్రోఫీ సెమీ ఫైనల్ రోహ్టక్: రాబిన్ ఉతప్ప (196 బంతుల్లో 120; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ సాధించడం మినహా ఇతర బ్యాట్స్మెన్ ఎవరూ రాణించకపోవడంతో దులీప్ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్లో సౌత్జోన్ భారీ స్కోరు సాధించడంలో విఫలమైంది. ఈస్ట్జోన్తో బుధవారం ఆరంభమైన ఈ మ్యాచ్లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ తమ తొలి ఇన్నింగ్స్లో 86.5 ఓవర్లలో 9 వికెట్లకు 236 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ (32) ఫర్వాలేదనిపించాడు. రెండో వికెట్కు ఉతప్ప, నాయర్ 94 పరుగులు జత చేశారు. ఈస్ట్ బౌలర్లలో లక్ష్మీ రతన్ శుక్లా (4/30) రాణించగా, దిండా, రాణా దత్తా చెరో 2 వికెట్లు పడగొట్టారు. నమన్ ఓజా, సక్సేనా శతకాలు మొహాలి: నార్త్జోన్తో జరుగుతున్న మరో సెమీ ఫైనల్ మ్యాచ్లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి సెంట్రల్ జోన్ తమ తొలి ఇన్నింగ్స్లో 90 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 344 పరుగుల భారీ స్కోరు చేసింది. నమన్ ఓజా (193 బంతుల్లో 122 బ్యాటింగ్; 14 ఫోర్లు, 2 సిక్సర్లు), జలజ్ సక్సేనా (187 బంతుల్లో 110; 17 ఫోర్లు) సెంచరీలు సాధించారు. వీరిద్దరు మూడో వికెట్కు 140 పరుగులు జోడించడం విశేషం. అనంతరం అశోక్ మేనరియా (93 బంతుల్లో 53 బ్యాటింగ్; 6 ఫోర్లు)తో నాలుగో వికెట్కు ఓజా అభేద్యంగా 107 పరుగులు జత చేశాడు. లెఫ్టార్మ్ చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్తో ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అడుగు పెట్టాడు.


